పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: స్వాగతం..: ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను...!! హాయి వెల్లువలెత్తగ నీకు స్వాగతం..!! ఆవరించిన శూన్యం ఆనందపడగ నీకు స్వాగతం..!! అణువణువు తమకమున తేలిపోగ నీకు స్వాగతం..!! మనసు మురిసి మయూరమవగ నీకు స్వాగతం..!! ఎద పారవశ్యపు పరిమళాలు విరజిమ్మగ నీకు స్వాగతం..!! కౌగిలిన బంధీవై వెచ్చని చలువన చేష్టలుడిగిన నీకు స్వాగతం..!! ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను..!! 26/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv14h

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కొత్త తెలంగాణా నా మట్టితల్లి తెలంగాణా పాలపొత్తిళ్ళలో పొద్దు పొడిచింది నా కన్నతల్లి బంగరునేల పరాయితనం ఒడిసిపోయింది ఏండ్లసంది పూట పూటకు పడ్డ రంధి తీరిపోయింది ఏదెట్లనన్ని గాని కొత్తపురుడు పోసుకున్న తెలంగాణాకు కొత్త నెత్తురు నింపాలె, ప్రజల ఆశల, ఆశయాల ప్రాణం పొయ్యాలె బొమ్మ తెలంగాణా కాదు, మనకు అమ్మ తెలంగాణా కావాలె కనని కష్టాలు, కాని బాధలు పడ్డది ప్రపంచాన ఎవరికి రాని దుఃఖాలు మోసింది ఈ నేల లోకాన ఎరుగని శోకాలు ఓర్చింది ఈ నేల ఎందరు ఈ నేలను విముక్తికోసం ప్రాణాలనదులతో తడిపిండ్రు ఎందరు ఈ నేలమీద ఎన్నడులేని పోరు యుద్ధాలు నడిపిండ్రు వాళ్ళ రుణం ఎట్ల తీరాలె, వాళ్ళ కలలు ఎప్పుడు సాకారం కావాలె ఒకళ్ళను ఎత్తుకుని అమరనివాళులియ్యక మునుపే మళ్ళెందరిని బోనాలదీపాల్లెక్క ఎత్తుకోవాల్సి వొచ్చింది ఇంక ఏరువాక చెయ్యాలె, నాగేటిసాళ్ళల్ల మొలకకలలై వాళ్ళు జెండాలై రెప రెపలాడుతరు కొత్తలకు పెట్టాలె, అమరులకు తెలంగాణా నిండ గండదీపాలు పెట్టాలె గడప గడపకు వాళ్ళు చేసిన త్యాగాల పాటలె వినిపించాలె కొత్త తెలంగాణాకు కొత్తతొవ్వలు తియ్యాలె ప్రజల పెదవుల మీద తెలంగాణా చిరునవ్వుల ఎన్నీల కావాలె బెదిరిపోయిన మన మాటల గువ్వల్ని పిలిచి పలుకులు నేర్పాలె చెదిరిపోయిన మన చరిత్రరవ్వల్ని కూర్చి కొత్తపుస్తకాలు రాయాలె చీకట్లు, తాకట్లు, కనికట్లు లేని ప్రజలపాలన రావాలె తల్లులగర్భశోకాలు, ఉసురు తాకని తెలంగాణా కావాలె మన నదుల నీళ్ళల్ల మన పంటకలలు మెరువాలె కన్నీళ్ళు కడగండ్లు వుత్త యాదిలెక్క గావాలె కోటి రతనాల వీణ కాదు కొత్త ప్రజాకోటి తెలంగాణై నిలవాలె ¬¬¬కోరుకున్న నూతనజనవనమై వసంతాలు నిండాలె మోదుగులు పూసినయి, మామిండ్లు పూసినయి తెలంగాణా కొత్తకోయిల రాగాలు తీయాలె బతుకమ్మ తెలంగాణా, దసర తెలంగాణా పీర్ల తెలంగాణా, సబ్బండ జాతుల సకలతెలంగాణా ఆత్మగల్ల తెలంగాణా, మమతల తెలంగాణా మంచి మనుషుల తెలంగాణా, మహా తెలంగాణా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khnNEA

Posted by Katta

Sri Gajula కవిత

ఇప్పుడిక..ఈ నేలపైన //గాజుల శ్రీధర్,9849719609 // ఇప్పుడిక … జలగలు రక్తదాన శిభిరాలు నిర్వహిస్తాయి గద్దలు రెక్కలకింద ఊయలగట్టి కోడిపిల్లలను లాలిస్తాయి పాములు పుట్టలపై పిచ్చుకగూళ్లని అల్లుతాయి తోడేళ్ళు జీవాలమందకు జవానులై కాపలా కాస్తాయి ఇప్పుడిక.. ఈ నేలపైనే .. లేత చెక్కిళ్లపై ఉరివేసుకున్న అక్షరం ఆయుధమై మొలుస్తుంది ఏకలవ్యుడి విగ్రహం ముందు పావురాల గుంపు విల్లంబులను అల్లుతుంది . -20/02/2014

by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv3cn

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || (స్వ) గతం || ========================== ఆలోచనాంతరంగాలు గుండెల్ని గుచ్చుతున్నాయి మెదడు మాత్రం అప్పుడప్పుడు కుబుసం విడుస్తుంది కళ్ళల్లో మాత్రం కళ్ళు తెరిచిన స్వప్నం కనపడుతుంది ఆలోచనలు మాత్రం ముళ్ళ మధ్యే తిరుగుతున్నాయి ఆశల గుర్రం ఆకాశంలో ఎగురుతుంది ఆశ నిరాశల మధ్య నిచ్చెన వేస్తున్నాను నిరాశలు వెక్కిరిస్తున్నా ఆశ చావడం లేదు ఎప్పటికైనా ఆశల గుర్రం పై స్వారి చేసెయ్యాలని! తడిబారిన మనసు తప్పటడుగులు వేస్తుంది కళ్ళల్లో రక్తపు ఛారలు నిత్యం పలకరిస్తున్నాయి మనసు తడి పిండెయ్యాలని ఉంది గులకరాళ్ళ లోతుల్లో మనసు రాయి లా మారిపోయింది గతాలన్ని బ్రహ్మజెముడు మొక్కలై వెక్కిరిస్తున్నాయి వర్తమానంలో మొక్కలన్నీ ముళ్ళులై గుచ్చుకుంటున్నాయి భవిష్యత్ మాత్రం ముళ్ళ మధ్య పుష్పం లా తొంగి చూస్తుంది!!! ================================ ఫిబ్రవరి 26/2013

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv2VK

Posted by Katta

Nirmalarani Thota కవిత

*ఎవరు నువ్వు..? గంజాయి వనంలో తులసి మొక్కలా . . సైకత వేదికపై వికసిత కుసుమంలా . . ఎవరు నువ్వు..? గడిచిన నా బాల్యంలోంచి నడిచొచ్చిన ప్రియ నేస్తానివా . . ? మరచి పోయిన మమతల్లోంచి మరలి వచ్చిన మధుర ఙ్ఞాపకానివా? ముగిసి పోయిన భవితవ్యంలోకి దూసుకొచ్చిన తటిల్లతవా. . ? ఎవరు.. ? ఎవరు నువ్వు . . ? * నిర్మలారాణి తోట తేది: 26.02.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hT74Kx

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//ఓ ప్రయాణాంతర ప్రేలాపన// 0) డార్విన్ సిద్దాంతంలా మనమూ మారిపోతూంటాం నేను-మేమూ-మనమూలుగా,మామూలుగా ముడుతపడ్డ కాలాన్ని కాస్త ఇస్త్రీ చేస్కుంటాం మనిషిగా తప్పిపొయిన మనలని వెతుక్కుంటూ మనుషుల మధ్యే తిరుగుతుంటాం.. రాహోన్ మే చల్తీరహే సఫర్ హమారా ఇన్సాన్ బన్ కే, సారీ దునియాకా మెహమాన్ బన్ కే... 1) కొన్ని ప్రయాణాలు. కేవలం ప్రయాణాలనలేం చరించే చరణం, చలించే దేహం ఘలించే గళం స్మరించే పదం నర్తించే పాదం అన్నీ.. నిజానికివన్నీ నిజం కావేమో 2) ఎప్పుడంటావ్ ఇదివరలో మనిషిగా కాక సమూహంగా నేనుగా కాక. మనంగా బతుకుగ్గా కాక జీవితంగా నువ్వు కదిలిన క్షణం అదే ఆ క్షణం గతం లో ఎక్కడో వెలుగుతూనే ఉంది కదూ... 3) వినిపించే రాగమై ఒకరు, కనిపించే అను రాగమై ఇంకొకరు మనసు దారుళ్ళో కొన్ని పాదపు ముద్రల్ని ముద్రించినడుచుకుంటూ పొయాక... మిత్రమా...! అనగలవా ఇప్పుడు నేనూ అనేది కేవలం ఏకవచన సూచనాపదం మాత్రమే అని... 4) నిశ్శబ్దపు రాతిరి రాగాల రంగులద్దుకొని కొన్ని నవ్వులు కలిపిన పాటలై పక్షుల్లా రెక్కలల్లాడించి నిర్థాక్షిన్యంగా దుఖాలూ,ఆందొళనలూ అన్నీ అన్నీ చచ్చిపడిన చిత్రాన్ని మొహాన అతికించుకొని. ఓ మోడెర్న్ ఆర్ట్ లా మారిపోయాక ఒహ్హూ..!. పికాసో మళ్ళీ రావోయ్ ఈసారి అందమైన గొయెర్నికాని చిత్రించ గలవేమో ప్రయత్నించూ... 5) గోదావరిలో... నీళ్ళే నా కేవలం నీళ్ళేనా ఉన్నది..! కొన్ని ఆనందాశ్రువులూ రాలిపడ్డాయ్ రెండ్రోజుల కింద . అప్పుడప్పుడూ ఉప్పెనవ్వటమే తెలిసిన గోదారి మా ఆనంద భాష్పాలతో కలిసి ఇవాళ కాస్త ఉప్పనైంది.... 26/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OChXUf

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

**పిచ్ బ్లాక్** అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా ఏ రంగు లేకపోవడమే నల్లదనమా ఏమో నల్లదనానికి కూడా కొలతలుంటాయి కలర్ టెక్నాలజీ మహిమ మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో పిచ్ బ్లాక్? కమ్ముకొచ్చే ప్రశ్నా? సమాధానమా? ఏదైనా స్పెక్ట్రోస్కోప్ కొలుస్తూ కనబడితే అడగాలీసారి నా పిచ్చిగానీ గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా వెంటనే ఆ పని చెయ్యాలి చీకటిలో ఏవో ఆకారాలు రూపాలు మారుతూ కదలాడుతున్నాయి విరగ పూచిన శాంతి నల్లటి రెక్కలై రాలిపోతోంది నా భుజాలను ఒరుసుకుంటూ కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి ఓం శాంతిః శాంతిః శాంతిః అంతలో కొన్ని మాటలు అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి రంగుల్లో పూస్తాయా అమ్మా అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి 26.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | అదెట్లున్నా...!? ................................. నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి ; పలకరింపు ఒక్కటైనా లేని దారుల్లోకి తోలి కొన్ని గదుల్ని, కొన్ని ఫ్యాన్లని ,ఆన్ చేసిన వో టి.వి.ని నీకప్పగించి అన్నీ అమర్చాను కదా అని సంతృప్తి పడిపోతూ మా పనుల్లోకి మేం జారుకుంటూ 'నేనేమిట్రా' అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ తిరుగుతూ విరుగుతూ నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా ఊళ్ళో నీ అరుపులు , బండెడు చాకిరీ ,తన్నులుగుద్దులు . నిజంగా నువ్వు బతికిందీ , ఇంకా బతుకుతున్నదీ అక్కడే . కష్టాల్లోనే జీవితముంది- అదెట్లున్నా ?! సుఖమా - అదొట్టి ఖాళీ తిత్తి . అక్కడేం లేదు.ప్చ్.డొల్ల . ఊసుకున్నా ఉమ్ముకున్నా నీ ఇంట్లో ఇదేందని అడిగినోల్లు లేరు. లేచినా పండుకున్నా ఆరాంగా, హాయిగా . లోకమంతా నీడైనట్లు,నీదైనట్లు ; నీవే లోకమైనట్లు బతికినవ్ చూడు ; అదే జీవితం. ఇదేంది : ఇక్కడ అన్నీ బోల్టులు ,నట్లూ బిగించిన గిర్రలాగా . నోటికడ్డంబెట్టి ఆపుకునే తుమ్ములాగా . అదుముకుని ఆపుకుని కొంచెం కొంచెం కొసరి కొసరి బతకడం. దీనబ్బా ! ఇట్లుంటదా జీవితమంటే. అమ్మా : నువ్వే కరెక్టు. " ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు జాపాలి " ఈ బతుకుల్నేమో దుప్పటి, కాళ్ళూ అసలు సమజతైనే లేదు. 26.2.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBTQFo

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hf0KKp

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! జీవిత సమరం !! మనం జీవిస్తున్నామా బ్రతికెస్తున్నామా పొద్దు పొడవగానే మొదలు సంఘర్షణ కారణాలు ఏవైనా తెలియని మానసిక వత్తిడి విపరీతమైన ఆరాటం అర్ధం లేని జీవన పోరాటం ఏదో అయిపోతుంది అనే నిరుత్సాహం ప్రతిది సమయం తో పోరాటం అందుకోలేక పోతామేమో అని ఏకారణం తోనో వాయిదా పడితే ఒక్కక్షణం ప్రపంచాన్ని జయించిన ఆనందం నీ ప్రయత్నాలు చేయటమే కదా నీవంతు ప్రతి ప్రయత్నం సఫలం చేయటం పైవాడి వంతు నీ మనోవ్యధతో వ్యాకులం తో నీ చుట్టూ వున్నా సహజ సౌందర్యాన్ని నీ వాళ్ళ నిస్వార్ధ ప్రేమను గమనించక ఫలితం తెలియని ప్రయత్నాలలో పడి తిరిగి తిరిగి విసిగి వేసారి జీవన సమరం లో ఓడిపోతున్నాం నీది కానిది ఎంత ప్రయత్నం చేసినా రాదు నీవద్ద తాత్కాలికం గా వున్నా నీకు ఉపయోగ పడదు నీది అయితే ఎక్కడ వున్నా నీవద్దకె వస్తుంది తొందరగా ఎదగాలి అని ఆయాస పడవద్దు సమయం నిన్ను సరియైన సమయం లో దారి చూపిస్తుంది నిన్ను నీవు నమ్ముకో నీవాళ్ళతో మంచిగా మసలుకో నీవద్ద వజ్రాలు చూడు బయట రంగు రాళ్ళకు బ్రమ చెందకు మనశాంతి తో జీవించు మానవతా వాది గా చరించు !!పార్ధ !!26feb14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hf0Jq6

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుసుకుందాం ! తెలుగు,ఉర్దూ,ఇంగ్లీషు భాషలలో నిష్ణాతుడైన సాహితీవేత్త -డా.నోముల సత్యనారాయణ సార్ !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1heSCcT

Posted by Katta

Kavi Yakoob కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 19(కవి సంగమం) కవిత్వ సంపుటి పేరు :-"దృశ్య ప్రవాహం" కవి పేరు :-" సడ్లపల్లె చిదంబర రెడ్డి" పరిచయం :- రాజారామ్. టి ..... "నీవు కవివా?ఎవరి కవివి?? "నీ' కవివైతే మంచింది! నీ లోని గుబులువైతే మరీ మంచిది!!" --అంటూ "కవి" ఎవరి కవి కావాలో చెబుతూ నీ లోని దుఃఖమైతే చాలా మంచిదనే సత్యాన్ని వెలువరించినవాడు సడ్లపల్లి చితంబరరెడ్డి. “అది కొత్త కత్తిలా కుచ్చు కొంటుంది గుండెలో పచ్చి కారం పొడిలా కలతలు రాలుస్తుంది కళ్ళలో చేదు ఉమ్మెత్త ముళ్ళకాయలా ఇరుక్కొంటుంది గొంతులో నిజంగా నీ గుండె కోసి కాగితం పై పరిస్తే రాస్తుందది రసాక్షరాలు"--అంటూ గూటిలోని దుఃఖం మాత్రమే రసాక్షరాల వాక్యాలు రాస్తుందని వొక నిజాన్ని మన ముందు పరిచిన వాడు సడ్లపల్లె చితంబర రెడ్డి. “నీటిని పోగొట్టుకొన్న చేపలా పొర చిట్లి గుడ్డు నుండి జారిన పచ్చసొనలా చావు పీఠానికి బలి ఇచ్చుకొని ఆరిపోతున్న మేక తల కంటి చూపులా... ఆగిపోయిన జీవితాల్ని కాలిపోయిన కలల తోటల్ని తెగిన నరనరం మీటే విషాదల అలజడుల్ని"-డప్పుల మోతల శబ్దాల కవిత్వం చేయడం కవి ధర్మంగా అనుకుంటున్నవాడు సడ్లపల్లె చితంబరరెడ్డి. తాను తానుగా నిలిచి అక్షరాలు కొలిచే కవై కదిలే పదచిత్రాలను దర్శింప చేయలనుకున్న కవి ఈ సడ్లపల్లె చితంబరరెడ్డి. కవిత్వం రాస్తే ఏంటి లాభం?కవిత్వం రాస్తున్న వాల్లకేమి లాభం?అనే ప్రశ్న కొందరు ఏ మొహమాటం లేకుండా వేస్తుంటారు.అలాంటి వాళ్ళతో నేనంటూవుంటాను "మీరు అనుకుండే "లాభం' వేరు కవులకు కలిగే లాభం వేరు "-అని "తెల్ల కాగితమే కదా!ఇష్టమొచ్చింది రాసి కాగితాన్ని ఖరాబు చేయటం కవిత్వం కాదు.అక్షరాన్ని కాగితం భరించేటట్లు రాయటం కవిత్వం"-అంటాడు వొకాయన.నల్ల కాగితం మీద తెల్లని అక్షరాలు రాయడం కవిత్వం.కవిత్వం రాయడం అందరు అనుకొన్నంత సులభం కాదు,ఎంతో ప్రయాసతో కూడుకొన్న అంశమని కొందరికే తెలుస్తుంది. లోపల ఎక్కడో కడుపులోనో,హృదయలోనో,అస్థిపంజరంలోనో,కళ్ళలోనో దాగి దాగీ మరిగి మరిగీ సలపరించిన అక్షరం మాగిన పండు చెట్టు మీద నుంచి రాలిపడ్డట్టూ కాగితం మీద పడుతుంటే ఎంత మథనం.ఇంత మథనం "సడ్లపల్లి" పడ్డాడు కాబట్టే అతని"దృశ్యప్రవాహం" మన హృదయాల్ని తాకి మనల్ని తలో కలుపుకొని తనతో చివరి వరకు తీసుకెళుతుంది. ఇప్పుడు ఒక్క కవి జీవితం లోంచే కవిత్వం రావడం లేదు.ఇతరుల జీవితాల్లోంచి,వాళ్ళ ప్రేమల్లోంచి,విషయాల్లోంచి,అవమానాల్లోంచి,అనుమానాల్లోంచి,ముఖ్యంగా రోజు వారి జరుగుతున్న కుటుంబఘర్షణల్లోంచి కవిత్వం వొస్తున్నది.కవి తాను పొందిన అనుభూతిని తను ఎంతపొందాడన్నది కాదు అతని కవిత్వానికి గీటురాయి.ఆ అనుభూతిని ఎంతగా పాఠకుల పొందారన్నది ఆ కవి కవిత్వానికీ గీటురాయి అవుతుంది.ఈ లక్షణాన్ని"దృశ్యప్రవాహం" సంతరించు కొన్న వొక మంచి కావ్యంగా కవిత్వ ప్రియులకు అనిపించకమానదు. ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరం లేదు కానీ ఆ వాస్తవాన్ని తట్టుకోవాడానికే శ్రమించాల్సివుంటుంది.ఈ కవికి జీవితవాస్తవాలు అవగతం అయింతరువాత,అవగతం అయిన ఆ వాస్తవాల్ని తట్టుకోవడానికీ ఎంతో మథనపడ్డాడు.ఆ మథనం లోంచి ఉబికుబికీ వచ్చిందే ఈ "దృశ్యప్రవాహం". దుర్బల ఆరోగ్యం-దుర్భర దారిద్ర్యం అనే రెండు బండరాళ్ళ మధ్య చొచ్చుకొచ్చి అస్థిత్వాన్ని పొందిన మొక్క ఈ కవి జీవితం. రెండు ఇసురు రాళ్ళ మధ్య నలిగినలిగి ముక్కలు ముక్కలైన జీవిత శకలాల సమూహం ఈకవి జీవితం.ఆ జీవితాన్ని ఒరుసుకొని పారిన జీవిత దృశ్యప్రవాహం ఈ కవిత్వ సంపుటి.అందుకే ఇంత తీవ్రంగా ఇంత ఆగ్రహంగా ఇంత అనుభూతి సాంద్రంగా సాగుతుంది ఇది. "ఆత్మ సహజంగా జ్వలనశీలమయితే చంచలజ్వాల సైతం వెలుగులు విరజిమ్మవచ్చు-అంటాడు "జార్జిసాంట్ ఆనీ"అనే విమర్శకుడు.జీవన్మరణ సమస్యతో నిరంతరంఘర్షిస్తూ ..తన ఆత్మను సహజంగా జ్వలనం చేసుకొంటూ తానొక చంచలజ్వాలై భావుకతతో చితంబరరెడ్డి మండుతున్న భావాల వెలుగుల్ని ఈ సంపుటిలో విరజిమ్మాడు. మానవ,మానవేతర ప్రాకృతికాంశాల సర్వ వ్యాపకాలకు చెందిన అనుభూతుల్నీ,జనసమూహాల బాధలకూ,గాథల అనుభూతులకు ఈ సంపుటి వొక అద్దంగా రూపొందింది.మనుషుల్లోని మంచి చెడ్డల్నీ,సమాజంలోని అంతరాల దొంతరల్ని బట్టబయలు చేయటమేగాక"విజయానికి చిగురు తోరణం కట్టి''తొలిపాఠం' నేర్పుతుంది ఈ దృశ్యప్రవాహం.విద్య,పర్యావరణ రంగాలలోని విషయాలను ,జనుల అగచాట్లను,వైయుక్తిక అనుభవాల్నీ అందమైన పద,భావ చిత్రాలతో సరికొత్త దృక్కోణంతో వచన కవిత్వం చేశాడు సడ్లపల్లి.ఎన్నో కవితలు హృదయపులోతుల్లోకి వెళ్ళి బాధించి బోధించిన అంశాలను ప్రస్తావిస్తాను. "దారి పొడుగునా ఆశల గింజల్ని విత్తి స్వప్న చిత్రాలు తిరగేస్తూ ఒంటరిగా గడియారాన్ని వెంబడిస్తున్నప్పుడు నేను ఊహల శిఖరాలు కొలుస్తాను అప్పుడు నీవు గుర్తోస్తే... మనసు విప్పారిన పూవవుతుంది నిన్ను ఆకృతీకరించాలని కలల నేత కుంచెను తీస్తే అది రక్తాన్ని ఉమ్మింది"-అంటున్న ఈకవి నగరాల్లోని కొన్ని చోట్ల,అడవుల్లో పేలుతున్న మందు పాతరలను ఙ్ఞాపాకానికి తెచ్చి పచ్చి నెత్తురు మరకల్ని చుసి తన గుండె కూడా మందు పాతరై పేలిందని దుఃఖిస్తాడు."మనిషి మనిషి నిశిలో పేరుకొన్న కసి మాంసం ముద్దై కత్తుల కుత్తుకలకు కైపై" ఎక్కుతున్నదని వాపోతు ఇవి "మంచు ముక్కైకరిగి,కన్నీటి వాగై పొంగి కువకువలాడే కపోతమయ్యే" దృశ్యాన్ని కవి కోరుకుంటాడు. మానవ జీవితం లోని వేగం,తీరికలేనితనం,ఇంట్లో కోరికల చిట్టా విప్పినప్పుడు జేబు నిండుకున్న వైనం ఇవన్ని తెలుసుకొనే శక్తి కళ్ళకు లేకుంటే ఎంత బాగుండేదోకదా!-అని అనిపిస్తుంది అని కవి "నాకు అనిపిస్తుంది..!!!"అనే కవితలోచిత్రిస్తూ,"పలకా బలపాల కన్నా జాగ్రత్తగా విధ్యార్థులు అన్నం తట్టలు తెచ్చినప్పుడు../కలల కథలు చెప్పినప్పుడు లేని ఆనందం ఉడకని పిడికెడు మెతుకులు చూడగా/వారి ముఖాల్లో పొంగే వులుగులు చుసినప్పుడు.."-అని అనటంలో భారత దేశంలో రేపటిపౌరులు ఎలాంటి స్థితిలో వున్నారో తెలియ చేస్తాడు.ఎంతో అధిక్షేపాన్ని ఆగ్రహంతో తెలియజేస్తాడు. "విజయానికి' అనే కవితలో కవి తన జీవితం విజయం వైపు ఎట్లా పరుగులు తీసిందో అవిష్కరించాడు.జీవితాన్ని యుద్ధంగా,జీవించాడాన్ని అశ్వంగా,ఎదురయ్యే సంఘటనల్ని దారిగా పోలుస్తూ"యుద్ధానికి దౌడు తీస్తూ గుర్రం అలసి పోతుందప్పుడప్పుడు.......ఆవేశాన్ని సకిలిస్తూ,సునామీల్నీ పుక్కిలిస్తూ కండ కండ నుండి కాళ్లకు శక్తిధారల్లాగి విజయానికి-వీర మార్గం వైపు మళ్ళి కుప్పళిస్తుంది"-అంటూ వొక జీవన వికాస పాఠాన్ని చెబుతాడు."కన్రెప్పలు వాల్చాలంటే /రాత్రికి క్కూడా భయం/రాజ్య వ్యవస్థలో/మారువేషాల శాసనాలని"-అంటూ"ఏడొ చేప" అనే కవితలో రాజ్య వ్యవస్థ నిరంకుశ అధికారా హుంకారాలను కవిత్వంగా మార్చాడు ఈ కవి. రెండు దశాబ్దాల కిందట కవిత్వం రాసిన కవులు ఉదారవాదం,ప్రయివేటికరణ,ప్రపంచీకరణ అనే వాటి ప్రభావానికి లోనయ్యారు.ఈ కవి కూడా వీటి ప్రభావానికి గురికాక తప్పలేదు.మానవ జీవితాల్లోకి ఎంత తీవ్రంగా ప్రవేశించిందో,అది చేసె కుట్రలకీ ఒక్కొక్క కుటుంబం సాంకేతిక వ్యాపార సంస్కృతి వల్లా ఎట్లా విచ్ఛిన్నం అయ్యిందో బహిర్గతం చేసె కవిత "అన్ని రూట్లు బిజీ!!' అనేది. "గిట్టుబాటు ధరకు ఎదురు చూస్తూ కల్లమ్లో పురుగుల ధాన్యం కొరికి పుచ్చిపోతూ రైతు కట్నం బాకి బాపతు కొతయినా జమ చేస్తే అల్లుని ముఖంలో నవ్వులూహిస్తూ కూతురు పట్నం కరెన్సీ పిల్లల్తో పోటి పడే అమాయకత్వంలో మోటార్ సైకిల్ చుట్టూ చక్కర్లాడుతూ కొడుకు..... కాషాయంబరం విభూదుల వెచ్చదనాల్చాలక వి.ఐ.పి స్వాములంతా కొంగు చాటు కోసం తచ్చాడుతూ... జన సంబంధాల చదువులన్నీ టెక్నాలజీ పాము నోట్లో జీర్ణమవుతూ.... అన్ని రూట్లు బిజీగా వున్నాయి"-ఇలా కవిత ప్రపంచీకరణ వల్ల సంభవించిన పరిణామాల్ని వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. ఏ విషయమైనా అనుభవంలోకి,అవగాహనలోకి,అనుభూతిలోకి రానంతవరకు నిమ్మళంగా వుండొచ్చు.నిర్మలంగా వుండొచ్చు.ఈ కవి తీవ్రంగా దీర్ఘ రోగానికి(క్రానికల్ డిసీజ్)చిన్నపటి నుండి గురై దాని అనుభవాన్ని పొందిన తరువాత దాన్ని గురించి అవగాహన చేసుకొన్నాకా,దాని అనుభూతిని అర్ఠం చేసుకొన్నాకా నిమ్మళంగా వుండలేక నిర్మలంగా వుండలేక "పచ్చని ప్రాణాన్ని చప్పరిస్తు/మరణద్వారం వైపు లాక్కేల్ళే మృగం రోగం/వైరి వర్గాన్నిక్కూడా కర్కశ కరాళ కర్కోటక పీడింపుల రూపం"-అని ఆ రోగం గురించి గొప్ప అనుభూతాత్మక చిత్రణ చేశాడు.ఆయన తన సంపుటిలో రాసుకొన్న "నే ప్రవహిస్తూ వచ్చిన...'అనే మాటల్ని చదివితే ఆశ్చర్యంతోపాటు మన కళ్ళు కూడా కన్నిటి దృశ్య ప్రవాహలవుతాయి."కళ్ళ ముందే కను గుడ్డును /కసాయి కత్తుల్తో లాగి /మొసలి నోరులా నముల్తూ /ఏదో చెప్పాలని ప్రయత్నించే కళేబరం చివరి కదలికగా మెదిలే నాలుకను కొరుక్కుతిని"-ఇలా మరణం చివరి అంచున నిలబడి కవి చేసిన గెలుపోటముల జీవన్మరణపోరాటాన్ని చదివితే కవి విషాదం, మొండిధైర్యం మనల్ని ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మాటలకీ భావాలకీ వో కొత్త సోయగాన్ని తొడిగిన కవితా సందర్భాలెన్నో ఈ సంపుటిలో వున్నాయి.తెగి పోతున్న సంబంధాల గురించి కవి వొక చోట ఇలా అంటాడు."మంట సోకి పటాకీ సరాలు ఒక్కొక్కటి కాలి పేలి పోతున్నట్లు"-ఇలా ఊహకు అందని ఊహను కవి చేస్తాడు."ఏవో వలయాల తీగలు చుట్టుముట్టి/నింపాదిగా స్వారీ చేస్తూ నామీద/నా చేతుల్లో ఏమీ లేని నిబంధనల పుట్టుక/అస్థిత్వాన్ని పళ్ళ కింద బిగపట్టి/పందిరి దబ్బగా ఉండీ లేనట్లు నేను' లాంటి కవిత కవి అస్థిత్వ ఆలోచనను పందిళ్ళకోసం వేసె దబ్బతో ఉపమించడం కవి ప్రతిభను తెలుపుతుంది. "వలస పోతున్న ఎర్రెర్రని మట్టి /దిగులు పడుతున్న పల్లెల ఇళ్ళలో /తెగిపోతున్న వెల్తురు దీపాలు/కరువు లావా ప్రవాహంలో పడి /కాళ్ళూ చేతులాడక /మునిగిపోతున్న రైతులు,రైతు కూలీలు"-ఇలా కరువు నేలలోని స్థితిని ప్రముఖ కవి శివారెడ్డి మెచ్చేలా కవిత్వ చేశాడు సడ్లపల్లి.ఈ కావ్యమంతా ఎన్నో మంచి కవితలు "మనసులను చంపుకొని,దేహ దాహాలను పెంచుకొని,సంతలో సరుకులై కొల,తుల దూర ద్రవ్యాది మానాల ముక్కలై తక్కెడలో ' తూగుతుంటే.."మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాయి. 'నిరాశల గళంలో ఆశల పల్లవి'ని ఇంకా చాలా కాలం ఆలపించమని ఈ కవిని కోరుతూ"జీవించాలనే ఆశ/కాలాన్ని ఎదురించే చేవ" తో ఈ కవి జీవించి నిరంతరం జ్వలించాలని కోరుకొంటున్నా.కవి సంగమ మిత్రుల్ని ఇలాంటి మంచి కవిత్వాలని చదివి మరింత మీరు జ్వలించాలని ఆశతో చెబుతూ మరో మంగళ వారం కలుద్దాం.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMsW

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్!!అ/నిర్మితం!! --------------------­-------- నువ్వెప్పుడైనా కలలు కూలిపోవడం చూసావా? చెట్లు ఆకులను,పువ్వులను కలగంటాయి తమలోనే దాచుకోవాలని కాని శిశిరపు కాటిన్యంతో వసంతపు శకలాలను పోగుట్టుకుంటాయి నువ్వు కూడా కొన్నిసార్లు స్నేహం ప్రేమ కామం కాంక్ష స్వార్థాలను పోగేసుకోడానికి ఆర్తిగా యత్నిస్తావు అనిర్మితమైన అంచులపైన నిలబడి కొన్ని వాన చినుకుల మధ్య నీ దేహం స్వచ్చమైన ప్రకృతితో రమిస్తుంటుంది ఆవేశపు కణాలను కక్కేస్తూ నిన్ను నువ్వు కడిగేస్తూ అలసిన ఆత్మల పరివర్తనలో కళేభరాల బూడిదను ఎత్తుకుంటూ తిరుగాడుతుంటావు నిశీధిలో విగత ఎడారిలా... మళ్ళీ ఇప్పుడు కొన్ని కలలను కనాలి నీకు నువ్వుగా బ్రతకడానికి.... తిలక్ బొమ్మరాజు 23.02.14 26.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMcz

Posted by Katta

Chythenya Shenkar కవిత

చైతన్య || Save as ------------------- ఇంకెన్నాళ్ళు??? అంతః ప్రవాహ అంతిమ చిత్రం! ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు, నాది కాని నా తనువుని మోస్తూ.. ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! సమాజానికో అద్దం ఇచ్చి, క్షణక్షణానికి రంగులు మార్చి, ముందున్నప్పుడు వెనుకకు చూపి, వెనకున్నప్పుడు ముందుకు చూపి, ముందు వెనుకలకు మధ్యన పెట్టి, తడికలు చుట్టి గంతలు కట్టి, నమ్మించేందుకు నటనలు నేర్చిన, మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది! నాది కాని నా తనువుని మోస్తూ.. ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! నీది కాని నీ తనువుని చూస్తూ, తడబడి పోతూ, తమకపు కన్నులు చప్పుడు చేస్తూ.. తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ.. క్రొద్దిసేపేమో కన్నీరంటావ్, క్రొద్దిసేపేమో పన్నీరంటావ్, కన్నీటిలోన పన్నీరు కలిపి తప్పక ముందుకు సాగిపోతున్న, తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది! బ్రతుకు బండిపై ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని, బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని, పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ... నన్నే చూస్తూ నిన్నే తిడుతూ, నీకూ-నాకూ గొడవలు పెడుతూ, కడుపులు కొడుతూ, కలుపుని తింటూ... తప్పులు చేస్తూ ముందుకు సాగే, వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది! నీది కాని నీ తనువుని మోస్తూ, ముందుకు సాగే... వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! 26/02/2014

by Chythenya Shenkar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evuBcs

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। నాలో నువ్వు ।। -------------------- గుండె గోడలను చీల్చుకుని చొచ్చుకుపోయావు కొంత మాంసం ముద్దకు కొన్ని ఎముకులను అతికించి నువ్వే ఈ దేహాన్ని నిర్మించినట్టు. ఇక నాదంటూ ఏమీ లేదు ప్రతి అణువూ నీ పరిబ్రమణమే ప్రతి కణమూ నీ వశమే. ఉచ్వాస నిశ్వాసలు నీ స్పర్శకు రగులుతూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాయి లిప్తపాటు మరణానికి కొత్త ఆయుష్షు పోసుకుని. హృదయాన్ని కోట్ల శకలాలు చేసి విసిరేస్తున్నావు అవి మంచు పొగుల్లొ పడి ఆరని జ్వాలగా రగులుతున్నాయి. రాలి పడుతున్న రాత్రులు నక్షత్రాల బరువులు మోసుకొచ్చి గుండె బాధను పెంచి పోతున్నాయి. యాతమేసి తోడుతున్నా ఆరని కన్నీటి సముద్రాలు స్రవిస్తూనే వున్నాయి కట్టలు తెంచుకున్న ఉప్పెనలా. ఇది ఆది యో .. అంతమో .. అనంతమో .. ! (26-022014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evcNOE

Posted by Katta

Kishore Kumar Kattamuri కవిత

దేముడు దుర్మార్గపు దేవుడు కనే అదృష్టాన్నిచ్చి పేగు బంధమన్నది వాళ్ళకి పేటెంటు చేసాడు నా రక్తం ధారపోయ్యడానికి సిద్దంగా ఉంటె పసి పాపకి తల్లిపాలు శ్రేష్ట మన్నాడు బిడ్డల కోసం దివారాత్రము నేనున్నా తల్లి ప్రేమను మించింది లేదని చెప్పించాడు ఈడు వచ్చిన కూతుర్ని ఎడంగా ఉంచమని ఎదిగొచ్చిన కొడుకుని మిత్రుడిగా చూడమని నాకు ఎక్కడలేని అడ్డంకులూ పెట్టి జీవితాంతము ఆమెను తల్లిగానే ఉంచాడు అచ్చులు హల్లులు అన్ని కలిపి “అమ్మ” చేసి నన్నేమో “నాన్న”అని ఏకాక్షరంతో సరిపెట్టాడు దుర్మార్గుడా ఎందుకిలా చేసావని గద్దించబోతే ఇంత ప్రేమమూర్తిని నీకు భార్యను చేశాగా అంటూ తల్లిప్రేమకు లొంగిపోయానని నవ్వురుకున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి నమస్కారాలతో కిషోర్ కుమార్

by Kishore Kumar Kattamuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fpMgCC

Posted by Katta

Surya Suryadevara కవిత

మండే సుర్యుడిలా రగులు తున్న హృదయం... ఎగిసిపడె ఉప్పెనలా నీ జ్ఞాపకాల జ్వాలలు... తరుముకొస్తున్న ప్రచండ తుఫాను లా నీ గుర్తులు... కట్టలు తెంచుకున్న ఊద్రృతి లా నీ మీద ప్రేమ... భూకంపనికి కులుతున్న మెడలా నా జివితం... విటీ అన్నిటీ నుండి విముక్తి .. సునామిల ముంచుకువచ్చే నీ ప్రేమ...

by Surya Suryadevara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBcEVg

Posted by Katta

Vani Koratamaddi కవిత

మా తండ్రిగారి కవితలని ఆదరిస్తున్న మిత్రులకి దన్యవాదాలు గుప్తంగా వుండిపొయిన నాన్నగారి ప్రతిభను నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను రచన. క్రీ.శే.కొరటమద్ది నరసింహయ్య గారు, దీపావళి అమావాస్య నుద్దేశించి వ్రాయ బడింది. అమావాస్య నవ్వింది అమవస నిశిలో లెక్కలేని చుక్కల రాశిలో మృగ్యమైన శశికళ కోసం నా కన్నులు కలియ జూచినై నా ఎదను కలచివేచినై రాని రేనికోసం కలువరాణి పరితపించింది తీయని బాధతో తీరని బాధలతో సొమ్మసిల్లి పోయింది అంతా అంధకారబంధురం మర్మం తెలియని ప్రగాఢతిమిరం కలువల వెతతో నిండిన కజ్జల సంద్రం అంతు తెలియని విధాతృకృత్యం ఈ అందాల శరత్తులో జగత్తును ముంచెత్తిన ఈ తిమిరం ఏమిటి? దీని మర్మం ఏమిటి? ఆలోచన సాగలేదు, అంతుదొరకలేదు, అనుమానం తీర లేదు, అల్లంత దూరాన ఒక దీపకళిక మిణుకు మిణుకు మన్నది ఆకాశాన ఒక మెరుపు తునక తళుకు మన్నది నా ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది ఒక దీపం దీపావళియై ఒక మెరుపు తటిల్లతమై నిశియంతా నిండిపోయినై వెలుగుల పాలవెల్లిలో ఆకశమంతా నిండి వైచినై విరహిణియే కలువ బాల భ్రమసి పోయింది దాని శరజోత్స్న అనుకున్నది రేకు విచ్చి చూచింది నిజం తెలిసి నవ్వింది ఈనవ్వుల వెన్నెలలో అమవసనిశి నిండింది అమావాస్య నవ్వింది విరోధికృత దీపావళి. 26/2/2014.

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fppt9X

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి నాలో నేను! ఆ రెండూ ప్రక్కప్రక్కనే పెట్టా ఒకటి ఐశ్వర్యం మరొకటి హృదయం ఐశ్వర్యాన్ని పంచుకున్నారు హృదయాన్ని విరుచుకు తిన్నారు ఇప్పుడు నాకు కన్నీళ్లే లేవు చెప్పుకోవడానికి అక్షరాలు తప్ప! 25FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdDbSf

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ ............అన్నవరం దేవేందర్ నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం అవును ఇప్పుడు తెలంగాణా నేలంతా పరిడవిల్లుతంది.సంబురాలు చేసికుంటంది సై సై అని ఎగురుతంది .తల్లి పీరి పట్టుకొని ఆగవట్ట వశం లేని ఎగురుడు ఎగురుతంది .నిజానికి ఇప్పుడేమన్నా విప్లవించిందా,విముక్తి అయ్యిందా ? పటం మీద కొత్త గీతలు పడ్డయి.అయితే దేశం లో ఇదివరకు అమలు అవుతున్న దోపిడీ ఆగుతదా పీడన ఆగుతదా సామ్రాజ్యవాద పెత్తనాలు ఆగుతాయా ..సామ్రాజ్యవాదుల బంటులైన వారి నిలువు దోపిడీ ఆగుతది.వాళ్ళ పీడన ఆగుతది .అదే సంబురం . ఎందుకంటే తెలంగాణా చాలా ఏళ్లుగా పరాయికరణ చెందింది .డెబ్బై ఏళ్ళకు పైగా పోరాటం చేస్తంది .అయితే రాజ్యాంగ బద్దం గా జరిగిన ఇదొక్కటే సక్సెస్ అయ్యింది .విజయాన్ని ముద్దాడింది .నలబయో దశకం ల తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ,అరవయో దశకం ల తెలంగాణా పోరాటం ,ఎనబయో దశకం లో నక్సలైట్ పోరాటం అవన్నీ విజయానికి చేరువ మాత్రమే అయినవి .ఆ పోరాటాల ప్రభావాలు సమాజం మీద పడవచ్చు కాని లక్ష్యం సాదించలేదు .ఈ ఇన్ని పోరాటాల ఫోర్స్ తోనే తొంబై ఆరు నుంచి రెండువేల ఒక్కటి నుంచి తెలంగాణా ఉద్యమం వచ్చింది .ఇది సాదించింది .చాలా ఏళ్ల తరువాత ఈ విజయం అందుకే ఈ ఎగురుడు దునుకుడు . పాత చరిత్ర చర్వితం ఎందుకు కాని తెలంగాణా ,ఆంధ్ర రెండు అసమ సమాజాలు కలయికే కుట్ర ,మోసం తో కూడుకున్నది .ఇంకేముంది మొత్తం తెలంగాణ ను దోచుకున్నారు .అనుమానం లేదు నిజమే నిధులు ,నీళ్ళు కొలువులు అన్నీ ,పాలన చేత పట్టిండ్రు ,సినిమాలు పత్రికలు ,ప్రసార మాధ్యమాలు సకల రంగాల్లో సొచ్చిండ్రు .అయితే రెండు ప్రాంతాల బేధ భావం లేకుండా వుంటే వివక్ష లేకుండా వుంటే అంతా సమానం వుంటుడే.కాని రెండో శ్రేణి గా చూడడం లోనే కొనసాగింది .ఇది అన్ని రంగాలలో రాజకీయం ,పార్టీలు సంగాలు సంస్థలు ,విద్య ,వైద్యం ,చరిత్ర ,సంస్కృతి ఒక్కటేమిటి అన్యాయం జరగని రంగం లేదు . దీంతో తెలంగాణ సమాజం కు మంట పుట్టింది .ఆ మంట పలించించింది. ఒక భాద కాదు ఇది ఇప్పుడు సల సల సలిపే గడ్డ పలిగి చీము అంతా ఎల్లి పోయినంత హాయి అని సేద తీరుతున్నారు వ్యాపరులైన రాజకీయనాయకులు తప్పితే దోపిడీ పీడన ను ఎవరు కాని ఆమోదిస్తారు .పీడన దోపిడీ ఎక్కడున్నా ఈ రూపం లో ఉన్న ఎదిరించుడే .అది రేపటి తెలంగాణా లోను ఉండొచ్చు సీమాన్ద్రలోను ఉన్డొచ్చు . నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం పెయ్యి పులకరించే మట్టి స్పర్శ తెలంగాణం మహా తెలంగానం సకల ఆధిపత్యాల పై పూరి విప్పిన రేశం పీడన పై ఎదురేగిన ఊరేగింపు తెలంగాణ..నవ నవలాడే తెలంగాణ..

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cNK0bN

Posted by Katta

Pusyami Sagar కవిత

కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ వ్యక్తి స్వభావాన్ని (mentality) అది అంతర్ముఖమైన (introvert) లేదు బహిర్ముఖులు (ఎక్ష్త్రొవెర్త్) విరుద్ధ ప్రవర్తనను, నిత్య జీవితం లో మనిషి తోటి మనిషి తో ఎలా మసలుకుంటారు. వ్యక్తి ని అర్థం చేసుకోకుండా తొందరగా ఒక నిర్ణయానికి రావడం ఇవన్ని కట్ట శ్రీనివాస్ గారి కవిత లో కనిపించే అంశాలు .. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా స్పురణ కు తెచ్చుకోవాలి (hipocrots) మనసు లో ఒకటి వుంచుకొని పైకి మరొకటి మాట్లాడటం ప్రవర్తించటం మనిషిజీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తనా కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది మానసిక శాస్త్రం. మొదటి పరిచయం లో నే వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు అంటే నీకు కనిపించేది అంత నిజం కాకపోవచ్చుఇది చూడండి .. //సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం //ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే./// నిజమే పైకి కనిపించే ధీ నిజం కాకపోవచ్చు, మరి నిజం తెలుసుకోవాలి అంటే ...వారితో స్నేహం నేర్పిన తరువాత నే కదా తెలిసేది ...మనిషి ని అర్థం చేసుకోవడం లో వెనుకనే మే మనం ఎప్పుడు ... మానసికం గా దుఖాన్ని దాచి పెట్టి చాల మంది మన మద్యనే వుంటారు వారు చెప్పే దాక తెలియదు వారి వెనుక ఉన్న విషయము ఏమిటో ..కాని పైకి చిరునవ్వులు చిందిస్తు నలుగురి లో కలివిడి గా తిరుగుతారు కింది పంక్తులలో జాగ్రత్త గా గమనిస్తే ...మనషి పైకి కనిపించని మరో కోణాన్ని చూడాల్సిన అవసరం వుందని అనిపించింది రాత్రి పగలు పడుకునేవాడిని సోమరి బద్దకస్తుడు అనటమే కాని అలా ఉండటానికి గల పరిస్థుతులను ఎవరు అయిన గమించార, మాటలు ను సూటిగా చెప్పేవారిని ఫ్రాంక్ పర్సన్ అంటాము తప్ప, నిజంగా అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రహించగలామ నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ,//వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న //ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన....// పిరికితనం, ఏడుపు (crying), dareness (ధైర్యం) మూడు మానసికము గా కలిగే భావోద్వేగాలే. ఒక్క మనిషి లో మాత్రమే చూడగలిగే భావన ఏది అంటే నవ్వు ఏడుపు ...చాల మంది అంటూ వుంటారు మాకు ఏడుపు రాదూ ...మేము మానసికం గా బాగా దృడం గా ఉంటాము అని, కాని నిజంగా గుండె లోతుల్లోకి వెళ్లి చూస్తే ఆకాశం బద్దలయ్యే దుక్ఖాన్ని దాచిపేట్టుకుంటారు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! // వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే// ఏడిచే వారినీ లోకం వేరే గా చూస్తున్నదా కాని చాల మంది చిన్న విషయాలకి కన్నీరు పెడతారు బలహీనులని గేలి చేసి సంతోష పడతాము తప్ప వారు నిజంగా ఎంత సున్నితం గా ఆలోచిస్తారో కదా...ఇలాగ ఎప్పుడైనా ఆలోచించామా ?? //చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు //మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. కోపాన్ని ప్రదర్శించే వారు ఎప్పుడు అభద్రతా భావం తో నో లేదంటే, ప్రేమ రాహిత్యం తో ను కొట్టుమిట్టాడుతూ వుంటారు మీ మీద కోపం చూపిస్తే దూరం వెళ్ళాసిన అవసరం లేదు వారి కళ్ళలో కన్పించే దయనీయ భావాన్ని చదవాలి అంటారు వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే,//అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు.//భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. కవిత ముగింపు చాలా హత్తుకుంటుంది తెలిసిన నిజాన్నే మరోసారి గుర్తు చేసారు, మనిషి ని చదవాలంటే ప్రంపంచం లో అన్ని భాషలను ప్రయత్నిచినా "మనసు " భాష తెలుసుకొని మసలు కొంటె బాగుటుంది అంతే కదా.., మనిషి ని అర్థం చేసుకోవాలి అంటే మనసు లోతుల్లో కి వెళ్ళగలగాలి, గుండె లో ని ప్రేమ ని చూడగలగాలి, స్నేహాన్ని అందుకోవాలి అన్నప్పుడు పరిగెట్టటం కాదు ...నిలబడి ఆసాంతం మనిషి ని ఆకళింపు చేసుకుంటేనే సాద్యపడుతుంది నేస్తం !!!!.. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు.//మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి.//గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి,పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ===== కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు || మన మెందుకో అవతలి వారిని త్వరగా అపార్ధం చేసుకుంటాం కానీ లోతుల్లోకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం కానీ, ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే అదని గమనించం. పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రాదేవత ఒడిలో ఊయల లూగుతున్నవారిని చూసి ఎంత నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ, వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న విషయాన్ని గమనించలేం. తక్కువ మాటలను, ఎక్కువ వేగంతో చెప్పేస్తే ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం కానీ, రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన పట్టుకోలేం కాక పట్టుకోం. నాకసలు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! అని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తాం. కానీ వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు ఓ సారి కదిలిస్తే అది జిత్తులమారితనం కాదు అమాయతను రంగరించుకున్న మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. ఆటలో అరటిపండ్లలాంటి తొక్కలో విషయాలకో వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే, అది ఆధిపత్య ప్రదర్శనో, మితిమీరిన అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు. వారు ప్రేమరాహిత్యపు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారనే భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు. లోపటి లోకాల ఊసులు తెలియాలి, మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి. గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి, చాపే చేతులతో హృదయాలను అందుకోవాలి. పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ఓ సారీ నిలబడి భారం బేరీజు వేయగలగాలి.

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxIhJv

Posted by Katta