పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Annavaram Devender లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Annavaram Devender లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ .......................అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ...... కరీంనగర్ కు వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ఉన్నది .ఆ మాటకు వస్తే అన్ని జిల్లాలకు ఉంటది .కాని కరీంనగర్ చరిత్ర గ్రంధస్తం చేయబడ్డది .డాక్టర్ మలయశ్రీ 'కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర (క్రీ .శ 950-1995) పిహెచ్డి గ్రంధం 1997లోనే వెలువరించారు .ఇది తెలుగు సాహిత్య చరిత్రలో తల మాణికం. ఇందులో అనేక సాహిత్య విషయాలు ఉన్నాయి .తొలి తెలుగు కంద పద్యం పుట్టింది కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట మీదనే .ఈ పద్యాన్ని జిన్నవల్లభుడు రాసిండు .జినవల్లభుడు కన్నడ ఆది కవి పంపని సోదరుడు క్రి .శ 946 లో ఈ శాసనం వేయబడ్డది .ఆ తరువాత మాడిక సింగన్న ,వేలగందల కందన ,నారాయ చ్రికొండ ధర్మన లు ఈ జిల్లలో కవులు గా ప్రసిద్ది చెందారని ఈ గ్రంధం లో ఉన్నది..తొలి కవయత్రి కోడిమ్యలకు చెందినా ఆనంద మాంబ.ఈమె 1934 లో 'సతీలలామ ' అనే కావ్యాన్ని వెలువరించారు 1901-1950 మద్యలో సిరిషేనహళ్ కృష్ణమాచార్యులు ,నేమలికొండ పింగళి లింబాద్రి రెడ్డి ,గుండరేద్దిపల్లె అనంత్వరపు సిద్దప్ప .రామసిహ్మకవి వి .కేశవరావు లు ప్రసిద్దులని మలయశ్రీ పేర్కొన్నారు 1934 దీపావళి ప్రత్యేక సంచిక గా వెలువడ్డ 'గోలకొండ' కవుల సంచికలో 354 మంది కవుల వివరాలు ఉంటె అందులో 40 మంది కరీంనగర్ వారే నని మలయశ్రీ పరిశోధన లో తెలిపారు .ఇలా ఈ పరిశోధన గ్రంధం లో చాల విషయాలు ఉన్నాయి .ఇందులో 700 మంది రచయితల పరిచయం ఉన్నది .వెయ్యి సంవత్సరాల అపురూప చరిత్ర రూపొందించిన మలయశ్రీ బహు అభినందనీయుడు .ఇంకా ఈ గ్రంధంలో కొన్ని ఆయా రచయితల ఫోటోలు సుత ఉనాయి .జిల్లా పేరు మీద ఇలాంటి చరిత్ర రావడం కరీంనగర్ ప్రథమం . అయితే ఈ గ్రంధాలు ఇప్పుడు లభ్యత లేకపోవచ్చు ఎందుకంటే పదిహేడేళ్ళ కింద వెలువడ్డ పుస్తకం ఇది .ఈ కాలం వాళ్లకు తెలువాలిసిన పుస్తకమని రాస్తున్న .(మలయశ్రీ గారు కరీంనగర్ లోనే ఉంటారు మాట్లడలనిపిస్తే సెల్ ....9866546220....)

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiOE6y

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Annavaram Devender కవిత

ఇయ్యాల ( 15.06.2014)'నమస్తే తెలంగాణ'బతుకమ్మ ల 'రానే వచ్చింది '

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UCRZD2

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ .................................అన్నవరం దేవేందర్ వాగు ...ఇదొక సాహిత్య ప్రవాహ.....మాస పత్రిక కరీంనగర్ నుంచి ఈ కాలం లో 'వాగు ' సాహిత్య మాస ప్రత్రిక పురుడు పోసుకుంది .తెలంగాణా అవతరణ రోజే ఈ పత్రిక ఆవిష్క్రిన అయ్యింది .స్వాతంత్ర్య సమార యోధుడు ,నలబై ఏండ్ల కింద 'సారస్వత జ్యోతి ' పత్రిక నడిపిన బోయినపల్లి వెంకట రామా రావు దీనిని ఆవిష్కరించిండ్రు .దీనికి బహుభాషావేత్త ,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార ప్రకటిత నలిమెల భాస్కర్ సంపాదకులుగా ఉన్నారు ,నగునూరి శేఖర్ వెన్నుదన్ను గా నిలిచారు .జూకంటి జగన్నాధం ,పెద్దింటి అశోక్ కుమార్ యం .నారాయణ శర్మ ,నేను అంటే అన్నవరం దేవేందర్ ,కందుకూరి అంజయ్య ,గాజోజు నాగాభూ షణం,బూర్ల వెంకటేశ్వర్లు ..సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నాం . సాహిత్యానికి ఎన్నో పత్రికలు వస్తున్నయి.అందులో ఇదొకటి కాకుండా సామాజిక సాంస్కృతిక రాజకీయ అవగాహన తో తెద్దాం అనుకుంటున్నాం .కథ ,కవిత్వం వ్యాసం విమర్శ అన్నీ ఉంటాయి ఆవిష్కరణ కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగింది .సూరేపల్లి సుజాత జూకంటి సందేశాలు ఇచ్చిండ్రు . గతం లో కరీంనగర్ లో 'విద్యుల్లత ' పత్రికను బి .విజయ కుమార్ ,గోపు లింగా రెడ్డి ,వి వెంకటరెడ్డి లు వేలువరించిండ్రు ,సత్యార్తి పత్రిక మలయశ్రీ తీసిండు ,సిరిసిల్ల నుంచి జూకంటి నిజాం వెంకటేశం కలిసి ఒక సాహిత్య బులిటెన్ తెచ్చిండ్రు .అట్లనే ఇదొక ఒరవడి తో ఇక్కన్నుచే వాగు ప్రవహిస్తున్నది . రచనలు పంపొచ్చు........................... ;vaagu2014@gmail.com పత్రిక కావలిసిన వాళ్ళు తమ అడ్రస్ ఇస్తే పంపిస్తాం ...మెయిల్ చేయొచ్చు .. జయహో తెలంగాణ .....జయహో వాగు

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRRh9S

Posted by Katta

28, మే 2014, బుధవారం

Annavaram Devender కవిత

ఇంకా అయిదు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండు గా విడి పోనున్నది .తెలుగు కు రెండు రాష్ట్రాలు ,రెండు అస్తిత్వాలు రెండు బిన్న సంస్కృతులు ఉండనున్నాయి .ఆంధ్ర -తెలంగాణా కు అన్నిట్లో జమీన్ ఆస్మాన్ పరక్.భాష వేరు వేరే ఇక్కడి పల్లె భాష అక్కడి పల్లెకు ఎక్కది .అక్కడిది ఇక్కడ అట్లనే .ఇలా వేరు వారు సంస్కృతులు బల్మీటికి ఒక్క తాన కలిపినా కలువాలె.పందొమ్మిది వందల యాబైఆరు ల కలిస్తే ఈ రెండువేల పడ్నాలుగుల విడిపోవడం ఇరు పక్కల సంబురమే .ఒక్క వ్యాపార వాదులకు తప్ప .సాహిత్యం సంస్కృతి అన్ని ఇంకా మస్తుగ విలాసిల్లాలే. తెలంగాణా అయితే అరువై ఏండ్లుగా కోట్లడిన భూమి ఇప్పుడు కొంత తెగతెంపులు అవుతున్న సందర్భం .అందరం సంతోషంగా ఉందాం ఒకరి కొకరం శుభాకాంక్షలు తెలుపుకుందాం .రెండు తోవ్వలు పోయేది ఒక్క కాడికే ........

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wiBt9F

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

Annavaram Devender కవిత

ఎవలైతేంది ..... !!- ---------అన్నవరం దేవేందర్ ఆయన ఎవలైతేంది వూరు పక్కన గుట్టలన్నీ గులాబీ జాం లా గుటుక్కు మని మింగడు గదా ! జర జల్లెడ పట్టి సూడు ఆయన ఎవలైతేంది వూరు సుట్టు వాగులల్ల ఇసుకనంతా దేవుకొని పుట్న్నల్లెక్క బుక్కడు గదా ! జర మెరిగాల్లెక్క ఏరు ఆయన ఎవలైతేంది అడవి లోని కలప సంపదనంతా కర కర మింగడు గదా ! జర జాలి ల వడబోయి ఆయన ఎవలైతేంది భూముల్లోని ఖనిజాలను గంప గుత్త పట్టి పండ్లోలె అమ్ముకోడు గదా ! జర పశనతు పట్టు ఆయన ఎవలైతేంది నీ సుట్టు ముట్టు జాగలన్నీ కంపినీలకు కట్టబెట్ట లఫంగి కాడు గదా ! జర వస్త్రగాలం పట్టు ఆయన ఎవలైతేంది వోట్లన్నీ గంప గుత్తగ కమాయించుకొని నెత్తిన కూసోడు గదా ! జర తేజాబుల కడుగు అప్పుడు సోక్కం తెలుస్తది ... --

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmsEq3

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ........అన్నవరం దేవేందర్ ....23.04.2014 కరీంనగర్ లో ‘విద్యుల్లత’ లు విరచిమ్మిన కాలం కరీంనగర్ జిల్లా సాహిత్యానికి పత్రికా రంగానికి పెట్టింది పేరు .జిల్లా నుంచి 1969 లో సంవత్సరం పాటు ‘విద్యుల్లత ‘యువ సాహిత్య మాస పత్రిక నడిచింది .సాహితీ మిత్ర మండలి దీనిని ప్రచురించింది .దీనికి సంపాదకులుగా బి.విజయకుమార్ (జీవగడ్డ విజయకుమార్ గా ప్రసిద్దులు ),జి .లింగారెడ్డి (డాక్టర్ గోపు లింగారెడ్డి ,ప్రఖ్యాత జానపద సాహితీ వేత్త ,రెండేళ్ళ కింద మరణించారు ).వి.వెంకటరెడ్డి లు వ్యవహరించారు .అప్పుడు వీళ్ళంతా విద్యార్థులే జమ్మికుంట కళాశాలలో చదువుకొంటడ్రు.ఇటీవల నా పాత పుస్తకాలు సదురుతుంటే విద్యుల్లత జన్మదిన కథల సంచిక దొరికింది (ఆగస్ట్ –సెప్టెంబర్ -1970 )ఇందులో ఏడు కథలు ఉన్నాయి .ఈ పత్రిక కు శ్రీ శ్రీ .కొడవటిగంటి ,కే.వి రమణారెడ్డి ,అద్దేపల్లి రామమోహనరావు ,తాడిగిరి పోతరాజు ,చలం ,రాసిన ఉత్తరాలు ఉన్నాయి .నలబై నాలుగేండ్ల కింది సాహిత్య పత్రిక చూస్తే గంమతి అనిపిచ్చి ఈ కాలం లో రాస్తున్న . ఇంకా ఇందులో మెట్టు మురళీధర్ రావ్ ‘సుడుగుండం ‘,సి .ఎస్ రావ్ ‘గంజయిగొట్టాలు,అత్తలూరి నరసిహ్మరావ్ ‘నిద్ర పింగళి రంగా రావ్ ‘ఆకలి ‘,రవికాంత్ ‘ఉదయం ‘,ఆగ్నేయ ‘నింద లేందే ‘యం.యన్ రావ్ ‘హింస ను నిషేదించిన పులి రాజు ‘కథలు ఉన్నాయి .అట్లనే పి.యన్ .స్వామి ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్ తో ముఖాముఖి ఉన్నది .ఆపుడే తెలంగాణా నుంచి ఇంత గొప్ప పత్రిక వెలువడింది .ఆ తరువాత కాలం లో ఆగి పోయింది .కరీంనగర్ కేంద్రంగా ఆనాటి సాహిత్యం ప్రచురణకు కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఏర్పడింది .’బదులా’ కథా సంకలనం కూడా ఇక్కన్నుంచే వచ్చింది .శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రేవల్యుషన్’ఇక్కన్నే అచ్చయింది . అసలు కరీంనగర్ లో 1954లో బోయినపల్లి వెంకటరామరావ్ సంపాదకత్వాన ‘సారస్వత జ్యోతి ‘త్రైమాస పత్రిక వెలువడింది .అదే కాలంలో కమల్ కరిమనగారీ సంపాదకత్వంలో మానేరు ఉర్దు పత్రిక ‘పంచాయితి యుగం ‘పాతికలు వెలువడ్డాయి .1977 లో మలయశ్రీ సంపాదకత్వం లో సత్యార్తి పత్రిక వెలువడింది .తెలుగు సాహిత్యానికి కరీంనగర్ అందించినది ఎంతో ఉన్నది .ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పత్రికలు వస్తున్నాయి సిరిసిల్ల నుంచు ‘దిక్సూచి ‘సాహిత్య పత్రిక వస్తుండే....అట్లనే తెలంగాణా ఆవిర్భావం నాటి నుంచి ఇక్కడి మిత్రులు ‘వాగు ‘సాహిత్య పత్రిక వెలువరించేందుకు సన్నాహాలు చేస్తుండ్రు ..వాళ్ళను స్వాగతిస్తాం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rhUGVp

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Annavaram Devender కవిత

ఈ రోజు 14.04.2014 'ఆంధ్ర ప్రభ ' సాహితీ గవాక్షం లో ...

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzAlrT

Posted by Katta

9, ఏప్రిల్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ .............................అన్నవరం దేవేందర్ .....................................9/04/2014 కాళోజీ .......ఒక ఉత్సవమే ........ఒక పతాకమే .. కాళోజీ జీవితం ఓక ధిక్కార పతాకం .కాళోజీ ఒక ప్రశ్నల గని .కాళోజీ హక్కుల దిక్కు .ఇలా ఎన్నైనా రాయొచ్చు .ఆయన జీవితం పోరాటం తెలియని వారు ఎవరు లేరు .ఇది కాళోజీ శత జయంతి సంవత్సరం .కాళోజి శత జయంతి ఉత్సవ కమిటి బి .నరసింగ రావు అధ్యక్షతన ఏర్పాటైంది .గత ఆరు నెలలుగా కాళోజీ జయంతి ఉత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తుంది .'కాలోజి ఉత్సవ్ ' పేరిట ఈ టాబ్లాయిడ్ నూ వేలువరిస్తంది.ఇప్పటికి రెండు సంచికలు వచ్చినయ్.దీనికి వేణు సంకోజు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు .అట్లాగే 'కాళోజీ కెంపులు ' పేరిట కాళోజీ రాసిన ఆనిముత్యల్లాంటి కోట్స్ తో ఒక పుస్తకం వెలువరించారు .కాళోజీ కెంపులు కొన్ని వేల ప్రతులు ముద్రించి రాష్ట్రం లోని బడి పిల్లలందరికీ పంపిణి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .కాళోజీ సాహిత్యం ఈ తరానికి అందించే పనిలో ఈ కమిటి పని చేస్తుంది .ఈ ఉత్సవ్ సంచికలు నెల నేలా వెలువరించే పనిలో ఉన్నారు . కాళోజి ఒక ధిక్కారం ఒక గోడ గోడ ఏడ్పు అడుగుడు ఎదురు తిరుగుడు మర్లపడుడు ఆయన నైజం .ఆయన లో మార్క్స్ ,గాంధీ కలే కల్సి ఉన్నారు .ఆయన జీవితం తెలుగు సమాజానికి ఒక దీపం .

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivg7gs

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Annavaram Devender కవిత

పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది అన్నవరం దేవేందర్ .....................................తొవ్వ...02.04.2014 అవును పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది .కరీంనగర్ లో ఇది గత ఎనిమిది నెలలలు గా సాగుతంది .ఒక్కో పున్నం నాడు ఒక కవి ఇంటి డాబా మీద కవులంతా సాయంత్రం ఏడింటికి జమ అయితరు.గుండ్రగా కూసోని మనిషో కవిత సదువుతరు .అటేనుక ఆ కవితలన్నీ మల్లవచ్చే పున్నం కు పుస్తకంగా వస్తయి.తెలంగాణా రచయితల వేదిక జిల్లా శాఖ దీన్ని ఏర్పాటు చేస్తే సాహితీ సోపతి అచ్చోస్తది. ఇది ఇప్పుడు మహా అద్బుతంగా నడుస్తంది .ఒక్కో పున్నం కు అరవై ,డెబ్బై మంది కవులు వస్తుండ్రు .ఇందులో యువ కవులు పది పదిహేను దాక ఉంటరు.ఇలా కొత్తగా రాస్తున్నవారు హాజరవడం పాత వాళ్లకు ఆనందం అయితంది . మల్లా కవిత్వం కూడా కొత్త పుంతలతో రాస్తండ్రు .ఇలా కరీంనగర్ లో కవిత్వ వాతావరణం వెళ్లి విరుస్తుంది ఒక్కో కవి ఇంటి డాబా మీద ఎన్నీల కవిత్వం నడుస్తుంటే అక్కడికే పులిహోర ,బజ్జీలు ,సమోసా ,గుడాలు ,గారెలు ఇలా ఎదో ఉపాహారం వస్తుంది .ఆ రాత్రి సాహిత్య అనుభూతి తో గడుస్తుంది .కవిత్వం చదివే ఇల్లు ఇంటి పక్కాలు సుట్టాలు ఈ సమ్మేళనం ల పాల్గోటండ్రు.ఆతిథ్యం ఇచ్చే కవి ఇంటికి జిల్లాలోని కవులంతా కలిసి రావడం గొప్పగానే ఉంటంది .అపార్ట్ మెంట్ అయితే ఆ నివాసులు అంతా సమ్మేళనం కు వచ్చి కవిత్వం వినుడు .కవిత్వ సభల్లగా వేదిక లు ఉండయి .సుట్టు కూసునుడు రాత్రి తొమ్మిది దాటిందాకా కవిత్వం మాట్లడుకునుడు .ప్రతి సారి కొత్త వాళ్ళ తోని ప్రారంభిచుడు.ఆ తరువాత బస్సులెక్కి దూరం పోయేవాళ్ళు .అటేనుక లోకల్లున్న పాత కవులు ..ఇలా కరీంనగర్ కవిత్వం కొత్త పోకడలు పోతంది .దీన్ని ప్రేరణ గా ముంబై ,జనగాం ,సిద్ధిపేట లలో మొదలైతంది ...దీని పేరు ‘ఎన్నీల ముచ్చట్లు ‘ ఇది పత్రికల్లో బాగా ప్రచారం సుత అయ్యింది .నమస్తే తెలంగాణా బతుకమ్మ లో కవర్ పేజి ఆర్టికల్ .ఇండియన్ ఎక్స్ ప్రెస్ ల స్టేట్ పేజీల వచ్చింది v6 లో ప్రసారం అయ్యింది .దిన పత్రికల జిల్లా పెజీలనైతే పున్నం పున్నం కు వస్తంది .ఈ ప్రచారం తోని ఇదివరకు తెలువని కవులు ఎందరో కలుస్తుండ్రు .కవిత్వం సడువుతుండ్రు వచ్చే పున్నం కు పుస్తకం అచ్చు ల కవిత సూసుకున్టుడ్రు......... కవిత్వం కావాలె...కవిత్వం కావాలె ......ఎన్నెల ముచ్చట్ల కవిత్వం ల తడిసి పోవాలె ... జయ హో కవిత్వం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbDYb

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది అన్నవరం దేవేందర్ .....................................తొవ్వ...02.04.2014 అవును పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది .కరీంనగర్ లో ఇది గత ఎనిమిది నెలలలు గా సాగుతంది .ఒక్కో పున్నం నాడు ఒక కవి ఇంటి డాబా మీద కవులంతా సాయంత్రం ఏడింటికి జమ అయితరు.గుండ్రగా కూసోని మనిషో కవిత సదువుతరు .అటేనుక ఆ కవితలన్నీ మల్లవచ్చే పున్నం కు పుస్తకంగా వస్తయి.తెలంగాణా రచయితల వేదిక జిల్లా శాఖ దీన్ని ఏర్పాటు చేస్తే సాహితీ సోపతి అచ్చోస్తది. ఇది ఇప్పుడు మహా అద్బుతంగా నడుస్తంది .ఒక్కో పున్నం కు అరవై ,డెబ్బై మంది కవులు వస్తుండ్రు .ఇందులో యువ కవులు పది పదిహేను దాక ఉంటరు.ఇలా కొత్తగా రాస్తున్నవారు హాజరవడం పాత వాళ్లకు ఆనందం అయితంది . మల్లా కవిత్వం కూడా కొత్త పుంతలతో రాస్తండ్రు .ఇలా కరీంనగర్ లో కవిత్వ వాతావరణం వెళ్లి విరుస్తుంది ఒక్కో కవి ఇంటి డాబా మీద ఎన్నీల కవిత్వం నడుస్తుంటే అక్కడికే పులిహోర ,బజ్జీలు ,సమోసా ,గుడాలు ,గారెలు ఇలా ఎదో ఉపాహారం వస్తుంది .ఆ రాత్రి సాహిత్య అనుభూతి తో గడుస్తుంది .కవిత్వం చదివే ఇల్లు ఇంటి పక్కాలు సుట్టాలు ఈ సమ్మేళనం ల పాల్గోటండ్రు.ఆతిథ్యం ఇచ్చే కవి ఇంటికి జిల్లాలోని కవులంతా కలిసి రావడం గొప్పగానే ఉంటంది .అపార్ట్ మెంట్ అయితే ఆ నివాసులు అంతా సమ్మేళనం కు వచ్చి కవిత్వం వినుడు .కవిత్వ సభల్లగా వేదిక లు ఉండయి .సుట్టు కూసునుడు రాత్రి తొమ్మిది దాటిందాకా కవిత్వం మాట్లడుకునుడు .ప్రతి సారి కొత్త వాళ్ళ తోని ప్రారంభిచుడు.ఆ తరువాత బస్సులెక్కి దూరం పోయేవాళ్ళు .అటేనుక లోకల్లున్న పాత కవులు ..ఇలా కరీంనగర్ కవిత్వం కొత్త పోకడలు పోతంది .దీన్ని ప్రేరణ గా ముంబై ,జనగాం ,సిద్ధిపేట లలో మొదలైతంది ...దీని పేరు ‘ఎన్నీల ముచ్చట్లు ‘ ఇది పత్రికల్లో బాగా ప్రచారం సుత అయ్యింది .నమస్తే తెలంగాణా బతుకమ్మ లో కవర్ పేజి ఆర్టికల్ .ఇండియన్ ఎక్స్ ప్రెస్ ల స్టేట్ పేజీల వచ్చింది v6 లో ప్రసారం అయ్యింది .దిన పత్రికల జిల్లా పెజీలనైతే పున్నం పున్నం కు వస్తంది .ఈ ప్రచారం తోని ఇదివరకు తెలువని కవులు ఎందరో కలుస్తుండ్రు .కవిత్వం సడువుతుండ్రు వచ్చే పున్నం కు పుస్తకం అచ్చు ల కవిత సూసుకున్టుడ్రు......... కవిత్వం కావాలె...కవిత్వం కావాలె ......ఎన్నెల ముచ్చట్ల కవిత్వం ల తడిసి పోవాలె ... జయ హో కవిత్వం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbDYb

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

19, మార్చి 2014, బుధవారం

Annavaram Devender కవిత

ఈ రోజు నా 'తొవ్వ 'తప్పింది ......ఎన్నికల విధుల్లో మునిగిన ..మల్ల వారం తోవ్వలకు వస్తా .......

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OAnlXe

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ...............అన్నవరం దేవేందర్ 12.03.2014 మొస మర్రనియ్యని మురిపాలు ,వశం గాని సంబురాలు వశం గాని వాన పడుతే ఎట్లుంటదో మనకేరుకే .వశం గాని మురిపాలు అంతే ,పట్ట వశం గాని ఆనందాలు అంతే .ఎగిలివారంగ అయిదు గొట్టంగ మొదలైన ఫోన్లు రాత్రి పదకొండుకు బంజేత్తే బందు అయినయి.పొద్దుగాల ఎనిమిదింటికి ఇంటికి రాక పోకలు మొదలైనయి.ఇటు మనుసులు అటు ఫోనులు అబ్బబ్బ ....అన్నం తినుడు అవుతలి ఇవుతలికి పోవుడు ఏడ .....మంది ఎనుక మంది ఫోనుల ఎనుక ఫోను ...అయితే కొన్ని వందల ఫోన్లు వశం గాక ఎత్తలే ..అన్ని మిస్సుడ్ కాల్స్ అయ్యి ఉంటయి ... ఇదంతా నిన్న కరీంనగర్ లో డాక్టర్ నలిమెల భాస్కర్ ఇంట్ల జరిగింది .ఆయనకు కేంద్ర సాహిత్య ఎకాడమి అనువాద లో పురస్కారం ప్రకటించింది .దీంతో ఈ శుభాకాంక్షల వాన పడ్డది .తను మలయాళం నుంచి 'స్మారక శిలలు ' నవల ను అనువదించిండ్రు .ఈ పురస్కారం ఏమో గని మిత్రుల ,బందువుల ఆత్మీయత తోని ఉక్కిరి బిక్కిరి అయిన దేవేందర్ అని అన్నడు .నలిమెల భాస్కర్ గురించి ఇదే కాలం ల ఒకసారి రాసిన .దానిని మల్లోసారి సదువొచ్చు.అది దొరుకక పోతే నా 'పెద్దర్వాజ '(http://ift.tt/1lyyNOh) ల సూడొచ్చు .ఎకాఎకిన భాస్కర్ సార్ మీద Narayana Sharma Mallavajjala .Ramakrishna Kalvakunta ,Boorla Venkateshwarlu కవిత్వం వర్షమే కురిపించిండ్రు .అవ్వి సుత ఇస్తున్న ..... 1. ఏ మట్టి పొత్తిళ్ల నుంచి ఈ ఙ్ఞానం నడక నేర్చిందో ఈ పాలపిట్ట ప్రపంచగొంతుకని పాటకట్టి ప్రసారం చేస్తుంది ఏ వాగుగిన్నెల అమృతాన్ని పులుముకుందో దెశపు నాలుగుచెరగుల మట్టివాసనకి దోసిలి పట్టింది పదునాల్గుభాషలు ఒక్కపుస్తకమైనడిచినట్టు పదిభాషలు ఒక రామచిలుకల గుంపై ఊరేగినట్టు పదిదిక్కుల ఉద్వేగాలు ఒక గుండెగా కొట్టుకున్నట్టు ఈ గొంతుకొక్కటే దేశానికి నిలువుటద్దమౌతుంది అనేక భాషల పిల్లవాయువులు అక్కడక్కడి సరస్సుల శీతల సమీరాలు ఆయా ఉద్యమాలవెలుగురేఖలు ఈ కిటికీ నుంచేమమ్మల్ని చేరుతాయి కాగితాలకి కళ్లతికించుకున్న బుద్ధుడిచేతిలో ఏ గొంతులూ మాగడపలో మూగ బోకుండా భోధి వృక్షాలౌతాయి ---------యం.నారాయణ శర్మ .11/03/2014 2. పద్నాలుగు భాషలభాస్కరుడు నారాయణపురం మట్టిపువ్వు తనహృదయకోశాన్నిజల్లెడపట్టి జానుతెనుగుసొగసు తెలంగాణా పదాల్నిఏరి కుప్పవోసి,కడుపులున్నమాటల్ని అక్షరబాణాలుగా ఆలోచనల్ని ఎక్కుపెట్టి మౌనంగా మహాకార్యాలు చేసేమొండి పట్టుదలకు పర్యాయ పదం రక్తమాంసాల నిండా నాయిన రామచంద్రం సారుని తనలోకి వొంపుకున్న మట్టి బిడ్డ స్వరాల్ని శ్రుతి కలిపి గుండె పియోనోపై ఆత్మీయతల్నివర్షించే ఆక్షర భాస్కరుడు దివారాత్రాలు కండ్లను పుస్తకాల పుటల్లో మాగవెట్టి ,కథల పండ్లనురసపరిపుష్టం చేసినోడు తెలుగు మట్టిపొత్తిళ్లల్ల అనువాదపు కొత్త పంటలు పండిస్తున్న నిత్యకృషీవలుడు ఆనువాదపునవనీతం నలిమెల భాస్కరుడా! నజరానా అందుకో! నాలుగుకోట్ల తెలంగాణా జనం సాక్షిగా!! ..............కలువకుంట్ల రామ కృష్ణ .11/03/2014 3. ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలిపడే కళగల్ల మొకం పత్తిపాన్పులకెల్లి బొర్లచ్చినట్టు గుండెలకెల్లి పలికే రామసక్కని మాట మీగడ పెర్గు గిలకొడితె పేరుకున్న నవనీతం మనుసు అక్షరమక్షరం కండ్లకద్దుకుంటడు ఆత్మగల్ల భాషేదైనా అర్థం జేసుకుంటడు అతని పేరు నలిమెల భాస్కర్ అదిప్పుడు తెలుగు భాషల ముత్యాల పేరు పేరీ పేరీ అట్టుగట్టిన భాషల పరమాన్నం తెలంగాణ కడుపు సల్లగ జేసిన పదకోశపు సల్లకుండ ఒక్కటే తొవ్వ ఒక్కటే పట్టు మాటమీద నెనరు మనిషిమీద పావురం పనిమీదేసుకుంటే పరమాత్మనైనా పక్కకు పెట్టుడే పదామడైనా పాదాల పదాలు సుట్టుడే మానేరు పదనంత కరెక్కినట్టు దినదినం గల్లర గల్లర ఉరుకుడే బొళ్ళర బొళ్ళర కురుసుడే కుల్లంకుల్లం జేసుడే ఆ కాళ్ళకింది మట్టిని ముట్టుకుంటే సాలు ప్రపంచమంతా అనువాదమైతది అజ్ఞానమంతా సాగిలబడి సల్లు సల్లైతది. ...........బూర్ల వెంకటేశ్వర్లు 11/03/2014

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cw2S0T

Posted by Katta

5, మార్చి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తెలంగాణా గడీలు ......ఒక గత చరిత్ర రికార్డ్ తొవ్వ .................5.3.2014 ...............అన్నవరం దేవేందర్ తెలంగాణా లో గడీలు ఒక మహత్తర చరిత్ర .గడీలు అంటే దొరలు భూస్వాముల ఫ్యూడల్ పటాటోపం . అయితే ఇవి గతం ముచ్చట .ఇప్పుడన్నీ కూలిపోతున్న సందర్బం .తెలంగాణా కు మహత్తర పోరాట చరిత్ర ,వారసత్వం పుష్కలంగా ఉన్నాయి .అన్ని ప్రాంతాలకూ ఉంటాయి .చరిత్ర నిర్మాణం అవుడే అంతట ఉండది .అగొ సందర్భం లోనే ప్రముఖ కథా రచయిత .కే .వి .నరేందర్ ,ప్రముఖ కవి జర్నలిస్ట్ సంగవేని రవీంద్ర లు తెలంగాణా గ్రామాలు కాళ్ళు బలుపం కట్టుకొని తిరిగి చరిత్ర రికార్డ్ చేసిండ్రు .అది పుస్తకం గా వచ్చింది .దాని పేరు 'తెలంగాణ గడీలు '.ఇందులో ముప్పై గడీల చరిత్ర ఉన్నది .సిర్నాపల్లి గడి,బండలింగాపూర్ గడి ,దోమకొండ గడి ,సంజీవన్ రావ్ గడి ,తపాల్పూర్ గడి ,గట్ల మల్యాల గడి ,విసునూర్ గడి ,సిరికొండ గడి ,ఇందారం గడి ,గద్వాల గడి ,రాజారామ్ -భీమారం గడి ,కల్లెడ గడి ,బొల్లారం గడి ,లింగన్నపేట గడి ,మదనపల్లి గడి ,చల్గల్ గడి ,రాజాపేట గడి ,మద్దునూర్ గడి ,దాచారం గడి ,కొడిమ్యాల గడి ,రామాజీ పేట గడి ,నడిగూడెం గడి ,ఇటిక్యాల గడి ,దుబ్బాక గడి ,వంగర గడి ,వనపర్తి గడి కోహెడ గడి ,హుస్నాబాద్ -అక్కేన్నపేట గడి ,పెద్ద శంకరం పేట గడి ,మదనపల్లి గడీల వివరాలు ఫోటోలతో పాటు ఉన్నాయి ఎనుకట గడీల లో పెత్తందారి తనం రాజ్యం ఏలింది .ఎనబయో దశకం లో జరిగిన నక్సలైట్ ఉద్యమాల వల్ల గడీలు ఖాళీ అయినాయి .కాని ఆ చరిత్ర నిలిచే ఉన్నది . గడీల నిర్మాణం బహు గొప్పది అద్భుతమైన కట్టడాలు అవి .ఆనాటి ప్రజలు వెట్టి చసి నిర్మించిండ్రు .అందులో శర్మ జీవుల చెమట కలే గలిసి ఉన్నది .ఏది ఏమైనా ఇవి ఒకానొక చరిత్రకు నిదర్శనం . చరిత్ర పరిశోధన రచన చేసిన నరేందర్ రవీంద్రలు అభినందనీయులు ,చాల శ్రమకోర్చి తిరిగి తిరిగి సమాచారం సేకరించిండ్రు .....

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSt7mM

Posted by Katta

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ............అన్నవరం దేవేందర్ నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం అవును ఇప్పుడు తెలంగాణా నేలంతా పరిడవిల్లుతంది.సంబురాలు చేసికుంటంది సై సై అని ఎగురుతంది .తల్లి పీరి పట్టుకొని ఆగవట్ట వశం లేని ఎగురుడు ఎగురుతంది .నిజానికి ఇప్పుడేమన్నా విప్లవించిందా,విముక్తి అయ్యిందా ? పటం మీద కొత్త గీతలు పడ్డయి.అయితే దేశం లో ఇదివరకు అమలు అవుతున్న దోపిడీ ఆగుతదా పీడన ఆగుతదా సామ్రాజ్యవాద పెత్తనాలు ఆగుతాయా ..సామ్రాజ్యవాదుల బంటులైన వారి నిలువు దోపిడీ ఆగుతది.వాళ్ళ పీడన ఆగుతది .అదే సంబురం . ఎందుకంటే తెలంగాణా చాలా ఏళ్లుగా పరాయికరణ చెందింది .డెబ్బై ఏళ్ళకు పైగా పోరాటం చేస్తంది .అయితే రాజ్యాంగ బద్దం గా జరిగిన ఇదొక్కటే సక్సెస్ అయ్యింది .విజయాన్ని ముద్దాడింది .నలబయో దశకం ల తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ,అరవయో దశకం ల తెలంగాణా పోరాటం ,ఎనబయో దశకం లో నక్సలైట్ పోరాటం అవన్నీ విజయానికి చేరువ మాత్రమే అయినవి .ఆ పోరాటాల ప్రభావాలు సమాజం మీద పడవచ్చు కాని లక్ష్యం సాదించలేదు .ఈ ఇన్ని పోరాటాల ఫోర్స్ తోనే తొంబై ఆరు నుంచి రెండువేల ఒక్కటి నుంచి తెలంగాణా ఉద్యమం వచ్చింది .ఇది సాదించింది .చాలా ఏళ్ల తరువాత ఈ విజయం అందుకే ఈ ఎగురుడు దునుకుడు . పాత చరిత్ర చర్వితం ఎందుకు కాని తెలంగాణా ,ఆంధ్ర రెండు అసమ సమాజాలు కలయికే కుట్ర ,మోసం తో కూడుకున్నది .ఇంకేముంది మొత్తం తెలంగాణ ను దోచుకున్నారు .అనుమానం లేదు నిజమే నిధులు ,నీళ్ళు కొలువులు అన్నీ ,పాలన చేత పట్టిండ్రు ,సినిమాలు పత్రికలు ,ప్రసార మాధ్యమాలు సకల రంగాల్లో సొచ్చిండ్రు .అయితే రెండు ప్రాంతాల బేధ భావం లేకుండా వుంటే వివక్ష లేకుండా వుంటే అంతా సమానం వుంటుడే.కాని రెండో శ్రేణి గా చూడడం లోనే కొనసాగింది .ఇది అన్ని రంగాలలో రాజకీయం ,పార్టీలు సంగాలు సంస్థలు ,విద్య ,వైద్యం ,చరిత్ర ,సంస్కృతి ఒక్కటేమిటి అన్యాయం జరగని రంగం లేదు . దీంతో తెలంగాణ సమాజం కు మంట పుట్టింది .ఆ మంట పలించించింది. ఒక భాద కాదు ఇది ఇప్పుడు సల సల సలిపే గడ్డ పలిగి చీము అంతా ఎల్లి పోయినంత హాయి అని సేద తీరుతున్నారు వ్యాపరులైన రాజకీయనాయకులు తప్పితే దోపిడీ పీడన ను ఎవరు కాని ఆమోదిస్తారు .పీడన దోపిడీ ఎక్కడున్నా ఈ రూపం లో ఉన్న ఎదిరించుడే .అది రేపటి తెలంగాణా లోను ఉండొచ్చు సీమాన్ద్రలోను ఉన్డొచ్చు . నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం పెయ్యి పులకరించే మట్టి స్పర్శ తెలంగాణం మహా తెలంగానం సకల ఆధిపత్యాల పై పూరి విప్పిన రేశం పీడన పై ఎదురేగిన ఊరేగింపు తెలంగాణ..నవ నవలాడే తెలంగాణ..

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cNK0bN

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ..........................అన్నవరం దేవేందర్ చరిత్ర కారుడు జైశెట్టి రమణయ్య ..12.02.2014 చరిత్ర పురుషుడు జైశెట్టి రమణయ్య ఒక చరిత్ర జైశెట్టి రమణయ్య ప్రఖ్యాత చరిత్ర కారుడు .చరిత్ర రచన పరిశోధన లో ఆయన కృషి ఎన్న తగినది .ఇటీవల జూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ల తో కలిసి జగిత్యాల లో ఆయనను కలిసినప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన చాలా చరిత్ర విషయాలు చెప్పిండ్రు .ఆయన రాసిన ’కరీంనగర్ జిల్లా చరిత్ర –సంస్కృతి ‘అనే పుస్తకం జిల్లా చరిత్రకు ఇప్పటికీ ప్రామాణికం .దీన్నే ఆంగ్లంలో వెలువరించారు .కాలగమనం కోన సముద్రం ‘మరొక చారిత్రక గ్రంధం దీనిని యస్ .జైకిషన్ తో కలిసి వేలువరించిడ్రు .Temples of south India ,The chalukya and kakatiya temples .వీరి మరో పుస్తకాలు . జైశెట్టి రమణయ్య గారు చరిత్ర రచయితే కాదు తాను స్వయంగా చరిత్ర సృష్టించాడు .ఇప్పటికీ యాబైఏ డు సంవత్సరాలుగా డైరీ రాస్తున్నాడు .డైరీ అంటే స్వంత విషయాలే గాదు.ఆనాటి సామాజిక రాజకీయ విషయాలు అందులో ఉంటాయి .పందొమ్మిది వందల యాబై ఏడు నుంచి క్రమం తప్పని అలవాటు .ఇందుకు గాను ప్రపంచ రికార్డ్ లు ఎక్కి గుర్తింప పడ్డారు .అలాగే గత నాలుగు దశాబ్దాలకు పైగా వార్తా క్లిప్పింగులు సేకరించి పుస్తక రూపంలో ఉన్నాయి .తాను రాసిన ఉత్తరాలు ,తనకు వచ్చిన ఉత్తరాలు అతి ముక్యమైనవి పుస్తక రూపంలో బైండింగ్ చేసి ఉంచిండ్రు .Memories of Dr.J.Ramanaiah(autobiography),Prime pastures ,Glimpses ,A book of Invitations ఇట్లా తన జీవితానికి తారస పడ్డయి అన్నీ తను భావి తరాల కోసం భద్రపరిచిండ్రు . మొత్తం భారతదేశం ను చరిత్ర రచన అద్యయనం కోసం తిరిగిండ్రు .ఇక కరీంనగర్ జిల్లా ను చారిత్రక గ్రామాలను అన్నీ తిరిగి అక్కడి శాసనాలు చడువి విగ్రహాలను శోదించి ఏ కాలం ఏమిటి చరిత్ర అని రాసి ప్రకతిన్చిడ్రు .అట్లా గే కోటిలింగాల ఆంధ్రుల తొలి రాజధాని అని అక్కడ శాతవాహన పూర్వపు రాజ్యం ఉన్నదని గుర్తిన్చిండ్రు .చారత్ర నిర్మాణం లో రమణయ్య కృషి చాలా గొప్పది .ఆయన ఇల్లే ఒక మ్యుసియం లాగ ఉంటది .డెబ్బై ఆరేళ్ళ వయసున్న రమణయ్య సారు ను సూస్తే మనకు చరిత్ర రచన పట్ల ఉత్సాహం కలుగుతది.హిస్టరీ రీడర్ గా పందొమ్మిది వందల తొంబై ఆరు లో రిటైర్ అయిన ఆయన కు ఇప్పటికీ సాహిత్యం రచన చరిత్ర రచన అంటే ఇష్టమైన అంశాలు .వేల మంది శిష్యులు ఎందఱో ప్రముఖులు ఉన్నారు . జగిత్యాల అంటే జైత్ర యాత్రే కాదు ఇంకా అక్కడ యాదికి వచ్చేది అలిశెట్టి ప్రభాకర్ తిరిగిన అడుగుజాడలు .బి.ఎస్ .రాములు తాత్విక ఆలోచనలు ,మరియు జైశెట్టి రమణయ్య సారుతో చరిత్ర సంభాషణ .

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1epfS2o

Posted by Katta