kavisangamam లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
kavisangamam లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
6, నవంబర్ 2013, బుధవారం
4, నవంబర్ 2013, సోమవారం
కవిత్వ విశ్లేషణ
కెక్యూబ్ వర్మ -దుఃఖ దీపం
తొలిదశల్లో అలంకారశాస్త్రం,కొంత కాలానికి కళాతత్వశాస్త్రం.ఇంకాకొంత
కాలానికి మనస్తత్వ శాస్త్రం వచ్చాక సాహిత్యంలో అనేకమైన అంశాలు చర్చకు
వచ్చాయి.ప్రధానంగా అలంకార శాస్త్రం నాటికే మనస్సు కు సంబంధించిన చర్చ
ఉన్నప్పటికీ,సాహిత్యంలోనూ మనస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ
పాశ్చాత్యులు వేసిన దారులు గమనింప దగినవి.
దుఃఖానికి మూలం సుఖం
పైనున్న యావేనని భారతీయ తాత్వికుల ఆలోచన.ఈ ఆశావహ జీవితాన్ని అందుకోలేక
పోవడమే దుఃఖ హేతువు.అందుకోలేని అంశం ఎలా అవగాహన లోకివస్తుందనేదీ ప్రశ్న.అది
ఇతరజీవితాలని గమనించటం.దాన్నించి తనని గ్రహించటం.ఈ అనుభవాన్ని కళాకారుడు
ప్రకృతినించి కూడా అనుభవిస్తాడు.
మానసిక యంత్రాంగాన్ని
గూర్చి ఫ్రాయిడ్ కొన్ని సూత్రీకరణలు చేసాడు.మనో యంత్రాంగం లేదా స్వప్న
యంత్రాంగం(The mechnism of Dreems)సంఘర్షణకు,బాధకు ప్రతినిధి.ఒక సందర్భం
నించి కలిగే అనేక భావనలకు,వికారాలకు ఇదే మూలం.ఇందులో నాలుగు భాగాల్లో
వ్యత్యయీకరణం(Displacement)ఒకటి .ఇది
రెండు రకాలుగా జరుగుతుంది.అవ్యక్తాలోచనకు సంబందించిన వస్తువు భాగం మాత్రమే
అభివ్యక్తిలో కనిపిస్తుంది.ఒకరకంగా అలంకార శాస్త్రంలో
(Synecdoche)సారోపలక్షణను పోలి ఉంటుంది.ఒక అంశాన్ని మరోదానితో ఆరో పించి
చెప్పటం.
పోల్చే అంశం ప్రతీకీ కరణం(Symbolisetion)కు లోబడి
జరుగుతుంది.దర్శనం వీటిని దృశ్య ప్రతిమలు(Visual images)గా
స్వీకరిస్తుంది.మనవాడుకలోని అనేక పదాలు ఇలానే ఏర్పడ్డాయి.భాషాశాస్త్రం
తెలిసిన వాళ్లకి ఈ విషయంకొత్త గాదు.మనం అమూర్తార్థంలో పదాలను ఉపయోగిస్తాం
కాని ఇవి ఒక మూర్తార్థాన్ని ఆధారం చేసుకునే పుట్టాయి."కుశలుడు"-అంటే
చేయితెగకుండా దర్భలు కోసేవాడని,"ఘటికుడు"అంటే కుండ పొట్టకింద ఉంచుకుని
నదిని ఈదేవాడని ఆర్థాలు. ఇతిహాసాలలో పేర్లు ఇలా మూర్త భాగాలనించి
వచ్చినవే.అందువల్ల మూర్త భాగానికి సారూప్యాన్ని పట్టుకోవడం మనసుకు బాగా
అలవాటైన పని.
కెక్యూబ్ వర్మ గారు మనిషికి దీపానికి మధ్య సారూప్యాన్ని ఆధారం చేసుకుని తాత్విక పునాదులనుంచి జీవితాన్నినిర్వచించారు.జీవితంచ ుట్టూ జరిగే అనేక అంశాలతో ప్రతీకాత్మకంచేస్తూ జీవితాన్ని నిర్వచించారు.
"నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు/గాలి నిన్ను కూచోనివ్వదు"
"నీ అరచేతులు చాలనప్పుడు లోలోన/దిగాలు ఒక్కసారిగా అసహనంగా"
"ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక/దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం"
"నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల/భయ దృశ్యం అల్లుకుంటూ"
"నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా/అల్లుకుంటూ అచేతనంగా"
"ఈ కాంతి రేఖల రాక పోకల/వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు"
అనేకదృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.ఇందులో "నీ" అనే పదం మాత్రమే కేవల
వ్యక్తి వాచకం.ఇది లేకుంటే"గాలి/క్రీనిడ/నూనె ఒలకటం /కాంతి
రేఖలు/మిణుగురులు/వలయం "లాంటి వన్ని అర్థపరంగా సామాన్యీకరణంచెందేవి.కాని
వ్యక్తి వాచకం వల్ల ఇవన్నీ జీవితాన్ని అందులోని ఆటుపోటులని,కాపాడుకోడానికి
పడే బాధని వ్యక్తం చేస్తాయి.అర్థక్షేత్ర పరిధిలో చూస్తే ఇవన్నీ దీపం అనే
పరిధికి చెందినవే.
"చిక్కనవుతున్న చీకటి పాట/గాలి అలలనలా కోస్తూ"
"అచేతనంగా అభావమౌతున్న/రూపం ధూప కలికమవుతూ"
"నీ ఒక్కడివే ఈ గదిలో/ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ"
చివరి క్షణాలని వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపించే ఈవాక్యాలు కూడా జీవితం
చుట్టూ ప్రతీకాత్మకంగా అల్లుకున్నవే.దర్శనం దృశ్యాలని చేజిక్కించుకుంటే అది
విఙ్ఞానం రూపంలో లోనికి వెళ్లి ఙ్ఞానం ,అనుభవం ద్వారా కళగా వ్యక్తం
చేయబడుతుంది.మంచి దార్శనిక కళానుభవం ఉన్న కళాకారుడే దాన్ని అందుకో
గలుగుతాడు,అందించగలుగుతాడు.మంచి కవిత అందించిన కెక్యూబ్ వర్మ గారికి ధన్య వాదాలు.
__________ఎం. నారాయణ శర్మ
30, అక్టోబర్ 2013, బుధవారం
ఉర్దూ కవిత్వ నజరానా
ఉర్దూ కవిత్వ నజరానా. పేరు బాగుంది. కాని, ఏం రాయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నాకు అన్నయ్య లాంటి యాకూబ్ నా మీద నమ్మకంతో రాయమన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నిద్రపోనీయలేదు. కవితా విమర్శ జోలికి పోయే కన్నా, ఉర్దూ కవులను వారి కవితలను పరిచయం చేయడం మంచిదని భావించాను. కవితా విమర్శ చేయగల స్థాయి నాకు లేదు.
ఉర్దూ కవుల్లో ఎవరి నుంచి మొదలుపెట్టాలి? గాలిబ్, జౌఖ్, మీర్, ఇక్బాల్... మహామహుల్లాంటి కవులు ... కవిసంగమంలో ఎవరి కవిత్వాన్ని ముందుగా పరిచయం చేయాలి? ఉర్దూ కవిత్వ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలే నా కళ్ళ ముందు కనబడతాయి. అవిభక్త భారతదేశంలో ప్రగతిశీల రచయితల సంఘం (తరఖ్ఖీ పసంద్ ముసన్నఫీన్)కు చెందిన కవిగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూ సాహిత్య పుటలపై తనదైన ముద్రవేశారు.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ తో ప్రారంభించాలనే నిర్ణయించుకున్నాను. ప్రతి శుక్రవారం ఫైజ్ కవితలను, వాటి అనువాదాన్ని, వివరణను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. వరుసగా ఉర్దూ కవుల కవితా కుసుమాలు కవిసంగమంలో విరబూయించడానికి చేసే కృషిలో ఏవయినా పొరబాట్లు దొర్లితే, కవిసంగమంలో పిల్లకాకి లాంటి వాడిని కాబట్టి క్షమించాలి.
ఇక ఉపోద్ఘాతం చాలించి, విషయానికి వచ్చేద్దాం. ఫైజ్ కవితలు పరిచయం చేసే ముందు క్లుప్తంగా ఫైజ్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుని, ఆ తర్వాత ఆయన కవితలు చూద్దాం.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1911లో పాకిస్తాన్లో ఉన్న సియాల్ కోట్ లో జన్మించారు. ఉన్నతి విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం లెక్చరర్ గా పనిచేసి 1942లో సైన్యంలో కెప్టెన్ గా చేరారు. 1951లో రావల్పిండి కుట్ర కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1955లో విడుదలయ్యారు. 1984 నవంబర్లో లాహోర్ లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ తన జీవితకాలంలో రెండు ప్రపంచయుద్ధాలు చూశారు, అవిభక్త భారతదేశంలో రాజకీయాలను, దేశవిభజనను, బంగ్లాదేశ్ ఏర్పాటును చూశారు. ఎలాంటి నిరాశాజనక వాతావరణంలోనైనా ఆశాదీపాన్ని వెలిగించే ఫైజ్ కవితల్లో... ఆయన జైల్లో ఉన్నప్పడు రాసిన – జైలులొ ఒక రాత్రి- ఇప్పుడు చూద్దాం.
జైలులో ఒక రాత్రి
చీకటి పొదల్లో నక్షత్రాల దారుల్లో
దట్టమైన రాత్రి నెమ్మదిగా దిగుతోంది
పిల్లతెమ్మెర నన్నుతాకి వెళుతోంది
ప్రేమపలుకేదో గుసగుసగా చెబుతోంది
ఖైదు పెరట్లో దేశబహిష్కృత వృక్షాలు
ఆకాశం చీరకు నగిషీలు అద్దుతున్నాయి
గగన గవాక్షంలో ఉదారంగా ప్రకాశిస్తంది
వెన్నెల సుందరహస్తం
తారామండల వెలుగురవ్వలు ధూళిలో కరిగిపోయాయి
ఆకాశం నీలి రంగు తేజస్సులో కలిసిపోయింది
గుండెలో ప్రేయసి వేర్పాటు బాధా కెరటాల్లా
పచ్చని మూలల్లో దట్టమైన నీడలు
రెపరెపలాడుతున్నాయి
మనసులో నిరంతరం ఒకే భావం కదలాడుతోంది
ఈ క్షణం జీవితం ఎంత తీయగా ఉంది
దౌర్జన్య విషాన్ని కలిపేవారు నేడు సఫలం కావచ్చు, రేపు కాదు.
సమాగమ మందిరంలో దీపాలను వారు ఆర్పేసినా
చంద్రుడిని ఆర్పగలరా?
ఈ కవిత ఫైజ్ అహ్మద్ ఫైజ్ జైల్లో ఉన్నప్పడు, కమ్యునిస్టు అనబడే ప్రతి ఒక్కడిని కుట్ర కేసులో ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన పరిస్థితిలో రాశారు. దుర్భరమైన అణిచివేతను ఎదుర్కుంటూ కూడా మొక్కువోని ఆత్మధైర్యాన్ని, ఆశాభావాన్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉర్దూ కవితను తెలుగులో రాయమని చాలా మంది మిత్రులు అడిగారు. వారి కోరిక ప్రకారం ఉర్దూ కవితను కూడా ఇక్కడ ఇస్తున్నాను.
షామ్ కే బీచో ఖమ్ సితారోం సే
జీనా జీనా ఉతర్ రహీ హై రాత్
యుం సబా పాస్ సే గుజర్ తీ హై
జైసే కహ్ దీ కిసీ నే ప్యార్ కీ బాత్
సహన్ జందా కే బేవతన్ అష్ జార్
సరంగోం మహూ హైం బనానే మేం
దామనె ఆస్మాం పే నక్షో నిఖార్
షానె బామ్ పర్ దమక్ తా హై
మహర్బాం చాందినీ కా దస్తె జమీల్
ఖాక్ మేం ఘుల్ గయీ హై ఆబె నుజూమ్
నూర్ మేం ఘుల్ గయా హై అర్ష్ కా నీల్
సబ్జ్ కోషోం మేం నీల్గోం సాయే
లహ్ లహాతే హైం జిస్ తరా దిల్ మేం
మోజె దర్దె ఫరాఖ్ యార్ ఆయే
దిల్ సే పైహమ్ ఖయాల్ కహతా హై
ఇతనీ షీరీన్ హై జిందగీ ఇస్ పల్
జుల్మ్ కా జహర్ ఘోల్ నే వాలే
కామ్రాం హో సకేంగే ఆజ్ నా కల్
జల్వా గాయే విసాల్ కి షమేం
ఓ బుఝా భీ చుకే అగర్ తో క్యా
చాంద్ కో గుల్ కరేం తో హమ్ జానేం
ఈ కవితలో – మహర్బాం చాందినీ కా దస్తే జమీల్ – అన్న పంక్తి చాలా గొప్పగా రాశారు. మహర్ అన్న పదానికి చంద్రుడు అన్న అర్ధం కూడా ఉంది. మహర్బాం అంటే దయచూపినవారని అర్ధం. మహర్బాం చాందినీ అనడంలో ఉదారుడైన చంద్రుడి వెన్నెల అన్న భావం స్ఫురిస్తుంది. భాషపై తిరుగులేని ఆధిపత్యం, పదునైన ఊహాశక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు సాధ్యం.
అబ్దుల్ వాహెద్
ఉర్దూ కవిత్వ నజరానా
మళ్ళీ శుక్రవారం పరుగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ సారి నేను కూడా ఎదురుచూస్తూనే ఉన్నాను. ఈ వారం ఎవరి గురించి రాస్తున్నావని ఒక మిత్రుడు అడిగారు. ఫైజ్ గురించే రాస్తాను, ఈ వారమే కాదు మరి కొన్ని వారాలు కూడా ఆయన గురించే రాస్తానన్నాను. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు వారికి తెలిసిన ఉర్దూ కవులు తక్కువ. గజల్ పట్ల అభిమానం ఉన్న వారు తప్ప మిగిలిన తెలుగు పాఠకులకు ఉర్దూ కవుల గురించి పెద్దగా తెలియదు. తెలిసిన పేర్లలో కూడా గాలిబ్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఉమర్ ఖయాం పేరు కూడా వినబడుతుంది,కాని నిజానికి ఆయన ఉర్దూ కవి కాదు. ఆయన కవిత్వం ఉర్దూలో తర్జుమా అయ్యింది. తెలుగు వారికి చాలా తక్కువ తెలిసిన పేరు ఫైజ్, భారత ఉపఖండం రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కాలంలో గొప్ప కవిత్వం రాసిన కవి ఆయన. ఈ వారం ఫైజ్ గురించి మరి కొన్ని వివరాలు అందించి, వచ్చే వారం నుంచి ఆయన కవితలు మరి కొన్ని ఎక్కువగా పోస్ట్ చేయాలనుకుంటున్నాను.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ ప్రతి సందర్భంలోను కవిత రాశారు. చాలా ఎక్కువగా రాశారు. ఏడు కవితా సంపుటాలు ఆయన పేరున ఉన్నాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. రాజకీయాల పట్ల లోతయిన అవగాహన ఉన్న వ్యక్తి. గతవారం చెప్పుకున్నట్లు ట్రేడ్ యూనియన్లలో ఉన్నరు. సామ్యవాద భావాల పట్ల ప్రభావితులయ్యారు. ప్రగతిశీల రచయితల వేదిక అప్పట్లో సామాజిక అంశాలన్నింటిపై ప్రతిస్పందించేది. అందులో అత్యంత చురుకైన వ్యక్తి ఫైజ్.
ఫైజ్ రాసిన కవితా సంపుటాల్లో మొదటిది నక్ష్ ఫరియాది (ఫిర్యాదు చేస్తున్న చిత్రం). నిజానికి ఇది గాలిబ్ కవితలోని ఒక పంక్తిలోని పదబంధం. దాన్నే ఫైజ్ తన కవితకు వాడుకున్నారు. ఆ కవితా సంపుటం అదే పేరుతో వచ్చింది. అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన కొత్తలో రాసిన కవితలివి. 1941లో ఈ సంపుటం అచ్చయ్యింది. సాధారణంగా కవులందరి మాదిరిగానే ప్రారంభంలో రాసిన కవితలు ప్రేమ కవితలే. కాని ఈ సంపుటంలో తర్వాత తర్వాత రాసిన కవితల్లో ప్రేమ, విప్లవ భావాలు కలగలిసి కనబడతాయి. ప్రేమ విరహ బాధలే కాదు ప్రపంచ బాధలు కూడా పంక్తుల్లో ఉన్నాయి. ప్రారంభంలో రాసిన కవితలు ఒకవిధమైన స్వాప్నిక ఊహలను ప్రతిబింబిస్తాయి. మేరే నదీమ్, హుస్న్ ఔర్ మౌత్, ఆజ్ కీ రాత్ ఇలాంటి కవితలే. ఫైజ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహ్ముదుజ్జఫర్, ఆయన భార్య రాషిదా జహాన్ ఇద్దరు కమ్యునిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉండేవారు. వారిద్దరి ప్రభావం వల్ల ఫైజ్ సామ్యవాద సిద్దాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్యవాద ప్రభావం ఆయన రాసిన కవిత – ముజ్ సే పహలీ సీ ముహబ్బత్ మేరే మహ్ బూబ్ నా మాంగ్ (ప్రియా, మునుపటి ప్రేమను ఇప్పుడు కోరవద్దు)లో స్పష్టంగా కనబడుతుంది. తన ప్రేయసి అద్భుత సౌందర్యంతో కళ్ళు తిప్పుకోలేక పోతున్నప్పటికీ, తాను ప్రపంచంలోని కష్టాలను కూడా చూడక తప్పదని అంటాడు. ఈ కవితా సంపుటిలోని ఇతర కవితలు తర్వాత అనేక ఉద్యమాల్లో ప్రేరణ గీతాలయ్యాయి. సంకెళ్ళు, శృంఖలాలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ గొంతెత్తాలని నినదించిన కవిత .. బోల్ కె లబ్ అజాద్ హైం తేరే, బోల్ జుబాన్ అబ్ తక్ తేరీ హై (చెప్పు, నీ పెదాలు స్వేచ్ఛగానే ఉన్నాయి, చెప్పు, నీ నాలుక ఇంకా నీదే)లో రాసిన పదాలు భారత పాకిస్తాన్ లలో అనేక నిరసర ఉద్యమాల్లో ప్రతిధ్వనించాయి.
మోజూయె సుఖన్ కవితలో ఒక కవి ఆలోచించవలసిన విషయాలేమిటో ముక్కుసూటిగా చెప్పేశాడు. ప్రేయసి కురుల మృదుత్వం, గోరింటాకు చేతుల లాలిత్యం గురించి ఆలోచించాలా లేక ఆదమ్ ఈవ్ సంతానం (మానవాళి) ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న కష్టాలు కడగండ్ల గురించి ఆలోచించాలా అని ప్రశ్నించాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ఆకలి, దారిద్ర్యం, దౌర్భాగ్యాలను ప్రశ్నించడం కవుల పని కాదా అని నిలదీశాడు.
ఫైజ్ కవిత్వం ఉద్యమాల ఉప్పెన. ఆయన జీవితం కూడా ఉద్యమాలలోనే గడిచింది. ప్రేయసి చుట్టు తిరిగే కవిత్వాన్ని మనిషి చుట్టు తిప్పిన కవి ఫైజ్.. అందుకే ఫైజ్ గురించి మరి కొన్ని వారాలు కొనసాగిద్దాం..
ఇప్పుడు ఫైజ్ రాసిన ఒక కవిత చూద్దాం.
ప్రియా, మనుపటి ప్రేమను నా నుంచి కొరవద్దు
నీవుంటే జీవితం శాశ్వతంగా ప్రకాశిస్తుందని
ఎల్లప్పుడు అనుకున్నా
ప్రేమబాధ నాదే అయినప్పడు, ప్రపంచబాధ గొడవెక్కడ
నీ నగుమోము ప్రపంచంలో వసంతాన్ని విరజిమ్ముతుంది
నీ కళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకేముందని?
నీవు దొరికితే అదృష్టం నా అడుగులకు మడుగులొత్తుతుంది
కాని అలా కాదు, అలా కావాలని అనుకున్నానంతే...
ప్రపంచంలో ప్రేమే కాదు, ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
శతాబ్ధాలుగా విస్తరిస్తున్న నల్ల మంత్రజాలం
సిల్కు, శాటిన్, బంగారు దారాలతో అల్లుకుంటోంది
అబ్దుల్ వాహెద్
October 25/2013
ఉర్దూ కవిత్వ నజరానా
బక్రీద్ పండుగ హడావుడి ముగిసింది. ఈద్ ముబారక్ చెప్పుకోవడమూ, ముబారక్ లు స్వీకరించడంలోనే రెండు రోజులు గడిచిపోయాయి. అఫ్ కోర్స్ బిరియానీ ఉండనే ఉందనుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది బిరియానీలో ఉగాది పచ్చడి కలుపుకు తింటే ఎలా ఉంటుందా అని, అలాంటి ఆలోచనలతో భుక్తాయాసం తీర్చుకోక ముందే తలుపు మీద టక టకా మని శుక్రవారం కొడుతుంది. ఆ వెనుకే ఫైజ్ గారు పాస్ రహో అంటున్నాడు. కవిసంగమం మిత్రులు ఎదురు చూస్తుంటామన్నారు కాబట్టి ఆయాసాలు, ఆలోచనలు పక్కన పెట్టి కంప్యూటర్ కీబోర్డు చేతిలోకి తీసుకున్నాను.
గత శుక్రవారం ఫైజ్ మీద రాసిన పంక్తులకు నేను ఊహించని స్పందన వచ్చింది. కవులను గండపెండేరాలతో ఘనంగా సన్మానించిన తెలుగు నేల మనదిరా అంటూ మనసు ఒక మొట్టికాయ వేసింది. ముఖపుస్తకంలో పరిచయమైన మిత్రుడు కృష్ణమోహన్ మోచర్ల గారు ఫైజ్ గురించి కొంత సమాచారం పంపించారు. నా కోసం శ్రమకోర్చి ఆయన సమాచారం సేకరించడం కొంత ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ఇలాంటి మిత్రులు లభించినందుకు గర్వంగాను ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఫైజ్ గురించి ఫైజ్ ఏమన్నారన్నది ఆసక్తికరమైన విషయం. తన గురించి ఆయన ఇలా చెప్పుకున్నాడు :
’’1920 నుంచి 1930 మధ్య కాలం సాహిత్యంలో అనేక జాతీయ, రాజకీయ ఉద్యమాల కాలం. కేవలం సీరియస్ సాహిత్యమే కాదు, సరదాగా నడిచే రచనలు కూడా వచ్చేవి. హస్రత్ మోహానీ, జోష్, హాఫీజ్ జలంధరీ, అక్తర్ షీరానీల పేర్లు కవిత్వంలో బలంగా వినిపించేవి. ఈ వాతావరణంలో నక్ష్ ఫరియాదీలోని కవితలు కొన్ని రాశాను.
1934లో కాలేజీ విడిచిపెట్టాను. 1935లో అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఇక్కడే నాకు నా సమకాలీనుల్లో చాలా మందికి మానసికంగాను, భావావేశపరంగాను పరిణతి లభించింది. ఈ కాలంలోనే మేము సాహిబ్జాదా మహమూదుజ్జఫర్ ను ఆయన శ్రీమతి రాషిదా జీహాన్ ను కలిశాము. ఆ తర్వాత ప్రగతిశీల రచయితల ఉద్యమం మొదలైంది. దాంతో పాటే శ్రామిక ఉద్యమాలు కూడాను. ఈ క్రమంలో అనేక దృక్పథాల వేదికలు ఏర్పడ్డాయి. ఇక్కడ మేము నేర్చుకున్నదేమిటంటే ప్రపంచానికి దూరంగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే మన చుట్టు ఉన్న వాతావరణం మనపై ఖచ్చితంగా ప్రభావం వేస్తుంది. వ్యక్తిగతంగా మనిషి అతనికి ఉన్న ప్రేమలు, సంతోషాలు, కష్టాలు, బాధలు వగైరా ఎన్ని ఉన్నా కాని, వ్యక్తిగతంగా మనిషి ఈ పూర్తి చట్రంలో చాలా చిన్నవాడు. జీవితం ఈ విశ్వమంత విస్తారమైనది. కాబట్టి ప్రేమబాధ, ప్రాపంచిక బాధ ఈ రెండు ఒకే అనుభవానికి చెందిన రెండు పార్శ్వాలు. ఈ భావం మనసులో చోటు చేసుకున్న తర్వాత రాసిన పద్యమే – మునుపటి ప్రేమను అడగవద్దు ప్రియా – అన్న కవిత. పూర్తి ప్రపంచంలోని దు:ఖం గురించి ఆలోచించవలసి ఉంది. ఆ తర్వాత కొంత కాలం సైన్యంలోను, జర్నలిజమ్ లోను, శ్రామిక సంఘాల్లోను గడిపిన తర్వాత నాలుగేళ్ళు జైలులో గడపవలసి వచ్చింది. దస్త్ సబా, జిందాన్ నామా కవితా సంకలనాలు జైలు అనుభవాల రికార్డులే. ప్రేమలానే జైలు జీవితం కూడా ఒక మౌలికమైన అనుభవం. ఈ అనుభవం కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. తొలి ప్రేమ ఉదయించినప్పుడు ఉండే భావావేశాలు మళ్లీ మొగ్గ తొడిగాయి. ఉదయాస్తమయాల్లోని సౌందర్యం, ఆకాశంలోని నీలిమ, చిరుగాలి స్పర్శ అన్నీ జైలులోను అనుభూతికి వచ్చాయి. మరో విషయమేమంటే, బయటి ప్రపంచానికి సంబంధించిన కాలం దూరం అనేవి జైలులో ఉండవు. దూరం దగ్గర అనేది ఇక్కడ లేదు. ఒక్క క్షణం కూడా శతాబ్ధాల కాలంగా ఉండవచ్చు లేదా శతాబ్ధాలు కూడా నిన్నటి రోజులా కనిపించవచ్చు. మూడో ముఖ్యమైన విషయమేమంటే, అందరితోను వేరుపడిన భావం. ఒంటరితనం. ఇక్కడ చదవడానికి, ఆలోచించడానికి, సృజనాత్మక వధువును సింగారించడానికి కావలసిన సమయం ఉంటుంది.‘‘
ఫైజ్ తన గురించి తాను ఎక్కువగా చెప్పేవారు కాదు.. ఈ సంభాషణ అర్థాంతరంగానే ఆపేశారు.
భారత ఉపఖండం తీవ్రమైన మార్పులకు గురవుతున్న కాలంలో ఫైజ్ రాసిన పంక్తులు ఈ మార్పులపై తమ ప్రభావాన్ని వేశాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు. కేవలం కవితలు మాత్రమే రాయలేదు. పత్రికల్లో సంపాదకీయాలు, వ్యాసాలు, రాసేవారు. అనేక విషయాలపై ఆయన ఇంటర్వ్యులు చదివితే ఆనాటి రాజకీయ పరిస్థితులపై లోతయిన అవగాహన కలిగిన వ్యక్తిని చూస్తాం. భారత ఉపఖండంలో నేటికి ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు ఆయన అభిప్రాయాల్లో జవాబులు దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.
అణిచివేతలు, అన్యాయాలపై గళమెత్తిన కవి ఫైజ్. పాస్ రహో అంటూ ఆయన రాసిన కవిత ఈ వారం చూద్దాం:
పక్కనే ఉండు
నా హంతకీ, నా ప్రేయసి
పక్కనే ఉండు
రాత్రి నడుస్తున్నప్పుడు
ఆకాశంలో నెత్తురు తాగి రాత్రి నడుస్తున్నప్పుడు
కస్తూరీ లేపనం చేతబట్టి వజ్ర ఖడ్గం నడుస్తున్నప్పుడు
పాడుతూ నవ్వుతూ ఆర్తనాదాలు చేస్తూ నడుస్తున్నప్పడు
బాధల నీలిమువ్వలు అడుగడుగున మోగిస్తూ నడుస్తున్నప్పుడు
రొమ్ములో మునుగుతున్న గుండె
చొక్కా చేతుల్లో ముడచుకుంటున్న హస్తాలను చూస్తూ
ఆశ పడుతున్నప్పుడు
శిశువు రోదనలా మద్యం గలగలలు
ఎంత సముదాయించినా వ్యర్థమైనప్పుడు
అనుకున్నది ఏదీ జరగనప్పుడు
ఏదీ పనికిరానప్పుడు
రాత్రి నడుస్తున్నప్పుడు
విషాదం తొడుక్కుని నిర్మానుష్య రాత్రి నడుస్తున్నప్పుడు
పక్కనే ఉండు
నా హంతకి నా ప్రేయసి నా పక్కనే ఉండు
ఫైజ్ ఉర్దూలో రాసిన పంక్తులు ఇవి.
పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో
జిస్ ఘడీ రాత్ చలే
ఆస్మానోం కా లహూ పీకర్ సయా రాత్ చలే
మర్ హమ్ ముష్ఖ్ లియే నష్తర్ అల్మాస్ చలే
బైన్ కర్తీ హుయీ హస్తీ హుయీ గాతీ నికలే
దర్ద్ కా కాస్నీ పాజేబ్ బజాతీ నికలే
జిస్ ఘడీ సీనోం మేం డూబతే హువే దిల్
ఆస్తినోం మే నిహాం హాథోం కే రాహ్ తక్నే లగేం
ఆస్ లియే
ఔర్ బచ్చోంకే బిలఖ్నేకీ తరాహ్ ఖుల్ ఖులె మై
బహరె నాసూదగీ మచలే తో మనాయే నా మనే
జబ్ కోయీ బాత్ బనాయే నా బనే
జబ్ న కోయీ బాత్ చలే
జిస్ ఘడీ రాత్ చలే
జిస్ ఘడీ మాతమీ సున్ సాన్ సియా రాత్ చలే
పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో
అబ్దుల్ వాహెద్
ఉర్దూ కవిత్వ నజరానా
శుక్రవారం మరీ ఇలా పరుగెత్తుకు వచ్చేయాలా? మొన్ననే కదా వెళ్ళింది. మరీ అంత తొందరేం వచ్చిందని ఉరుకులు పరుగుల మీద రావడం...అనుకుంటూ మొదలు పెట్టాను ఈ పంక్తులు. అసలు ఈ వారం రోజులు ఎలా గడిచాయో, ఎప్పుడు గడిచాయో తెలియడం లేదు. దానిక్కారణమేమిటంటే, పాతకోటలోకి సరదాగా వెళితే చేతికి వజ్రాల లంకెబిందెలు దొరికినట్లు, నేనేదో ఉర్దూ కవితలు నాలుగు పరిచయం చేద్దామని రాసిన రాతలకు వజ్రవైఢూర్యాలను మించిన ప్రశంసలు దొరికాయి. కామెంట్లు భుజం మీద చరుస్తుంటే నా మనసు సప్తాకాశాలు దాటేసి విహరించడం మొదలెట్టింది. నన్ను నేనే మరిచిపోయిన స్థితిలో వారం రోజులేంటి, ఏళ్ళు గడిచినా తెలుస్తుందా? ఈ ప్రోత్సాహానికి నేను అర్హుణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఆ అర్హత సంపాదించడానికి తప్పకుండా కష్టపడతాను. ఇంతగా అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతఙ్ఙతలు
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం
మొన్న శుక్రవారం ఫైజ్ గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ రోజు మరో రెండు ముచ్చట్లు చెప్పుకుని మరో కవిత చదువుకుందాం.
చాలా మంది కవుల్లాగే ఫైజ్ కూడా ప్రేమకవితలతోనే మొదలెట్టాడు. నెమ్మదిగా సామ్యవాదం వైపు మొగ్గు చూపడంతో ఫైజ్ లోని ప్రగతిశీల భావాలు ఆయన కవితల్లోను ప్రతిఫలించడం మొదలయ్యింది. ఒక విప్లవకవిగా ఆయన ఉర్దూ సాహిత్యంలో పేరు సంపాదించుకున్నాడు. ఇరవయ్యో శతాబ్ధంలో ముఖ్యమైన కవుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. ఫైజ్ కవితల్లో ఒక అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తుంది. ఆయనకు సంతృప్తి ఎన్నడూ లేదు. ప్రేమ కవితల్లో కూడా ఈ అసంతృప్తి కనిపిస్తుంది. ఒక ప్రేమకవితలో – పూలలో రంగులు నింపేద్దాం, వసంత గాలి వీస్తుంది. రారాదూ ఉద్యానవనానికి పనిలేదు, స్తబ్ధత వదిలింది, పదండి గాలితో మాట్లాడదాం, ఎక్కడో ఒక చోట ప్రేయసి కబుర్ల చెప్పుకుందాం.. అంటూ కొనసాగే కవిత చివర – ఐతే ప్రేయసి ఇంట్లో లేదా ఉరికంబం పైన తప్ప మధ్యదారిలో తానెక్కడా ఉండేది లేదంటాడు.
నా చేతిలో పెన్ను, ఇంకు లాక్కుంటే లాక్కోనీ... నా గుండె నెత్తుటిలో వేళ్ళు ఎప్పుడో ముంచాను- అని రాశాడు మరో చోట.
1951లో కుట్ర కేసులో జైలుకెళ్ళినప్పడు ఫైజ్ తన బ్రిటీషు భార్య అలీస్ కు అనేక ఉత్తరాలు రాశాడు. తర్వాత ఆ ఉత్తరాలను ప్రచురించాలని కొందరు మిత్రులు ఆయన్ను కోరారు. తన భార్యకు ఇంగ్లీషులో రాసిన ఉత్తరాలన్నీ స్వయంగా ఫైజ్ తిరిగి ఉర్దూలోకి అనువదించాడు. ఆ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ, ఈ ఉత్తరాలు వ్యక్తిగతమైనవే అయినా, వీటిని ప్రచురించడం వల్ల రాజకీయ ఖైదీల మనోస్థితి, ముఖ్యంగా సామ్యవాద సిద్దాంతాల కోసం పోరాడేవారు జైళ్ళలో ఉన్నప్పుడు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడతాయని, అందుకే ప్రచురిస్తున్నానని చెప్పాడు.
ఫైజ్ ఉత్తరాల గురించి, ఫైజ్ జీవితం గురించి వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పడు ఫైజ్ రాసిన – ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ప్రియా (చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్) కవిత చూద్దాం:
కొన్ని రోజులు మాత్రమే, ప్రియా, కేవలం గుప్పెడు రోజులు మాత్రమే
దౌర్జన్యం నీడలో ఊపిరి పీల్చే నిస్పహాయత ఇంకొన్ని రోజులే...
ఇంకాస్త సమయం ఈ వేధింపులు సహిద్దాం, అలమటిద్దాం, రోదిద్దాం...
ఇది మన పూర్వికుల వారసత్వం ... మన అంగవైకల్యం...
శరీరానికి ఖైదు, భావావేశాలకు సంకెళ్ళున్నాయి
ఆలోచనలకు దాస్యబంధాలు, మాటలపై కట్టడులు
అయినా ధైర్యంగా బతుకుతూ పోతున్నాం
జీవితం, బిచ్చగాడి చిరుగుల పంచేనా
ప్రతిక్షణం దానిపై బాధల మాసికలు పడుతుండాలా
ఫర్వాలేదు, దౌర్జన్యం కొన్ని రోజులు మాత్రమే
కాస్త ఓపికపట్టు, అణిచివేతల రోజులు కొన్నే
ఈ నిర్జన, ఎడారి, బీడు లోకంలో
మనం ఉండాలి, కాని ఇలాగే ఉండడం కాదు.
అపరిచిత హస్తాల అనామక వేధింపుల భారం
నేడు భరించాలి, ఎల్లప్పుడు కాదు...
నీ అందాన్ని కప్పేస్తున్న అమానుషాల ధూళి
మన మూన్నాళ్ళ యవ్వనంలోని నిరాశలతో సమానం
వెన్నెల రాత్రుల్లో వ్యర్థంగా ప్రజ్వరిల్లే బాధ
ఆలకించబడని గుండె నిట్టూర్పులు, వినబడలేని శరీర ఆర్తనాదాలు
కొన్ని రోజులే, ప్రియా, కొన్ని రోజులు మాత్రమే...
ఉర్దూలో ఫైజ్ భావాలను సాధ్యమైనంత వరకు తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. కవిత చివరి పంక్తులు – చాందినీ రాతోంకా బేకార్ దహకతా హువా దర్ద్... భావాన్ని తెలుగులో రాసినా.... ఆ అనుభూతిని రాయడం కష్టమే. అలాగే – జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కీ ఖబా హై జిస్ మేం, హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం – అన్న పంక్తుల్లోధ్వనించే బలమైన నిరసన, ఆగ్రహం, ఆవేదన, తిరుగుబాటు తదితర భావాలు తెలుగులో వచ్చాయా? అనుమానమే... ఉర్దూలో కవిత మీరే చదవండి. నా అనువాదం అసలు కవితకు ఒక ఆమడ దూరంలో ఉందని చెప్పినా, ఫర్వాలేదు కనీసం ఆమడ దూరం వరకు వచ్చాను కదా?
చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్, ఫక్త్ చంద్ హీ రోజ్,
జుల్మ్ కీ ఛావూం మేం దమ్ లేనే పర్ మజబూర్ హై హమ్
ఔర్ కుఛ్ దేర్ సితమ్ సహ్ లేం, తడప్ లేం, రో లేం,
అప్నే అజ్ దాబ్ కీ మీరాస్ హై, మాజూర్ హైం హమ్
జిస్మ్ పర్ ఖైద్ హై, జజ్బాత్ పే జంజీరేం హైం
ఫిక్ర్ మహ్బూస్ హై, గుఫ్తార్ పే తాజీరేం హైం
అప్నీ హిమ్మత్ హై కే హమ్ ఫిర్ భీ జియే జాతే హైం
జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కి ఖబా హై జిస్ మేం
హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం
లేకిన్ అబ్ జుల్మ్ కీ మాయాద్ కే దిన్ థోడే హైం
ఇక్ జరా సబ్ర్, కే ఫరియాద్ కే దిన్ థోడే హైం
అర్స యే దహ్ర్ కీ ఝుల్సీ హుయీ వీరానీ మేం
హమ్ కో రహ్నా హై, పర్ యుం హీ తో నహీ రహ్నా
అజ్నబీ హాతోంకే బేనామ్ గారన్ బార్ సితమ్
ఆజ్ సహ్నా హై, హమేషాతో నహీ సహ్నా హై
యహ్ తేరే హుస్న్ సే లిపటీ హుయీ ఆలమ్ కీ గర్ద్
అప్నీ దో రోజా జవానీ కీ షికస్తోం కా షుమార్
చాందినీ రాతోంకా బేకార్ దహక్తా హువా దర్ద్
దిల్ కీ బేసూద్ తడప్, జిస్మ్ కీ మాయూస్ పుకార్
చంద్ రోజ్ ఔర్, మేరీ జాన్, ఫకత్ చంద్ హీ రోజ్ ....
మళ్లీ శుక్రవారం కలుద్దాం.. అంత వరకు సెలవు..
అక్టోబర్ 10, 2013
1, అక్టోబర్ 2013, మంగళవారం
కవిత్వ విశ్లేషణ
సంధ్య యెల్లాప్రగడ-తీరని ఒంటరితనం
కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expe erienser)గా
కవిత్వం చెబుతున్న వాళ్లలో ఈతరహా కవిత్వీకరణ కనిపిస్తుంది."నేను"అనేది
ఒకటి ఇందులో కనిపిస్తుంది.ఇందులోనూ సమాజం అంతర్గతంగా ప్రవహిస్తుంది.
సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తు న్న ఒంటరితనాన్ని,బాధని కవిత్వీకరించారు.
"తీరని వంటరి తనం
నాకు మాయని గాయాని చేసింది"-
"ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై..
నా కాలిని మెలి వేశాయి !"
"కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు
రక్తం లా వెచ్చగా మసులుతోంది!!"
"ఇది సమరమని తెలుసు...
ఇది నా ఒంటరి సమరమని తెలుసు."..
"జయాపజయములు ఏమైనా
వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "
ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక వాక్యాలుగా అందించారు."గాయం/పాము/ మెలివేయటం/కన్నీరు/ రక్తం"ఇవన్నీ బాధని తరువాత వాక్యాలు తన నిర్ణయాన్ని,తెగువని చెబుతాయి.
"ఏకాంతంతో సహవాసం
జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం
సాగి వేగి కడతేరేది ఎప్పుడో!
స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"
ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.
కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం ,హృదయాన్ని
తట్టే వాక్యాల్ని చెప్పడం వీటివెనుక పదిలమైన సాధన,అధ్యయనం అవసరం.ఇలాంటి
సమయాలలో కొంతమంది కొన్ని గుర్తుల్ని అనుసరిస్తుంటారు.తొలి దశని గమనిస్తే
పదాలలో బలవంతపు ప్రాసని అనుభవించడం.ఒకటి రెండువాక్యాలు యూనిట్లతో
పూర్తిచేయటం లాంటివి.
సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.
__________ఎం. నారాయణ శర్మ
కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expe
సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తు
"తీరని వంటరి తనం
నాకు మాయని గాయాని చేసింది"-
"ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై..
నా కాలిని మెలి వేశాయి !"
"కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు
రక్తం లా వెచ్చగా మసులుతోంది!!"
"ఇది సమరమని తెలుసు...
ఇది నా ఒంటరి సమరమని తెలుసు."..
"జయాపజయములు ఏమైనా
వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "
ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక వాక్యాలుగా అందించారు."గాయం/పాము/
"ఏకాంతంతో సహవాసం
జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం
సాగి వేగి కడతేరేది ఎప్పుడో!
స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"
ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.
కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం
సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.
__________ఎం. నారాయణ శర్మ
కవిత్వ విశ్లేషణ
కట్టా శ్రీనివాస్-ఎరుక
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా. వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,ద ాంపత్య
,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని
వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా
మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్ర దర్శించడం
ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి
నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.
_____________ఎం. నారాయణ శర్మ
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్ర
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.
_____________ఎం. నారాయణ శర్మ
కవిత్వ విశ్లేషణ
రాళ్లబండి కవితాప్రసాద్ -ఎగిరివొచ్చిన హంస
"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.
డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యా త్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.
ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.
"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."
మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.
"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "
ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.
"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"
కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎ గరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అ ప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన
రెక్కలివి.
"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "
మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.క న్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.
"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"
అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.
"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"
"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."
మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.
"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"
_____________ఎం. నారాయణ శర్మ
"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.
డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యా
ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.
"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."
మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న
"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "
ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.
"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"
కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎ
రెక్కలివి.
"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "
మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.క
"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"
అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి
"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"
"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."
మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.
"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"
_____________ఎం. నారాయణ శర్మ
కవిత్వ విశ్లేషణ
సి.వి.శశారద గారి కవిత :
ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యో గాలకోసం పుట్టిపెరిగిన ఊరికి,కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ కాలనికి ఒకటి,రెండుతరాలనించి కనిపిస్తుంది.
ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/ కుమారుని గొంతుకనించి కనిపించవు.వస్తుసందర్భం,దాన ి మూలవస్తువులో సారూప్యతలున్నప్పటికీ ఇది ఈకాలానికి సంబందించి కొత్తవస్తువే.
రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా
స్థలపరిమితి(Spase Limitetion)కాల పరిమితి(Time Limitetion)అని
విడదీయొచ్చు.ఆఖ్యానంలో సత్యానికి సంబంధించిన ఆకళింపు ఉంటుంది. ఈ ఆకళింపులో
స్వభావం ఉంటుంది.ఈ స్వభావమే రచన గొంతుని చూపుతుంది.ఈ పరిమితిని
స్వభావపరిమితి(Personal Limitetion)అంటారు.
శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ
గతంగా చూపిన శ్రద్ధకూడా శైలిని ప్రత్యేకించి చూపుతుంది.ప్రధానంగా
వస్తువుని ప్రసారం చేయడానికి వాడుకున్న ప్రశ్నా వాక్యల పద్దతి
రూపముఖంగాబాగా ఉపకరించింది.
"జీవితాన్ని వెతుక్కుంటూ, లక్ష్యాల్ని మోసుకుంటూ
ఉద్యోగమూ, చదువూ అంటూ
ఊరూ ఇల్లూ దాటుతుంటే
'అప్పుడే వెళ్తున్నావా?' ప్రశ్నిస్తాయా కళ్ళు!"
"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను!
'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!!
యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను
వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు
వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను
'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు
'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా?
అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"
ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.
"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు
దృక్కులు పరిచాయని తెలుసు
వెను తిరిగి చూడలేను!"
"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు
వర్షిస్తూనే ఉంటాయని తెలుసు!
వెను తిరిగి చూడలేను!!"
"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం
గూడొదిలిన పక్షుల
రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."
ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో వాక్యాలను నిర్మించారు.
చాలాసార్లు కొత్తతరం కవిత్వం రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.
శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను.
_____________ఎం. నారాయణ శర్మ
ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యో
ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/
రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా
శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ
"జీవితాన్ని వెతుక్కుంటూ, లక్ష్యాల్ని మోసుకుంటూ
ఉద్యోగమూ, చదువూ అంటూ
ఊరూ ఇల్లూ దాటుతుంటే
'అప్పుడే వెళ్తున్నావా?' ప్రశ్నిస్తాయా కళ్ళు!"
"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను!
'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!!
యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను
వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు
వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను
'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు
'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా?
అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"
ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.
"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు
దృక్కులు పరిచాయని తెలుసు
వెను తిరిగి చూడలేను!"
"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు
వర్షిస్తూనే ఉంటాయని తెలుసు!
వెను తిరిగి చూడలేను!!"
"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం
గూడొదిలిన పక్షుల
రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."
ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో వాక్యాలను నిర్మించారు.
చాలాసార్లు కొత్తతరం కవిత్వం రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.
శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను.
_____________ఎం. నారాయణ శర్మ
21, సెప్టెంబర్ 2013, శనివారం
కవిత్వ విశ్లేషణ
షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగ ి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతా న్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.
షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన
స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా
తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.
"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర
కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"
ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో
అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో
కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.
ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.
'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"
"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"
తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో
గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన
"దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో
కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక
ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా
కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
______________ఎం.నా రాయణ శర్మ
కవిత్వ విశ్లేషణ
బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి
కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని
సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి
సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత
అందుకు సమాధానం చెబుతుంది.
వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు
బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా
తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వ ెండిలా,తెల్ల
కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం
కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.
"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"
"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"
"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"
"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"
వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్
చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో
ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా
తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ
కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి
చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/ దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.
"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.
"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"
ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
______________ఎం.నా రాయణ శర్మ
17, సెప్టెంబర్ 2013, మంగళవారం
కవిత్వ విశ్లేషణ
కె.ఎన్.వి.ఎం.వర్మ-గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల
నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం
(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.
వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.
కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.
కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.
'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."
"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."
వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.
అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.
"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"
ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.
కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.
______________ఎం.నా
నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం
(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.
వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.
కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.
కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.
'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."
"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."
వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.
అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.
"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"
ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.
కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.
______________ఎం.నా రాయణ శర్మ
కవిత్వ విశ్లేషణ
గుబ్బల శ్రీనివాస్-క్షురకుడు
అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తరువాత బహుజన వాదం పేరుతో అణగారిన వర్గాల
కవిత్వం(Poetry of appressed groups)వెలువడింది.నిజానికి ఇది వచ్చిన వేగం
ఆకాలానికి అనేక చర్చలు తీసుకు వచ్చాయి.జూలూరి గౌరి శంకర్"వెంటాడే
కలాలు"తీసుకువచ్చారు.ఆ తరువాత కూడా చాలామంది కవులు తెచ్చిన సంపుటాలున్నాయి.
చరిత్ర గతిలో వచ్చిన ఉద్యమాలవల్ల ఈ కవిత్వం తన గొంతును
మార్చుకుంది.తరువాతి కాలంలో వచ్చిన ప్రపంచీకరణ (Globalisetion)కవిత్వం లో
ఒక ప్రధాన పాయగా ప్రవహించిన కుల వృత్తుల కవిత్వం ఈ వర్గాలదే.దానికి కారణం
ప్రపంచీకరణ వల్ల ఆయా వృత్తుల విధ్వంసం జరగటమే. ఆతరువాత తెలంగాణా ప్రాంతీయ
ఉద్యమంలోనూ ఈ తాత్వికత పాత్ర గమనించదగింది
గుబ్బల
శ్రీనివాస్"క్షురకుడు"మానవీయ స్పందనను కూర్చుకున్న కవిత.ఔపయోగిక దృక్పథంతో
జీవితాన్ని పరిశీలించిన కవిత.ఇందులో అంశాత్మక పరిశీలన(Case
study)ఉంది.నిజానికి ఇలాంటి నిర్మాణం దీర్ఘ కవితల్లో ఎక్కువగా
కనిపిస్తుంది.
"నెరిసిన తలలకు మాసిన ముఖాలకు
కత్తి పట్టి వైద్యం చేస్తాడు/వైధ్యుడు కాదు"
"రాక్షస రూపాలను అందమైన
నగిషీలు చెక్కుతాడు/శిల్పి కాదు"
చివరి భాగం వల్ల వాక్యం పొడుపుకథ నిర్మాణాన్ని సంతరించుకుంది.మనసును
హత్తుకునే మార్దవమైన వాక్య భాగాలూ ఉన్నాయి.ఇవి ఒకింత కళాత్మకంగా
కనిపిస్తాయి.
"మనసు లగ్నం అయితే/వేళ్ళు విన్యాసం చేస్తే
క్రమ పద్ధతిలో అమిరిపోతాయి/జులపాలు
అవి ప్రేమిక ఊహల్లో నీలి మేఘాలు"
"నిద్దరోతున్న జనాన్ని బద్ధకం కమ్ముకున్న లోకాన్ని
డప్పు దరువుతో చైతన్యం నింపుతాడు"
"తనువు చాలించి చివరి మజిలి
చేరుతుంటే/విచార గీతం ఆలపించి
మరుభూమి చేరుస్తాడు ఆత్మీయుడిలా "
జీవితాన్ని గమనించిన తీరు బాగుంది.మంచి అంశాలని
కవిత్వీకరించారు.జీవితాన్ని అనేక భావాభి వర్గాలనించి చూడటం కూడా
కనిపిస్తుంది.వచనంలో ఇంకా తాదాత్మ్యత అవసరమనిపిస్తుంది.సాధనే క్రమంగా ఆ
మార్గాన్ని ఉపదేశిస్తుంది.మంచికవిత అందించినందుకు శ్రీనివాస్ గారికి
అభినందనలు.
______________ఎం.నా రాయణ శర్మ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)










