పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || ‘పెప్పర్ బాయ్’ ల పైశాచికం !! || (రాజకీయ సీమా౦ధ్రోన్మాదం) తోడేళ్ళ ఆఖరి ముసగులూ తొలగిపోయాయి ...!! సందర్భం వస్తే తప్ప తెలిసిరాలేదా సీమాంధ్ర రాబంధ రాక్షస కాండ ..!!?? అరవయ్యేళ్ళు తినీ తినీ ....తెగబలిసి తోలుమందమెక్కి- మదమెక్కి అందలమెక్కి –విషం కక్కిన గుంటనక్కల కండ కావరానికి ‘రంగుడబ్బాల’ తైలమర్ధన !! పన్నెండువందల పండుపున్నములు మీ ‘తొండాట’కు నిర్ధాక్షిణ్యంగా బలై పోయాయిగదరా..!! పైసలకోసం – పదవులకోసం ఆస్తులకోసం – కొలువులకోసం బరితెగించారీ బద్మాష్ గాళ్ళు ఎగబడి – తెగబడి పార్లమెంట్ను సైతం తగలబెడ్తనని విరగబడి చెబుతున్న గాడిదలకి చట్టం చుట్టమైయ్యిందా ? చట్టుబండలయ్యిందా?? నోటికాడికొచ్చిన మా అరవైయేళ్ళ ఆకలి ముద్దలో విషపు చుక్కలేస్తూ ఉంటే !! లెక్కలేనన్ని మా లేలేత ప్రాణాలు చుక్కల్లో కలిసిపోతున్నాయి ..!! బకాసురులే నరకాసురులే ....!! అసెంబ్లీలో అసిద్దం కక్కి , ఉన్మాద శునకాల్లా ...పైశాచికానంద తాండవం !! ‘అఫ్జల్ గురు’ ని మించి సార్వభౌమధికారాన్ని వంచి౦చి ఉగ్రవాదుల్ని మించి నయవంచకుల ‘విష’ ప్రయోగాలు ఎవరెవర్ని చంపటానికి ?? కరుడు గట్టిన ‘కసబ్’ ని సైతం అధిగమించి ప్రజాస్వమ్యాన్నే తుంచేస్తూ దేశాంతానికి వెనుదీయని రాజకీయ తీవ్రవాదాన్ని అంతం చేయకపోతే దేశానికే ప్రమాదం !! ఓట్లు – సీట్లు – నోట్ల కోసమా ఈ దేశ ద్రోహం !!? ఇదేనా ‘సమ ఐక్య’ వాదం !! అది కాదు ఆ ప్రజల నాదం ..! కత్తులతో ఒకడు –విషరసంతో మరొకడు – తగలబెడ్తానని౦కొకడు !!?? ‘రెండుకళ్ళ’తో కుళ్ళబొడుస్తున్నదొకడు!! సమన్యాయమంటూ సగం సగం కోసుకు తింటున్న లక్ష కోట్లు మెక్కిన ‘జగత్ కిలాడొ’కడు !! పూట పూటకు ‘పుండాకోర్ల’ దమనకాండ ! కమలం అమలినమైనదనుకుంటే ...!?? కన్నీటిని కనుగొన్నదనుకుంటే ...? ‘కోతి రొట్టెల’ కొండెంగ వేషాలా తమాషాలు !! జీవన్మరణ దశాబ్దాల పోరులో ఆత్మాహుతుల పరంపర చాలదన్నట్లు ఆటంక వాదుల ఆటవిక ‘క్రీడ’ స్టార్ ‘బుడ్డర్ఖాన్’ ల సన్నాసి పాట ! మాడి – వాడి –రాలిపడే మా ఆకలిపూలను అగ్నికి ఆహుతి చేస్తే ..?? సమ్మక్క- సారక్కే దిక్కయి నిలిచేను మాకు రంకునేర్చి ..బొంకునేర్చి ..నంగనాచి ‘రంగుడబ్బాల’ విచ్చలవిడి ‘వ్యభిచారం’!! ఛీ.... ఛీ ఛీ .............నీయబ్బ ఏం బతుకులురా యదవనేతల్లారా !!! ఆఖరి కన్నీటి చుక్కని, చిట్టచివరి నెత్తుటి బొట్టుని పీల్చుకుని సుఖపడతార్రా ??!! ఆలస్యమైన ‘ధర్మమే’ జయిస్తుందని సహిస్తే ..క్షమిస్తే .........................!!? అక్షరాలకందని రాక్షస మూకపై మేమిక యుద్ధానికి సిద్ధమైతే ..................?? మైసమ్మ తల్లితోడు ... ఒకడంటే ఒక్కడుండడిక్కడ ద్రోహులు తరిమి తరిమి కొడుతుంటే తరలిరాద తనే తెలంగాణ జై జై అంటూ జైతెలంగాణ !! ( పార్లమెంట్లో కొందరు రాజకీయ సీమా౦ధ్రోన్మాదుల ఉగ్రవాద దాడికి నిరసనగా ....ఇది కేవలం రంకు రాజకీయనాయకులను ఉద్దేశించింది మాత్రమే .... ) ----------------- 14 - 02 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nyFCih

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి