పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, డిసెంబర్ 2012, శుక్రవారం

హైదరాబాద్ లో 'లమకాన్ వేదికగా కవిసంగమం'

వాకిలి e-పత్రిక చదువుతున్నప్పుడు పదేపదే నాకు 'కవిసంగమం' గురించి గర్వంగా అనిపించింది.
గత కొన్నాళ్లుగా ఎంతోమంది యువ కవులకు వేదికగా కావడం,తద్వారా తమనుతాము explore చేసుకోవడం;పోయెట్రీ ఫెస్టివల్ లో పాల్గొనడం ,ఆ తర్వాత ప్రముఖ సీనియర్ కవులతో కవిసంగమం వలన interact అవుతుండటం -ఇవన్నీకవులకు, కవిత్వానికి ఒక వాతావరణం కల్పించినట్లైంది.
ఇవాళ 'వాకిలి' లో కనిపిస్తున్న ,లేదా విశ్లేషించబడుతున్న కవులు 'కవిసంగమం'కవిత్వగ్రూప్ ద్వారా పాఠకులకు చేరువైనందుకు, విమర్శకుల, e-పత్రికల దృష్టిని ఆకట్టుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. 

- ఇంకా ఇంకా కవిత్వపరిశ్రమ జరగాలి.
- విస్తృతంగా కొత్త కవులను ప్రోత్సహించే పని నిరాఘాటంగా సాగాలి.
- కొత్తగా రాస్తున్నకవుల కవిత్వాన్ని కవితా ప్రమాణాలతో తూచగలిగిన కవితవిమర్శ కావాలి.
దానిని సరియైన రీతిలో స్వీకరించగలిగే పరిణతిని ,మునుముందుకు సాగాలనుకునే కవి స్వంతం చేసుకోవాలి.
- కేవలం పొగడ్తలకు ,లైకులకు, మాత్రమె లొంగిపోయే తీరును మార్చుకోవాలి.కవిత్వంపై విమర్శను,సూచనలను స్వీకరించగలిగే స్థితికి కవి చేరుకోవాలి.

~~ఈ దిశగా 'కవిసంగమం' ఇకపై దృష్టి సారించబోతుంది అని ప్రత్యేకంగా 'కవిసంగమం'లో కవిత్వం రాస్తున్న కవులకు విన్నపం !

~అలాగే ప్రతినెలా జరిగే 'లమకాన్ వేదికగా కవిసంగమం' లో కవిగా సీనియర్ కవితో వేదికను పంచుకునే స్థాయి కవిత్వాన్ని సృజించగలిగే దశకు మీ కవిత్వానికి పదును పెట్టుకోవాలని మనవి!!!!!!!!!!!

=కవిత్వం కావాలి కవిత్వం!

కవిత్వవిమర్శ కవి ఎదుగుదలకు ఉపయోగపడ్తుంది.!!!

.................................................................
ఇప్పటివరకూ 'కవిసంగమం' లో కేవలం ప్రశంసల పద్ధతిలోనే వ్యాఖ్యలు కానీ,సూచనలు కానీ చేస్తూ, ప్రోత్సహించడమే పద్దతిగా సాగాం.
ఒకవిధంగా కవిత్వాన్ని రాసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చేట్లుగా కామెంట్స్ లోనూ,ప్రశంస లోను జాగ్రత్తలు తీసుకుంటూ కవిత్వవిమర్శ చేయగలిగినవాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించారు.
ఇకపై కవులు ఇంకా మెరుగైన కవిత్వం రాయడానికి ,ఆయా కవితల విశ్లేషణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
'' కొందరు బాగులేదనగానే, అలాంటి విమర్శలకు ఎంత మాత్రం స్పందించరు. లేదా ఆవేశంతో సమాధానాలిస్తుంటారు" అని నవుదూరి మూర్తి గారు భావించినట్లు ఆ రకమైన పద్ధతులు కవులకు అనుసరణీయం కాదు..ఆవేశంతో సమాధానాలు ఇచ్చేవారితో ఇకపైన నోచ్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.కవిసంగమానికి కూడా అటువంటివారి వారి కవిత్వమూ అవసరమూ లేదు.
నిజంగా కవిత్వంపట్ల ఇష్టమూ,పాఠకులపట్ల గౌరవమూ లేనివారిని వదిలేయడమే భవిష్యత్తులోచేయాల్సినపని.

'కవిసంగమం' కవిత్వవేదికగా,కవిత్వవిమర్శ వేదికగా ఎదగాలని నా ఆకాంక్ష.
నవుదూరి మూర్తి గారు,కర్లపాలెం గారు, అఫ్సర్, బివివిప్రసాద్, కరీముల్లా ఘంటసాల, హెచ్చార్కె, సతీష్ చందర్, వసీరా, శ్రీనివాస్ వాసుదేవ్, పులిపాటి గురుస్వామి, కాసుల లింగారెడ్డి, నందకిషోర్, కట్టాశ్రీనివాస్, కిరణ్ గాలి, నరేష్ కుమార్, కుమార్ వర్మ, రామకృష్ణ, మెర్సీ, జయశ్రీ నాయుడు, రోహిత్,-ఇంకెందరో కొత్త పాతతరం వారు కవిత్వవిమర్శపై దృష్టిపెట్టాలని నా మనవి.

కవిసంగమం లోని కవుల్ని,కవిత్వాన్ని సాహిత్యంలో సుస్థిరంచేసే దిశగా ఇది తప్పనిసరి అవసరం!

ఒక కొత్త ప్రయోగం

.........................
2013 సంవత్సరం నుండి ' కవిసంగమం ' ఒక కొత్త ప్రయోగం చేయడానికి సంసిద్ధమవుతోంది.మిత్రులంతా పాల్గోవడం ద్వారా,విస్తృతంగా ప్రచారం చెయ్యడం ద్వారా ఈ కవిత్వ ప్రయోగాన్ని విజయవంతం చెయ్యాలి.ఈ ప్రయోగం కవిత్వంలో రాబోయే తరాలకు ఒక దారిని ఏర్పరిచినట్లు అవుతుందని నా గాఢమైన నమ్మకం!

~ ప్రతి నెల ఒక ఆదివారం సాయంత్రం 'లమకాన్'వేదికపై ఒక సీనియర్ కవి (శివారెడ్డి వంటి వారు) + ముగ్గురు కవిసంగమం కవులు ఒక్కొక్కరు ఐదు కవితలు చదువుతారు. వారి కవితల ఇంగ్లీషు అనువాదాలు తెరపైన ప్రొజెక్షన్ చేయడం ద్వారా తెలుగేతర మిత్రులకు ఉపయోగంగా ఉంటుంది.
~ సంవత్సరాంతంలో ఆ కవితలను Bi Lingual Anthology గా ముద్రించడం జరుగుతుంది.

***
~ ఈ కవిత్వ సమ్మేళనంలో అవకాశాన్ని, కవిత్వం చదివే అర్హతను మీరు రాయబోయే కవిత్వమే నిర్ణయిస్తుంది .ఆ వేదికపై చదివే కవులను ఎంపిక చెయ్యడానికి- సీనియర్ కవులు,విమర్శకులు ముగ్గురితో - ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.

~కవిత్వం కావాలి కవిత్వం!
ఇక కవిత్వ నిర్మాణం పట్ల శ్రద్ధ వహించండి.మంచి కవిత్వం రాయండి.