పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

డా. రావి రంగారావు గారు రాసిన కవిత !!నేత్ర రుచులు!! కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ !నయనం ప్రధానం ! అన్నారు, అట్టి నేత్రానికి జీవితానికి గల అనుసందాన్ని, అవి పలికే భావోద్వేగాలను రంగారావు గారు తమ కవిత లో వెల్లడించ ప్రయత్నం చేసారు ...కన్ను (Eye) కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం, అలాంటి అవయం అన్ని జంతువులకు వున్నా మానవ కన్ను కి వున్న ప్రాధ్యాన్యం గురించి ...వాటి విలువ ను చాటి చెప్పేది !! సాధారణం గా జిహ్వ కు సంబందించిన విషయాలు మననం చేసుకునేప్పుడు !రుచులు! అన్న పదం వాడతాము..కాని ఇక్కడ నేత్ర సంబదించిన జీవితపు అనుభూతులను ప్రతిరూపం గా వాడారు ...వెలుగు చీకటి మధ్య అనుసందానమే కదా నేత్రం, అందుకే మొదటి పంక్తి లో //కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం // !!కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ !! కళ్ళలో మెరుపు ను ఎప్పుడు చూస్తాము ఏదైనా ఆశ కనిపించినపుడు, జీవితం కష్టాలలో ను .బాధలో ను ..వున్నప్పుడు ఒక దారి కన్పించి తొవ్వ చూపి నడిపిస్తున్నపుడు కలిగే మెరుపు ఆశ ....అలాగే ఇద్దరు స్త్రీ పురుషులు కళ్ళు కలియక లో మెరిసిన వెలుతురూ ప్రేమ కు దారి తీసెదే కదా... !కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం ! తడవటం ..కురవటం ఒకటే నా...రెండు ఒకే అర్థం గా కానవచ్చే రెండు వేరు వేరు పదాలు, మన సన్నిహితుల ను చాల రోజుల తరువాత కలిసినపుడో , లేదు ఒక వ్యక్తి పై అపరిమితమైన ప్రేమ అభిమానం కురిపించే ధీ తడవటం , కురవడం అంటే ధార గా పోవడం మన వలన అపకారం జర్గినపుడు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం పశ్చాత్తాపం ! వాటి తో వచ్చే కన్నీరు కురవడం ... చిట్ట చివరి గా కన్ను మూసినా వెలుతురే బతుక్కి ఆవల తీరం లో అనగా ...చివరి దశ మరణం మే ... అక్కడ ప్రశాంతం తో మలి దశని దాటి మరో లోకం లో పయనించాలి //కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.// రావి రంగారావు గారు ఎంతో సులభం గా అందరికి అర్థం అయ్యే రీతిగా రాసారు ...వారి కవిత లో ఎంతో గొప్ప జీవిత అర్థం దాగి వున్నది. మరిన్ని మంచి కవితల తో ముందుకు కొనసాగుతారు అని ఆశిస్తూ . సెలవు ...(మార్చ్ 5, 2014) ===== డా. రావి రంగారావు (నేత్ర రుచులు) కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1IGaL

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || అందరూ అంతే ...స్వార్ద పరులు..|| ----------------------------------------------------------- కొంచెం అటు ఇటుగా అందరూ అంతే ...స్వార్ద పరులు తన ఆనంద కోసం ఎదుటి మనిషి మనసుతో ఆడుకోవడం అన్నీ చేసి ఏం తెలియనట్టు అమాయకంగా నటించడం ఒక్కొసారి ఏందుకో నన్ను నేను నమ్మని నిజాలను బుజాన వేసుకొని ఎక్కడని తిరగను నన్ను ఎవ్వరూ నమ్మరు నేను వాళ్ళకు ఆడూకొనే ఆట వస్తువుని కదూ ...? అవే కళ్ళు అవే కళ్ళు నన్ను నన్ను గా నిలవనీయని అందమైన కళ్ళు అవే కళ్ళు మిలమిలా మెరుస్తాయి అవే కళ్ళు ఎడతెగని దుఖాన్ని కురిపిస్తాయి అవే కళ్ళు క్రోధంతో ఎర్రబడతాయి నన్ను అవమానించి తగలపెడతాయి ఒకరిలోకి ఒకరు ప్రయాణించీ నేణు మారమే ఒంటరిగా మిగిలిపోయా ఇంకొకరిలోకి ఒకరు ప్రవేశించ లేక కొన్ని రహస్య ప్రదేశాల్లో కొన్ని ఆశలతో ఆత్రంగా తడుముకున్న ప్రతిసారి నీవు పక్కన లేచూ నీకోసం వెతికితే ఎక్కడో దూరంగా నీవు ఇంకొకరి వడిలో నీవు కరిగిపోతూ తన్మయత్నంలో ఉన్నావు అందుకే ఆ దృశ్యాలను చూడలేక ..నా కళ్ళలో మన జ్ఞాపకాలను గుచ్చి రక్తం ఓడుతున్న నన్ను నేను గాయ పరుచుకంటూ సాగుతున్నానిలా నలిగిన మనసుకదా నాది ఎలా నన్ను ఓదార్చుకోను కాస్త చెప్పవూ దు:ఖ దు:ఖంగా..నిశ్శబ్ధంగా మౌనంగా నేను ఇల తగల బడుతూనే ఉన్నా నిన్ను మరొకరి కౌగిలిలో చూసి తలవంచుకొని నడుస్తూనే ఉన్నా గమ్యం ఎటో తెలియక

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1IEQh

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

ఏపాట నే పాడ‌ను కొల‌త‌లు లేని న‌ల్ల‌ని కాలం కాళ్ల‌నుంచే మొద‌లు కొల‌త‌ల కంద‌ని తెల్ల‌ని నీడ‌లు బ‌హుశ దిగంతాల దాకా న‌ల్ల‌ని కాల‌మూ తెల్ల‌ని నీడ‌లూ జ‌ల‌కాలాడి సృష్టించిన ఆకుప‌చ్చ‌ని స్వ‌ప్నం నిజానికి స్వ‌ప్నం కాదు.... ఓ జీవితం ...కాదు ఓ ప్ర‌పంచం!! ప‌చ్చ‌ల జ‌ల‌కాంతిలో ఎగిరే నీరు త‌ప్ప‌ క‌న్నీరు లేని జీవితంలో కాలాన్ని ధిక్క‌రిస్తూ గ‌డ్డిపోచ లోల‌కం మీద ఊయ‌ల ఊగే ప్ర‌పంచం క‌ప్ప, గ‌డ్డి, మిడ‌త, తూనీగా .. ఎవ‌రైనా ఆకుప‌చ్చ‌ని ఆర్ద్ర‌నిశ్శ‌బ్దాన్ని శృతిచేసి గ‌డ్డిపోచ లోల‌కం ల‌య‌లో ఆల‌పిస్తే? అది న‌ల్ల‌ని మేఘాల‌ పాట‌ విద్యుల్ల‌త‌ల చుట్టూ మొరిసే కాంతి పాట‌ అది నానావ‌ర్ణాల‌తో కులికే భూమి పాట‌ అది స‌మ‌స్త‌వ‌ర్ణాల‌నూ కొత్త‌రంగుల్లోకి మార్చే కాలాగ్ని పాట‌ ఇంతాచేసి అది ఆరుబ‌య‌ల్లో పిల్ల‌ల వాన‌పాట‌ ____________________________వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGGbXC

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

ఉమిత్ కిరణ్ ||వీడ్కోలు|| నీ పట్ల నా ప్రేమ మరణం లేనిది. అయినా దేశం పట్ల నన్ను యుద్దానికి పిలుస్తోంది నీతొ నేను గడిపిన మధుర క్షణాలన్ని నన్ను తరంగాలు తరంగాలుగా ముంచెత్తుతున్నాయి. అంత గొప్ప ప్రేమానుభవాన్ని పొందగలిగేలా చేసినందుకు నేను దేవుడికి ఎప్పుడూ ఋణపడి ఉంటాను.... నేను ఒకవేళ యుద్దం నుంచి రాకపోతే నా ప్రేమను విస్మరించకు.... నాఊపిరితిత్తుల నుండి ఆఖరి శ్వాస బయటి కొచ్చే సమయంలో కూడా అది నీ పేరుగా పరణామం చెందుతుంది.... మరణించిన వారి ఆత్మలు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయన్నమాట నిజమైన పక్షంలో నేనెప్పుడూ నీదగ్గరే ఉంటాను.... ఓక చిరుగాలి నీ ముంగురలను కదల్చడానికి నిన్నుస్ర్పుశించినపుడు అది నా ఊపిరే అవుతుంది. నేను ఒకవేళ యుద్దంలో మరణిస్తే అది శాశ్వతమైన వీడ్కలుగా బావించకు. మన కలయిక కోసం నేను వేచి ఉంటాను.. అప్పుడు ఇక ఏ యుద్దమూ మన ఆత్మలని వేరు చేయలేరు కదా.....

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f2wBJD

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఇంకా ఎన్నిసార్లు --------------------­-------- కొన్ని కర్పూర కాంతులు కరిగిపోయాక ఆశల ఆనవాళ్ళు చెదిరిపోయాక నీలోని కొన్ని క్షణాలను నీకు నువ్వుగా అర్పణ చేస్తావు చూడు గతించిన జ్ఞాపకాలు మనసు నిర్వేధంలో మరుగునపడిపోయాక యతించినావు నీవు నాలో ఎన్నాళ్ళుగానో మరచిపోలేని శ్వేత మయురంలా నన్ను అల్లుకున్నపుడు నీ యద రెక్కలపై తల వాల్చిన సమయాలను ఎలా పోగెయ్యను ఇంకా ఎన్ని మార్లు నా ఆత్మ దహనమవ్వాలో నీ ఊహల ఖజానాలో. తిలక్ బొమ్మరాజు 04.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1suGI

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నీల్లగోలెం నువ్వు పిలుస్తవని నేను పిలువకుండ ఎట్లొస్తవని నువ్వు చెరో దిక్కు ముకం సూడకుండ మాట్లాడితే అద్రగానం వానకు కండ్ల ఒర్రెలు మునిగిపోతయి గుండెవాగులు పొర్లిపోతయి కుదిరితెనె కలుస్తం తియ్ ఏముంది ఎదురుసూసుకునుడేగద ఎంతకాలమైనా మనకొరకు వసంతం ఆగివుంటదిలే రెప్పపాటే మన దూరాలన్ని ఎర్రమట్టిఅలుకు చల్లి, సున్నం పట్టీలుపెట్టిన మట్టిగోడలకు ఈసారి మనబొమ్మలేసుకుందాం ఈతచాప చల్లదనాలు చుట్టిపెట్టు దీపంకోసం ఓ ఇదికాకు చుక్కలు ముట్టించుకుందం మామిడిపూవాసనలతో గాలివిసనకర్ర మాఘమాసంవెన్నెల్ని విసురుతుందిలే నేను బయలుదేరంగనె నీకెరుకజేస్త తొవ్వలు మువ్వలు మోగించుకుంటొస్తయి తనబ్బిలో దాచినవన్ని ఒకసారి సూడు మరిచిపోయినయి తీసుకొస్త మన యాదికి ఎక్కడాపాల్నొ ముచ్చట తెలుస్తలేదు గడికి కలుక్కుమని మనసు పళ్ళున కండ్లపొంట వాన చెడగొట్టుడు వానకు కాలమేంది బుదగరిస్తానికి దుక్కం మన సుట్టమా వొద్దన్నా కన్రెప్పలతడికనూక్కుంటొస్తనే వుంటది పోనీ పోనీ మనం కలుస్తెసాలు నవ్వులకొంగుతోని ముకం తుడుసుకుందం 04.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1swyn

Posted by Katta

Nirmalarani Thota కవిత

కనుదోయి కబుర్లు చెబుతోంది.. గుండె మూగ బోయింది . . గుండె గుస గుసగా ఊసులాడుతోంది.. కనుపాప తప్పుకుంది . . ఎంత మధుర సమాగమం . . !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NR8p6Z

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || విష దారులు || ================================ ఎప్పుడో నువ్వు నడిచి వెళ్ళిన నీ పాదాల తడి ఇంకా ఆరలేదు పాదముద్రల్లో దాగిన కుల పిలుపుల తడి ఇంకా చిమ్ముతూనే ఉంది రహదారుల్లో ఎండమావుల్లా నీ కుల పాదాల ముద్రలు గాయాలై అక్కడక్కడా కనిపిస్తూ అప్పుడప్పుడు వెక్కిరిస్తు వెళ్ళిపోతున్నాయి చారలు పోయినా ఛాయలు కనపడుతున్నాయి పయనించే దారుల్ల్లో విష భీజాలు నాటావు కాబోలు కుల వృక్షాలు అక్కడక్కడా ముళ్ళు విడుస్తున్నాయి ముళ్ళను దాటుకుంటూ పయనిస్తుంటే చిన్న చిన్న ముళ్ళు అప్పుడపుడు గాయపరుస్తునే ఉన్నాయి నీ పాదాల తడిలో నా పాదాలు గాయలై రక్తం కారుస్తున్న్నాయి చిమ్మ చీకటిని చీల్చుకుంటూ అడుగులేస్తున్న నా పాదాలు ఇప్పుడు విష సర్పాలను కూడా దాటేస్తున్నాయి విషం తడిపే నీ పాదాలను లెక్క చెయ్యకుండా పడగలెత్తిన నీ సంస్కృతిని నా అడుగులతో కప్పేస్తా ! ========= మార్చి 04/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0ZZJg

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

|| కవిత్వం విందాం....కవిత్వం చదువుదాం ...|| ----------------------------------------------------------------------------- 60 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న విజయోత్సవ సందర్భంలో భాగంగా *తెలంగాణ కవిత్వోత్సవం * ప్రముఖ కవులతో .... తేది: 7-3-2014 ( శుక్రవారం ), సాయంత్రం: 5-30 కు , రామచంద్రాపురం మండలంలోని ' మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం' ( బీరంగూడ కమాన్ దగ్గర ) లో డా.కాంచనపల్లి ( ప్రముఖ కవి ) అధ్యక్షతన , ఏనుగు నరసింహారెడ్డి ( ప్రముఖ కవి ) ముఖ్య అతిథిగా, దేశపతి శ్రీనివాస్( ప్రముఖ కవి , గాయకులు ) ఆత్మీయ అతిథి గా సభ ఏర్పాటు చేయనైనది తప్పక రండి. ...... ఆహ్వానితులు .... తెలంగాణ సాహిత్య సమాఖ్య , హైదరాబాద్ కవుల వేదిక

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fECYJ1

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ /// నా చిట్టి నానోలు /// ************************ నిర్మల నీలాకాశ౦లో అలలు.... ఆ తెల్లని కొ౦గలు. ----------------------------- భువికి దిగివచ్చిన నక్షత్రాలు... ఆ మిణుగురులు. ------------------------------ తన మోమున విరిసిన నవ్వులు... నా పెరటిలోని పువ్వులు. ************************ --- {04/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0PpBP

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వర్షం ఆకాశం నోరు తెరిచింది అంతే; హోరున వర్షం చెట్లు తడిసి ముద్దయిపోతున్నాయ్ మొక్కలు నానిపోతున్నాయ్ వంకలు, వాగులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయ్ ఇక నిండడానికి అక్కడ ప్రదేశమే లేదు అందుకే; ఇక మిగిలిన గుండెలు సైతం వర్షపు నీటితో నిండిపోయి చీకిపోతున్నాయ్ వర్షానికి ఆవేశం ఎక్కువ అందుకే కళ్ళల్లోంచి కూడా కురుస్తోంది చూపుల్ని నాకుతూ వర్షం అంటే అందరికీ ఇష్టం కానీ ఎందరికో కష్టం వర్షానికి మక్కువ ఎక్కువ అది చిరిగిన బ్రతుకుల్లోనే కురుస్తుంది జీవితాల్ని కూలుస్తుంది అంతా అయిపోయాకా ఏమీ ఎరగనట్టు నటిస్తుంది తెరిచిన నోరు తెరిచినట్టే ఉంటుంది శూన్యంలా అంతా శూన్యం చేసేసి ఆ శూన్యంలోకే చూస్తూ శూన్యం శూన్యంగానే మిగిలిపోతుంది అది ఎప్పటికీ నిండదు మళ్ళీ వర్షం కురిసే వరకూ! 04MAR2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OWNbFW

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! || రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను...... '' రక్తం /చుక్క వీగిపోయి / చెమట చుక్కగా రూపందింది చెమట చుక్క్క తకెత్తదు! ప్రశ్నించదు! నమ్మకంగా పంజేస్తుంది '' ** '' కాని సిరా చుక్కవుంది చూశావ్ విద్యుదాగారంవిప్లవా వాసం! సిరా చుక్క స్పర్శ చెమట చుక్కని రక్తం చేస్తుంది కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య! ** శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట! కోడేదూడ! బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!.... స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై .... కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే.... అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే .... అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో. పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి. భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి. మోహనరాగం ఆలపించన శివారెడ్డి '' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే '' నా సోదరులకి కళ్ళిచ్చాను నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను నా దేశానికి నా దేహానిచ్చాను కాదు నాదేశమే నాదేహం '' నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి - నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. '' ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం 4.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3gyhZ

Posted by Katta

Kks Kiran కవిత

" లోకంలో ఉన్న సౌందర్యం ఒక్కోసారి ఒక్కోలా హఠాత్తుగా దర్సనం ఇచ్చేస్తే ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందడం అనేది ఒక్కోసారి చాలా ఇబ్బందైన పని అనే అనిపిస్తుంది, ఆ సౌందర్యాన్ని చూసిన ఆనందం వల్ల కలిగిన తన్మయత్వపు స్థితిలో ఉన్నప్పుడు ఒక అందాన్ని మించి మరో అందం కంటిముందు కనిపించి కళ్ళెదుటే తిరుగాడుతూ ఉంటే పొందే బాధ స్వర్గమో,నరకమో ఖచ్చితంగా తెల్పలేని భావస్థితిలా తోస్తుంది " ఇంత స్థితి గురించి నేనెందుకు వర్ణించి చెప్తున్నాను అంటే , ఈరోజు జరిగిన ఒక సంఘటన గురించి ముందుగా వివరించాలి.... మా కాలేజులో అమ్మాయిలు ఎప్పుడు కూడబలుక్కుని ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, ఈరోజు ప్రతీ అమ్మాయి " లంగా ఓణీలు " కట్టుకుని చక్కగా మన తెలుగు వస్త్రధారణలో తయారయ్యి కాలేజుకి విచ్చేసి మాకు కనువిందు చేసేసారు ఒక్కసారిగా...!!! ఉదయం లేచి ఏ ఏ సౌందర్యాలును ఈరోజు ఆస్వాదిస్తానా అని అనుకునే నాకు ఇంత ఊహించని సౌందర్యాలు ఎదురయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుబోక అచేతనావస్థకు గురి అయిన వ్యక్తిలా అలా వాళ్ళని చుస్తూ ఉన్నాను అంతే.......!!! " ఈలోకంలో ఎన్ని గొప్ప సౌందర్యాలు ఉన్నాయి? వెతికే ఓపికా,ఆస్వాదించి స్పందించే మనసూ ఉండాలే కాని ఈ లోకంలో ప్రతీదీ సౌందర్యమే.. సౌందర్యం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ లోకంలో ముఖ్యంగా కనపడేవి రెండే సౌందర్యాలు. 1. ప్రకృతి తాలూకు సౌందర్యం 2. స్త్రీత్వం తాలూకు సౌందర్యం. నిజమే .....!!!!!! " ప్రభాతసమయాన ఒంటరిగాదారిలో నిశబ్దంగా నడుస్తున్నప్పుడు అప్పుడే వాయి తీసిన ఇడ్లీలు కక్కే పొగలాగ ఉండే పొగమంచూ సౌందర్యమే.! ఆ పొగమంచు కరిగి అప్పుడే విరిసిన పువ్వులపై తొలకరి జల్లులా నిలిచే నీహారికా బిందు సమూహాలూ సౌందర్యమే..!! దారిని, దారికి ఇరువైపులా ఉండే చెట్లను ,పంటపొలాలనూ కనపడనియ్యకుండా చేసే మంచుతెరలూ సౌందర్యమే...!!! ఆ మంచుతెరలు వెనకనుంచి మసగమసగ్గా కనిపించే ప్రభాత సూర్యుని ఆగమనమూ సౌందర్యమే....!!!! ఆ ఆగమనాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ కదిలే మేఘాల కదలికా సౌందర్యమే.....!!!!! రాత్రే ప్రాణంపోసుకుని అప్పుడే విచ్చిన సన్నజాజి పూలూ సౌందర్యమే......!!!!!! చెట్టునుండగానే ప్రాణం విడిచి కిందకి రాలిపడే పారిజాతపూల సొగసూ సౌందర్యమే.......!!!!!!! " ప్రకృతికి పర్యాయపదమైన " స్త్రీ "లో కుడా అంతే సౌందర్యం ఉంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ భూమికి ఎక్కువ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందా? లేక ఈ భూమిపై తిరిగే ఈ అమ్మాయిలకి ఎక్కువ ఆకర్షణశక్తి ఉంటుందా అని? (ఎంతకాలం ఆ ఆకర్షణశక్తి ఉంటుందని కూడ ప్రశ్న కాదు). వాళ్ల మాటలు,చేష్టలు కొంటెగా ఉంటాయి,సిగ్గుగానూ ఉంటాయి...!!! స్త్రీలలో ఉండే ప్రధాన ఆకర్షణలలో ఇదోకటి కాబోలు...!!! తరచి తరచి చూస్తే వారి ప్రతీ కదలికా మనకేదో కవిత్వం చెప్తున్నట్లు ఉంటుంది. అందుకే మన పూర్వీకులు అంత గొప్పగా వర్ణనలు చేసేసి రాసేవారు స్త్రీ సౌందర్యం గురించి. సరే మా కాలేజ్లో అమ్మాయిలను క్లాసులు ఖాళిగా ఉండడంవల్లో,మరి అంత ఆకర్షణా వాళ్ల నుంచి నాకు తప్పించుకోవడం చేతకాకో తెలియదు కానీ ఎప్పుడూ అంతలా పట్టించుకోని నేను అలా పరిశీలిస్తూ ఉన్నాను చాలసేపు... " మన తెలుగు వస్త్రధారణలో అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారంటే అసలా అందం వారికి ఆ చీరకట్టుకోవడం వల్ల వచ్చిందా ? ( లేక ) వాళ్ళు కట్టుకోవడం వల్లనే ఆ చీరకట్టుకి అంత అందం ఆపాదించబడిందా అనేది తొలగని అనుమానంలా మనలని వేధిస్తూ ఉంటుంది మనల్ని. " అమ్మాయిలు అమ్మాయిలలా ఉంటేనే ఎంతో బాగుంటారు " అని అనిపించింది ఉదయం వీళ్లను చూస్తే... ప్రస్తుతం శిశిరఋతువు వెళ్తూ వసంతం ఆగమనం చెందే కాలం కదా ఇది? అలానే ఈ అమ్మాయిలు కూడా తమ కౌమారపు వయస్సును వదిలేసి యవ్వనంలోకి అడుగుపెడుతున్నారు కదా? వసంతఋతువు వస్తూంటే ఎంత అద్భుతంగా ఉంటుందో,ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత ఆహ్లాదం నాకు కనిపించింది వీళ్లను చూస్తూ ఉంటే... " మాటిమాటికీ వారి ముఖపద్మాలపై పడే వారి నల్లని ముంగురులను చూస్తే నాకు అవి తుమ్మెదలేమో అని అనిపించింది. ఆ కన్నుల్లో కూడ కొత్తరకపు అందాలు చోటుచేసుకున్నాయి. క్ర్రీగంటిన ఆ చూపులు , కదిలే ఆ కనురెప్పలు మన్మధుడు గురిచూసి విసిరే బాణాలు.. సంపెంగ మొగ్గ లాంటి ఆ ముక్కుకి ఇంకా అందం తెచ్చిన ఆ ముక్కుపొడకని ఎంత వర్ణించినా తక్కువే, ఇక నవ్వులు... " నవ్వులా అవి నవపారిజాతాలు " అనే పాటని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి ఆ నవ్వులు. ముఖాలలో ప్రవహించే అ నవ్వుదొంతరల సౌందర్యం వర్ణించలేక ఎంతమంది కవులు గింగిరాలు తిరిగారో... నవ్వినప్పుడు సొట్టపడే ఆ బుగ్గలు,ముసిముసి నవ్వుల ముచ్చట్లు,అందులో ఒక అమ్మాయి చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేస్తూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా అబినయించే సుందరమైన చేతికదలికలూ,మొహంలో ప్రకటించే హావభావాలూ,కదిలేటప్పుడు చేతికి ఉన్న గాజుల సవ్వడులూ ఇవన్ని చూస్త్తూ ఆనందలోకంలోకి వెళ్ళిపోయాను అలా... మెడల్లో ధరించిన ఆ ముత్యాలహారంలోని ముత్యాలకాంతి చందురుని వెన్నెలను ఎగతాళి చేసేలా ఉంది.... చుక్కలు మెరుపులై వాళ్ల చీరాంచుల చివరన మెరుస్తున్నాయి, ఒక అమ్మాయి ఆకాశంలో ఉన్న నీలాన్ని అరువుగా తెచ్చుకుని తన చీర రంగుగా చేసుకుంది, ఇంకొక అమ్మాయి ఏకంగా నీలం రంగు పరికిణీ కట్టుకుని వచ్చింది అందరికన్నా భిన్నంగా...!!! మాటిమాటికీ దోరనవ్వులు నవ్వుతూ నా వంక చూస్తోంది అప్పుడప్పుడూ తన స్నేహితురాలుతో మాట్లాడుతూనే , నవ్వు ఆపుకుంటూ నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఆ నవ్వునంతటినీ కళ్లచూపులతోనే వెళ్లగక్కుతోంది. ఇక ఆ అమ్మాయిలలో కొందరు తమ వాలుజడలకి పెట్టుకున్న మల్లెలు సూర్యుని ఎండకి కరగని మంచు స్పటికాలు అన్నట్లు ఎంతో తెల్లగా అందంగా ఉన్నాయి. వారి జడలలో ఉండే అదృష్టం పొందిన ఆ పూల సోయగాలకి,వీరి సుకుమారానికి అట్తే తేడా ఏం ఉన్నట్లు అగుపించలేదు నాకు... వారు తలత్రిప్పిన ఒక్కక్షణం అటు చూస్తే చాలు,బెర్ముడా ట్రయాంగిల్ కి కూడా అంత ఆకర్షణ ఉండదనిపించింది,అంత ఆకర్షణ కలిగి ఉన్నారు ఈ రోజు ఈ అమ్మాయిలు మన తెలుగు వస్త్రధారనలో ఉండి. ఎంత ముచ్చత కలిగిందో మొత్తానికి వారి సౌందర్యాన్ని చూసాకా, ఎంతైనా " దమయంతి " వారసురాళ్ళుగా వీళ్ళు, ఇంకో " శ్రీహర్ష నైషదం" రాసే అవసరం మన మగవాళ్లకి ఎప్పుడూ కలిగిస్తూ ఉంతారు వీళ్ళు తమ సౌందర్యంతో.....!!! " - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dl9zkA

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hFa4Yv

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

By Vijay Kumar Svk

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0B3sb

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (నేత్ర రుచులు) కన్ను తెరిస్తే ఎంత వెలుతురో... జీవితం కన్ను మెరిస్తే ఎంత వెలుతురో... ఆశ కన్ను కలిస్తే ఎంత వెలుతురో... ప్రీమ కన్ను తడిస్తే ఎంత వెలుతురో... అభిమానం కన్ను కురిస్తే ఎంత వెలుతురో... పశ్చాత్తాపం కన్ను మూస్తే ఎంత వెలుతురో... బతుక్కి ఆవలి తీరం.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQ80wd

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@@ అపార్ట్ మెంట్లు @@ _ కొత్త అనిల్ కుమార్ . # 4/3/2014 ఎప్పటికి ఏవో జ్ఞాపకాల కదలికలతో మనసంతా సందడిగా ఉంటున్దేన్దుకో సందడి అంటే సంబురం కాదు గాని ఏవో గుర్తుకొస్తుంటాయి అనవసరంగా అన్ని యాది చేసుకునే నిరంధి జీవితం కాదు .కాని ఏదో రంది మదిని కదిలించేలా చేస్తుంది ఈ దినసరి మనవ యంత్రం నడిచి నడిచి చల్లబడాలంటే తిరిగి గూడు చేరి తలుపు లేసుకోవలసిందే తప్ప .,మందలించే మనిషుండదు అవును మరి., ప్రపంచీకరణ విసర్జించిన మనుషుల పుట్టాలనే అపార్ట్ మెంట్లలో ... నిన్న మొన్నటి వరకున్న వంద వాకిల్లని ఫ్లాట్లుగా మారిపోయాయి వాకిళ్ళ పై ఉన్న పిండి ముగ్గులన్ని పెయింట్ గీతలయినాయి ఆత్మీయ మనసులన్ని అపార్ట్ మెంట్ జాలిలో వడ పోయబడ్డాయి గల్లిలన్ని మాయమై విలాసం మిగిల్చిన విల్లలినాయి ఎవరి మనసులు వారికే ఎవరి చూపులు వారికే హద్దులు నిర్దేశింపబడిన అత్మీయప్రవర్తన లోపల ప్రేమలున్నా మించకూడదు చొరవలు కరువైన కృత్రిమ జీవితాలు ఒకప్పుడు మనసుల్లోకి మనుషులు అలవోకగా చొచ్చుకేల్లెవారు ఒకరింటి గుమగుమలు దారిని చీల్చుకుని ఇంకొకరింట్లోకి వెళ్లి నిండిపోయేవి ఇప్పుడంత పెద్ద దారులు లేకున్నా ఈ స్నేహ పరిమళాలు దర్వాజాలు దాతలేవు దాటిన ... మనిషి మనిషికి కనిపించినంత సేపే చక్కగా అతికించుకున్న పలకరింపులు అందంగా అలకరించుకున్న చిరునవ్వులు ఆ గూళ్ళలో ప్రేమలు లేవని నేననను ప్రేమను పాటిస్తున్నారనేదే నా బాధ మనసుకు వేరే బాధ లేక కాదు ఈ అనుభవాల యేరు గుండెను తడి చేస్తూ వెళ్ళడమే బాధ . కుదుట పడ్డ మనసు ఇలాంటి వెతలతో మల్లి పదనౌతుంది లక్షణంగా గడిపేస్తున్న జీవితంలో నాకేం బాధ లేదు కాని లక్ష్యాన్ని నిర్దేశించుకుని బ్రతికే యంత్రాలు ప్రేమకు కొంత 'spase ' ను నిర్దేశించుకుని జీవించడమే కొంత బాధ నాకు మనిషి బ్రతికే స్థలమే తగ్గింధనుకున్న మనసు బ్రతికే స్థలమూ తగ్గింది . _ కొత్త అనిల్ కుమార్ .

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hEZz7k

Posted by Katta

Srinivas Moni కవిత

బతుకమ్మ (02-03-2014) (నమస్తే తెలంగాణ) లో పబ్లిష్ అయిన నా కవిత ' ఐ లవ్ యూ హైదరాబాద్ ' http://ift.tt/1ePMAPF

by Srinivas Moni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ePMAPF

Posted by Katta

Srivalli Radhika T కవిత

ఎందాకా..!//టి.శ్రీవల్లీ రాధిక నేనొక మందహాసాన్ని ఏమరచి ప్రకటిస్తే.. తాము పారేసుకున్న నవ్వుల్ని వెతికేందుకు పరుగుతీస్తారు.. ఓ విజయాన్ని పరాకుగా ప్రస్తావిస్తే.. తాము సాధించిన పతకాలన్నిటినీ ప్రదర్శనకు పెడతారు ఒక సంతోషం సీతాకోకచిలుకలా నాచేతిపై వాలితే వేవేల పుష్ప రాశుల్ని తమ వాకిళ్ళలో ఎరగా వెదజల్లుతారు ఒక గౌరవం నక్షత్రంలా నా తలపై మెరిస్తే వందల మణిగుచ్చాలని తమ యింటి పైకప్పులకి వేలాడదీస్తారు నా చుట్టూ ఉన్న వారు.. అన్నివేళలా ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఆరాటపడతారు నవ్వులోనూ నడకలోనూ నన్నధిగమించాలని ప్రయత్నిస్తారు హటాత్తుగా ఒకరోజు.. ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా.. నిరామయంగా.. ఆనందంగా.. అతి సహజంగా నిష్క్రమించే అవకాశం మొదట నాకే వస్తే.. పాపం వీళ్ళంతా ఏం చేస్తారు! అలవోకగా నేను దాటిపోతుంటే నాకన్నా ముందు నడవ లేక నేనెటు వెళ్తున్నానో అర్ధం కాక బహుశా ఇక్కడే ఆగిపోతారు.. ఎవరి శరీరాలలో వాళ్ళు అశక్తులై నిలిచిపోతారు ***

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nqjyvx

Posted by Katta

కాశి రాజు కవిత

కాశి రాజు ||చిక్కుడు గింజల సెగలో|| ఇల్లుమొత్తం నిండుకున్నా లేనితనం ఎప్ప్పుడూ లేదు మాటో, పిలుపో ,సర్దుబాటో చేసిపోతావ్ అమ్మేమో అప్పైనా తెచ్చివండేస్తది బదులివ్వడం తెలిసిన బతుకుల్లో లేదన్నబాధ తెలీదని అమ్మ కొసరి వడ్డిస్తున్నపుడే తెలుస్తాది. ఆకలిగా ఆవురావురంటూ తిని, కాస్త నిండాక కాళ్ళుసాపుకు తిని అమ్మా నువ్వూ కూడా తిను. అన్నపుడు నాకు నిండిందని నిర్దారించుకున్న మీరిద్దరూ మాకు ఆకలైనపుడు మెతుకుల్లాగా మారిపోయారు బడికెళ్లలేదేరా అని అడుగుతుంటే బియ్యం లేవన్న సమాదానం అమ్మ సెప్పిందో, నా ఆకలే సెప్పిందో తెలీలేదు ఆ పూట మనం కాలుచుకుతిన్న పచ్చి చిక్కుడుకాయల ముదురు గింజలన్నీ కమ్మదనాన్ని కాదు గాని , అమ్మదనాన్నే తెలిపాయి. ఆ పొయ్యి సెగకి నువ్వు కాస్త నా పక్కకు జరిగాక, నాన్నా ! ఆకలితో కాదుమనం, అమ్మతో నిద్దరోయాం

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDQs1K

Posted by Katta

Santhisri Santhi కవిత

// శాంతిశ్రీ // చిలుక-గోరింక మీరిద్దరూ చిలుకా గోరింకల్లా ఉన్నారనుకున్నాం ఇన్నేళ్లల్లో నీతో ఎన్నో మధురానుభూతులు పంచుకుందా చిలుక ఎంతో భవిష్యత్తునూ ఊహించుకుంది అవేవీ నెరవేరకుండానే ఏదో అత్యవసర కార్యమేదో ముంచుకొచ్చినట్లు అర్ధాంతరంగా ఎగిరిపోయింది తిరిగి రావడం అసాధ్యమని తెలిసినా అది ఆపడం నీ తరం కాలేదు ఆ చిలుక తరం అంతకన్నా కాలేదు నీ గూడులో కువ కువలాడుతున్న బుజ్జి పక్షులకు ఇక అమ్మవూ నాన్నవూ నువ్వే వాటికి ఆహారం నీవే తేవాలి అవి ఎగరడం నేర్చుకునే వరకూ బాధ్యతంతా నీదే వాటి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిరంతరం తపించు.. శ్రమించు నీలో సగం లేదన్న వెలితిని మేము పూడ్చేది కాదు.. పూడ్చలేము కూడా ఆ వెలితిని మీ బుజ్జి పక్షుల కుహుకుహులతో సాహిత్య కవిత్వా కుసుమాలతో నింపుకో అప్పుడు నీవు ఎప్పటికీ ఒంటరివికావు.. కాలేవు మేమంతా ఉన్నాము నీవెంటే సాహిత్య సేద్యం ఇక మొదలుపెట్టు మేటిగా నిలిచి ఉజ్జ్వలంగా ఎదుగు అందరూ నిన్నే పలవరిస్తారప్పుడు అప్పుడు నీవు ఒంటరివెలా అవుతావు కీర్తి నీతో జతకలిసి, పెనవేసుకుని ఉంటే ఎందరిలోనో నిండుగా నీవు తేది: 10.2.2014 (భార్య చనిపోయిన వేదనలో ఉన్న గేరా కోసం)

by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDQsyL

Posted by Katta

Indira Bhyri కవిత

ఇందిర గజల్ ఒకరినొకరు కబళిస్తే జాతి నిలిచి ఉండునా అంతకంత దిగజారితె ఖ్యాతి నిలిచి ఉండునా నిప్పుకడుగు సూర్యుడినే దాచగలుగు మబ్బులేవి స్వార్థమనే చెదలుచేర నీతి నిలిచి ఉంటుందా అడుగడుగున పదునెక్కుతు సాగినదే జీవితం రగిలించే చమురులేక జ్యోతి నిలిచి ఉండునా మాటరాని జీవులైన జట్టుకట్టి మసలునే సమభావన లేక ఐక్యగీతి నిలిచిఉండునా త్యాగధనుల చరితలన్ని మేలుకొలుపులే 'ఇందిర' మూలాలను మరచిపోతె రీతి నిలిచి ఉండునా 2011 రచన . 4/3/14

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eZJl3G

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

అది నాదే! ఓ క‌విత‌ మ‌ట్టిలోంచి చెట్టులో చేరి ఆకుప‌చ్చ‌ని హ‌స్తం చాచి నా మీద క‌విత్వం రాయండి అంటుంది ఇంకో క‌విత రెక్క‌ల్లోంచి ఓ ఈక‌ని పీకి ఆకాశంలో ముంచి త‌నూ రాయ‌డానికి త‌యారైపోతూ త‌న గురించి రాయ‌మ‌ని స‌వాల్ విసురుతుంది మ‌రో క‌విత త‌న‌లోని ఆశ‌ల్ని రాగాల దారాలుగా గాలినిండా అల్లి మంచు ముత్యాల్ని ఒడిసి ప‌ట్టి నా మీద కూడా క‌విత రాయ‌మంటుంది మూడు విడిక‌విత‌లు క‌లిసి ఒకే క‌విత‌ ఇక‌ నేనేం రాసేదీ న‌న్నూ చేర్చుకోమ‌ని అడ‌గ‌డం త‌ప్ప‌ న‌లుగురికీ క‌లిపి ముక్తాంపుగా ఉమ్మ‌డిగా ..ఒకే ఒక చిరున‌వ్వు ఆది నాదే ----------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5lCWa

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుసుకుందాం :SELECTED READINGS బాలగంగాధర తిలక్ | తపాలా బంట్రోతు ............................................... తపాలా బంట్రోతు మైడియర్‌ సుబ్బారావ్‌ కనిపించడం మానేశావ్ ఏ(విటీ... పోస్టుమాన్‌ మీద గేయం వ్రాయాలా! అందమైన అమ్మాయి మీద కాని చందమామ మీద కాని వంద్యుడైన భగవంతుడి మీద కాని అ వంద్యుడైన ధీరనాయకుడు మీద కాని పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే ఎక్కడి పోస్ట్‌మానో యీ గోల ఈ సాయంత్రం వేళ ధనవంతుణ్ణి స్తుతి చేస్తే పది డబ్బులు రాలుతాయి సచివోత్తముణ్ణి స్మరిస్తే పదికళ్ళు మనమీద వాలుతాయి ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావ్ ఉత్త పోస్టుమేన్ మీద ఊహలు రానేరావు మూడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ వన మహోత్సవ దినం బిర్లా దాల్మియా సినీమా దలైలామా యుద్ధం పరమార్థం రాజులూ, రాజ్యాలూ, తారుమార్లూ ఇటువంటివి చెప్పు మరి చూడు నా తడాఖా మృదు మాధ్వీ పదలహరీ తరంగ మృదంగ విలసద్భంగీ మనోహరాలౌ కావ్యాల్ గేయాల్ కొల్లలుగా వ్రాస్తాను కానీ, తపాలా బంట్రోతు మీదా హవ్వ! ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్నసైజు జీతగాడు చెవిలో పెన్సిల్ చేతిలో సంచీ కాకీ దుస్తులు అరిగిన చెప్పులు ఒక సాదాసీదా పేదవాడు ఇంటింటికీ వీధివీధికీ ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమ్మినిస్టరా ఏం అయితే చూడు ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు ఆ కళ్ళలో ఆతృత ఆ గుండెల్లో గడచిన దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం అమ్మాయీ ! పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే నీ ఆశ నాకు అర్ధమయింది. అందుకే చూపులు తుమ్మెద బారులు కట్టి నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి వీధి వీధినంతా కలయజూస్తున్నాయి అడుగో పోస్ట్ మాన్! ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక విచ్చిన రెండు కల్హార సరస్సులు గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ కనపడీ కనపడని కళ్ళల్లో కొడిగట్టిన ప్రాణపు దీపంతో తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం తన బాబు తన ఊపిరి అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం కోసం నిరీక్షణ క్షణ క్షణ ప్రతీక్షణ ఒక కార్డు ముక్క వ్రాశాడా బంట్రోతూ వెళ్ళు వెళ్ళు త్వరగా ముసలిదానికి మంచివార్త నందించు ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు దూరభారాన ఉన్న కుమారుని కోసం వగచే తల్లికి చేరువ చేరువౌతూన్న నువ్వొక ఊరట దగ్గర దగ్గరౌతున్న మిత్రుని లేఖ కోసం నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి ఉద్యోగశప్తుడైన నవీన యక్షునికి మనిషికి రాక్షసునికి నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిముషము అనే కంచె చుట్టూ త్రిప్పగల నేర్పరవి .. కూర్పరివి... అదృష్టాధ్వం మీద నీ గమనం శుభాశుభాలకి నువ్వు వర్తమానం నీ మాజిక్ సంచిలో నిట్టూర్పులు నవ్వులు పువ్వులు ఆనందాలు అభినందనలు ఏడుపులు ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం! కొందరికి పరిచయమైన నవ్వు కొందరికి తలపంకించిన నవ్వు కొన్నివైపులకి చూడనే చూడవు అందరికీ నువు ఆప్త బంధువుని అందరికీ నువు వార్త నందిస్తావు కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మథనం అవుతూంటుంది ఇన్ని యిళ్ళు తిరిగినా నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు తీరం వదలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు - 1959 -------------------------------------------------------------- * సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలా శాఖ జరుపుకొనే వార్షికోత్సవానికి పోస్టుమాన్ మీద వ్రాయమని కోరినప్పుడు వ్రాసి యిచ్చిన గేయం.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NPknOd

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | ఒద్దిక --------------------- రోజూవారీ ఘటన: ప్రవహిస్తూ కాలం, ప్రసరిస్తూ పొద్దుటెండ బాటపట్టి నేను-కిటికీలోకి పట్టిపట్టి చూస్తూ- సాదరంగా నవ్వే పాపాయి కోసం చిన్ని కళ్ళలో ఒకింత విస్మయం, రవ్వంత కుతూహలం ఆ ప్రపంచంలోకి ఆహ్వానం ఇద్దరికీ తీరిక చిక్కితే నిన్నటి నుంచి నేటిలోకి పలకమాగిన పలుకరింపులు చిట్టిపొట్టి మాటల రుచి చెప్పరానంత! అంతలోనే బిక్కమొగం అందుకునే ఆరున్నొక్కటి బిత్తరి నా చూపులిక బాట వెంట బిరబిరలు, పరుగందుకోలేని పాదాలతో అమ్మవొడి చేరగానే మొలకెత్తే గారాబం, రసవత్తరం కిటికీ అద్దానికి అతుక్కున్న చిన్నారి హస్తకమలం... తుమ్మెదలుగా మారిన నా పాదాలిక అక్కడక్కడే తిరుగాడతాయి. (మార్చి, 2014 "కౌముది" లో ప్రచురించబడింది) 04/04/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5fayy

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

నా మస్తిస్కంలో కవితాక్షరాలు కనుమరుగైతే జీవన శ్వాస ఆగి మరణిస్తాను" ఈ కవితా పంక్తులు నేను చదివిన కవితా సంపుటి సముద్రమంత గాయం లోనివి.కవి శ్రీ కెరె జగదీష్ గారు రాయదుర్గం అనంతపురం జిల్లా . పూర్తి వివరాలకు చరవాని 9440708133 9440708133

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNCkbv

Posted by Katta

Smitha Tati Smitha కవిత

Salute The Real Hero . Pandit Jawaharlal Nehru's inspirational speech for youth http://ift.tt/1c3u2Mo

by Smitha Tati Smitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eZnMAi

Posted by Katta

Maddali Srinivas కవిత

పునర్నిర్మాణం?!?!//శ్రీనివాస్//04/03/2014 ----------------------------------------------- కుట్టుకుంటూ కూర్చున్నావా చిరిగిన బొంతని తీరిగ్గా పేర్చుకుంటూ చీలకలూ పేలికలూ సూదేమో దిగదాయే దారపు చిక్కులు విడవాయె చీకటి తో నీ దోస్తీ తెగదాయే నడి రేయికి నవ్వులేదు జడివానకు మెరుపు లేదు తగదంటే వినకుండా వర్షించే కన్నుల్లో తడి బారిన గుండెల్లో వెన్నెలని వెదుక్కుంటూ వేసారిన మనసుకు విశ్రాంతే కరువాయె బ్రతుకంతా బరువాయె మేటింగ్లో ఫైటింగే పార్టింగ్లో ఫైటింగే మీటింగ్ పాయింటే లేని మనసులకు పీసంటే పీస్ పీసే పుట్టుంటే బాగుండే గిట్టున్నా బాగుండే పుట్టీ పుట్టని పుట్టుక పుట్టాకీ వగపేలో నూతుల్లో నీరు రాక జనవాసాలల్లో వద్దంటే పారాకా తెలిసి తెలిసీ చేసిన తప్పుల వుచ్చులు మెడ చుట్టూ బిగిసాకా నటనేలో వగపేలో వగపుల నటనేలో నటనల్లో వగపేలో వుచితంగా వెలిగే దివిటీలకు చమురు లేక నీరందిచ్చే శక్తి లేక అరువిచ్చే బుగత లేక పండని బీడులు వేసే ప్రశ్నలకి జవాబీయలేక మండే గుండెలకింత వుపశమనం కరువయ్యాక నువ్వు నాటిన గులాబి మొక్క వాడాకా నువ్వు వోడాకా వగపేలో, నటనేలో పేర్చుకున్న చితిలోనే మోక్షం పొందేసేయ్ పోసుకున్న పెగ్గులో కీర్తి నిషా తలకెక్కి జీవన్ముక్తికి సోపానం వేస్తుందిలే అరువు సోకుల ధగధగలన్నీ వెలిసిపోతే కాల గర్భంలో కలిసిపోతే నువ్వొక్కడివే కీర్తి నిషాలో తీరిగ్గా మునిగిపో మురికి పాలైన మమ్మల్ని యిట్లానే వదిలేసిపో

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djCmGq

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-20 (కవి సంగమం) "అదృశ్యలోకంలో ఆకాశం సాక్షిగా కవి అంతఃసంఘర్షణలే తమో చిత్రాలు" కవిత్వ సంపుటి పేరు :-" తమో చిత్రాలు" రాసిన కవి పేరు :- నారయణ శర్మ. మల్లావఝ్జల కవిత్వాన్ని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "నాలో ఇందరున్నారని తెలిసింది పగిలిన అద్దం చూసాకే"-1 "కవిత్వమంటే అస్థిత్వ యాత్రే నాలోని నన్ను నీలా వేరుగా చూడ్డం"-2 "బౌద్ధం, కవిత్వం ఒక లాంటివే బుద్దుడూ కవి ఇద్దరూ తాపసులే మరి"-3 ఇవి నారాయణ శర్మ గారి (1,2,3)"అస్తిత్వ పుష్పాలు"-అనే నానీలు లోని కొన్ని శకలాలు. ఈ కవిత్వ శకలాల సారాంశాన్ని లోతుగా అధ్యయనం చేయగలిగితే నారయణశర్మ గారి కవిత్వ వ్యక్తిత్వం అవగతమవుతుంది.ఈ మాటలే ఆయన అంతరంగభావాల్ని పట్టిస్తాయి. "తమో విరహిణి వెంట్రుకలు విరబోసుకొని ఆకాశం నిండా ఆరబోసుకొన్నప్పుడు చుక్కల మల్లెల్ని తలలో తురుముకున్నప్పుడు నేనూహించాను" ఇలా చీకటి రాత్రిని విరహిణి ఆరబోసుకొన్న శిరోజాలతో ఉత్ప్రేక్ష చేసి అక్షరాలను మృదంగా ధ్వానం చేసిన వాడు, "అనుభూతిని కాగితం పై కక్కేశాను,కాగితం పై కవిత్వం నవ్వుతుంది" అంటూ కవిత్వ హసనాన్ని ధ్వనింప చేసినవాడు," నా పెదాలు కదలకుండా, నా గొంతు పెగల కుండా, ఓ శబ్దం పుట్టుక...నా కలం నుంచి" అంటూ అంతరంగ అరల్లో తన కవిత్వావిర్భావం జరుగుతుందని ధృవీకరించినవాడు ఎవరంటే అతడు మల్లావఝ్ఝల నారాయణ శర్మ అని నేనంటాను. నారాయణశర్మ గారు కేవలం కవే కాదు సంగీత విద్వాంసుడు,చిత్రకారుడు కూడా.సాహిత్యం అతని తండ్రైతే, కొన్నేళ్ళవరకు తన ఒడిలో లాలించిన తల్లి మృదంగ సంగీతం.కళ్ళల్లో కల గన్న చెలి చిత్ర కళ.సంగీత,సాహిత్యాల రహస్యాలను వొడిసిపట్టుకున్న శర్మ గారు చిత్రకళను ఆయువుపట్టుగా అభ్యసించటంచే ఆయన జీవితం ముక్కోణపు పువ్వులా వికసించింది. "తమోచిత్రాలు"రాసిన నారాయణ శర్మకు, "మౌనశంఖం" అధివాస్తవిక స్వరంతో మ్రోగించిన శ్రీరంగం నారయణబాబుకీ పేరులోనే కాదు యాధృచ్ఛిక సంబంధం జీవితంలో కూడా కొంచెం కాకతాళీయత కనిపిస్తుంది.ఇరువురు కవులు,సంగీతం తెలిసినవారు,చిత్రకళను అభ్యసించినవారు.పైగా ఇద్దరు అధివాస్తవికతను కవిత్వంలో నిక్షిప్తం చేసి రసావిష్కరణ చేసినవారు.అందుకే నారాయణ శర్మ గారి "తమో చిత్రాలు"అనే కవితా సంపుటిని ఈ వారం పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆధివాస్తవిక తాత్వికతను అవగాహన చేసుకోనే ధోరణి తెలుగు నేలలో వున్నా,ఎందుకో ఈ వాదం పాఠకుల ఆదరణకు నోచుకోలేదు.బాహ్యాంతరాల చేతనావస్థల్ని పునఃసంధానపరిచే విధానమే అధివాస్తవిక వాదం.బాహ్య ప్రపంచంలోని సంఘటనలు,సామాజిక విలువలతో వాటి పట్లలోక విధానంపట్ల వున్న అసలైనా అనుభూతులు,తీవ్రతలు కలగలిపి సరికొత్తరూపంలో సరికొత్త రూపంలో సరికొత్త క్రమంలో అందుకొనే ప్రయత్నమే అధివాస్తవికత వాదం.అధివాస్తవిక రచనా సాఫల్యానికీ నిదర్శనం ఈ "తమోచిత్రాలు" కవితా సంపుటి.అధివాస్తవికత ఏ ఆఛ్ఛాదనలు,ఏ సంకెళ్ళు లేని స్వేచ్ఛాయుత మానవున్ని చూడాలని కాంక్షించింది.మనిషి ఆలోచనలు,చర్యలు అతని జీవితం నుండి నిద్రాస్థితిలోనే జీవం పోసుకొంటున్నాయి.ఆ జీవం పోసుకుండే ప్రదేశానికీ వెళ్ళడానికీ మనిషి భయపడుతున్నాడు.మనిషిని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేసేది అధివాస్తవికత."తమోచిత్రాలు" అనే ఈ సంపుటి లో వుండేది జీవితమే. అద్భుతమైన క్రమం,అద్భుతమైన శైలి ఈ సంపుటిలో కనిపిస్తుంది.మనిషి అంతరాంతరాల్ని, చైతన్యపు లోతుల్ని ఆవిష్కరించే ఉత్కృష్ట వాహికగా ఈ అధివాస్తవిక తమోచిత్రాలు నిలుస్తాయి. శ్రీరంగనారాయణబాబు,తిలక్,బైరాగి,అజంతా,శేషేంద్ర,వేగుంట,ఇస్మాయిల్ మున్నగు గొప్ప కవులను అధ్యయనం చేసిన అనుభవం శర్మ గారి "తమోచిత్రాలు" సంపుటికి పునాదేమో? డా:సి.నా.రె గారు నారాణశర్మ గారి తమో చిత్రాలు" కవితా సంపుటికీ ఆశీస్సులు అందజేస్తు"శర్మ గారి కంటికి "తమస్సు" రాత్రి కనిపించే "చీకటి" కాదు ఆవేదనకు,ఆందోళనకు తీవ్రస్వరంతో నిన దించే అంతఃసంఘర్షణకు ప్రతీక" అన్నారు.అంతేకాదు ఇది వ్యక్తావ్యక్తం పునాదిగా సాగిన కావ్యం.ఈ కావ్యంలోని ఇమేజీరీ, సింబల్, వాస్తవికతలు అధివాస్తవికతలో కరగిపోయి దీనికీ ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. "అదృశ్యలోకంలో"-అనే కవితను "నోటినిండా నిశ్శబ్దాన్ని /కళ్ల నిండా చీకటిని కుక్కుకొని"-అని ఆరంభిస్తాడు.నోట్లో నుండి శబ్దం ఆవిర్భవిస్తుంది.కళ్ళు కాంతిని ఇష్టపడతాయి.కానీ కవి నోట్లో నిశ్శబ్దం ,కళ్లల్లో చీకటి అంటూ తిరగేసి చెప్పి వొక అనూహ్యతను సృష్టించి పాఠకునికి వూహకు వొదిలి పెడతాడు."పాత వాటిని మరమ్మత్తు" చేయడమంటే వున్న శబ్దాలను కొత్తగా రూపొందించటం.ఆ ప్రయత్నంలో నిశ్శబ్దం ముక్కలై వొక చీకటి రంగుల లోకం నిలిచిందని చెబుతూ తనలోని ఘర్షణని స్ఫురింప చేస్తాడు. అచేతన,చేతనావస్థలో కవి తన అంతరంగాంతరిక్షంలో చేతన పొందిన భావం ఆకృతి పొందె సందర్భంలో కళ్ళ నిండా చీకటి రంగులు పులిమిన కొత్తలోకం ఆవిష్కరించబడిందంటున్న కవి చేతనలో "ఇవన్నీ నా ఊహలే...యథార్ఠం కాదు"-అని అంటూనే అచేతనలో "అబద్ధం..కాదు" అని అంటాడు.ఇలా పఠితను సందిగ్ధతకు గురి చేసి ఆలోచనలోకి నెట్టివేస్తాడు. "కళ్లు మూసుకొనే చూస్తున్నాను నాలుక కదపకుండానే... మాట్లాడుతున్నాను నోరు మెదప కుండానే కంఠనాళాలు ధ్వనించకుండానే నా నుంచి పాత గుర్తుల్లో కొత్త శబ్దాలు" ఇలా కవి కవితలో కళ్లు మూసుకొని చూడటం,నాలుక కదపకుండా మాట్లాడటం ,కంఠ నాళలు కంపించకుండానే కొత్త శబ్దాలు పుట్టడం ఇవన్నీ పాఠకున్ని అధివాస్తవిక లోకంలోకి తీసుకెళ్ళడానికే కవి ప్రయోగించాడని అనుకోవచ్చును. సర్వ సాధారణంగా కోరికలను గుఱ్ఱాలతో పోలుస్తుంటారు.ఈ అంశాన్ని గ్రహణంలోకి తెచ్చుకొని కవి తన అంతరంగంలో అణగారిన కోరికలను రెక్కల గుఱ్ఱాల పిల్లలుగా రూపకం చేస్తూ,చివరకు అవి పెద్దవై తనను గిట్టల వెనకనించి లాక్కెళుతున్నాయని కొత్త పద ప్రయోగం చేస్తాడు.అసలు నిజాన్ని మరచినప్పుడు జాగృతం అయిన మనస్సు కోరికల్నీ వెనక్కి మళ్లించిందని సూచించడానికీ ఈ పద ప్రయోగం చేసివుండవచ్చును."తవ్వుతున్నంతసేపు తాకిడి మెత్తగానే ఉంది"అని అంటున్న కవి "పాత గుర్తుల్లో కొత్త శబ్దాల నిర్మాణం అదృశ్యపు లోకాల అరల్లో అదే సుప్త చేతనావస్థల్లో సాగిందనే నూతన అభివ్యక్తిని పాఠకులకు అందజేస్తాడు. కవి భావానికీ పాఠకుడు (శ్రోత)తన మనస్సులో రూపాన్ని ఇవ్వగలిగే శక్తిపైనే ఏ అధివాస్తవిక కవిత్వ విలువైనా ఆధారపడివుంటుంది.అధివాస్తవిక కవిత్వం పరమార్థం అర్థాన్నివ్వటం కాదు.రసావిష్కరణ అధివాస్తవిక కవిత్వ ముఖ్యలక్షణం.ఈ సంపుటిలో పఠిత(శ్రోత)కు రసావిష్క రణ కలిగించే కవిత "ఓ తమో చిత్రం వెనుక". ఈ కవితలో కవి సూర్యాస్తమయమై రాత్రి ప్రవేశించటాన్ని ఎంత గొప్పగా చెప్పాడో చూద్దాం "పడమటి కొండలవైపు వెలుగు ఒత్తిగిలి పడుకున్నప్పుడే నాకు తెలుసు నేను లొంగిపోతానని" సూర్యుని వెలుగు పడమటి కొండల వైపు వెళ్ళి సర్దుకొని ముడుచుకొని పడుకుందని అనటంలో కవి భావం పాఠకుడు(శ్రోత) హృదిలో ఎలాంటి రసాన్ని ఉత్పత్తి చేస్తుందో ఊహించవచ్చును. "తమో విరహిణి వెంట్రుకలు విరబోసుకొని ఆకాశం నిండా ఆరబోసుకున్నప్పుడు చుక్కల మల్లెల్ని తలలో తురుముకొన్నప్పుడు"- ఈ వాక్యాల్లో చీకటి అనే కాంత అభ్యంగన స్నానం చేసి విరహంతో తన ప్రియుడి కోసం ఎదురుచూస్తు,శిరోజాల్నీ విరబోసుకుందట.అంతే కాదు ఆకాశం నిండా ఆరబోసుకుందట.అంటే చీకటి అంతటా ఆవరించదని భావన.ఆ చీకటి చిన్నది తన ధమ్మిళ్ళంలో నక్షత్రాలనే మల్లె పువ్వుల్ని పెట్టుకుందట."తురుము కోవడం" అనే వొక సమర్థ పదాన్ని కవి వాడాడు. పాఠకుడు (శ్రోత) ఒకసారి పై వాక్యాల్లోని భావాన్ని ఊహించుకోగలిగితే కవి ప్రతిభను అసాధారణం అనుకోకుండా వుండలేడు.అప్పుడు రసావిష్కరణ కాకుండా వుండదు. ఇట్లా ఆ చీకటి చిత్రం వెనుక గల నేపథ్యాన్ని అలంకారాలతో చెబుతూ "పూలు తుమ్మెదకు మకరందాన్ని/గాలికి గంధాన్ని అందించి వ్యభిచరిస్తున్నప్పుడు "-అని అంటాడు.పూలు ప్రియురాలికి ,తుమ్మెదను,గాలిని ప్రియుడికి ప్రతీకలుగా చేసి ఒక సౌందర్య రస భావాన్ని పాఠకుడికీ అందించి చివరగా కవితను అధివాస్తవిక మార్గంలో మళ్ళిస్తాడు."నిశ్శలంగా దుప్పటి నీడలో... నేను మెలుకువను దులిపేసుకున్నప్పుడు ఓ దీప్తాంధునిగా"-అని అంటున్న వాక్యాల్లో "దుప్పటి నీడలో మెలుకువను దులిపేసుకున్నప్పుడు"అంటే చేతనలోంచి అచేతనలోకి పోయినప్పుడు అనే ఆలోచన పాఠకునికీ కలుగుతుంది.కేవలం శబ్దాన్ని అతి వ్యాప్తిగా చేయటం,భావాన్ని అవ్యాప్తి చేయడం,ఆలోచనను నిదుర పుచ్చడం,అబద్దాల అరల్లో ,అద్దాల నీడల్లో పొంగడం ఇవన్నీ అధివాస్తవిక ఆలోచన వీచికలేమో నని అనిపిస్తుంది. అధివాస్తవిక మొత్తం కవిత్వంలో నుంచి ఒక భాగాన్ని విడదీసి చూడటం ఆ కవిత్వ సాంప్రదాయం కాదు.అట్లే వ్యవహార భాషలో అధివాస్తవిక భాషను,అధివాస్తవిక భాషలో వ్యవహార భాషను కొలవటానికీ సమానమైన కొలబద్ద లేదు.కాబట్టే కవి పాత శబ్దాలను మరమ్మత్తు చేసి కొత్త వాటిగా మార్చి కవిత్వం సృష్టిస్తాడు.పైన పేర్కొన్న అంశానికీ నారాయణ శర్మ గారి "కొత్త శబ్దం" అనే కవితను నిదర్శనంగా చెప్పవచ్చును. "ఏ సడి చప్పుడు చేయకుండానే పెదవులు కదలకుండానే ధ్వనులు పుట్టకుండానే ఎన్నో శబ్దాలు పుడుతున్నాయి,పోతున్నాయి నా మనసొక అంతఃప్రసవ శ్మశాన వాటిక శబ్దాలకు చికిత్సజరుగుతోందిక్కడ వికత్థానాలకు,విచికిత్సలకు విరుగుళ్ళకై అంతరంగ పరిశోధన జరుగుతుందిక్కడ" ఈ కవితలో శబ్దం తన అంతరంగంలో జనిస్తుందని,అక్కడే శ్మశాన వాటికలో కలుస్తుందని, సడి చప్పుడు లేకుండా ఓ ధ్వని రూపం కోసం తాపత్రయపడుతూ,ఆక్రోశిస్తున్నాయని కవి అంటాడు.కవి ప్రయోగించిన వ్యవహారభాషను,అధివాస్తవిక భాషలో కొలిచే కొలబద్ద కనిపించదు.పెదాలు కదలకుండా,గొతు పెగలకుండా కలం నుండి ఓ శబ్దం పుట్టడానికీ కారణం అంతరంగంలోనే భావాలు నిండు గర్భం ధరిరించి ప్రసవ వేదన పడుతూ బయటపడుతాయని చెబుతూ తన అంతఃసంఘర్షణ లోంచే కవిత్వావిర్భావం జరిగిందనే నిజాన్ని పరోక్షంగా పేర్కోంటాడు. ప్రకృత్య ప్రకృతుల పుట్టుక నుండి పుట్టి పడే వర్షాన్ని "ఓ పుట్టుక లో"-అనే కవితలో ఎంతో ఊహిస్తే తప్ప సాధారణ ఆలోచనకు అందని విధంగా మార్మికంగా ఆధివాస్తవిక ధోరణిలో మన కళ్ళ ప్రాంగణంలో కురిపిస్తాడు."ఆకాశం వేడి చూపులు చూస్తుంది"-అని అనటంలో ఎండ తీవ్రంగా కాస్తున్నదని,"మట్టి బెడ్డకు ఆలోచన పెరిగిందేమో ప్రాణాలు పిండుకొని ఆవిరై ఆకాశం వైపు కదిలింది"-అని అనటంలో భూమి లోని నీరు ఆవిరై గగనంలోకి మేఘమై చేరుకొంటుందని అధివాస్తవికంగా చెబుతాడు."పృధివీ గగనాలలో ఏదో బంధం"-అంటూ భూమిని ఆకాశాన్నీ కలిపేదీ వర్షమేనని సూచించి "ఆకాశంలో కదలికలు "మెరిశాయి""/అనుబంధపు భావనలు "ఉరిమాయి""-అని కొత్తగా వర్ష వాతావరణ సూచికలైన ఉరుములు,మెరుపులను వాటి ఆర్భాటాల ధ్వని ఏమాత్రం లేకుండా మనకు వినిపిస్తాడు కనిపింప చేస్తాడు. "సమకాలీన చైతన్యం మలుపులు తిరుగుతు,మెలికలు తిరుగుతూ దిన దిన ప్రవర్ధమాన క్లిష్టతను సంతరించుకుంటోంది.పదాలకతీతమైన పారవశ్యాన్ని ప్రతిపదార్థ శృంఖాలాలతో బంధించడానికీ ప్రయత్నిస్తే అది వ్యర్థ ప్రయత్నం మాత్రమే అవుతుంది."-అంటారు రోణంకి అప్పలస్వామి గారు వేగుంట వారి "చితి-చింత" అనే కావ్యానికి రాసిన ముందు మాటలో.ఈ "తమో చిత్రాలు"-కవితా సంపుటిలో గల కవితలు తీవ్రమైన పారవశ్యతను కల్గిస్తాయి.ఈ కవితలను ప్రతి పదార్ఠ సంకెళ్ళతో బంధించలేము.ఈ కవితల్లో వాటి వెనుక తూచి బేరీజు వేసినట్టు ఆలోచనల ముద్ద వుండదు.చేతన లోని ఆలోచనకు సంబంధం లేని అప్రయత్నలక్షణం గల వ్యక్తీకరణ ఈ కవి కవిత్వంలో కనిపిస్తుంది.కవి నిరంతర స్వతంత్రుడు. కాని ఈ కవి తాను "అస్వతంత్రుణ్ణి" అంటున్నాడు.అస్వతంత్రుడు కావడానికీ కారణం తన లోగిలిలోకి వచ్చి తనను కౌగలించిన ఆమె కులాల పాతరల్లో పగిలిపోయినప్పుడు,ప్రపంచమంతా భీతావహం అయినప్పుడు..దేనికీ స్వతంత్రించలేని తను "అస్వతంత్రుణ్ణి" అనుకుంటున్నాడు. ఆమె పరిష్వంగంలో ఒళ్ళు మరచిపోయిన అంశం ఆంతరంగికమైనది."ఎందరి చేతుల్లోనో నలిగి "పోయిన కారణంగా ,లోకవిధాన కారణంగా కూడా దేనికీ స్వతంత్రించలేని అస్వతంత్రుణ్ణి అని అంటున్నాడేమో అన్న భావన కవి కలుగజేస్తాడు.ముందే చెప్పినట్టు ఈ కవిత వెనుక బేరీజు వేయగల ఆలోచనల ముద్ద లేదు అధివాస్తవికత కవిత కాబట్టి.నీ"జన్మకు కారణమైన వాళ్లు రక్తతర్పణం చేస్తూ..నిన్ను నాకప్ప గించారు"-అని అంటున్న కవి ఆమె కళ్లు"రుధిరాంజనాన్ని దిద్దుకున్నాయి"అని చెబుతు ఆమె కళ్లలోని కోపాన్ని రక్తపు కాటుకతో సంభావించి వైచిత్రిని సాధించాడు. "ఈ ఆకాశం సాక్షిగా "-అనే కవితలో రుధిరం తూర్పు ఉదయంలో కనిపించాడాన్ని,తూర్పు వైపు తమస్సు వెళ్ళాడాన్ని "ఈ పిచ్చి వాళ్ళు అరుణోదయం"అంటున్నారని వ్యాఖ్యానిస్తాడు.ఆకాశం సాక్షిగా తమస్సు అనే విరహిణి రక్తంతో తలంటుపోసుకుందని చెప్పటం అధివాస్తవిక కవిత్వ ధోరణే.రాత్రుళ్ళు అడవుల్లో జరిగే కాల్పుల హత్యల్నీ గుర్తుకు తేవాడానికేమో ఈ కవి "మాంసపు ముద్దలేరటం నాకు గుర్తు/రక్తం ఆనవాళ్లు భూమిలో ఇంకిపోవటం నేను చూశాను"-అని అంటూ ఇలా రక్తంతో నిండిన తమస్సు తూర్పు వైపు వెళ్లటం "అరుణోదయం"-అని భావించే వాళ్ళ పట్ల తనకు గల ఆలోచనను చూచాయగా చెబుతాడు. "పాటను మరచి పో"-అనే కవితలో ఈ మనుషులను నమ్మి పాడకు అని కోకిలను హెచ్చరిస్తాడు. కోయిల దేహపు రంగును ఇష్టపడని మనిషి అంతరంగ ప్రవృత్తిని "నీ బొమ్మని దాచుకోడేం? /నీ మాటని పాటనే వాడు/నీకూతని గీతమనేవాడు /నీ నలుపుని అందమనడేం?"నలుపుని ప్రతీకగా తీసుకొన్న దళిత వాదాన్ని స్పృశింప చేశాడు.ఈ కవికి చీకటి అంటే చాల అపేక్షలా వుంది.'చీకటి ఆశని చావనివ్వదు'అన్న నమ్మకంతో "రేపటి వెలుగు చీకటి జీవితంలో ఎన్ని చిధ్రాలు చేసిందోనని, ఆ చిధ్రాలనుంచి ఎంతో వెన్నెల కారిపోయిందోనని,ఎన్ని చుక్కలు జారిపోయాయోనని తన బాధని అధివాస్తవికంగా చెబుతాడు "చీకటి" అనే కవితలో.ఈ సంపుటిలో చివరిలో వున్న ఎంతో మార్మికంగా కవి ప్రతిభకు అద్దంలా వున్న కవిత "గాలి బొమ్మలు".చెత్త కుప్పలే పొత్తిల్లై సమాజంచే అక్రమ సంతానంగా పిలువబడే ఆ శిశువులను గాలి బొమ్మలుగా చిత్రిస్తూ రాసిన మంచి కవిత ఇది.మట్టి గుండెల్లో మానవత్వాన్ని వెదుక్కొంటూ ఎవరికీ తెలియని జాడలోకి ఏడడుగుల లోతులోకి అమ్మలు విడిచిన గాలి బొమ్మలు అంటూ దుఃఖపు తడితో చెబుతాడు.గాలి బొమ్మల గొంతులేడిస్తే పిల్లగాలి ఈలకూత లాలిపాటలా,ఆ గాలిబొమ్మలు నవ్వటానికీ గాలి కొమ్మలను వూపుతుందని ప్రకృతి కూడ వారి పట్ల తల్లి ప్రేమని కనబరుస్తుందని మనసు కరిగేలా చిత్రిస్తాడు. ఉగాదిని అందరి కవుల్లా కాకుండా "ఈ వసంతమేమిటి?"-అని వినూత్నంగా ప్రశ్నిస్తూ "ఇది వసంతమా?" అనే కవిత బహుధాన్య ను గురించి రాశాడు."ఎవడో పంచ భూతాలు ప్రపంచమన్నాడు/ఆరో భూతం/దరిద్రాన్ని మరిచాడు/ప్రతి సంవత్సరం /దిష్టి బొమ్మలా రుతువుల రంగులు పూసుకొని"-అంటూ వొక కొత్తదనాన్ని ఈకవితకు అలది,ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా "అన్నపూర్ణ ప్రపంచబ్యాంక్ /ప్రహరీ గోడ దగ్గర అడుక్కుంటోంది"-అంటూ తెలుగునేల దుస్థితిని వ్యంగ్యంగా పేర్కోంటాడు. నారాయణ శర్మ గారిది ఒక ప్రత్యేక అభివ్యక్తీకరణ.దీనిలో వొక విశిష్టత వుంది.అది కవి వ్యక్తిత్వం తప్ప వేరు కాదు.అది కవిది తప్ప మరెవ్వరిదీ కాదు.కవిత్వ లోకంలో ఆయనదొక వింత గొంతు.అది మరెవ్వరికీ అనుకరణ కాదు.చీకటిలో కూడా అతనిదే అని పోల్చదగినది అతని కవిత్వం అని చెబుతున్నాను. "ఎవరూ నీవు? కవిని అయితే ఓ మంచి కవిత్వం చెప్పవయ్యా! ఇప్పుడు కవిత్వాన్ని గురించి నేను పట్టించుకోవడం లేదు ఎందుకు? భావుకత్వంతో,గుణదోషాలు చూపించే విమర్శకుడు లేక" ఈ మాటలు నావి కావు.ఇవి పదవ శతాబ్దంలో రాజశేఖరుడు అన్నవి.కవిత్వాన్ని,ముఖ్యంగా అధివాస్తవిక కవిత్వాన్ని గురించి చెప్పే మంచి విమర్శకుడు లేక ఈ కవిత్వ దోరణి ప్రజాదరణకు నోచుకోలేదేమో నని భావిస్తున్నాను.ఈ సంపుటి లోని గొప్పదనం కవిదే.పరిచయంలో లోపం నాదేనని చెబుతున్నాను. మంచి కవితా సంపుటితో మరో వారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NpOKee

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

అమృతాన్నిపంచుతా_ప్రేమసాగరాన్నిమధించి ..@శర్మ \4.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eZcR9Q

Posted by Katta

Panasakarla Prakash కవిత

చినుకుల దృశ్య‍‍౦ ని౦గిత౦డ్రి మబ్బుతల్లి విదిల్చికొట్టిన పిల్లచినుకులు కొ౦డమీదిను౦చి నేల గు౦డెమీదకు దూసుకొచ్చి ఇక్కడ తమ రెక్కలు విప్పుకు౦టున్నాయ్.. ఎక్కడ చూసినా వాటి తైతక్కలే... లేలేత బాల్యాన్ని ఆస్వాదిస్తూ.. అలాగని తల్లిద౦డ్రుల్ని మరిచాయా అ౦టే?..లేదు! గు౦తల్లో ఒద్దికగా కూర్చొని..గు౦డెల్లో దాచుకున్న‌ తల్లిద౦డ్రుల శిఖరాగ్ర రూపన్ని దారినపోయేవార౦దరికీ అద్ద౦లా౦టి తమ మోములో చూపిస్తున్నాయ్ అప్పుడే బాల్యమై కురిసి...వడివడిగా యవ్వనమై మెరిసి వెను వె౦టనే వృద్ధిపొ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦దిన ప్రవాహమై........ ఏ నదిలోకో...నాళాలోకో..చెరువులోకో.....కాలువలోకో.. వృద్దప్యమై కొట్టుకుపోతున్నాయ్ చినుకులు.. తడిచినవాడు తుడుచుకు౦టున్నాడు మొలిచినవాడు మెచ్చుకు౦టున్నాడు ముడుచుకున్నవాడు విచ్చుకు౦టున్నాడు మనిషికానివాడే తిట్టుకు౦టున్నాడు.......... అనామక౦గా వచ్చినా నేల...దాహ౦తీర్చి ని౦గి పేరును నిలబెట్టిన చినుకులలా౦టి పిల్లలు మాకుకూడా ఉ౦టే బాగుణ్ణు అనిపిస్తు౦ది ఇ౦త ప్రేమగా కురుస్తున్న చినుకుల్ని పట్టి౦చుకునేవారు కొ౦దరైతే..... తప్పి౦చుకునేవారు కొ౦దరు... ఐతే........ ఎ౦డిన తాటాకు గుడిసెలపైన‌ డప్పుకాళ్ళతో నృత్య౦ చేసిన వాన చినుకులు మేడమీదపడి గాయపడడ౦........... నేనెప్పటికీ...మరిచిపోలేని దృశ్య౦.. పనసకర్ల‌ 4/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYfXDO

Posted by Katta

Ravi Chandra Maheswaram కవిత

రవి చంద్ర మహేశ్వరం || మరువకు నీ లక్ష్యం || ఓ ప్రియమైన మిత్రమా, నిన్నని గూర్చి నీరసించిపోకు, రేపటి గెలుపే లక్ష్యమంట నీకు.

by Ravi Chandra Maheswaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pXVYVW

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! మా ' స్వప్న ' o -మా ' ప్రణ ' తి !! 28-9-2013/02-02-2014/04-03-2014 ************************ మెరిపించే మేని చాయనీ ముదుతల్లేని ముఖారవిందాన్నిచ్చే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మ్రుగాళ్ళ ఆకలి చూపులతో మకిల పట్టిన శరీరాల్నీ కాంక్షల కళ్ళతో మలినపడ్డ దేహాల్నీ పరిశుభ్రం చేసే సరిక్రొత్త సబ్బులు కావాలిప్పుడు అమ్మలనూ అమ్మాయిల్లా చూపుతూ అబ్బురపరిచే టెలీవిజన్ ప్రకటనల్లోలా ' స్టార్ ' లయ్యే అవకాశాలను తెచ్హే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది కాలేజీ ప్రాంగణాల్లో ప్రేమించమని వేధిస్తూ వెంటబడే కామ పిశాచాలు కుమ్మరించే యాసిడ్ ద్రావకం కడవలకొద్దీ మీదబడ్డా కమిలిపోక తట్టుకునేలా మా చర్మాన్ని మరింత దళసరి చేసే క్రొంగొత్త సబ్బులు కావాలిప్పుదు పట్టులాంటి మ్రుదుత్వం ముత్తుకుంటేనే కందిపోవడం లాంతి కాసులు రాల్చుకునే కాస్మో ' ట్రిక్స్ ' పడికట్టు పదాల ఊరింపు మాటలతో దేహంపై వ్యామోహం పెంచే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మోహంతో..పైశాచికానుభవ దాహంతో నవ మానవ వన మ్రుగాలు విసిరే విచ్హు కత్తుల్లంటి చూపుల పిడిబాకులకు చిద్రమవుతూ కని పెంచిన వాళ్ళకి కాటి దుఖాన్ని మిగిల్చే కూతుళ్ళుగా కాక యుద్ధ రంగంలో ఘర్జించే రుద్రమల్లా మా దేహాల్ని సన్నద్దం చేసే న్యూ ప్రోడక్షన్ కోసం ఇప్పుడు మేం ' స్వప్నించే ' ది-ఎప్పుడూ ' ప్రణతి ' oచేది (వరంగల్లు స్వప్న,ప్రణతిలు గుర్తుకు వచ్చి ) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167* Like · · Promote · Share Srinivasu Gaddapati, Rama Krish

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eYDJqp

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ పెద్ద తేడా @ ఎలి నాటి శని పోతుందా.. సాడే సాత్ షురువు అయితుందా.. ఏమో.గాని . ఆఫీసర్ల పాలన పోయి నాయకుల పాలనా రాబోతుంది. రాయితో తల పగల కొట్టుకోడానికి తలను రాయికేసి కొట్టుకోడానికి ఇంత కన్నా పెద్ద తేడా లేదేమో ? _ కొత్త అనిల్ కుమార్' @ ఓట్ల బిచ్చం @ నిన్ననే తెల్ల చెడ్డి తొడుక్కున్న తమ్ముడికి ఇయ్యల్లనే రాజకీయ పార్టి చౌరస్తాలో పెద్ద పోస్ట్ అనే బిచ్చం పడింది.. కొత్త బిచ్చ గాడు పొద్దెరుగడు గదా. పార్టి జెండా వట్టుకుని ఒకటే తిరుగుడు ఓట్ల బిచ్చం కోసం _ కొత్త అనిల్ కుమార్' 3/3/2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1counJZ

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

సూర్య‌స్ప‌ర్శ‌ భూమిలో ఎక్క‌డో దాక్కున్నాయి వేళ్లు ఆకాశంలో ఎక్క‌డికో పోయాయి కొమ్మ‌లు మంచు ప‌ర్వ‌తాలు మ‌హాశ్వేత ఫ‌లాలు సూర్య‌స్ప‌ర్శ‌తొ ఫ‌లాలు క‌రిగి అమృత ర‌సగంగ నేలంతా ప్ర‌వ‌హిస్తాయి హిమ‌గిరుల‌పై బంగారు సూర్య సుగంధాలు గుండె నిండా నింపుతాయి గోరు వెచ్వెచ‌ని నిశ్శ‌బ్దాన్ని ఈ మ‌హాస్వ‌ప్నం నిశ్శ‌బ్దం లో నిద్ర‌పోతూ సంచ‌రిస్తోంది దేనిలో నిండిపోయి దేనిలో సంచ‌రిస్తోందో వేరే దేనిలో ఇంకెవ‌రిలో నిండిపోతుంది త‌న‌లో కాకుండా వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOKqjW

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా || ------------------------------------------------------------------- చెలి చెమ్మ గిల్లిన కళ్ళతో చేదు అనుభవాలతో చావుకు చేరువలో ఉన్న చరిత్ర లేని శవాంగా మిగిలాను నేను నీ కోసం నిరీక్షిస్తూ నీవు నాదానివి కావాలని ఆకాంక్షిస్తూ చెదిరిన కలల్ని నెమరువేస్తూ శూన్యం లోకి వంటరినై చూస్తూ నీకోసం కలల పొలంలో భ్రమలనే విత్తనాలను నాటాను నేను కన్నీటి కలువ ప్రక్కన శూన్య ఫలసాయం వస్తుందని తెల్సీ ఇంకా ఆశతో ఎదురు చూసే వ్యర్థ జీవి నేను ఇలా గడిచే కలల కాలంలో కరిగి పోతున్నా నని తెల్సి కాలం నన్ను వెక్కిరిస్తున్నా విదిలేని పరిస్తితుల్లో వెక్కిరిస్తున్న గతం సాక్షిగా ఓడిపోయి వాడిపొయిన మనసు నాదే కన్నా చివరకు నే చూస్తున్న శూన్యం లో కలిసిన బాధలన్ని నాలోనే దాచుకొని నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా అదే నాజీవితపు చివరి మజిలీ అని తెలిసిన క్షనాల్లో

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i7uUCz

Posted by Katta