పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

అఫ్సర్ కవిత- ఓ పొద్దుటి రైలు _____________________________________ సాధారణంగా చూస్తేసాహిత్యంలో మూడు అంశాలని గమనించవచ్చు.అవి భౌతికము,మానసికము,ఆత్మికమూ..పరిణతి చెందిన కవిలో ఈ మూడులక్షణాలూ ఉమ్మడిగా కనిపిస్తాయి.భౌతికతాత్వికాంశలని వ్యక్తపరిచే సంధాయక శక్తిలా ఆత్మకాంతి(Light of soul)పనిచేస్తుంది.అరవిందులు కవి ఆత్మనుండి సరాసరి వ్యక్తమయ్యేదే అసలైన కవిత్వం అన్నారు."The true creator of poetry,the true hearer of the soul" కవిత్వాన్ని నిజంగా సృష్టించేదీ,వినేదీ,ఆస్వాదించేదీ ఆత్మయే-అనేది ఆయన అభిమతం.ఎడ్వర్డ్ బుల్లో చెప్పిన భౌతికాంతరత(Physical Distence)సూఫీ తత్వ వేత్తల దర్శనం,ఛాసర్ తన కవితలోప్రదర్శించిన "సూక్ష్మ భౌతిక స్పృహ" మొదలైనవి దీనికి దగ్గరవే. ఆత్మనే వ్యక్తీకరించి,వ్యక్తీకరింపబడుతున్నప్పుడు దానికొక సిద్ధవాతావరణం,స్వభావం ఉంటుంది.యూంగ్ మనస్తత్వ విశ్లేషణలో ప్రాక్తన ప్రతిమల(Premordial imeges) గురించి చెప్పాడు.మన ఆలోచనలను తెలియకుందడా ప్రభావితం చేసే అంశాలే ప్రాక్తన భావనలు.అథర్వణ వేదం వీటిని "అమృత గర్భ వాసనలు"అంది.ఒక అవ్వను చూసినప్పుడు ఇంట్లో అమ్మ గుర్తుకురావడం,చెట్టును చూసినప్పుడు ఇంట్లో/ఊర్లో చెట్టు గుర్తుకు రావడం ఇలాంటిదే. అఫ్సర్ కవిత "ఓ పొద్దుటి రైలు "లో ఈ స్పృహ కనిపిస్తుంది.ఈ కవితకు మరోదేశంలో ఉన్న రైలు ప్రయాణం ప్రేరణ.కాని ఇది అన్నిప్రయాణాలను,ఊళ్లనూ సారూప్యంగా వ్యక్తం చేస్తుంది.దీనికి కారణం నాలుగు వాక్యాల్లో ఎక్కదా నిర్దిష్ట స్థల ,కాలాలు లేక పోవటం. 1 వూరు మసక చీకటిలోకి సగం కన్ను తెరచి మూత పెట్టుకుంది ఇంకోసారి. దూరంగా రైలు కూత నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది. 2 పట్టాల పక్కన వూరు ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే. దాని ప్రతి మాటా రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది. 3 వూరు వెనక్కో ముందుకో ముందుకో వెనక్కో వొక పరుగులాంటి నడకతో- ఎవరంటారులే , వూరిది నత్త నడక అని! అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు. 4 అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది కూతవేటు దూరంలో. వాక్యాల వారీగా విభజించుకుంటే ఈకవిత మొదటిభాగం వాతావరణాన్ని పరిచయం చేస్తుంది."వూరు మసక చీకటిలోకి /సగం కన్ను తెరచి /మూత పెట్టుకుంది"అనటంలో ఊరు గమనించటంలేదని అర్థం.రైలుకూత నిశ్శబ్దంగా గిరికీలు కొట్టడంలో గాలిలో వినిపించే కంపన స్థితిని అనుభవాత్మకంగాచెప్పటం ఉంది. రెండవభాగంలో బౌద్ధిక ప్రయాణం కనిపిస్తుంది.రైలు కూతనుంచి ఊరిమాటవినటం అలాంటిదే.మూడు నాల్గులు జీవితాన్ని అర్థంచేసుకునేవి.భౌతికంగా భావించే అంశాలన్నిటినీ ఆత్మకాంతితో కవితామయం చేసాయి.నాలుగులోని "అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని "అనటంలోనూ ఈ స్పృహ దాగుంది. కవిత్వంలోనీ ఒక గొప్ప స్పృహనిండిన పరిపూర్ణ కవిత ఇది.ఇన్ని తాత్విక సాహితీ విలువలతో,సూక్ష్మీకరించి కేవలం నాలుగు వాక్యాలలో రాయటం సులభమైన సాధన వల్ల సాధ్యపడదు.చాల సార్లు విదేశాలలో ఉండి అఫ్సర్"ఊరి చివర"లాంటి కవితలని ఎలా రాస్తారా అని సందేహం ఉండేది.అఫ్సర్ గారి ఆత్మిక జీవిత వాతావరణాన్ని ఈ కవిత పట్టిస్తుంది

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p52Ak0

Posted by Katta

Kks Kiran కవిత

ఆకాశంలో అందంగా అరుదెంచిన పంచమి నాటి చంద్రుడిని చూసి నాకీ వర్ణన గుర్తుకొచ్చింది కాళిదాసు రాసిన " కుమార సంభవం " లోది. శివుడు పార్వతీ దేవితో ఇలా అంటాడు ఓ అందమైన రాత్రి ! ! ! " రాత్రి చీకటిని పారద్రోలడానికై తూర్పు దిశన చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొగలిపూలు విచ్చినట్లు ప్రాగ్దిశన తొలిరేకులు విచ్చుకుంటున్నాయి. నక్షత్రయుక్తమైన ఈ రాత్రి, ఇంతవరకూ మందరపర్వతంలో దాగిఉండి ఇప్పుడే ఉదయించిన చంద్రునితో కలిసి, నీవు నీ సఖులతో కూడి నాతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తున్నది ! చంద్రుడు వెన్నెల నవ్వు నవ్వుతున్నాడు చూశావ? ఈ లేత వెన్నెల వెలుగులు కొనగోళ్ళతో త్రుంచి నీకు కర్ణాభరణాలు చేయవచ్చు సుమా ! వ్రేళ్ళతో కురులను సవరిస్తున్నట్లు చంద్రుడు తన " కిరణాలతో " చీకటిని తొలగత్రోసి, ముకుళిత పద్మలోచన అగు రాత్రి ముఖాన్ని ముద్దాడుతున్నాడు !! పార్వతీ ! ఆకాశంవంక ఒకమాటు చూడు ! చంద్రుని లేత వెన్నెలలో చీకటి తెరలు తొలగిపోగా ఆకాశం, ఏనుగులు కలచివేసిన పిమ్మట నిశ్చలంగా ఉన్న మానససరోవరంలా కనిపిస్తున్నది ! ఉన్నత ప్రదేశాలలో వెన్నెల వెలుగులు అలముకున్నాయి. పల్లపు ప్రాంతాలలో చీకట్లు పరుచుకున్నాయి, అవునుమరి, గుణదోషాలను బట్టి సృష్టికర్త ఉచ్చనీచలు కల్పిస్తూ ఉంటాడు !!! చెట్టు కొమ్మల సందులగుండా,ఆకుల మధ్యగుండా పువ్వులవలే నేల వ్రాలుతున్న చంద్ర"కిరణ" కోమలరేకలను, వ్రేళ్ళతో పట్టి నీ మ్రుంగురులకు కట్టివేయవచ్చు సుమా !!!! " అని అంటూ ఇంకా చక్కటి వర్ణనలతో వర్నిస్తాడు రాత్రి తాలూకు అందాన్ని,ప్రస్తుతానికి ఇంత వరకూ వర్ణన చాలు,మిగతాది ఇంకెప్పుడైనా వివరంగా పోష్ట్ చేస్తాను, కాలిదాసు ఎంత బాగా రాసాడో కదా? అతను వర్ణిస్తుంటే ఆ రాత్రి మన కళ్ళముందే కనపడుతున్నట్లు,దానిని ఆస్వాదిస్తునట్లు ఉంది కదూ? అదీ కాళిదాసు గొప్పదనం,తప్పకుండా చదవండి అతని రచనలు సాహిత్యంపై ఇష్టం ఉంటే, శుభరాత్రి. - మీ Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oSLFUt

Posted by Katta

Srinivas Vasudev కవిత

కొత్త గొంతుకలో…..//వాసుదేవ్// --------------------------------- రాత్రిలాంటి నల్లచీరకట్టుకున్న నింగీ, ఒళ్ళారబెట్టుకుంటున్న నేలా రెండూ సాపేక్షసిధ్ధాంతాలకతీతమే ఐన్‌‌స్టీన్ మళ్ళీ వెనక్కెళ్లాల్సిందే...మనిషి మనుగడలోకి! మరికొత్త గొంతుకలేం పాడుతాయి జీవితమూ, బాధా నాణెనికి చెరోవైపూ ప్రతీ శతకం ఎవడో ఒకడు చెప్పినదో, చేసినదో మాటే వేరు-- గుండెలోంచి పొంగుకొచ్చే మాట గుండెని కోసుకొచ్చే మాట…… *** ఓవాక్యాన్ని చెక్కుతున్నప్పుడల్లా కొన్ని పదాలపై రక్తపు మరకలని చూడకుండా ముందుకెళ్లలేం గుమ్మానిక్కట్టిన చామంతులన్నీ ఒకే పాటందుకున్నాయి.... మా కంట్లోంచి జారిన కన్నీళ్ళని పట్టే కెమేరా ఉందా అని! మళ్ళీ ముందుకెళ్ళాలి --కన్నీళ్ళకి భాషని వెతుకుతూ *** రెండు పూలమధ్యైనా రెండు తొడల మధ్యైనా అదే వాసన కోర్కె వాసన....స్వార్ధపూరిత కోర్కె వాసన జీసస్‌ని శిలువేసిన ఆ జెస్టింగ్ పైలేట్ కీ అదే సమస్యనుకుంటా నిజాన్ని చెప్పనివ్వకుండానే వెనుతిరిగాడు *** ఐన్‌‌స్టీన్నీ, జీసస్నీనీ వెనకేసుకొద్దాం మరి మరో కొత్త గొంతుకలో... *** వికసించిన చీకట్లలో వెలుగుని ముద్దాడాను వికటించినవాటిల్లో ఫీనిక్స్ అస్థికలకోసం వెతికాను రెండూ దొరికాయి..... మరో కొత్త గొంతు మొహమ్మీదకొచ్చింది అదే గళం, అదే స్వరం కానీ మాటమార్చాల్సొచ్చింది గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం! ఓ కొత్తగొంతుకలో....

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kmN6IB

Posted by Katta

Kavi Yakoob కవిత

జయహో కవిత్వం ! ..................................... కవిసంగమం - ఫేస్బుక్ లో ఒక గ్రూప్ : వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. http://ift.tt/1jynLpu త్రిపురనేని శ్రీనివాస్ ॥ కవిత్వం కావాలి కవిత్వం ! .......................................................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ............. కవిత్వం వేరు వచనం వేరు సాదాసీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్- కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం .......... - కవిత్వసృజన,కవిత్వపఠనం,కవిత్వ సంబంధిత అంశాలు -ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా 'కవిసంగమం'సీరీస్ సభలు 'పోయెట్రీ వర్క్ షాపు'ల్లా జరుపుకుంటున్నాం.వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను వాల్ మీద పోస్ట్ చేసుకుంటున్నాం. ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గంలో సాగుతున్నాం. Important Note : ~Join in కవిసంగమం with ORIGINAL profile Photo. ~Don't send Join requests if your profile picture is not with original face. ............................................................................ ఈ గ్రూపు లో ~ 1. కవితలకు ఫోటోలు పెట్టవద్దు.[సీనరీలు గట్రా] 2. ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యాలి. 3. ఇతర పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన మీ కవితల,కవితావ్యాసాల 'లింక్స్'ను సరాసరి ఇక్కడ పోస్ట్ చెయ్యవద్దు. ఆ రచనను టైపు చేసి కానీ ,కాపీ,పేస్ట్ చెయ్యడం ద్వారాగానీ పోస్ట్ చేస్తూ క్రింద బ్రాకెట్ లో సదరు పత్రిక యొక్క పేరును రాయండి.[అలా లేని పక్షంలో అటువంటి పోస్టింగును పోస్ట్తె చేసినవారికి తెలుపకుండానే తొలగించడం జరుగుతుంది] 4. కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి. 5. కవితాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేవారిని, 'కవిసంగమం' గ్రూపు సమగ్రతకు భంగం కల్గించేవారిని వారికి తెలపకుండానే తొలగించడం జరుగుతుంది.ఈ విషయంలో 'అడ్మిన్'లు ఎవరికీ జవాబుదారీగా ఉండనవసరం లేదు. 6. కవిత కింద కేవలం లైక్ కొట్టిన వారికీ,కామెంటు రాసినవారికి -ఒక్కొక్కరికి ఒక 'థ్యాంక్స్' చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా,అవసరమైన చోట్ల ఆ కామెంటుకు వివరణ కానీ,ఇంకాస్త కవితకు సంబందించిన విషయం కానీ చెప్పదలుచుకున్నప్పుడు రాయడం బాగుంటుంది. 7.కవితలలోని అంశాలకు, కామెంట్ల లోని విషయాలకు పోస్ట్ చేసినవారే బాధ్యులు. వాటితో 'అడ్మిన్'లు గానీ,'కవిసంగమం' గ్రూపుకానీ ఏకీభవించారని అనుకోవసరం లేదు. ..... Note 1 ~ ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యండి. ఒకటికన్నా ఎక్కువ కవితలు పోస్ట్ చేసినచో ఆ పోస్ట్ తొలగించడం జరుగుతుంది. NOTE : 2 ~ కవిత పోస్ట్ చేసేటప్పుడు-కవితా శీర్శిక తప్పక పెట్టండి. [*ఉదా: కవి పేరు | కవితా శీర్షిక ] అలాగే కవిత క్రింద తేదీ తప్పక వెయ్యండి.[*ఉదా: 30.8.2012 ] మిత్రులారా! సహకవులు రాసిన కవితలపై మీ స్పందనలు రాయండి.ప్రోత్సహించండి. మంచి 'కవితా'వరణం సృష్టించండి !! Note:3~EVERY SATURDAY - SPECIALLY FOR POSTING ENGLISH POETRY . ....... *సాధ్యమైనంతవరకూ సభ్యులు తెలుగులిపిలో చర్చలు సాగించవలసిందిగా మనవి. తెలుగులిపిలో టైపు ఎలా చెయ్యాలో తెలీని వాళ్ళు http://lekhini.org/ or http://epalaka.com/ తో మొదలుపెట్టవచ్చు. : *నిర్వాహకులు*

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jynLpu

Posted by Katta

Saipramod Jayanth కవిత

ఒక అమ్మాయికోసం ప్రాణాలు తీసుకోవటం లో ఉన్న తపన దేశాన్ని కాపాడటానికి ప్రాణం ఇవ్వగలిగితే అప్పుడే నువ్వు అమరుడివి అవ్వగలవ్ జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1x1E9sq

Posted by Katta

Saipramod Jayanth కవిత

ప్రేమకు నిర్వచణమ్ ప్రేమించడం ఎలాగో అన్వేషించడమే జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oSzvLd

Posted by Katta

Saipramod Jayanth కవిత

అశ్లీలత బొమ్మల పై కాదు మనసుల పై పడకుండా చూసుకోండి..! చూసే కళ్ళు ఆలోచించవు, ఆలోచించే మనసు చూడలేదు.. ! జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kG4qTd

Posted by Katta

John Hyde Kanumuri కవిత

హమ్మయ్య గడచింది రాత్రి |జాన్ హైడ్ కనుమూరి | *** సాయంకాలం అవ్వగానే వస్తూ పోతున్న విద్యుత్తు మేఘావృతమైన ఆకాశం వుక్కపోతకు చెమటపట్టిన దేహం హఠాత్తుగా ఉరుములు మెరుపులు కిటికీలను విరగ్గొట్టే హోరు గాలి కొద్దిగా చినుకులు గాలితో పాటు వస్తుంటే తలుపులు మూయాలనే పిలుపులు ఎక్కడో ట్రాన్స్‌ఫార్మర్ పేలిన చప్పుడు ఇక విద్ద్యుత్తు రాదని నిర్ణయించుకొని ఇటుదొర్లి అటుదొర్లితే కంటికి నిద్రేమీ సరిపోక మండుతుంటే ఇదిగో ఇప్పుడే పలకరించడానికి వచ్చింది విద్యుత్తు. రాత్రి మాటేమోగాని ఆఫీసులో చెయ్యాల్సిన పనులు చాలానే వున్నాయి. 3.6.2014.....08:22 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o4LRhd

Posted by Katta

Panasakarla Prakash కవిత

"రైతు కొడుకు" తినేటప్పుడు క౦చ౦ బైట మెతుకు పడితే మౌన౦గా తీసుకుని తన క౦చ౦లో వేసుకునేవాడు నాన్న ఇ౦టికి అతిధులు ఎ౦తమ౦ది వచ్చినా అన్న౦తిని వెళ్ళాల్సి౦దే తినే సమయానికి అడుక్కునే వాడొచ్చి అమ్మా అని పిలిస్తే.. ము౦దెళ్ళి ఒక ముద్దేసి వచ్చేవాడు దేవుడికి క౦చ౦బైట ఓ ముద్దకలిపి తిన్నాకా అది కాకులకిసిరేసేవాడు అరుగు మీద ధాన్య౦బస్తాలే.. నాన్న కున్న అసలైన ఆస్తి ఆ తరువాతే మేమ౦తా.... అమ్మ మీద ఎప్పుడన్నా కోపమొస్తే చెప్పకు౦డా పొల౦యెళ్ళిపోయి... నోరులేని జీవాలమీద ప్రేమకొద్దీ... సాయ౦త్రానికల్లా తిరిగి వచ్చేసేవాడు. నీరుపట్టిన చద్దన్నాన్ని నీటిలో పి౦డి మజ్జిగేసుకుని తి౦టన్న నాన్నని చూసినప్పుడు లోక౦ కడుపు ఎ౦దువల్ల ని౦డుతు౦దో అర్ధమయ్యేది ఎక్కడో ఉద్యోగ౦ చేసుకు౦టున్న నాకు వర్ష౦ పడినరోజు రాత్రి నిద్రపట్టదు ఊళ్ళో ఇ౦కా ఒబ్బిడికాని ధాన్య౦ రాశులమీద‌ మనసు రెక్కలుకట్టుకెళ్ళి వాలిపోతు౦ది తడిసిన రాశులు నాన్న కళ్ళని తడి చేసినప్పుడు ఆయన కళ్ళల్లో దాచుకున్న నేనూ తడిసిపోతాను అమ్మ మెడలో వేళాడే బొ౦దు ఈసారి నాకె౦దుకో ఉరితాడులా అనిపిస్తు౦ది... పోయిన ప౦ట బిడ్డని చూసి కుమిలిపోతున్న అమ్మా నాన్నల్ని ఓదార్చడానికి నేనోమారు ఊరెళ్ళి రావాలి పనసకర్ల 3/06/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osWCrX

Posted by Katta

Pulipati Guruswamy కవిత

జీవితాలు రచించబడవు // డా.పులిపాటి గురుస్వామి // ఓ కథకి నువ్వెప్పుడూ నాయకుడివే కొన్ని కథల్లో మాత్రం సాధారణ పాత్రధారివి నీ చుట్టూతా నాలుకలు తిరుగుతున్నపుడు ఇరవై నాలుగు గంటల కాలాన్ని సర్దుకోవటం అలవాటౌతుంది కొన్ని సమయాలు చేతకానివి నీ నొసలు మీది చెమటను తీయడానికి కూడా సహకరించవు అన్ని కథలు కొన్ని సందర్భాలందు రాత్రి అందరం కలిసి భోంచేసినట్టు మాట్లాడుకుంటూ గోడును మింగలేవు కింద మీద నువ్వొక్కడివే కానప్పుడు నీ పాత్రకి నైపుణ్యం జోడించడం కుదరనిపని ప్రతి కథ తన ప్రదర్శన మీద అపనమ్మకాన్ని కల్గి ఉండదు కథ మాత్రం ఎప్పటికీ ఆగదు ఇంకో కథలో జాడని విడువగా కాలంతో పాటు చిగురేయటం దాని స్వంత సంబరం. ..... 3-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S35hXe

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఒక కవిత - కాసుల ప్రతాపరెడ్డి లోపలివీ, వెలుపలివీ మనసు పొరల్లోకి ఇంకుతయి చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం వాడకుండానే రాలిపడాలె ఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల ఈ శాపమెప్పటిదో, ఎవరిదో ఊపిరాడక తన్నుకుంటూ ఉంటది నిన్నటికీ నేటికీ ఎంతటి తేడా వాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయి ఆరాటం, పోరాటం ఆశానిరాశల ఊగిసలాట పొత్తు కుదరని తండ్లాట, తల్లమల్లడం మనసు వేగాన్ని దేహం అందుకోదు ఈ నేలకు ఎందుకింత ప్రేమ ఆత్మనూ దేహాన్నీ మోస్తది కన్ను మూసుకున్నా పట్టని నిద్ర తొవ్వల మీద నెత్తురోడుతున్న పావురాలు మోదుగు చెట్టు ఒళ్లంతా పూలే ఎందుకొస్తామో, ఎందుకు పోతామో నేల తల్లి పచ్చి పుండు అయితనే వుంటది నీటి మీది రాతలో, నుదుటి రాతలో చెప్ప వొశం గాని వెతల కతలు రోదించే తోటలోకి పాట ఒక్కటీ రాదు

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPrfUX

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1udTFPE

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2TvaN

Posted by Katta

Chi Chi కవిత

_RomancE_ కలిసే ఉన్నాయవి కారణమే లేకున్నా!! ఒకటుంటే ఇంకొకటుండదు కానీ రెండూ ఉన్నాయ్ మొదలునంటే ఉన్న చివరిలా మొదలవకుండా ముగియకుండా !! అదో చర్యహీన జ్వాల !! ఆ రెండిటి నడుమా ఆహ్వానించే వీడ్కోలుగా రగులుతూ కలయికొందనివ్వని నిత్య శత్రువు ప్రాణమది!! విరసమే సరసంగా అపరిచయ మిత ప్రేమికులా రెండు బతుకు చావు !!_____________(3/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2KyOI

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! నీదే స్వంత నిర్ణయం !! మనదొక వింత ప్రపంచం ఎవరికీ ఎవరు తెలియరు మాటలు తెలుస్తాయి అవి నిజాలో అబద్దలో తెలియదు వ్యక్తిగత జీవితాలు తెలియవు మనసులో భావాలు అనుకుంటాం ఎ భావం అయినా పలికించ గలరేమో కదా ఏదైనా రాతలే కదా ఎలాగైనా రాయచ్చు మనసు అంటే మనో ప్రపంచం ఒంటరి అంటే స్వప్న ప్రపంచం విషాదం అనునయన ప్రపంచం ఊరట ఓదార్పు ప్రపంచం తోచక పలకరిస్తే స్నేహ మయం ఎన్నో పరిచయాలు రకరకాల పలకరింతలు ప్రతి పిలుపు లక్ష్యం మనమే మన సమస్యల వలయం లో కొద్దిపాటి విశ్రాంతి కి ఇక్కడకు వస్తే తెలియని అర్ధం కాని కొత్త సమస్యలు తెలియకుండానే ఇరుక్కుపోయే సాలెగూడు ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చి ఒంటరి తనం తో ఉండే కొద్దిమంది కుడా ఆ కుటుంబాలకు దూరం అవుతున్నారు ఏమైపోతున్నాం మనం ?? ఎటు వెళ్ళిపోతున్నాం మనం ?? నీతో కలసి వున్న వాళ్ళ కన్నా అపరిచితులే మనకు మిన్నా ??? నువ్వు నీలా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు .... నువ్వు అలా వుండటం ప్రకృతి నిర్ణయమేమో ... తెలుసుకో సమస్య లేనంత వరకు మంచిదే సమస్య వస్తే నిన్ను రక్షించే వాళ్ళే ఉండరు ప్రతి వారు సలహా ఇస్తారు నీ చేతులారా చేసుకున్నావు అనుభవించు అని జాగ్రత్త .. అంతా మనవాళ్ళే అంతా మంచి వాళ్ళే ..... నీ నిర్ణయాలు నీవి నీ బలహీనత కాకూడదు నీకు మానసిక వ్యదలాగా !!పార్ధ !!3/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2KzSQ

Posted by Katta

Si Ra కవిత

Si Ra// చరిత్ర పుస్తకం // 3-6-2014 ఆ పుస్తకంలో నీకు అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు రక్త కాలువలు కనిపిస్తున్నాయ్! ఆ పుస్తకంలో నీకు కాగితాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు జీవం ఉన్న అవయవాలు కనిపిస్తున్నాయ్! పేజీలు తిప్పుతుంతె, అర్థనాదాలు వినిపిస్తున్నయ్ ఎక్కడ చూసినా, యుద్దాలు, చీలుతున్న దేహాలు కేకలు, తెగిపడుతున్న చేతులు, చిద్రమౌతున్న నాగరికతలు ప్రతి అక్షరం లో రెండు కత్తులు రాజుకుంటున్న ధ్వని ప్రతి వాక్యం చివర, ఫిరంగి పేలిన శబ్ధం ప్రతి వ్యాసం తర్వాత, తలలు తెగిపడుతున్న చెప్పుడు. సరే అని కొంచం చుట్టు పక్కల చూస్తే యెగరేసిన జండాలు, కాలిపొతున్న దెహాలు దండయాత్రకి బయలుదెరుతున్న సైన్యాలు. గాలి పీల్చుకుంటే, గన్ పవ్డర్ వాసన ఒక సారి పుస్తకం అంతా అల తిప్పి చూస్తే తుపాకి కంటి తో స్వప్నించె విప్లవకారుడి పలకరింపు. భయం వెసి పుస్తకాన్ని దూరంగ విసిరేస్తే అది మాంసపు ముక్క అని ఒక డెగ దాన్ని ఎత్తుకెలిపొయింది.

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvocGK

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

హైకమాండ్ల తలలు మారాలే కానీ తోకలు మారితే ఏం ప్రయోజనం?

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKDLwC

Posted by Katta

Kapila Ramkumar కవిత

నిబద్ధతగల విమర్శ “కవనమార్గం” || prajaasaahi || దాదాపుగా అన్ని తెలుగు పత్రికల్లోనూ సాహిత్యానికి కేటాయించే స్థలమే పరిమితమైతే అందులో విమర్శకూ పుస్తక సమీక్షలకూ ఇవ్వజూపుతున్న ప్రదేశాన్ని గమనిస్తేనే ఆ ప్రక్రియలపట్ల సంపాదకులకున్న గౌరవం తెలుస్తుంది. నిజానికి పుస్తక సమీక్ష ప్రక్రియ కాస్తా పుస్తక పరిచయంగా ఎప్పుడో మారిపోతే, ఇప్పుడైతే స్వీకారం (స్టాంపు సైజులో పుస్తకపు ముఖచిత్రం, దాని దిగువున రచయిత, ప్రచురణకర్త, ధరల వివరాలు ఇవ్వడం) వరకు దిగజారింది. ఇలాంటి అరుదైన సమయంలో థింసా వెలువరించిన “కవనమార్గం” అనే కవిత్వ పరిచయాల, పరామర్శల వ్యాస సంపుటి చదవడం నిజంగా ఎంతో మేధనిస్తుంది. ప్రకృతిని అనుకరించేది జీవితమైతే, జీవితాన్ని అనుకరించేది సాహిత్యం. సృజనశీలురైన సాహిత్యకారులు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే జీవన గమన సూత్రాలను వారు అక్షరీకరిస్తారు. వాటిని ఆకళించుకున్న పాఠకులు ఆ చలనసూత్రాలను తమకు అన్వయించుకుని తమ జీవనాన్ని సుఖవంతం, సరళతరం చేసుకుంటారు. సృజనశీలురు, పాఠకులకు మధ్య వంతెనలాగా విమర్శకుడు తన బాధ్యతలను నెరవేర్చాలి. జీవితాన్ని రచయిత పరిశీలిస్తున్న తీరును అంచనా వేయాలి. ఇంకెలా చూస్తుండాలో హెచ్చరించాలి. అదే సమయంలో పాఠకుడికి రచనను మరింత సునిశితంగా అధ్యయనం చేయడానికి సహకరించాలి. ఇలా పదునైన రెండంచుల కత్తిని ఒడుపుగా నిర్వహించగలిగిననాడు ఆ విమర్శకుడి వల్ల అందరికీ హితవు చేకూరుతుంది. దీనికి పూర్తి భరోసానిస్తూ కవులకూ, పాఠకులకూ థింసా తన “కవనమార్గం” సిద్ధం చేశారు. తనకు దొరికినంత జాగాలో విస్పష్టంగా తన అభిప్రాయలను వ్యక్తీకరించిన థింసా సమాజంపట్ల, బతుకుపట్ల, రచనపట్ల, సాహిత్య ప్రయోజనంపట్ల, నిర్దిష్టమైన, ప్రగతిశీలమైన అంచనాలున్న విమర్శకుడు. అందుకే 36 వ్యాసాలు చదువుతున్నపుడు అవన్నీ ఒకదానికొకటి పొడిగింపుగా, ఒకే విషయానికి అంశాల చేర్పుగా అనిపిస్తుంది. ఒకే కాన్వాసుమీద చిత్రించిన భాగాల చిత్రంగా కనిపిస్తుంది. కవులు శాశ్వత ప్రతిపక్షం అని గుర్తుచేస్తున్న విమర్శకుడు నిత్యం ప్రజల పక్షం వహిస్తాడని స్పురిస్తుంది. దానికి కావలసిన ముడిసరుకు నడుస్తున్న సమాజాన్ని అధ్యయనం చేయడమేనని హితవు తలకెక్కుతుంది. తానందుకున్న ప్రతి కవితా సంపుటాన్ని జాగ్రత్తగా, ప్రేమగా చదవడం పూర్తిచేశాక సాహిత్య చరిత్రలో ఆ కవి స్థానాన్ని (కొన్నిసార్లు ఆ కవి దృష్టికోణాన్ని) అంచనావేసి, తన కవిత్వానికి ఎంచుకున్న వస్తువును పరామర్శించి (సార పరీక్ష చేసి), ఆ వస్తువును ఎస్టాబ్లిష్ చేయడానికి వాడిన పదచిత్రాలను, భాషను (రూప నిర్ధారణ) పరిశీలించి, పలుమార్లు మననం చేసుకోదగ్గ కొన్ని మాటల్ని ఉటంకించడం వరకూ ఆ కవినీ, కవిత్వాన్ని, ప్రగతిశీల దృక్పథంతో అవగహన చేసుకోవడానికి పాఠకునికి సహకరిస్తారు. అనంతరం ఆ కవికి, ఆ మార్గంలో కొత్తగా కలం పట్టబోతున్న యువ పాఠకులకు వేటిని పరిహరిస్తే కవిత్వం మరింత ప్రయోజనకరం కాగలదో అందుకు సంబంధించిన సూచనలందించడంతో సమీక్ష ముగుస్తుంది. పేజీలు ఎక్కువైనా (నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై 12 పేజీల సమీక్ష), తక్కువైనా (వడ్డెబోయిన శ్రీనివాస్ ‘ముఖచిత్రం’పై ఒకటింపావు పేజీ పరిచయం) అన్ని వ్యాసాలూ ఇలాగే కొనసాగుతాయి. ఈ విమర్శా వ్యాసాల సంపుటి ఆశారాజు ‘సర్వాంతర్యామి’తో ప్రారంభమవుతుంది. రెండో వ్యాసం కూడా అతనిదే అయిన ‘సారంగి’ని పరిచయం చేస్తుంది. ఈ రెండు సమీక్షలు కాక, ఆసారాజు ‘బద్నాం’కు థింసా రాసిన ముందుమాట 35వ వ్యాసంగా వుంది. ఈ మూడింటినీ కలిపి చదవడం హైదరాబాద్ ప్రేమికుడు ఆశారాజు సమగ్ర సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో మరికొన్ని వ్యాసాల సాయంతో కందుకూరి శ్రీరాములు గురించి ఓ అంచనాకు రావచ్చు. ప్రపంచీకరణ తెస్తున్న విపరిణామాలు, దానికి పాలకవర్గం హింసద్వారా ప్రజామోదాన్ని పొందేట్టు చేయడం, దానివల్ల లుప్తమవుతున్న సామాజిక ప్రమాణాలు, ఈ రంధిలో పడి దిశానిర్దేశం చేసుకోలేని మధ్యతరగతి మానవుడు ఎటు పోతున్నాడో తెలియకుండా కొట్టుకుపోవడం ఆధునిక జీవనంలో అనివార్యమైన మార్పులు. ఈ ‘ఛేంజ్ మేనేజ్ మెంట్’ లో కవుల పాత్ర కీలకమైంది. ఈ అవసరాన్ని, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను థింసా దాదాపు ప్రతి వాక్యంలోనూ గుర్తు చేస్తారు. ఈ మార్పులను విశ్లేషించుకోగలగడం, ప్రజా వ్యతిరేకమైనవాటిని తిప్పికొట్టగలగడం, ప్రజానుకూలంగా మార్చుకోగలగడం, ఇందుకు ప్రజలను సన్నద్ధం చేయగలగడం మన అవగాహనలోకి రావాలి. ఇదంతా వ్యష్టిగా, సమష్టిగా జరగలని కవులు కోరుకుంటారు. అపుడే పేనిన తాడులా మనిషి బలవంతుడవుతాడు. అందుకే పద పదమూ ప్రమత్తత అవసరమని థింసా ఘోషిస్తారు. ఆ చెప్పడమన్నది ఈయన కవికూడా కావడంవల్లనే ఓర్పుతో అనునయంగా చెప్పడం మనం గమనిస్తాం. ‘కవనమార్గ’మంతా అల్లుకుంటూ పరిమళించిన అనేక భావాలలో రూపసారాల చర్చ ఒకటి. రూపసారాల గురించి ఎంత చెప్పినా కృష్ణమూర్తి యాదవ్ పై రాసిన స్మృతివ్యాసం ‘నెనరు-నెమరు’ లో చెప్పిన ఈ మాట తర్వాత ఇంకా వివరణ అనవసరమేమో! ‘ఏ ఆధునిక కనీ ముందు రూపచట్రాన్ని నిర్మించుకుని అందులో ఆధునిక జీవితాన్ని వస్తువుగా ఇరికించడు. వస్తువును వ్యక్తపరిచే క్రమంలో కవిత్వరూపం రూపుదిద్దుకుంటుంది. వస్తువును రూపించే క్రమంలో ప్రతీకలూ, భావ ప్రతిమలూ, పదచిత్రాలూ, భాష కవి ప్రతిభనుబట్టి, ప్రాపంచిక దృక్పథాన్నిబట్టి పనిముట్లుగా అందివస్తాయి‘ (పే. 27). నిర్మొహమాటత్వం థింసా బలమైన బలహీనత. ‘అల్పపీడనం’ కవి పైడి తెరేష్ బాబును పరిచయం చేస్తూ ఆత్మగౌరవ వ్యక్తీకరణ ప్రయత్నంలో దళిత ధిక్కారస్వరం తెరేష్ బాబుది ఎంత ప్రతిభావంతమైన ప్రయత్నమో చెప్తూనే అతడి దళిత గజల్స్ సాహసంలో పరిణతిలేదని చెప్తారు (పే. 46). పద్మారావు ‘నీలికేక’ను మనసారా మెచ్చుకుంటూనే అతి వైభవీకరణ (గ్లోరిఫికేషన్) దళిత జీవన వాస్తవాలను మేలిముసుగు వేసి మరుగుపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తారు (పే. 43). ఈ వ్యాసంలో పద్మారావు వాడిన అలోచనాత్మకమైన ‘కత్తి ప్రయాణం చేయలేనంత దూరం / కరుణ ప్రయాణం చేస్తుంది‘, ‘సృజనానికి రమ్యమే కాదు / గమ్యం కూడా కావాలి‘ లాంటి మాటలు చకచకా గుర్తు చేశారు. గాఢాబివ్యక్తిని అడుగడుగునా దర్శింపజేయించే కవి నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై విపులమైన వ్యాసం కవి కవిత్వంపైనా మొత్తంగా తెలుగు కవిత్వంపైనా కొత్త వెలుగును ప్రసరించి తీరుతుంది. ‘కవికి కవిత్వం ఉబుసుపోని ఉత్తుత్తి కబుర్లు కాదు. ఒక జీవన్మరణ సంఘర్షణ. నిత్యావసర దినుసే కాదు. ఒక మానసికావసరం. ఒక ధిక్కారస్వరం. ఒక పదునైన శస్త్రం. ఒక సాహస చర్య‘ (పే. 20). ఈ మాటలు “పీఠభూమి”కి ముందుమాట రాస్తూ కందుకూరి శ్రీరాములు గురించి అన్నవే కావచ్చు. కాని ప్రతిసృజనశీలునికీ అన్వయించేలా వారి కృషి సాగాలి. విమర్శకుడిగా థింసా మాత్రం అలాగే ఈ వ్యాససంపుటిలో సాహితీ వ్యవసాయం సాగించేరు. కవులకు, కొత్తగా కలం పట్టే వీరులకు ఉపయుక్తంగా ప్రతి వ్యాసం చివరా చేసిన సూచనలు విలువైనవి. సంస్కృత పదాలపై వ్యామోహం వదులుకోవలని కందుకూరి శ్రీరాములుకు చెప్పినా (పే.17), కవితా శీర్షికల ఎంపిలలో జాగ్రత్త గురించి కృష్ణమూర్తి యాదవ్ కు సూచించినా (పే. 25), వెటకారపు మాటలూ, వేళాకోలపు మాటలూ, అశ్లీల పదాలూ పరిహరించాలని ప్రసాదమూర్తిని కోరినా (పే. 53), పురాణ ప్రతీకల్ని తగ్గించమని జూపల్లి ప్రేంచందుకు హితవు పలికినా (పే. 58), చెప్పాలనుకున్న ప్రతి విషయాన్నీ కవితామయం చేయాలనే తపనలో ఎడిటింగ్ చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడకపోతే కావ్యంలో బిగుతు కొరవడుతుందని కె.సుదేరాకు చెప్పినా (పే. 73) అవి ఆయా కవులనే ఉద్దేశించినవి కావని గమనించాలి. కవులంతా మనసుకు పట్టించుకోవాల్సిన అపురూపమైన మాటలివి. ఇస్మాయిల్ అనువాద కవిత్వం ‘రెండో ప్రతిపాదన’ను సమీక్షిస్తూ కవిని నీరోతో పోలుస్తారు. ఈ వ్యాసం చదువుతుంటే విశ్వనాథపై రా.రా. విరుచుకుపడిపోవడం గుర్తుకొస్తుంది. కాని, ఇస్మాయిల్ పై సాఫ్ట్ కార్నరున్న ‘కవనమార్గ’పు ముందుమాటకారుడు వి.వి. ఆ సంకలనం తప్ప మరేం దొరకలేదా అని అంటారు. ఇక ఈ వ్యాసాలన్నీ అమర్చిన క్రమం అంతు చిక్కనిది. అలా కాకుండా అచ్చయిన తేదీల క్రమంలోనో, కవిత్వ సంపుటాల శీర్షికల అక్షరాది క్రమంలోనో, ఆయా కవులపేర్ల అక్షరాది క్రమంలోనో ఏదో ఒక క్రమం పాటిస్తే సాహిత్య విద్యార్థులకు ఉపయుక్తంగా వుండేది. చివర కొన్ని వ్యాసాలలో ఎవరి కవిత్వం గురించిన వ్యాసమో అంత తొందరగా అంతుచిక్కదు. ఉదాహరణకు కె. సుదేరా ‘పొలికేక’పై నాలుగు పేజీల సమీక్షా వ్యాసంలో రెండున్నర పేజీల తర్వాత ఆ వ్యాసం ఫలనా కవిత్వంపైనని తెలుస్తుంది. ఎంత విశ్లేషణాత్మక వ్యాసాలైనా చాలా పొడువైన ఇంట్రోలయి కూర్చున్నాయి. అస్తిత్వ వాదనలపట్ల, ఆత్మగౌరవ వ్యక్తీకరణల పట్ల, ధిక్కార స్వరాల పట్ల, దోపీడీ వివక్షల వ్యతిరేకతల పట్ల వెరసి వీటి అభివ్యక్తీకరణల పట్ల అచంచలమైన విశ్వాసం, అపారమైన సానుభూతిని కనపరుస్తూనే ఈ ధోరణులు సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాయని థింసా ఆందోళన చెందుతున్నారు. ఇది ఆయన ఆలోచనలోని సారభూత పార్శ్వం. పే. 19లో “నిజానికి ఈ గుర్తింపు రోదనలూ అస్తిత్వ ఖేదనలూ రూపంలో అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించి గళ్లాపట్టి నీలదీసేవిగా మనకు కనిపిస్తుంటాయి గాని, సారంలో మాత్రం పాలకవర్గాల కొమ్ము కాస్తుంటాయి. రాజ్యాన్ని ధృడపరుస్తుంటాయి. రాజ్యహింసని ధృవపరుస్తుంటాయి. సామూహిక సామాజిక చేతనని తమంతట తామే ముక్కలుగా తెగ నరుక్కుని, తుంపులు తుంపులు చేసుకుని..” అని రాశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్టుగా పే. 56లో “గుర్తింపు రాజకీయాల కెరీరిస్టు ధోరణి ప్రబలి, ప్రెజర్ గ్రూప్ పాలీట్రిక్సుకీ కవిత్వ రంగం ప్రభావితమైంది. మనిషిని సమూహాన్నుంచి విడదీసే వైయక్తిక వాదాన్ని ఈ గుర్తింపు రాజకీయాలు బలంగా ప్రేరేపించాయి” అంటారు. దీని గురించి థింసా మరొక విపులమైన వ్యాసం రాస్తే బాగుణ్ణు. బలంగా, సూటిగా వాదన వినిపించగల విమర్శకుడు ఈ విషయంపై నాబోటి నూతన సాహిత్య అధ్యయనపరులకు కొత్త వెలుగు ఇచ్చినట్టవుతుంది. ఇంకొక మాట – పే. 36లో “మాయమైన బిడ్డలకోసం, కనుమరుగు చేయబడిన ఆత్మీయులకోసం తెలంగాణలోని తల్లుల నిరంతర రోదన అన్య ప్రాంతీయుల అనుభవంలోకి వచ్చేది కాదు” అంటారు. కాని, రాజ్యహింస తెలంగాణకే పరిమితం కాదని థింసా గుర్తించాలి. ప్రజలున్న చోటల్లా విస్తరించిన రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిపిన ప్రతిఘటనలో తెలంగాణ వెలుపల అసువులు బాసిన అమరులను మరచినట్టవుతుంది. అయితే చైతన్యవంతమైన తెలంగాణ మాగాణిలో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యహింసలో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆ దు:ఖభరిత గాధలను ప్రతిభావంతంగా తెలంగాణ కాల్పనిక సాహిత్యంలో సమర్థంగా వ్యక్తమవడాన అది అందరమూ చదివి అనుభూతం చెంది గుండెకోతకు గురవుతున్నాం. 36 వ్యాసాలు చదివాక నన్ను బాధించిన అంశం, ఏ ఒక్క కళింగాంధ్ర కవి కవిత్వమూ థింసాకు ఎదురవ్వకపోవడం. థింసా ‘కవనమార్గా’నికి దారినిస్తూ వరవరరావు రాసిన ‘నడవాల్సిన బాట’ ఈ వ్యాసాలను చదవడంలో, జీర్ణించుకోవడంలో ఎంతగానో సహకరిస్తుంది. “ఇప్పటి కవిత్వం అందంగా, రసాత్మకంగా ఉంటేనే సరిపోదు. జీవితంపట్ల, జీవన వైరుధ్యాలపట్ల చదువరికి ఎరుకని కలిగించి భవిష్యత్తుపై ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగిస్తూ చీకట్లోంచి వెలుగులోకి నడిపించేదిగా ఉండాలి” అని పే. 95లో థింసా అంటారు. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఈ “కవనమార్గం” సృజనశీలురతోపాటు సాహిత్య విద్యార్థులంతా తప్పక అధ్యయనం చేయాల్సిన పుస్తకం. (ఈ వ్యాసం ఆగష్టు, 2008 “ప్రజాసాహితి” సంచికలో ప్రచురితమైంది.)http://ift.tt/1udk8Na

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1udk8Na

Posted by Katta

Kapila Ramkumar కవిత

నిబద్ధతగల విమర్శ “కవనమార్గం” || prajaasaahi || దాదాపుగా అన్ని తెలుగు పత్రికల్లోనూ సాహిత్యానికి కేటాయించే స్థలమే పరిమితమైతే అందులో విమర్శకూ పుస్తక సమీక్షలకూ ఇవ్వజూపుతున్న ప్రదేశాన్ని గమనిస్తేనే ఆ ప్రక్రియలపట్ల సంపాదకులకున్న గౌరవం తెలుస్తుంది. నిజానికి పుస్తక సమీక్ష ప్రక్రియ కాస్తా పుస్తక పరిచయంగా ఎప్పుడో మారిపోతే, ఇప్పుడైతే స్వీకారం (స్టాంపు సైజులో పుస్తకపు ముఖచిత్రం, దాని దిగువున రచయిత, ప్రచురణకర్త, ధరల వివరాలు ఇవ్వడం) వరకు దిగజారింది. ఇలాంటి అరుదైన సమయంలో థింసా వెలువరించిన “కవనమార్గం” అనే కవిత్వ పరిచయాల, పరామర్శల వ్యాస సంపుటి చదవడం నిజంగా ఎంతో మేధనిస్తుంది. ప్రకృతిని అనుకరించేది జీవితమైతే, జీవితాన్ని అనుకరించేది సాహిత్యం. సృజనశీలురైన సాహిత్యకారులు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే జీవన గమన సూత్రాలను వారు అక్షరీకరిస్తారు. వాటిని ఆకళించుకున్న పాఠకులు ఆ చలనసూత్రాలను తమకు అన్వయించుకుని తమ జీవనాన్ని సుఖవంతం, సరళతరం చేసుకుంటారు. సృజనశీలురు, పాఠకులకు మధ్య వంతెనలాగా విమర్శకుడు తన బాధ్యతలను నెరవేర్చాలి. జీవితాన్ని రచయిత పరిశీలిస్తున్న తీరును అంచనా వేయాలి. ఇంకెలా చూస్తుండాలో హెచ్చరించాలి. అదే సమయంలో పాఠకుడికి రచనను మరింత సునిశితంగా అధ్యయనం చేయడానికి సహకరించాలి. ఇలా పదునైన రెండంచుల కత్తిని ఒడుపుగా నిర్వహించగలిగిననాడు ఆ విమర్శకుడి వల్ల అందరికీ హితవు చేకూరుతుంది. దీనికి పూర్తి భరోసానిస్తూ కవులకూ, పాఠకులకూ థింసా తన “కవనమార్గం” సిద్ధం చేశారు. తనకు దొరికినంత జాగాలో విస్పష్టంగా తన అభిప్రాయలను వ్యక్తీకరించిన థింసా సమాజంపట్ల, బతుకుపట్ల, రచనపట్ల, సాహిత్య ప్రయోజనంపట్ల, నిర్దిష్టమైన, ప్రగతిశీలమైన అంచనాలున్న విమర్శకుడు. అందుకే 36 వ్యాసాలు చదువుతున్నపుడు అవన్నీ ఒకదానికొకటి పొడిగింపుగా, ఒకే విషయానికి అంశాల చేర్పుగా అనిపిస్తుంది. ఒకే కాన్వాసుమీద చిత్రించిన భాగాల చిత్రంగా కనిపిస్తుంది. కవులు శాశ్వత ప్రతిపక్షం అని గుర్తుచేస్తున్న విమర్శకుడు నిత్యం ప్రజల పక్షం వహిస్తాడని స్పురిస్తుంది. దానికి కావలసిన ముడిసరుకు నడుస్తున్న సమాజాన్ని అధ్యయనం చేయడమేనని హితవు తలకెక్కుతుంది. తానందుకున్న ప్రతి కవితా సంపుటాన్ని జాగ్రత్తగా, ప్రేమగా చదవడం పూర్తిచేశాక సాహిత్య చరిత్రలో ఆ కవి స్థానాన్ని (కొన్నిసార్లు ఆ కవి దృష్టికోణాన్ని) అంచనావేసి, తన కవిత్వానికి ఎంచుకున్న వస్తువును పరామర్శించి (సార పరీక్ష చేసి), ఆ వస్తువును ఎస్టాబ్లిష్ చేయడానికి వాడిన పదచిత్రాలను, భాషను (రూప నిర్ధారణ) పరిశీలించి, పలుమార్లు మననం చేసుకోదగ్గ కొన్ని మాటల్ని ఉటంకించడం వరకూ ఆ కవినీ, కవిత్వాన్ని, ప్రగతిశీల దృక్పథంతో అవగహన చేసుకోవడానికి పాఠకునికి సహకరిస్తారు. అనంతరం ఆ కవికి, ఆ మార్గంలో కొత్తగా కలం పట్టబోతున్న యువ పాఠకులకు వేటిని పరిహరిస్తే కవిత్వం మరింత ప్రయోజనకరం కాగలదో అందుకు సంబంధించిన సూచనలందించడంతో సమీక్ష ముగుస్తుంది. పేజీలు ఎక్కువైనా (నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై 12 పేజీల సమీక్ష), తక్కువైనా (వడ్డెబోయిన శ్రీనివాస్ ‘ముఖచిత్రం’పై ఒకటింపావు పేజీ పరిచయం) అన్ని వ్యాసాలూ ఇలాగే కొనసాగుతాయి. ఈ విమర్శా వ్యాసాల సంపుటి ఆశారాజు ‘సర్వాంతర్యామి’తో ప్రారంభమవుతుంది. రెండో వ్యాసం కూడా అతనిదే అయిన ‘సారంగి’ని పరిచయం చేస్తుంది. ఈ రెండు సమీక్షలు కాక, ఆసారాజు ‘బద్నాం’కు థింసా రాసిన ముందుమాట 35వ వ్యాసంగా వుంది. ఈ మూడింటినీ కలిపి చదవడం హైదరాబాద్ ప్రేమికుడు ఆశారాజు సమగ్ర సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో మరికొన్ని వ్యాసాల సాయంతో కందుకూరి శ్రీరాములు గురించి ఓ అంచనాకు రావచ్చు. ప్రపంచీకరణ తెస్తున్న విపరిణామాలు, దానికి పాలకవర్గం హింసద్వారా ప్రజామోదాన్ని పొందేట్టు చేయడం, దానివల్ల లుప్తమవుతున్న సామాజిక ప్రమాణాలు, ఈ రంధిలో పడి దిశానిర్దేశం చేసుకోలేని మధ్యతరగతి మానవుడు ఎటు పోతున్నాడో తెలియకుండా కొట్టుకుపోవడం ఆధునిక జీవనంలో అనివార్యమైన మార్పులు. ఈ ‘ఛేంజ్ మేనేజ్ మెంట్’ లో కవుల పాత్ర కీలకమైంది. ఈ అవసరాన్ని, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను థింసా దాదాపు ప్రతి వాక్యంలోనూ గుర్తు చేస్తారు. ఈ మార్పులను విశ్లేషించుకోగలగడం, ప్రజా వ్యతిరేకమైనవాటిని తిప్పికొట్టగలగడం, ప్రజానుకూలంగా మార్చుకోగలగడం, ఇందుకు ప్రజలను సన్నద్ధం చేయగలగడం మన అవగాహనలోకి రావాలి. ఇదంతా వ్యష్టిగా, సమష్టిగా జరగలని కవులు కోరుకుంటారు. అపుడే పేనిన తాడులా మనిషి బలవంతుడవుతాడు. అందుకే పద పదమూ ప్రమత్తత అవసరమని థింసా ఘోషిస్తారు. ఆ చెప్పడమన్నది ఈయన కవికూడా కావడంవల్లనే ఓర్పుతో అనునయంగా చెప్పడం మనం గమనిస్తాం. ‘కవనమార్గ’మంతా అల్లుకుంటూ పరిమళించిన అనేక భావాలలో రూపసారాల చర్చ ఒకటి. రూపసారాల గురించి ఎంత చెప్పినా కృష్ణమూర్తి యాదవ్ పై రాసిన స్మృతివ్యాసం ‘నెనరు-నెమరు’ లో చెప్పిన ఈ మాట తర్వాత ఇంకా వివరణ అనవసరమేమో! ‘ఏ ఆధునిక కనీ ముందు రూపచట్రాన్ని నిర్మించుకుని అందులో ఆధునిక జీవితాన్ని వస్తువుగా ఇరికించడు. వస్తువును వ్యక్తపరిచే క్రమంలో కవిత్వరూపం రూపుదిద్దుకుంటుంది. వస్తువును రూపించే క్రమంలో ప్రతీకలూ, భావ ప్రతిమలూ, పదచిత్రాలూ, భాష కవి ప్రతిభనుబట్టి, ప్రాపంచిక దృక్పథాన్నిబట్టి పనిముట్లుగా అందివస్తాయి‘ (పే. 27). నిర్మొహమాటత్వం థింసా బలమైన బలహీనత. ‘అల్పపీడనం’ కవి పైడి తెరేష్ బాబును పరిచయం చేస్తూ ఆత్మగౌరవ వ్యక్తీకరణ ప్రయత్నంలో దళిత ధిక్కారస్వరం తెరేష్ బాబుది ఎంత ప్రతిభావంతమైన ప్రయత్నమో చెప్తూనే అతడి దళిత గజల్స్ సాహసంలో పరిణతిలేదని చెప్తారు (పే. 46). పద్మారావు ‘నీలికేక’ను మనసారా మెచ్చుకుంటూనే అతి వైభవీకరణ (గ్లోరిఫికేషన్) దళిత జీవన వాస్తవాలను మేలిముసుగు వేసి మరుగుపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తారు (పే. 43). ఈ వ్యాసంలో పద్మారావు వాడిన అలోచనాత్మకమైన ‘కత్తి ప్రయాణం చేయలేనంత దూరం / కరుణ ప్రయాణం చేస్తుంది‘, ‘సృజనానికి రమ్యమే కాదు / గమ్యం కూడా కావాలి‘ లాంటి మాటలు చకచకా గుర్తు చేశారు. గాఢాబివ్యక్తిని అడుగడుగునా దర్శింపజేయించే కవి నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై విపులమైన వ్యాసం కవి కవిత్వంపైనా మొత్తంగా తెలుగు కవిత్వంపైనా కొత్త వెలుగును ప్రసరించి తీరుతుంది. ‘కవికి కవిత్వం ఉబుసుపోని ఉత్తుత్తి కబుర్లు కాదు. ఒక జీవన్మరణ సంఘర్షణ. నిత్యావసర దినుసే కాదు. ఒక మానసికావసరం. ఒక ధిక్కారస్వరం. ఒక పదునైన శస్త్రం. ఒక సాహస చర్య‘ (పే. 20). ఈ మాటలు “పీఠభూమి”కి ముందుమాట రాస్తూ కందుకూరి శ్రీరాములు గురించి అన్నవే కావచ్చు. కాని ప్రతిసృజనశీలునికీ అన్వయించేలా వారి కృషి సాగాలి. విమర్శకుడిగా థింసా మాత్రం అలాగే ఈ వ్యాససంపుటిలో సాహితీ వ్యవసాయం సాగించేరు. కవులకు, కొత్తగా కలం పట్టే వీరులకు ఉపయుక్తంగా ప్రతి వ్యాసం చివరా చేసిన సూచనలు విలువైనవి. సంస్కృత పదాలపై వ్యామోహం వదులుకోవలని కందుకూరి శ్రీరాములుకు చెప్పినా (పే.17), కవితా శీర్షికల ఎంపిలలో జాగ్రత్త గురించి కృష్ణమూర్తి యాదవ్ కు సూచించినా (పే. 25), వెటకారపు మాటలూ, వేళాకోలపు మాటలూ, అశ్లీల పదాలూ పరిహరించాలని ప్రసాదమూర్తిని కోరినా (పే. 53), పురాణ ప్రతీకల్ని తగ్గించమని జూపల్లి ప్రేంచందుకు హితవు పలికినా (పే. 58), చెప్పాలనుకున్న ప్రతి విషయాన్నీ కవితామయం చేయాలనే తపనలో ఎడిటింగ్ చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడకపోతే కావ్యంలో బిగుతు కొరవడుతుందని కె.సుదేరాకు చెప్పినా (పే. 73) అవి ఆయా కవులనే ఉద్దేశించినవి కావని గమనించాలి. కవులంతా మనసుకు పట్టించుకోవాల్సిన అపురూపమైన మాటలివి. ఇస్మాయిల్ అనువాద కవిత్వం ‘రెండో ప్రతిపాదన’ను సమీక్షిస్తూ కవిని నీరోతో పోలుస్తారు. ఈ వ్యాసం చదువుతుంటే విశ్వనాథపై రా.రా. విరుచుకుపడిపోవడం గుర్తుకొస్తుంది. కాని, ఇస్మాయిల్ పై సాఫ్ట్ కార్నరున్న ‘కవనమార్గ’పు ముందుమాటకారుడు వి.వి. ఆ సంకలనం తప్ప మరేం దొరకలేదా అని అంటారు. ఇక ఈ వ్యాసాలన్నీ అమర్చిన క్రమం అంతు చిక్కనిది. అలా కాకుండా అచ్చయిన తేదీల క్రమంలోనో, కవిత్వ సంపుటాల శీర్షికల అక్షరాది క్రమంలోనో, ఆయా కవులపేర్ల అక్షరాది క్రమంలోనో ఏదో ఒక క్రమం పాటిస్తే సాహిత్య విద్యార్థులకు ఉపయుక్తంగా వుండేది. చివర కొన్ని వ్యాసాలలో ఎవరి కవిత్వం గురించిన వ్యాసమో అంత తొందరగా అంతుచిక్కదు. ఉదాహరణకు కె. సుదేరా ‘పొలికేక’పై నాలుగు పేజీల సమీక్షా వ్యాసంలో రెండున్నర పేజీల తర్వాత ఆ వ్యాసం ఫలనా కవిత్వంపైనని తెలుస్తుంది. ఎంత విశ్లేషణాత్మక వ్యాసాలైనా చాలా పొడువైన ఇంట్రోలయి కూర్చున్నాయి. అస్తిత్వ వాదనలపట్ల, ఆత్మగౌరవ వ్యక్తీకరణల పట్ల, ధిక్కార స్వరాల పట్ల, దోపీడీ వివక్షల వ్యతిరేకతల పట్ల వెరసి వీటి అభివ్యక్తీకరణల పట్ల అచంచలమైన విశ్వాసం, అపారమైన సానుభూతిని కనపరుస్తూనే ఈ ధోరణులు సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాయని థింసా ఆందోళన చెందుతున్నారు. ఇది ఆయన ఆలోచనలోని సారభూత పార్శ్వం. పే. 19లో “నిజానికి ఈ గుర్తింపు రోదనలూ అస్తిత్వ ఖేదనలూ రూపంలో అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించి గళ్లాపట్టి నీలదీసేవిగా మనకు కనిపిస్తుంటాయి గాని, సారంలో మాత్రం పాలకవర్గాల కొమ్ము కాస్తుంటాయి. రాజ్యాన్ని ధృడపరుస్తుంటాయి. రాజ్యహింసని ధృవపరుస్తుంటాయి. సామూహిక సామాజిక చేతనని తమంతట తామే ముక్కలుగా తెగ నరుక్కుని, తుంపులు తుంపులు చేసుకుని..” అని రాశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్టుగా పే. 56లో “గుర్తింపు రాజకీయాల కెరీరిస్టు ధోరణి ప్రబలి, ప్రెజర్ గ్రూప్ పాలీట్రిక్సుకీ కవిత్వ రంగం ప్రభావితమైంది. మనిషిని సమూహాన్నుంచి విడదీసే వైయక్తిక వాదాన్ని ఈ గుర్తింపు రాజకీయాలు బలంగా ప్రేరేపించాయి” అంటారు. దీని గురించి థింసా మరొక విపులమైన వ్యాసం రాస్తే బాగుణ్ణు. బలంగా, సూటిగా వాదన వినిపించగల విమర్శకుడు ఈ విషయంపై నాబోటి నూతన సాహిత్య అధ్యయనపరులకు కొత్త వెలుగు ఇచ్చినట్టవుతుంది. ఇంకొక మాట – పే. 36లో “మాయమైన బిడ్డలకోసం, కనుమరుగు చేయబడిన ఆత్మీయులకోసం తెలంగాణలోని తల్లుల నిరంతర రోదన అన్య ప్రాంతీయుల అనుభవంలోకి వచ్చేది కాదు” అంటారు. కాని, రాజ్యహింస తెలంగాణకే పరిమితం కాదని థింసా గుర్తించాలి. ప్రజలున్న చోటల్లా విస్తరించిన రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిపిన ప్రతిఘటనలో తెలంగాణ వెలుపల అసువులు బాసిన అమరులను మరచినట్టవుతుంది. అయితే చైతన్యవంతమైన తెలంగాణ మాగాణిలో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యహింసలో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆ దు:ఖభరిత గాధలను ప్రతిభావంతంగా తెలంగాణ కాల్పనిక సాహిత్యంలో సమర్థంగా వ్యక్తమవడాన అది అందరమూ చదివి అనుభూతం చెంది గుండెకోతకు గురవుతున్నాం. 36 వ్యాసాలు చదివాక నన్ను బాధించిన అంశం, ఏ ఒక్క కళింగాంధ్ర కవి కవిత్వమూ థింసాకు ఎదురవ్వకపోవడం. థింసా ‘కవనమార్గా’నికి దారినిస్తూ వరవరరావు రాసిన ‘నడవాల్సిన బాట’ ఈ వ్యాసాలను చదవడంలో, జీర్ణించుకోవడంలో ఎంతగానో సహకరిస్తుంది. “ఇప్పటి కవిత్వం అందంగా, రసాత్మకంగా ఉంటేనే సరిపోదు. జీవితంపట్ల, జీవన వైరుధ్యాలపట్ల చదువరికి ఎరుకని కలిగించి భవిష్యత్తుపై ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగిస్తూ చీకట్లోంచి వెలుగులోకి నడిపించేదిగా ఉండాలి” అని పే. 95లో థింసా అంటారు. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఈ “కవనమార్గం” సృజనశీలురతోపాటు సాహిత్య విద్యార్థులంతా తప్పక అధ్యయనం చేయాల్సిన పుస్తకం. (ఈ వ్యాసం ఆగష్టు, 2008 “ప్రజాసాహితి” సంచికలో ప్రచురితమైంది.)http://ift.tt/1udk8Na

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1udk8Na

Posted by Katta

Kavi Yakoob కవిత

Selected Readings~

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2bqDa

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

http://ift.tt/1o3q3mc

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3q3mc

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నిద్ర || నువ్వు నిద్రించక చాలా కాలమయ్యింది కదూ ఒక శరీరం నీ మీద కప్పబడినప్పుడు అలిసిపోయిన రెప్పల వెనుక నువ్వెంత కాలం మెలుకువగా ఉంటావు ******* దోసిళ్ళతో వెలుగు పువ్వులను పట్టుకొని కొన్ని నవ్వులను బాల్యం నుండి పిండుకొని తెల్లని కడిగిన కళ్ళతో నువ్వు ప్రకాశిస్తూ ఏదో ఒక దుప్పటి క్రింద కాదు నువ్వు అపరిమితంగా ఆ చల్లని గాలిలా వ్యాపించి వెన్నలవై రాత్రి మీద నిద్రించు ******* గాలి తాకిడికే తేరి చూచే కన్నులు నిదురించేదేపుడు కలలు కనేదెపుడు విడుస్తున్న శ్వాసలో నీది కానిది వదులుతూ నీలో ఒక శూన్యాన్ని పాన్పుగా పరుచుకో * * * చివరిగా ఒక మాట మనసుకు నిదుర రాదు నువ్వే నేర్పాలి చాంద్ || 3.06.2014 || ( " వాకిలి " జూన్ 2014 పత్రికలో ప్రచురితమైన నా కవిత )

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2hp6h

Posted by Katta

Chi Chi కవిత

_వాదం_ అపవాదెరుగనిదేది !! అమ్మాయ్యలతో మొదలు అందరి వాదవాదం అసలాద్యంతమనటమే నాటకం!! ఇంద్రియించుకున్న దేహజగంలో అర్థమో పీడగా .. భావమో క్రీడగా అవయవాలాకలికి ప్రాణమో చీడగా మండలమే లేని మొండి ప్రత్యక్ష్యంలో తలనుండెన్ని వాదాలు దూకాయో గండికొట్టినట్టు మొండాల్లోకి !! చురుకు చచ్చి మెదళ్ళు ముండమోసాయని గుండెలదురుతుంటే కడుపులు పైకి కక్కుతున్నాయి ఆకలికో వాదాన్ని.. ఎన్నాకల్లో !! తీరాయాంటే లేదు కడుపుల కిందాకలితో అడుక్కోని బిచ్చగాళ్ళని కక్కుతూ గుణించుకునే ఆకల్లతో ధన్యవాదాన్ని అడుక్కోవడం !! ధన్యవాదిస్తే పెరుగుతుందే తప్ప ఏ వాదానికీ ఆకలి తీరదు వాగుడాగదు !!___________(3/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqWEke

Posted by Katta

Pulikonda Subbachary A Poet కవిత

Dear friends I presented this English poem in the Telangana Poets meet on the Eve and the Midnight of June 1st and the Dawn of the Telangana that is 2nd June. Please read it and respond. Prof. Pulikonda Subbachary Dravidian University SONG OF LIBERATION I sing the song of Telangana The melody of a Jeweled Veena. || I sing|| The crimson Sun in the midnight dawn Smeared the Sky blood of the hero’s The flames that burnt the Campuses The flags that cordoned the villages Made the high skies red and red || I Sing|| The smoothie softy feathers Cut the steel cage of Decades of despotism The chirping sound of the flying birds Make a rhythm for song of freedom | I sing | “I am your slave, I bow to your feet” The words of ‘vetti’ the tyranny of Gadies The muted idiom of Telangana Burnt in the flames Vanished in the red sky. || I sing || The New dawn, new epoch And the Newest Sun of hope and faith Bring the light of progress and prosperity. Tears of waning professions, cries of dalits, Pitch for justice yell for equality Leader of the pink brigade Listen to the voices, crushed in despair The crimson Sun in the midnight dawn Painted the sky the blood of Heroes I Sing the Song of Telangana The melody of the Jeweled Veena.

by Pulikonda Subbachary A Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SpoZgh

Posted by Katta

Kamal Lakshman కవిత

II కమల్II సగటు మనిషి ఆక్రోశంII --------------------------------------- కలలూ, కోరికలేమో గుర్రాలు శ్రమ , లక్ష్యాలేమో తాబేళ్లు అవకాశాలేమో తక్కువాయే పోటీలేమో ఎక్కువాయె రంగు రంగుల ప్రపంచం అడుగడుగునా కలుషితం గాడ్సేల కున్న విలువ గాంధీలకు లేదాయే తేలికగా విలాసమైన జీవితం అనుభావించాలనేదే అంతిమ లక్ష్యం చట్టాలేమో ఉన్నవాళ్ళ చుట్టాలు ఇచ్చుకోలేని వాళ్లకన్నీ కష్టాలు ఎన్ని అర్హతలున్నా వ్యర్థమే అయిన వాళ్ళు వెనక లేకపోతే అనర్హులు అందలమెక్కి అపహాస్యం చేస్తూ ఉంటే ప్రతిభా పాటవాలు వెలవెల బోయి విల విల లాడుతున్నాయి మూగబోయి వచ్చిన అవకాశాన్ని వదలక కష్టపడితే వచ్చేదేమో పిసరంతాయే ఏమని చెప్పేది, ఎన్నని చెప్పేది సగటు మనిషి పడే నిరంతర చిక్కుముళ్ళ మనో వ్యధ ప్రతి రోజూ పడుతూ లేస్తూ చస్తూ బ్రతుకుతూ... చెప్పలేక.. చెప్పుకోలేక మనసు చేస్తున్న గావుకేక... మనిషి పడుతున్న చావు కేక... కమల్ 3.06.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h22gSZ

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//క్రోధం//03.06.2014 ఆకాశాన్ని,భూమినీ కలుపుతూ.. తళుక్కుమంటున్న కాంతిరేఖలు.. విశాల గగనంలో ..ఫ్లోరసెంట్ పెన్సిల్తో పిచ్చిగీతలు గీస్తున్నట్లుగా, మెరుపులు.. ఆ వెంబడే ప్రళయగర్జన చేస్తూ ఉరుములు! వెయ్యి సింహాలు ఒక్కసారి అరుస్తున్నంత భయంకరంగా! ఉలిక్కి పడి లేచింది ఊరు.. అంధకారంలో..భయంగుప్పుట్లో..ప్రజలు! పిడుగుపాటుకి ప్రాణాలొదిలిన ఎందరో.. దురదృస్టవంతులు! పిడుగులు పడతాయని ముందే లెఖ్ఖగట్టిన శాస్త్రం! గర్జించిం.గర్జించి..అలసిన మేఘాలు, కుంభవృస్టితో చల్లబడ్డాయి! జోరున వర్షం! ఎడతెరిపిలేకుండా కురుస్తోంది! సముద్రంలో సుడిగాలులట.. ఉప్పెనలై ముంచుకొచ్చే ప్రమాదమట! పసిగట్టిన శాస్త్రజ్ణుల హెచ్చరికలు! ఫలితం మాత్రం శూన్యం! ఊహించనిరీతిలో.. ఊళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయాయి! నిశ్శబ్దాన్ని చీల్చుతూ.. మా ముద్దు పప్పీ.. మొరుగుతోంది, ఏదోహెచ్చరిక చేస్తూ.. ప్రశాంతమైన పున్నమిరాతిరి, ఒక్కసారిగా హాహాకారాల మధ్య అట్టుడికింది! భూమాత కుదిపిన రెండే రెండుకుదుపులు.. కుప్ప కూలిన కట్టడాలు.. కట్టడాలక్రింద నుజ్జయిన ఎన్నొ శరీరాలు.. రిక్టరుపై..లెక్కలు చెప్పిన శాస్త్రజ్ణులు! ప్రకృతిని పరిశీలించి..పరిశొధించి, ఆమె కోపతాపాలని ఖచ్చితంగా లెఖ కట్టే శక్తి మనిషి సొంతం ఇప్పుడు! కానీ... ఆమె క్రోధాన్ని ఆపే శక్తి.. పచ్చదనాన్ని విచ్చిన్నం చేస్తున్న మనకుందా? .....03.06.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kkv1ep

Posted by Katta

Jagadish Yamijala కవిత

ఏదో చెప్పాలనుకుని.... ----------------------------- అన్ని ఆకులను తాకుతూ వచ్చిన గాలి నన్నూ తాక్కుంటూ పోయింది నేనూ ఒక ఆకునై నృత్యం చేస్తూనే ఉన్నాను... ----------------------- సముద్రాన్ని చదివాను గుప్పెడు నీటిలో.... ----------------------- ఎన్ని చినుకులను కలిపినా చివరికి ఒక్క చినుకే మిగులుతోంది --------------------------- ఒక్కొక్క క్షణంలోనూ ఒక్కో ప్రపంచం --------------------------- ఒక్క మంచుబిందువునైనా సంపూర్ణంగా చూసింది లేదు ------------------------- నీడను తరిమితే సూర్యుడు దాక్కుంటున్నాడు ------------------------- అంతిమంగా ఏం చెప్పగలం మరణాన్ని తప్ప.... ------------------------- తమిళంలో నా మిత్రుడు మా పుహళేంది రాసారు.... ఆ భావాన్నే నాకు తోచిన తెలుగులో చెప్పాను - యామిజాల జగదీశ్ 3.6.2014 ---------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Isxt

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చరమాంకం రోడ్డును హత్తుకున్న నీరెండొకటి చీకటికి చుట్టమవుతూ మాయమవుతోంది వన్యపు స్తన్యాన్ని నరుకుతున్న చేతులు అప్పుడప్పుడు నీళ్ళొదులుతోంది కాటికి కట్టెలు కరువయ్యేదాకా రెండు కళ్ళలో ఇంత పచ్చదనాన్నీ పోసుకుంటావు చూడూ నువ్వు సంపాదించినట్టు తెల్లరక్తం ఆ పూలముఖాలపై ఎక్కువ కాలం వనాన్నీ తమలోకి తోడుకోలేక కొత్త వర్షం పలకరిద్దామన్నా పిలవలేని నిస్సహాయతలో ఓ సజీవ కళేభరం పరిది విస్తరించిందిగాని పరిమితిని కాపాడుకోలేక మట్టిగా మిగిలింది ఆనవాళ్ళను మిగుల్చుకోలేక ఆశలను వేర్లతుంగలో తొక్కి స్థాణువై నానుతూ తిలక్ బొమ్మరాజు 03.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6IuFo

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి |RIP| మొహం మై పూతలకి జరుగుతున్న పూజలకి మొహం కోసం చచ్చిన ఆత్మలని మరచి మరి మైమరుపుగా చూస్తున్నప్పుడు కలిగిన కలతలో **** సావొద్దు అంటే సచ్చేదాక ఇనలే సచ్చినంక కానేటోడు కనవడలే సావు బతుకుల మధ్య ఊగుతున్న భూమి కి పురిటి దానం చేసి సావెతుక్కున్న సమాధుల మీద సుకూన్ గా కూకున్న రాజకీయ మరాఠి సేతుల్ల మల్ల సచ్చినవ్ కదనే బతికున్న గోస లో బతుకులేకపాయె సచ్చినోడి కి పూలదండల పూలు కరువాయే బిడ్డా సావొద్దని నిన్ను అడిగేటోడు గప్పుడు లేకపాయే .. బతికున్న అమ్మకి గిప్పుడు గంజి కరువాయే సచ్చి ...రంకు సచ్చినోల్ల దొరల ఇంట్ల రాచ పీనుగు కి పట్టం గడితివి .. సావొద్దంటే ఇనకపోతివి సాధించింది నువ్వేనే .. నిన్ను సంపుకొని నీ ఘోరీ మీద పీర్ల సంకలెక్కి కుషి జేస్కుంటున్న దొం...లం .....లను జూస్తే నీ సావ్ మీద సావుకే జాలి గలిగే గద నీ బూడిదె రాల్సిన అన్నపు ఇత్తులు ఆడి నవ్వుల ఇషం గల్సి సేదెక్కినయ్యి బిడ్డా ... సావొద్దంటే ఇనకపోతివి నిశీ!! 03-06-14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kkdfb1

Posted by Katta

Renuka Ayola కవిత

//నా నడకలో నగరం// రేణుక అయోల రోజు నడుస్తాను నిశ్స బ్దంలో శబ్ధనై ఆకుపచ్చని గడ్డి అలలపై నడిచే నల్లని పిట్టలని చూస్తూ తెల్లటి మనుషుల పల్చని చిరునవ్వుల మధ్య నడుస్తాను ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది చెట్లనీడలు ఆకుపచ్చని లోయలని తడుముతాయి ఆక్కడే కుక్కపిల్లలు ఆడుకుంటూ వుంటాయి మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం నాదేశంలోకి తీసుకు వెళుతుంది కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి ద్వారాలు వేరవుతున్న చప్పుడు అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు నగరం నన్ను నీడలా అనుసరించింది చుట్టూ నిద్రపోతున్న నిశ్సబ్ధంలోకి జలపాతంలా దూకింది అది ఆకుపచ్చని నీడలోకి కనుమరుగైనా నగరం ధూళిలో నేను నడుస్తున్నాను ఆకుపచ్చని నిశ్బబ్ధం లోకి ఒరిగిపోతూ

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rEsQ9w

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 31 ( కవిసంగమం ) చదివిన కవిత్వ సంపుటి పేరు :- " ఆకుపాట " ( కవిత్వం ) కవిత్వ సంపుటి రాసిన కవి :- " శ్రీనివాస్ వాసుదేవ్ " సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి “ “మనసు కాగితంపై తడి ఆరని ఓ వర్షపు సంతకం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం” " నువ్వేమో వెన్నెలా నేనేమో వాన "-అని అనుకొంటూ 'వర్షం లాంటి అసూయ పడే ప్రేమ " కోసం మనసంతా వర్షం లో తడపటానికీ "ఆ నాలుగు వర్షపు చుక్కలూ గుండెని తడిపి మరీపలకరింపు"చేయడానికి,"ఓఅక్షరమో వానకారుమేఘమో తట్టిలేపడానికీ ,"కాగితంపై వచ్చి పడుతుంటాయి వడగళ్ళ వానలా" "నిన్న వర్షంలో పట్టుకున్న వో బిందువులా " ఓ షెహనాయీ వేదనతో శ్రీనివాస్ వాసుదేవ్ కలం నుండి కాగితంపై తడి ఆరని సంతకంతో దివ్యానుభూతితో కొత్త భావనతో కవిత్వాక్షరాలు రాలి "ఆకుపాట "ని ఆలపించాయి. వర్షం అంటే ఎవరికైనా హర్షం కలుగక మానదు.శ్రీనివాస్ వాసుదేవ్ తన "వర్షం"-అనే కవితలో "వర్షం నా బలమైన బలహీనత" అన్నాడు. అందువల్లనేమో రాయాల్సిన సందర్భమొస్తే చాలు వర్షం గురించి కనీసం ఒక వాక్యమైనా రాస్తాడు ఈ సంపుటిలో చాల కవితల్లో.ఆ వాక్యాలే పైన నేను అన్నవి ఆయన గురించి. ఏకంగా "వర్షం"._(నా బయో గ్రాఫర్) అనే కవితను వర్షం పైన రాసేశాడు. "వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి కథ ఓ షహనాయీ వేదన... వర్షవాకిళ్ళ వేదం,వాన చిగురు వేదాంతం కాగితప్పడవల సయ్యాట,చూరుపై నుంచి వానపాట మనసుపై తడి ఆరని ఓ సంతకం వర్షమెప్పుడూ ఓ అద్భుతం" ఓ అపురూప దృశ్యమే.కురుస్తున్న ప్రతి వాన చినుకు నేలను చేరే సమయంలో ఒక గోళం ఆకృతిలో వుంటుంది.చేయి చాచి అడిగినప్పుడల్లా అవి అనునయిస్తూ అరచేతిని తడిపినాయట.శ్రీనివాస్ ఊహా ఒక చాంపేయమాలల కవితంతా అల్లుకపోయింది ఈ కవితలో.షహనాయి స్వరపు దుఃఖపు జీరలా వాన చినుకు సవ్వడి ఓ కన్నిటి కథను చెబుతుందన్న భావమే వాసుదేవ్ ని విభిన్నమైన కవిగా నిరూపిస్తోంది. "వర్షంలో తడిసి తడవకుండా చేతిని బయటకు చాచినప్పుడల్లా చూరునుండి భారమైన చుక్కలు ఙ్ఞాపకపు నీడల్లా... ప్రతి గోళం ఓ కథ చెప్తూనే ఉంది ఓ ఙ్ఞాపకాన్ని వొదుల్తూ తమకంగా!" ఇందులోని భావ చిత్రం మన మనసులో ఒక గాఢముద్రనే వేస్తుంది.ఙ్ఞాపకాలతో బరువెక్కిన వాన చుక్క చెప్పే కథని విని చేయి దాన్ని వదిలేస్తుంటే ..ఆ వర్షపు నడుము చుట్టూ తన చేతులు వేసి కౌగలించుకున్నట్లు కవి ఊహచేసి కొత్త భావాన్ని,కొత్త దివ్యానుభూతిని ఇచ్చినట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దంగా కురిసే వాన చినుకుల సడిని ఈ కవి ఆకాశపు నిట్టూర్పులుగా ,మనసు బావురమని అన్నప్పుడు అది కురిసిన కన్నీటి బొట్లుగా పోలిక చేయడం, ప్రతి వర్షాన్ని ఒక సంగీత విభావరిగాగా సంభావించడం కవి ఎంతగా ఊహల ఊయల్లోకీ వెళ్ళిపోయాడో "వర్షం" కవిత మనకు చూపిస్తుంది. కవి ఎంతగా వర్షాన్ని తమకంతో ఇష్టపడ్డాంటే వర్షం తన కథని రాసే బయోగ్రాఫర్ అని అనేంత. స్వర్గం నుంచి భూమ్మీదకు పరిగెత్తుకొంటూ వచ్చి ఆ భూమిలోకి వెళ్ళి మాయమయ్యే వర్షం ముక్తిని చెప్పే ఓ పాఠంగా కవి తాత్వికంగా చెబుతాడు.ఈ "వర్షం"-కవితలో ప్రతి పంక్తిలో కవి మెస్మరైజ్ చేసే పోలికల్ని ప్రతిభావంతంగా ప్రయోగించాడనటానికి ఎంతమాత్రం సందేహపడను. "వర్షం " కవితని చదివి రాసేటప్పుడు ఈ కరువు నేల మీద ఓ నాలుగు చినుకులు రాలటం కేవలం యాధృఛ్చికమేనేమో? ముప్పైరెండు బొమ్మలు చెపిన కథలు కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక లో పద్యంలో చెబితే ఆకులు చెప్పిన అరవైనాలుగు కథలు మైనంపాటి మైనంపాటి సుబ్రహ్మణ్యం శర్మ వచనంలో చెబితే డెభ్బైఏడు గుడి మెట్లు చెప్పిన కథల్ని శ్రీనివాస్ వాసుదేవ్ వచనకవిత్వం చేశాడు.అయితే శ్రీనివాస్ చెప్పిన తీరు వేరు.వాళ్ళంతా అనేక పద్యాల్లో, అనేకవందల పుటల్లో చెబితే ఈ కవి ఓక్కొక్క గుడిమెట్టు చెప్పే కథని ఆ మెట్ల చేతనే పాఠకుడే ఊహించుకునేటట్లు ఒకటి రెండు వాక్యాల్లోనే చెప్పిస్తాడు.ఆ యిద్దర్ని తక్కువ చేయడానికీ కాదు ఈ పోలిక నేను చెప్పింది.అసలు ఆ ఇద్దరికీ ఈ కవికీ సాదృశ్యమేలేదు. బొమ్మలు,ఆకులు కథలు చెప్పినట్లే గుడిమెట్లు కూడా చెబుతాయి కథల్ని అని చెప్పడానికే పోలికలు చెప్పాను. "గుడిమెట్లు-ఓ శిథిల కథల సంచిక"-అనే ఈ కవిత తనకి ఈ ప్రపంచాన్ని ఇచ్చిన అమ్మని, చేతుల్లోంచి జారిపోయిన తీర్థంలా వెళ్ళిపోయిన అమ్మని తలుచుకుంటూ,ఆమె ఙ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతెచ్చే గుడిమెట్లను వొక అంతర్లీన దుఃఖంతో శిథిలకథల్నిచెప్పినట్లుగా శ్రీనివాస్ రాసిన కవిత ఇది. "గుడికన్నా ముందే పలకరించే /ఆ డెభ్బైఏడు మెట్లూ డెభ్బైఏడు కథలు"-అని ఈ కవితని కవి ఆరంభిస్తాడు. ఒక్కో గుడిమెట్టును ఎక్కుతూ వెనక్కినెట్టేస్తున్న అనుభవానికీ తను లోనైతే అతని అమ్మ మాత్రం గతాన్ని ఎక్కడో కలిపేసే ఆలొచనలో వున్నదని చెబుతూ,మెట్టు చివర మొలకెత్తుతున్న గడ్డి మొక్క,కాలానికి లొంగిపోయిన శంఖం పువ్వు,దేన్నుంచో విడివడిన సంపెంగ రెమ్మా ఇవన్నీ పలకరించి ఒక్కోక్కటీ జీవితానికి సరిపడ తమ కథలు చెప్పాయని కవి అంటాడు.ఆ అనడంలోనే గడ్డిమొక్క,శంఖం పువ్వు,సంపెంగ రెమ్మలకు మానుషత్వాన్ని ఆరోపించి వాటి వెనుక దాచేస్తే దాగని కథల్ని పాఠకుడు వూహించుకుండేటట్లు చాస్తాడు. "అమ్మ అంటూనే ఉండేది నీతో గుడికిరావడం 'ఓ అనుభూతిరా' అని అదేంటో అర్థంకాని వయసు! ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ మెట్లపొడుగునా ఇపుడు ఙ్ఞాపకాల శిలాజాలే" భూమిపొరల్నిఎంతో లోతుగా తవ్వుకొంటూపోతే ఆ లోపలిపొరల్లో పూర్వజీవుల జాతుల అసలు రూపాలు కప్పబడి వాటి వునికిగా నిలిచిన రూపాలనే శిలాజాలు అంటారు.'శిలాజం అనే పదాన్ని ప్రయోగించి కవి ఎంత లోతైన భావాన్ని ఈ కవితలో పొదిగాడో అర్థం చేసుకోవచ్చు."చీర కొంగుతో చెయ్యి తుడుస్తున్న ఆమెలో తెల్లరంగు అద్దుకున్న నవ్వు"ని కవి చూశాడట.ఆ నవ్వుకి అర్థం అపుడు తెలీకపోయినా,ఇపుడు గతాన్ని ఇలానే చూడాలని అవగతమయ్యిందట. అంటే తెల్లరంగు అద్దుకున్న నవ్వుతో చూడాలని.తెల్ల రంగు స్వఛ్చతకీ ప్రతీక.గతాన్ని అట్లా చూసే తత్వం అలవరుచుకోవడం అంత సులభమా?-చాలా లోతైన భావ పరంపరల్ని ఈకవి మనకొదిలేసే విద్యలో కడు నేర్పరిలా అగుపిస్తాడు ఇలాంటి వాక్యాలను రాసి. ఇదే కవితలో ఇంకో చోట " జీవితపుటల్లో అందమైన బుక్ మార్క్ ఈ గుడి మెట్లు"-అని అంటాడు.బుక్ మార్క్ అనే పదం కంఫ్యూటర్ కు సంబంధిన పారిభాషిక సాంకేతిక పదమే కావచ్చు.కానీ ఈ కవి ఆ పదాన్ని ఆ ఆలోచనలో వాడినట్లు లేదు.పుస్తకం చదువుతూ మధ్యలో ఆపేసినప్పుడు గుర్తుగా కొందరు అందమైన నెమలీకలు వాడేవారు.ఇప్పుడు పుస్తకానికి అనుబంధంగా ఒక రిబ్బన్ లాంటి దారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.చదివి ఆపేసిన తరువాత పుటల దగ్గర ఆ రంగుల రిబ్బన్ దారాన్ని వుంచడం వల్ల తిరిగి అక్కడనుంచే చదువుకుండే అవకాశం కలుగుతుంది.జీవితపుస్తకంలో ఆ గుడిమెట్లు ఓ బుక్ మార్క్ లా వుండి మళ్ళీ ఆ పుస్తకాన్ని తిరిగి చదువుకోవడానికీ,అంటే ఙ్ఞాపకం చేసుకోవడానికీ.ఇంతటి విస్తృతార్థాన్ని ఒక మాట బిగింపులో కవి శ్రీనివాస్ వాసుదేవ్ సాధించే ప్రయత్నం చేస్తాడు చాలా కవితల్లో. విశాఖ బీచ్ చేత కానీ సముద్రం చేతకానీ ఆకర్షంపబడనికవి వుంటాడనుకోను.మహాకవి శ్రీ శ్రీ సైతం విశాఖ మీద 15 ఆశ్వాసాల ప్రబంధం రాస్తానని రాయలేదు.విప్లవ కవయిత్రి విమల విశాఖ సముద్రాన్ని సౌందర్యదృష్టితో "ఉదయం నీరెండలో..అలలు బద్దకంగా వొళ్ళు విరుచుకొంటాయని ,అలలు తీరానికేసి తలలు బాదుకొంటాయని,సముద్రం గుండెలో చీకటి బాకులా రాత్రి గుచ్చుకుం టుందని,అప్పుడు అలలు నల్లగా పైకి లేస్తాయని అంటుంది వొక కవితలో."కిటికీ రెక్కల మల్లే కొట్టు కొంటూ జీరాడే అలల కుచ్చుల కర్టెన్లు తేలిపోతూ కిటికీలా విశాఖ సముద్రం"-అని రవూఫ్ అనే కవి ఆ సముద్రాన్ని అద్భుతంగా వర్ణించారు.శ్రీనివాస్ వాసుదేవ్ కూడా విశాఖ బీచ్ ని ఒక నోస్టాల్జియా గా చెబుతు ఆ సముద్రపు అలలపాటలను తన సొలిలాక్విలో వొక భాగంగా పోలుస్తాడు.సముద్రం ఏ కచేరిలో చూడని వాయిద్యపరికరాల ద్వనిని తన అలల శబ్దంతో మోసుకొచ్చిందనే ఒక భీతవహ ఊహని ప్రవేశపెడతాడు "నేనూ, నా సముద్రం"అనే కవిత ఆరంభంలో. "కంటి బిగువున అదిమిపట్టలేని దుఃఖంలా ఫెళ్ళుమన్న గుండె రోదించినట్టు ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం! వేయి మృదంగాలాఘోషగా ఆరంభమై శృతి చేసుకొంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతు" ఎంత ఊహాతీతంగా ఈ కవి సముద్రపు అలల సంగీతాన్ని ఊహ చేశాడో ఊహించండి ఒకసారి ఈ కవి సంభావన శక్తి ఏమిటో ద్యోతకమవుతుంది . తనతోనే,తనలోనే వుండే సముద్రాన్ని " ఎవరో స్త్రీ అని అరచారని చెప్పిన ఆ అరచింది కవే అని ఆ స్వరంలో మనం గుర్తించవచ్చు.కవి హృదయం పొందిన ఏ అనుభూతైనా అక్షరరూపం దాల్చి కవిత్వం కావాలి.కానీ కొన్ని అనుభూతులంతే కలాన్ని కలవరపెట్టితుఫాను మేఘంలా కురవకుండా కమ్మేసి పోయినట్లు కొన్ని మధురానుభూతులు కూడా కవిత్వమవ్వవని కవి ఎంతో వెతల వెక్కిళ్ళ మధ్య చెబుతూ అవి వెన్నెలని పట్ట్కొని జేబులో పెట్టుకోనివ్వవని,వర్షాన్ని తాగనివ్వవని అనుభవపూర్వక ఙ్ఞానంతో చెబుతాడు. "మట్టి ముద్దల్లోను,రాళ్ళ రాసుల్లోనూ అర్థంకానివన్నీ వుంటాయి దేవున్నో,దేవతనో చూడమన్నారు ఇక్కడే.. కళ్ళు మూసుకున్న చీకట్లో దండం పెడుతూనే ఉంటాను చిరునామా అవసరం లేని దేవుడికీ" ఈ దేవుడికన్నా మూరెడు మల్లెలు,మూడక్షరాలూ, చెప్పే కథలు-వీటన్నిటిని కవిత్వీకరించుకోవడమే తనకి ముఖ్యమని అక్షరాలే దేవుళ్ళని కవి తీర్మానించుకొంటాడు. ఈ కవి తన సంపుటిలో ఒక ఎలిజీ రాశాడు.ఎలిజీ అంటే ఆత్మీయులైనవారు కానీఉ,ప్రసిద్దులైన వారు కాని మరణిస్తే వారి స్మృతికి అంకితంగా రాసే రచన.సాధారణంగా ఎలిజీలు కరుణరసాత్మకంగా వుంటాయి.కొన్ని ప్రబోధాకాలుగా కూడ వుండొచ్చు.ఈ కవి కూడా వేగుంట మోహన ప్రసాద్(మో) చనిపోతే ఆయన చితి ని చూసి చింత చేశాడు ఒక ఎలిజీ రాసి."అక్షరమో...అనుభవమో"-అని దానికి శీర్షిక వుంచాడు.కవిత్వపు జిలుగులు తెలియనివాడు,కవితా హృదయం లేని వాడు కాదు వేగుంట మోహన ప్రసాద్.అత్యంత ప్రతిభావంతుడైనా ఈ అదునిక కవికొరకు శ్రీనివాస్ రాసిన ఇందులో "ఓ దిగులు కర్ర వేలాడుతోంది మెడపై పదానికీ పద్యానికీ ఇరుక్కున్నాననీ కొన్ని 'మో' లు ఎక్కువయ్యాయనీ.."-అని మో కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. పుట్టినప్పుడు పురిటి వాసన ఆడపిల్లేనా అని మూతి విరిచిన ముదితల ఆడిపోసుకొనే మాటల్లో "అమ్మా! నా డిబ్బి పగలకొట్టనే"-అని రోదిస్తున్న జోగిని స్వగతం గురించి చెప్పినా,"ఖబడ్దార్! మా గొంతు నొక్కాలంటే"-మళ్ళీ మా పాటలపై మాట్లడావంటే మా ప్రతి పాటా మీ మరణశాసనమవుతుందని ఛాందసుల దాడికీ గురైన కాశ్మీరీ యువతుల మ్యూజిక్ బ్యాండ్ నిర్వహనని గురించి రాసినా,స్వేచ్చ కోసం ఏడు చువ్వల్ని పట్టుకున్న ఖైదీల గురించి రాసినా,ఖ్మేర్ రోజ్ దురాగతాన్ని చెప్పినా,"ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదన్నట్లు"-జీవితాన్ని ప్రశ్నించి నిర్వచించిన మరణాల్నీ వర్ణించినా,"ఈ గ్రాఫిటి గీతలు,గోడమీదికి దిగివొచ్చిన హరివిల్లులని"అనుకుండే వారిపైన నిషేధం విధిస్తూ చట్టం చేయాడాన్ని నిరసించినా,"ఇక్కడ చెట్లూ,దేహాలూ కాలుతుంటాయి కొన్ని కాలడం కోసం పుడితే కొన్ని పుట్టడం కోసం కాల్తాయి"-అని మలేసియా అడవుల్లో రబ్బరు తీసే ఉద్యోగంలో జాడల్ని కోల్పోయిన వారిని అభివర్ణించినా,"పలకరించలేని నిస్సహయత.."తో "అర్థం కాని దేహ సంశయం"తో-"జీవన మర్మంలో అర్థంకానీ దేహ మర్మమంతో ఊగిసలాడే ట్రాన్స్ జెండర్,దేహంలోపై భాగం స్త్రీగా,దిగువభాగంపురుషుడిగావున్న వార్ని చింత్రించినా శ్రీనివాస్ ప్రతిభా మన కళ్లను తప్పించుకోలేక ఇట్టే దొరికిపోయి ఆలోచనా సముద్రంలోకీ మనల్ని లాక్కెళుతుంది. అఫ్సర్ "ఆధునిక జీవన శకలాలుగా జీవిత విశ్వరూపం చూపించిన కవిగా ఈ కవిని గుర్తిస్తే,"తనదయిన ఒక ఆకాశాన్ని కోసుకొంటూ రాలిన కన్నిటీ చుక్కలను లోకంతో పంచుకుంటున్న కవి అని హెచ్చార్కే అంటే "బతుకు రంగుల కోరస్ ఈ కవి కవిత్వమని యాకుబ్ చెబితే నౌడురి మూర్తి గారు మాత్రం "కొందరి కవిత్వానికీ అనుభూతి,కొందరికీ ఆవేశం,కొందరికీ ప్రతీకలు,కొందరికీ పదబంధాలు,కొందరికీ గమకం లేదా తూగు,ఇలా ఒక్కోక్కరికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది.ఈ ఆకు పాట వీటన్నిటి సమ్మేళనం"-అని అన్నారు. వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని వారు ఎవరూ వుండరు ఈ కవిత్వ సంపుటి చదివితే.నిజంగా ఈ సంపుటి "కవిత్వ కిర్మీరం".అంటే అనేక వర్ణాల కలయిక. బహుత్వ తత్వానికి(pluralistic philosophy ) ఈ కవి కవిత్వం ఒక ఉదాహరణం అని నేనంటాను. Smorgasbord అనేది అన్ని రుచులు వుండే విడివిడిగా వుండే పదార్థాలతో వడ్డించే స్కాండినేవియన్ బఫెట్ .దాన్ని విడివిడిగానైనా తినొచ్చట.లేదా కలుపుకొనైనా తినొచ్చట.ఈ పోలిక ఎందుకు తెస్తున్నానంటే ఈ సంపుటిలోని కవితల్నీ కలిపి చదువుకోవచ్చు.విడివిడిగానైనా చదువుకోవచ్చు.ఎలా చదువుకొన్నా కవిత్వపు గాఢత గాని,సాంద్రతలో చిక్కదనం గానీ ఎంత మాత్రం తగ్గినట్టు అనిపించని మంచి కవితల్నీ ఈ శ్రీనివాస్ వాసుదేవ్ ఈ సంపుటిలో వడ్డించాడు కవిత్వ ప్రియుల కోసం. ఓ చెట్టు కిందో,ఓ మేఘం కిందో మనసు పరచి మాట్లాడాలని వుందని కాంక్షించే ఈ కవి ఇంకా ఎన్నొ అద్భుత కవితల్ని వేలార్చినా స్థల.కాలాభావాల కారణంగా తాత్కాలికంగా విరమిస్తున్నా. Being,becoming,belonging ఈ ట్రినిటిలో నువ్వేమిటి కవీ?-అని ప్రశ్నించే ఈ కవి "మనసు మాట విననప్పుడల్లా ఓ కవితా వాక్యం పుడుతుందే నీ నుంచి-"అని కవికీ భరోసా ఇస్తాడు శ్రీనివాస్ వాసుదేవ్. "మనసుందని ప్రేమించలేను...మనసే ప్రేమయినప్పుడు నువ్వు లేవనీ అనుకోలేను. ప్రేమ నువ్వైనప్పుడు "-అని అనే ఈ కవి ప్రేమను గూర్చి కూడా తనదైన తాత్వికతతో పుష్కలంగా రాశాడు."ప్రేమ అడుగుల చప్పుడు గుండెలపై సున్నిత మోత/చీర కుచ్చెళ్ళకీ సంగీతముంటేనా"-ఇలాంటి అందమైన సుకుమార ప్రణయ మృదు భావనలేమీ కొదువలేదు ఈ కవిత్వంలో. కవి మిత్రులను శ్రీనివాస్ వాసుదేవ్ వినిపించే "ఆకుపాట" వినండని కోరుకుంటూ వచ్చే మంగళ వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wW4pnX

Posted by Katta

Kodanda Rao కవిత

మిత్రులు శ్రీ రాజేంద్రకుమార్ గారి కవిత ఒకటి ఇప్పుడే చదివాను, బాధ కలిగింది. నేనూ ఒక కవిత రాసి దానికి కామెంటు గా పెట్టాను. శ్రీ రాజేంద్రకుమార్ గారి కవిత ******************* తెలంగాణా ఇక ప్రత్యేక రాష్ట్రం అవశేషాంధ్రకు ప్రత్యేక పథకం మరి నా రాయల కో .....? వీలయితే ప్రత్యేక దేశం చెయ్యండి సాధ్యమయితే భూమండలంలోంచే విడదీసి విసిరేయండి. మరో గ్రహమయినా అనుగ్రహిస్తుందేమో ? 18/02/2014 కె.కె.// ఒకటేలే// ************* రాయలన్న పదంలోనే, రాజసమున్నదిలే, ఎక్కడున్నా, ఎప్పుడైనా స్వతంత్రులే,స్వతంత్రులే, వ్యధలు పడకు, మదన పడకు చింతనెపుడు చెంతకు రానియ్యకు, అవశేషాంధ్రము కాదిది, అశ్వమేధ యాగానికి సంసిద్ధం చేయబడ్డ శ్రీరాముడి గుర్రమిది. తెలంగాణ వేరుపడినా, అని ఎవరో అంటున్నా, అదంతా పనికిరాని కాగితాలపైనా, తమ్ముడొకడు అలిగాడు, మద్య గీత గీసాడు, స్పర్ధలు ఉండవులే ఎపుడూ, అమ్మనొదిలి ఏడకు పోతాడు. తెలుగు పదం, తెలుగు జనం ఒకటేలే, ఒకటేలే తెలుగు తనం, తెలుగు జగం ఒకటేలే, ఒకటేలే ============ 02.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5joGU

Posted by Katta