పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

వుయ్యాల జీవితం గాలిపొరల్లో నా మాటలు, పాటలు, నా దుక్కాలు నా వాగ్దానాలు వుండే వుంటాయి వెలుగుల్లో వుండేవుంటాయి నా కంట్లోని చిత్రాలు, మెరుపులు మరకలు, వానతడి సింగిడీలు మొగులు మీది జారేటి మబ్బులు నేలమీద రాసిన మెరుపుల రాతల్లో నా రుతువులుండే వుంటాయి పారేటి కాలువల్లో పారబోసుకున్న పచ్చివిత్తనాల మొలకనవ్వులు దాచుకునేవుంటాను దున్నిన పొలాల్లో నాగేటిసాల్లళ్ళో నా బతుకమ్మ నన్నెత్తుకుని పాలిచ్చి పాలించే వుంటది ఎన్ని కన్నీళ్ళు గుండెమత్తళ్ళు దుంకినా భరోసా యిచ్చిన మనుషుల మనసుల వేల చేతిస్పర్శలుండే వుంటాయి లేకపోతే... నేనె్ట్లా జీవించివుందును ఎవరో నన్ను ఆత్మీయంగా మోహనం చేయకపోతే ఎవరో నన్ను నా సమస్తదోషాలను ఇగిరించి మిగిలించకపోతే ఎవరో నన్ను నా చిన్ని చిన్ని ఈస్థటిక్స్ ని ఒప్పుకోకపోతే ఎవరో నన్ను నన్నుగానే ప్రేమిస్తూ వుండకపోతే నేనెట్లా సాగుతున్నయాత్ర నయ్యేవాడిని మరుపురాని బాటలెన్ని తిరిగినానో మనసునింపిన తోటలెన్ని గడిపినానో ఆకాశమార్గాన పాఁవురమున్ననా కలలెగిరిపోతున్నా నా ఆకలి తీర్చింది నా మట్టితల్లే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYEoB

Posted by Katta

Patwardhan Mv కవిత

సందర్భం:: ఎవరిది ఇది ??? ................. /////......అన్నా నేనొక జ్వాలా వలయితుణ్ణి దుఃఖితుణ్ణి నా లోపల నా బాధలు నా వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా బీభత్సరవాలు నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో సలసల కాగే మానవాశ్రుజలాలు అయినా అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం నా లోపల వినబడుతూ నన్నిలాగ నడిపిస్తూ సృష్టిలోని అర్థం కోసం జన్మలోని సాఫల్యం కోసం జనన మరణాతీతమైన సురభిళ రహస్యం కోసం.......///// ఎవరిదండీ ఈ పద సంగీతం?? 25-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXWwfY

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || శోధన|| ========================== జీవిత అర్ధం కోసం ప్రతి రోజు భూతద్దం పెట్టి నిఘంటువులో వెతుకుతున్నా నానార్ధాలు తప్ప జీవిత అర్ధం తెలీక అపార్ధాల లోకంలో సంచరిస్తున్నా ! ప్రతి రోజు అద్దం భూతద్ధమై వెక్కిరిస్తుంటే నా ప్రతిబింబం అద్దంలో నుండి తొంగి చూస్తుంది ఈ గూడర్దాల లోకంలో నా రూపం నిత్యం నయవంచనకు లోనవుతూ ... అర్ధం కోసం అన్వేషిస్తే జీవితం పరమార్ధంగా మారింది నిత్య శోధనలో ఎన్నో కఠోర సత్యాలు బాహ్యం గా అర్ధం తెలీక నగ్నంగా వెక్కిరించాయి జీవితంలో నిత్య సంఘర్షణలు ఇంద్రజాలంలా మాయమవుతున్నాయి నీడలు మాత్రం తరుముతున్నాయి నేను మాత్రం పరిగెడుతున్నా నిఘంటువు జీవితమయ్యింది ఎన్నో ఎన్నెన్నో పరమార్ధాల నడుమ జ్ఞాపకాల భూతద్దం పగిలిపోయింది అద్దం లో నీడలు లేవు ప్రతి పేజి ఒక జీవితమే ! ------------------------- మార్చి 25/14

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYC03

Posted by Katta

Prasad PV కవిత

ప్రియమైన ఫేస్ బుక్ మిత్రులకు నా మనవి.. నా పేరుతో కొందరు మిత్రులకు కొన్ని ఇబ్బందికరమైన గ్రూప్ లలో జాయిన్ అవ్వాలని కోరుతూ నేను Invite చేసినట్లు Notifications / Messages వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం నేను కేవలం 5 గ్రూప్ లలో కొనసాగుతున్నాను. అవి " 1. kavi sangamam*కవి సంగమం*(Poetry ), 2. Special group, 3. చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు, 4. ప్రియతమా అందుకో నా గీతం..నీకోసమే" 5. పూల సోయగాలు. ఇందులో "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" అనే గ్రూప్ లో నేను 9 మంది Admins లో నేనొక Admin మాత్రమే. ఎవరినైనా నేను Invite చేసిందీ అంటే కేవలం "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" Group లో మాత్రమే. అయితే నా మిత్రులు కొందరికి ఈరోజు కొన్ని అసభ్యకరమైన గ్రూప్ లో నేను Invite చేసినట్టుగా మెస్సేజెస్ వచ్చినట్లు నా ద్రుష్టికి వచ్చింది. FB మిత్రులకు నేను తెలియజేసేదేమిటంటే అలాంటి Messages తో నాకెలాంటి సంబంధం లేదు. అలాగే ఇలాంటి Invitataion messages ఎలా వచ్చాయో నాకూ తెలియడం లేదు. FB మిత్రులు దయచేసి నేనేం చెయ్యాలో నాకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా ప్రమేయం లేకుండా ఇలాంటి Messages తో ఇబ్బంది పడుతున్న నా మిత్రులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలను కోరుతున్నాను. దయచేసి ఈ సమస్యను నేను ఎలా అదిగమించాలో కూడా నా మిత్రులైన మీరు నాకు తెలియజేయాలని కోరుతున్నాను. కృతజ్ఞతలతో...... మీ మిత్రుడు ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYAoX

Posted by Katta

వనజ తాతినేని కవిత

వనజ తాతినేని || స్వప్నలోకం || స్తబ్దత లోను.. అతి నిశ్శబ్ద భావ సంచనల రూపమా.. చేతనతో నన్ను నేను దర్శించుకునేలా చేసే..మాయా దర్పణ సౌధమా .. అనిశ్చిత జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట రూపమా.. జీవనకాసారంలో.. నేడు - రేపు మధ్య సంధిగా నిలిచిన మగతలో.. మరో.. లోకాన్ని.. చూపిన.. నేస్తమా .. అచేతనావస్థలో.. గత స్మృతులను రేపిన.. స్వప్నమా. లౌకిక స్వప్నాలతో.. అలౌకిక ఆనందం మిగిల్చిన .. తేజమా.. కోటి ఊహలతో.. మనోరధంపై..ఊరేగానో కోరికల రెక్కల గట్టుకుని అంబరాన స్వేచ్చా విహంగమై.. విహరించానో.. కలతలెన్నో.. మరిపించావు.. కలవరము కల్గించావు.. నీలో నేను కరగని నాడు.. నేనొక విగత జీవినో..నిశాచరినో.. అందుకే.. అయ్యావు నువ్వే నాలోకం... నాదైన లోకం. స్వప్నలోకం.. స్వప్న సౌధంలో .. నివశిస్తూ అందరు స్వప్న సాకారానికి..ప్రయత్నిస్తూ కొందఱు .. జీవితమంతా స్వాప్నికమై.. సాగుతూ మరి కొందఱు .. స్వప్నం .. బ్రాంతిగా భావించిన ఎందఱో ... ఇందరికి ఉందిక్కడ లిఖించలేని చిరునామా ఓ ... జీవితకాల నమూనా. 25/03/2014.

by వనజ తాతినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUC5C

Posted by Katta

Srivalli Radhika T కవిత

http://ift.tt/1gVUDq9

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUDq9

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆహ్వానం జయనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం 31.3.2014 సోమవారం ఉదయం 10.30 గంటలకు ఖమ్మం మంచికంటీ భవనం వేదికగా నిర్వహించబడును . కవులు, సాహితీ అభిమానులకు సాదర అహ్వానం -- సాహితీ స్రవంతి - ఖమ్మం.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gxMCO1

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljoQaE

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది అమ్మ భాష వదిలి, ఆంగ్లమ్ము నేర్చుట ఆంగ్లమే నిజమిపుడాస్తి యనుట నదిని దాటి తెప్పను తగలెయ్యడమౌను తేనె లొలుకు తెలుగు తీపి నెరుగు

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf5t2

Posted by Katta

Chi Chi కవిత

_ నిద్రాజనం_ ప్రపంచం పిలిచేదాకా మంచం దిగద్దు పిలిచాక్కూడా దిగద్దు దిగాలనిపించేవరకు మంచమే ప్రపంచం!! అయినా దిగిన తర్వాత మాత్రం ఏముందని? మెలకువతో పడిదొర్లే ప్రపంచమనే ఇంకో మంచం!! నిద్ర మెలకువల మధ్య దూరం మంచమంతుందో , ప్రపంచమంతుందో!! ఎంతుంటే ఏంటి.. మంచముందని నిద్రపోలేం , ప్రపంచముందని మేల్కోలెం రెండూ పిలవ్వు నిజానికి!! కానీ మంచానికి ప్రపంచానికి మధ్య పిలుపుదూరంలో ఏదో ఉంది అసలా పిలుపెందుకుందో పండులోది నిద్ర మెలకువలతో , మంచం ప్రపంచంతో సంబంధంలేకుండా !! అయినా పిలుపుతో మారే ప్రపంచం కోసం మేల్కోవడం కన్నా ప్రపంచమే లేని నిద్రలో మంచం దిగకపోడమే మేలేమో!! ఏందో ఏమో తేలేదాకా మాదీ నిద్రా పోతాయ్!!____(25/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1feohr7

Posted by Katta

Vani Koratamaddi కవిత

//మౌనం// మౌనంగా వున్న మనసు పలుకులు కరువై నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తూ పదాలతో ప్రపంచాన్ని పలుకరిస్తుంది నిట్టూర్పుల గాలులు భరించలేక నిశిలోకి చూస్తూ మనసు తలపులు మూసుకుంటాను నయనాలు కారుస్తున్న జల్లులు చెక్కిళ్ళపై కన్నిటి సముద్రాన్ని తలపిస్తాయి మాటలు పెదాలు దాటలేక భావాలు బయటకు రాలేక.. అక్షరాలై ప్రవహిస్తుంటాయి వాణి కొరటమద్ది 25/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf2gQ

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కుదించని సవరణ ---------------------------- 1/కొన్నిసార్లు నాలోకి లోతుగా జారిపోయాక గుండె గోడల పక్కగా ఓ కన్నీటి బిందువొకటి పొడిగా రాలి పడుతుంది నిన్నా నేటికి మధ్యగా 2/అంతరాళంలో కొన్ని నిశ్శబ్ధ అణువులు నీ మౌనంలో బలయ్యాక మిగిలిన శిధిలాల వెనుక దుమ్మును మరోసారి నువ్వుగా దులుపుకుంటూ 3/రెక్కలు మొలవని ఓ పిచ్చుక కళ్ళకింద దాగిన కష్టమేదో నీ మనసులోను ఉన్నట్టు స్రవిస్తాయి నీ పంచేంద్రియాలు ఈరోజు మళ్ళా 4/దివిటీ పట్టుకుని ఎడారి సొరంగాలలో పెనుగులాట తడియారని క్షణం కోసం 5/మంచుకిరీటాలన్నీ నీవే దాచేసుకోవచ్చు కరిగిపోని సంద్రంలో తీయగా 6/ఇంకా నడవాలి కొంత దూరం మళ్ళీ ఇంకొన్నిసార్లు పొడిగా పుప్పొడిగా మారాలి తిలక్ బొమ్మరాజు 25.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf20o

Posted by Katta

Mounasri Mallik కవిత



by Mounasri Mallik



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEUK

Posted by Katta

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//కొలత// గాలిలో తేమని హైగ్రోమీటర్ తో కొలుస్తారు హృదయంలో తేమను దేనితో కొలుస్తారు చెమర్చిన కళ్లతో తప్ప భూమి కంపిస్తే దాని తీవ్రతను రిక్టార్ స్కేలులో చూస్తారు కవి హృదయకంపనాన్ని దేనిలో చూస్తారు అతని కవిత్వంతో తప్ప

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEUv

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEE5

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ప్రేమించటం తప్పు కాదు దానిని ఒప్పించ లేక పోవటం తప్పు నీ వాళ్ళ ఆలోచన నీకు తెలియదా మార్చలేనపుడు వోర్చుకోక తప్పదు నీ ప్రేమ నీకు ముఖ్యం నీ మీద ప్రేమ వాళ్లకు ముఖ్యమే కదా ప్రేమ జీవితాలను నిలపాలి జీవితాలు రాలిపోయే ప్రేమలు ఎందుకు ?? తప్పు ఎవరిదీ కూతురి మీద ప్రేమదా ?? జీవితం బలి తీసుకున్న తన ప్రేమదా ?? ఎవరున్నారు అక్కడ సుఖం గా ?? ఏమి సాధించారు గుండె కోతేగా ?? చస్తే అయ్యో పాపం అనే జనం చావనీకుండా ఆపలేక పోయింది కదా ఎవడి జీవితం వాడిది . బ్రతికి వుంటే చస్తే ప్రతివాడు న్యాయ నిర్నేతే ఎక్కడ వున్నది పెద్దరికం ఎవడి బ్రతుకు వాడు , సమాజం నేడు అయ్యో పాపం అనే దిక్కులేని జనారణ్యం అయింది చూడు మనమంతా ఒక్కటే అని భావిద్దాం మనసు మనసు పంచుకుందా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం !!పార్ధ!!25mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gx8Qj5

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvABrY

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

|ఏమంత తొందర || గులాబీముళ్ళు గుచ్చుకొని రక్తసిక్తమయ్యుంది హస్తం పద్మంకోసం పంకిలంలో జారిపడ్డది పచ్చచొక్కా లింకులకోసం బలమైనలంకెలకోసం బంగపడుతున్నది కొడవలిక్కి నానోట్లో నీవేలు నీకంట్లో నావేలు .....ఎంచక్కా పొత్తయు పొడుచుకొందాం కుదరకుంటే చెప్పు ....కండువాల రంగులు మార్చే ఎజెండాలో పడదాం ఎన్నికలయ్యాక ఎవడెక్కాలో తేల్చుకొందాం......ఏమంత తొందరలేఇప్పుడు ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QaQFVT

Posted by Katta

Meher కవిత

సిద్ధార్థ || రేగడి మన్ను / చీకటి / ఏకాంతం || నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ నా జ్ఞాపక కాలం పొయ్యింది రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యంది ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో అనంతాకాశంలోకి లేచిపొయ్యింది లోపల ఏ జీవీ సందడించకున్నా కాలం కడుపుతో ఉన్నట్టు ఈమె దేహంలో పొలమారుతున్న ముల్లును నేను … రేగుపండు ముల్లును ఈమె చుట్టే పరుచుకున్న పొడిగాలిని తనకోసమే పడిగాపులు పడుతున్న దగ్ధ చినుకుని నారింజ కాసారం … తన తెరపొర … అర కూడా నేనిక్కడ ఎగిరే అఘోరీ పిట్టను - వొంటరి గుట్టను ఏకాంతపు చీకటి రేగడి మన్నును కల రవ్వను కాంతి బొట్టును పదం తెగిన పాదాన్ని నిరామయ మధ్యాహ్నపు పొలిమేరను చిత్ర ఢాకినిని March 24, 2014 http://ift.tt/1jAevCN

by Meher



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4qWYE

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

క్షణాల శాశ్వతత్వం ============ విడిపోయాం ! నిజమే ! మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు ! అదీ నిజమే ! అయితేనేం? మనం స్నేహించిన కాలం లో జీవించాం..గుర్తుందా ? మనం కలిసున్న కాలం ఎంతో కొంత ఉంది కదా ! గంటలో ...రోజులో....నెలలో ... ! నెయ్యంతో పంచుకున్న ఊహలు, ఊసులు పగల బడి నవ్వుకున్న నిమిషాలు... మనసు నలిగినప్పుడు ఓదార్చుకున్న క్షణాలు నేనే నువ్వన్నట్టు, నువ్వే నేనన్నట్టు ఒకరి నొకరు సహానుభూతించిన సందర్భాలు మౌనంగా పక్క పక్కన కూచున్న ఏకాంతాలు నా మనో మందిరంలో అందాల చిత్రాలు అమృతం లాంటి మన సాంగత్యాన్ని గరళం లాంటి నీ నిష్క్రమణాన్ని నా మనసు హంస లా వేరు చేస్తుంది నాటి అద్భుత ఘడియల్ని నెమరేస్తుంది జ్ఞాపకాల పరిమళాల్ని ఆస్వాదిస్తుంది కాల కూటం లాంటి నిర్గమనాన్ని త్యజిస్తుంది చర్విత చర్వణాల పై ఆసక్తి లేదు కా లం చేసిన గాయాలపై అచ్చెరువూ లేదు నిందా, నిష్టూరాలపై అక్కర అసలే లేదు అంతర్లోకంలో ఆ నాటి స్మృతులు నిక్షిప్త నిధులు ఆజన్మాంతం గుండె గదిలో అత్యంత పదిలాలు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSIx

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

. 80వ ద‌శ‌కంలో రాపజ‌మండ్రిలో సాహితీ వేదిక అనే ఓ సంస్థ ఉండేది. దానివ్య‌స్థాప‌క స‌భ్య‌ల్లో మ‌హేష్ ఒక‌రు. ఇది చ‌క్రాల వెంక‌ట సుబ్బు మ‌హేష్ అనే ఓ సాహితీ మిత్రునితో నా అనుబంధం గురించి. స‌హితీ వేదిక‌తోనూ దానిలోని మిత్ర‌బృందం తో అనుబంధం నాకు క‌విత్జీవ జీవితానుభ‌వాన్నిచ్చింది. ప‌దిరోజుల క్రితం సెల‌వంటూ శాశ్వ‌తంగా వెళ్లిపోయిన మ‌హేష్‌కు నివాళుల‌ర్పిస్తూ రాసిన జ్ఞాప‌కం ఇది. మనుషుల్లోని కవిత్వాన్ని ప్రేమించిన మహేష్‍ అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషుల్లో ఉండే కవిత్వం ఇష్టం. అతడు తన గురించి మర్చిపోయి మనుషుల్ని ప్రేమించాడు. సొంత జీవితం గురించి మర్చిపోయి జీవితాన్ని ప్రేమించాడు. రాజమండ్రి గోదావరి తీరం అతడి అర్తికి తగిన జీవితాన్నిచ్చింది. కాళ్లు తడవ కుండా సముద్రాల్ని దాటిన మేధావి కూడా కళ్లు తడవ కుండా జీవితాన్ని దాటలేడు రాజమిండ్రిలో పేపర్‍మిల్లులో పనిచేసే చక్రాల వెంటక సుబ్బు మహేశ్వర్‍కి వాళ్ల సోదరి ఉత్తరాలు రాసేది. ఓ ఉత్తరంలో ఇది రాసిన కవి పేరుతో సహా ఉంది. అలా నా పేరు మహేష్‍కి పరిచయం. కానీ నన్నెప్పుడూ చూడలేదు. మహేష్‍అనేవాడొకడున్నాడని అతడు తర్వాత కాలంలో నాకు సోదరుడు కాగలడని నాకు కూడా తెలియదు. ఓ సారి మా అన్నయ్య శ్రీ వక్కలంక వెంకట ప్రకాశరావుగారి కోసం పేపర్‍మిల్లుకి వెళ్లాను. ఆయన నన్ను మహేష్‍దగ్గరికి తీసుకెళ్లి వీడు మా తమ్ముడు. ఏవో కవితలు గట్రా రాస్తుంటాడు అని పరిచయం చేశాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు కావచ్చు. మహేష్‍చాలా స్టె••ల్‌గా ..సేఫ్టీ ఆఫీసర్‍దర్పం ఒలకబోస్తూ ‘‘ ఏం పేరు’’అన్నాడు. ‘‘వసీరా’’ అన్నాను. ఒక్కసారిగా నమ్మలేనట్టు చూశాడు. ఆ తర్వాత ‘‘అహ్హహ్హ హ్హహ్హ హ్హా’’ అంటూ మనస్ఫూర్తిగా నవ్వేశాడు. వసీరా అంటే ఎవడో వృద్ధుడు అనుకున్నాను. ఇంత గుంటడవి అంత వేదాంతం ఎలా రాశావు. అని మరోసారి నవ్వేడు. అది నాకూ మహేష్‍కి మొదటి పరిచయం. తర్వాత మరో రెండేళ్లకి నేను మెడిక••ల్‌ రిప్రజెంటేటివ్‍గా రాజమండ్రి వచ్చాను. మహేష్‍ద్వారా సుబ్బు , ఎరాప్రగడ దంపతులు, భద్రుడు సావిత్రిగారూ ఇలా సాహితీ వేదికలో అందరూ స్నేహితులయ్యారు. వీళ్ల ద్వారా నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. నిజం చెప్పాలంటే మహేష్‍, భద్రుడూ ,గోపీచంద్‍వీరి ముగ్గురికీ సాహిత్యం పట్ల జీవితం పట్లా ఒక విధమైన మెచ్యూరిటీ ఉండేది. ప్లూరాలిటీని గౌరవించి కలుపుకునే మంచి సంస్కారం వీళ్లకి అంత చిన్న వయసులోనే ఎలా సాధ్యమో నాకు అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే నాకు అప్పుడు అంత మంచి సంస్కారం లేదు. సాహితీ వేదికలో రకరకాల భావజాలం గల కవులు కథకులు విమర్శకులు ఉండేవారు. నాకు గుర్తున్నంత వరకూ నేనూ సావిత్రిగారూ మార్క్సిస్టు భావజాలం గల వాళ్లం. సాహితీ వేదికలో మార్కిస్టు భావజాలంతో రాసిన కవిత్వమైనా మరే కవిత్వమైనా అందులో కవిత్వం ఉందా లేదా అనేది ముఖ్యం. అలంకారాలు కాదు. వేదన, మానవీయ స్పర్శ, జీవితం ఇవి ముఖ్యం. నినాద ప్రాయంగా రాస్తే అస్సలు ఒప్పుకునే వారు కాదు. చీల్చి చెండాడే వారు. . పొయెట్రీలో ఏ మాత్రం తడి ఉన్నా ఇక ఆ కవితల్ని నెత్తిన పెట్టుకుని మరీ పలవరిస్తూ ఉండేవారు. సాహితీ వేదిక కవితా సంకలనానికి ‘ఆర్కెస్టా•’ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఇదే. భిన్నస్వరాల ఏకత్వంలోని సింఫనీయే సాహితీ వేదిక అని చెప్పడమే. మహేష్‍ది అశాంతీ వేదనా పలికే తాత్విక స్వరం .. అతడి లైఫ్‍స్టె••ల్‌ ....కూడా అలాగే అశాంతిమయంగా అరాచమైన అన్వేషణాభరితంగా ఉండేది. సైద్ధాంతిక గ్రంధాలు సామూహిక జీవితాన్ని అర్థం చేసుకునే సాధనాలు మాత్రమేనని, జీవితం ఈ సాధనాలకంటే బలమయినదని మహేష్‍నమ్మేవాడు. వేదనా భరితమైన అశాంతి దానినుండి ఏదో తెలియని అన్వేషణా అతడి లోలోపల ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండేది. అందుకే అతడి ఫేవరెట్స్ డాస్టోవిస్కీ, బైరాగి, అజంతా, కాఫ్కా, బసవరాజు అప్పారావు. కవికొండల వెంకటరావు.. వేస్ట్ ల్యాండ్‍ఇలియట్‍...జెన్‌హైకూ కవుల్లో ఇస్సా...తిట్లూ తన్నులూ తినే పిల్లాణి చూసి కూడా అతడు అసూయ పడతాడు. అనాథ అనే హైకూని మహేష్‌తరచూ చెప్పేవాడు.. ఇలా వేదనా భరితమైన జీవితవాస్తవాలు చెప్పే కవులెప్పుడూ అతడిని వేధిస్తూ... తడిగా ఉంచేవారు. మల్లయ్యపేటలోని తన బ్రహ్మచారి క్వార్టర్స్‌లో జపనీస్‌హైకూల పుస్తకాలు ఉండేవి. వాటిని సగర్వంగా ప్రదర్శించేవాడు. చదివి విన్పించేవాడు. రాలిన పువ్వు తిరిగి కొమ్మని చేరింది సీతాకోక చిలుక. బహుశ ఈ వాతావరణమేనేమో. నేను నంది వర్థనం చెట్టు వంటి కవితలు రాయడానికి దారితీసింది. ఆ కాలంలో బహుశా మా మిత్ర బృందంలో ఇంకెవరి దగ్గరా అంతగా కన్పించని ఇంకో టాలెంట్‍ కేవలం అతడికి మాత్రమే ఉంది. అదేమంటే ఇటువంటి అశాంతిని వ్యక్తం చెయ్యలేక లోలోన కుతకుత లాడే తన లాంటి వాళ్లని గుర్తించడం. వారి పట్ల కంపాషియన్‍. సహానుభూతి. పరాయీకరణ, ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల డొల్లతనం నుండి వచ్చే ఈ అశాంతి గురించి సిద్ధాంతాలు వల్లించే వారిలోనూ , కవిత్వాలు రాసే వారిలోనూ కూడా ఈ విధమైన కంపాషియన్‍చాలా అరుదు. నేను మానవ సంబంధాల కంటే కూడా కవిత్వం చాలా గొప్పదనే భ్రమలో ఉండేవాడిని. మానవ సంబంధాల దగ్గరకొచ్చే సరికి మహేష్‍ కవిత్వం కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల్లో మానవత్వం లేకపోవడం అతడిని ఎంతగానో బాధించేవి. అందుకే అతడు ఎవరి భావజాలాలు ఎటువంటివి?. ఎవరి అభిప్రాయాలు ఎటువంటివి? అనే ప్రశ్నే లేకుండా అందర్నీ అన్‍కండిషన••ల్‌గా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. కుప్పలి పద్మ, శకుంతల ,సావిత్రిగారు. తమ్ముడు, మరియు తమ్మడి తమ్ముడు, ఎర్రాప్రగడ ఇలా ఒకరిద్దరని కాదు స్నేహితులందరి సమస్యల్లో కష్టాల్లో పాలుపంచుకునేవాడు. అలాగే అతగాడికి వయో బేధం కూడా లేదు. పెద్దలతో పిల్లతో కలగలిసిపోయే వాడు. గంధం సీతారామాంజనేయులు గారు అతడిని కొడుకుగా భావించేవారు. శరభేశ్వర శర్మగారు కూడా అతడిని ఎంతగానో ఇష్టపడేవారు. 1984లో మా నాన్నగారు పోయినప్పుడు నా గురించి తెగవర్రీ అయినవాడు మహేష్‍. వసీరాది ససిపిల్లాడి మస్తత్వం వాడి గుండె పగిలిపోయి ఉంటుంది. ఎలా తట్టుకున్నాడో ఏంటో అనుకుంటూ సుబ్రహ్మణ్యంనీ, ఎర్రాప్రగడనీ కూడా బయలు దేరదీసి అమలాపురం వచ్చాడు. నేను ఓ చిన్నపిల్లాడితో ఆడుకుంటూ ఉండటం చూసి వీడు నిజంగా పసివాడే అని కంటనీరు పెట్టుకున్నాడు. అవునురా ‘‘నువ్వు దుఃఖాన్ని గడగడా తాగి భగభగా నవ్వగలవు’’. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటూ వెళ్లిపోయాడు. ఇదంతా ఎందుకంటే అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషులు చాలా చాలా ఎక్కువ ఇష్టం అని చెప్పడానికే. మహేష్‍రంగస్థల నటుడు కూడా. రామనాధంగారి నాటకాల్లోనూ ,కొప్పర్తి అమరలింగేశ్వర రావుగారి నాటకాల్లోనూ కూడా అతడు నటించేవాడు. ఎన్‍.ఆర్‍నంది రాసిన మరోమహోంజదారోలోనూ మహేష్‍నటించినట్లు గుర్తు. భద్రుడు రాసిన స్వాతంత్యోద్యమ శంఖారావం నాటకంలో అతడు రాసిన పాటలు నాకు కంఠతా వచ్చేవి. ఎందుకంటే ఆ నాటకంలో నేను గాంధీ వేషధారిని. దండికడలి తీరంలో స్వేచ్చోదయం అవుతోంది..తెల్లవాడి పాలన ఇక అస్తమించబోతోంది అంటూ రవి అస్తమించని బ్రిటిష్‍సామ్రాజ్యం ఏ స్వేచ్చోదయంతో అస్తమిస్తోందో చాలా సింపు••ల్‌గా తేట పదాలతో అద్భుతంగా రాశాడు. ‘‘సామ్రాజ్యవాది మందు గుండు ఉప్పు ముందు చిత్తురా. స్వేచ్చమీద ఇచ్చనేడు ఉప్పు రూపు దాల్చెరా అని రాశాడు. నన్నయ భారత రచన నాటకం కోసం అతడు ఎంతో రీసెర్చి చేశాడు. పూజ్యులు శ్రీమల్లంపల్లి శరభేశ్వర శర్మగారి దగ్గరికి రోజూ వెళ్లి నన్నయ సారస్వత రహస్యాలను గురించి చర్చించేవాడు. అంతటి హోవంర్క్ చేసే అధ్యయన శీలి మషేష్‍. ఈ నాటకం ముగింపులో పాట నిజానికి నాటకానికే హైలైట్‍. గోదారి తీరాన నన్నయ నుండి మొదలైన తెలుగు కవితా ప్రవాహం ఎన్ని రకాలుగా పరిమాణం చెంది, ఎన్నిముఖాలుగా వికసించిందీ ఆ పాటలో రాశాడు. తెలుగు కవిత్వం పరిణామం చెందుతూ ఈ నాటకం రాసేనాటికి చెరబండరాజు విప్లవ కవిత్వ దశకు వచ్చిందని , ఆఖరి చరణంలో చెరబండరాజుకు లా••ల్‌ సలామ్‍చెప్తూ పాటముగించాడు. నన్నయ నాటకాన్ని చెరబండ రాజుతో ముగించడం బహుశ టి.జె.రామనాధం గారికీ ...మహేష్‍కే చెల్లు. మిత్రమా మహేష్‍నువ్వు రాజమండ్రిలో ఉన్నా, సూళ్లూరుపేటలో ఉన్నా ...ఇంకోలోకంలో ఉన్నా ...నువ్వెక్కడున్నా సుఖశాంతులతో ఉండాలని పరమ శాంతి స్వరూపుడు శాంతిదాత అయిన భగవంతుని ప్రార్థిస్తాను. వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSbA

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ప్రియమైన ముఖపుస్టక మిత్రులకు ఒక శుభవార్త , 27- aprial -2014, బ్రాహ్మణా వివాహ పరిచయవేదిక నిర్వహిస్తున్నాం . విజయవాడ , శ్రీ సీతారామ కళ్యాణ మంటపం వద్ద , ఈ అవకాసము ఉపయోగించు కొనవచ్చును . ఇది బ్రహ్మనసేవసంఘం ఆధ్వర్యం లో నిర్వహించ బడుచున్నది , అడ్మిన్ కోశాధికారి కృష్ణా తరంగాలు / బ్రాహ్మణా సేవ సంఘం పార్ధసారధి ఉటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NMT86L

Posted by Katta

Vijaya Bhandaru కవిత

1.Ravalanukuntanu, maniacs ralenu,enthaina nenu bhandini, na samrajyaniki 2.ninna kuda thellarindi rathri newsnu thesthu theesi chuste emundi kula hatyaku prema bali

by Vijaya Bhandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NMT6M6

Posted by Katta

Sree Kavitha కవిత

||తీపి కీబోర్డే - తీపి చాక్లెట్ ని తలపిస్తూ సేం ఫీలింగ్|| @ 'శ్రీకవిత' శుభొధయం తీపి మధురం చెసెను తీపి అదరం తీపి మధురం పూరించేను ఖాలి ఉదరం తీపిగా పిలిసే పలుకుల ఉలుకులు కలిగించేను తీపి ఊసుల కులుకుల మనొహరాల ఉల్లాసం తీపి పదిలం కలిగించె అనుభూతులు అమరం తీపి మ్రుధులాలతో మెధలాడె స్ర్ముతులు స్వాలంభనం తీపి చాక్లెట్ కోకో గింజల రంగరింపులతో పొంధె గోధుమ వర్ణం తీపి చాక్లెట్ రూపు రెఖల సున్నితాలు వెర్పరిచేను నొరూరించె సాంగత్యం తీపి రాసాలు కలిగించేను లలాజలాల రసరమ్య భంధం తీపి రాసాల అనుబంధం విడదీయలేని అనుసంధానం తీగలేని కీబోర్డ్ తలపించేను కవరులేని బోసి చాక్లెట్ ఆ కీబోర్డ్ ని తాకినా మీటినా పంపే ఆక్షరాల పధాలు హ్రుధయమనే మదర్ బోర్డ్ కి మెలవింఛె శ్రుతిలయలు అవి మధి తలపులు అనే మానిటరు కిచ్చె పరవశాల సందేశాలు ఆ సందేశాల ఆదేశాలు పుచ్చుకున్నా ఇచ్చుకున్నా కలిగేధి !!సేం ఫీలింగ్!! వప్పుకుంటారా..?? ....

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q9XJSJ

Posted by Katta

Kamal Lakshman కవిత

జీవితం...life....జిందగీ... నవ్వుతూ బతకాలి రా నవ్వుతూ చావాలి రా ఇదేరా జీవితం ఇంతేరా జీవితం ఈ సృష్టిలో నవ్వే ప్రాణివి నీవోక్కడివే నోయ్ మానవా నవ్వవోయ్ సోదరా, నవ్వవే సోదరీ నవ్వితే నీ సొమ్ము నాకేం రాదోయ్ అసలు వచ్చేపుడు ఏం తెచ్చ్చావని ఏం పోయిందని , ఏ పోతుందని ఈ దిగులు, ఈ భయం,ఈ ఆందోళన పోయేపుడు ఏం తీసుకెళ్లాలని ఏం పట్టుకెళ్ళాలని ఈ ఆరాటం... ఏమీ లేదోయ్ ..ఏమీ లేదోయ్.. ఏమీ రాదోయ్..ఏమీ రాదోయ్ చివరికి నీదనుకున్న .. పుట్టుకతో నీ కూడా వచ్చిన ఈ శరీరం కూడా నీతో రాదోయ్ ఈ మాత్రం తెలుసుకోవోయ్ ఈ మాత్రం మరిచిపోకోయ్ ఇంతేనోయ్ జీవిత పరమార్ధం ఇదేనోయ్ మన జీవన సారం మరింకేం ..అన్నీమరచి నవ్వుదామా నవ్వుదామా నవ్వుతూ జీవిద్దమా.... నవ్వలేని జంతువే నవ్వుతోంది ఇక మనం నవ్వకపోతే ఎలా నవ్వితే పోయేదేమీ లేదు నాలుగు కాలాలు హాయిగా బతకటం తప్ప హా హా హా హా హా హా హా హా హా ... ( నేను మాత్రం నవ్వుతూ ఉంటానండి బాబోయ్) కమల్ 25th Mar 2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcW2Js

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // మలుపు మంచికే ....// ఎక్కడ నిలుచున్నావ్ ఏది వెసులుబాటని తిరుగుతుంటావ్ ఏది వెతలబాటని తప్పుకుంటావ్ ఈ అరణ్యాలలో వెలుగుతూ నీది కాదని తలపోస్తావ్ ఏతీర్దాలు పుణ్య లోకాలకి దారని పుచ్చుకుంటావు ఏకోరికలు నీవి కావని మభ్యపెడతావ్ ఎన్నిపలుకులకు తేనెపూసి పంచుతుంటావ్ ఎన్ని గుప్పిళ్ళ ప్రేమనిఒలక పోసి ఇచ్చుకుంటావ్ నీకై నువ్వు వెలగలేని చంద్రుడా పరిహసించే లోకంతో నువ్వూ పరిహసిస్తావ్ ముళ్ళున్న తోవల్లో నువ్వొక ముల్లవుతావ్ ఇక ప్రతి మలుపు మంచికేనని మళ్ళీ మళ్ళీ తలపోస్తూ సాగటమే జీవితం Date:24/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcW04i

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర// హైకూహారం-3//25.03.2014 1. తళుక్కున మెరుపులు.. ప్రకృతిని చిత్రీకరిసున్నాడుకాబోలు.. చంద్రుడు! 2. పపాయి వెక్కిళ్ళు.. అమ్మవచ్చింది.. ఆగిపోయాయి! 3. చీకట్లో పల్లె.. మత్తుగా నిద్దురోతుంది.. మరమనుషులు లేరుమరి! 4. కస్టించడమే తప్ప దాచుకోవడం తెలియని శ్రమజీవులు.. తేనెటీగలు.. 5. చిన్న వానచినుకు.. ఆవగింజంత విత్తనానికి జన్మిచ్చింది.. ఎంత చెట్టయ్యిందో! 6. నిద్రపోని పిల్లలు.. తీరని ఆరాటాన జంటలు.. రాత్రి పగలయ్యింది! 7. నిజంకాని.. జీవిత సంఘటనలు.. కలలు! 8. ఎర్రబడిన తూరుపు.. నిద్రలేచిన ఊరు.. పరుగులు ప్రారంభం! 9. పిల్లలాడుకొనే.. ప్రాణంపోసుకున్న విమానాలు.. తూనీగలు! 10. అలసిన జీవితం.. శ్రీమతి మళ్ళీ మామిడికాయడిగింది.. సంతొషాన్నివ్వలేదు! ..........25.03.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkAVsU

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

గాంధీ----గాంధారి -------------------రావెల పురుషోత్తమరావు గాంధారి కొడుకులున్న దేశంలో గాంధీ మహాత్ములకు చోటేది? నకిలీ గాంధీలు నడయాడే చోట అస్లలు సిసలు బాపూలకు నెలవెక్కడ? బ్తాందీ షాపులకూ మాoసాహార భోజన శాలలకూ గాంధీలను పరిమితం చేసిన క్షేత్రంలో అహింస అనురాగాలకు ఆదరణ ఉందా?? ============================--=23-3-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hiDhEJ

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అనవసరం కవిత్వానిదేముంది ఎవరైనా చెబుతారు ఆకు చెబుతుంది తనలా పచ్చగా ఉండమని పువ్వు చెబుతుంది తనలా నవ్వుతూ ఉండమని రాయి చెబుతుంది తనలా ధైర్యంగా ఉండమని పక్షి చెబుతుంది తనలా తెలివిగా ఉండమని చిన్న పిల్ల చెబుతుంది తనలా అమాయకంగా ఉండమని ప్రకృతి చెంబుతుంది తనలా దేవతలా ఉండమని కానీ నేనే ఒంటినిండా కవిత్వం నింపుకుని అదో రకం కంపు కొడుతూ కవిత్వాన్ని మించిన తత్వమేదో నాలో లోపిస్తూ కవిత్వమే నా ప్రాణమైతే మాత్రం ఏమి లాభం? కవిత్వాన్ని మించిన మానవత్వం నాలో లేనప్పుడు! 24Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joNN4g

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-22 (కవి సంగమం ) ---------------*--------------- చదివిన కవిత్వ సంపుటిని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి చదివిన కవిత్వ సంపుటి పేరు :- "దర్దీ" (షాజహానా కవిత్వం) కవిత్వ సంపుటిని రాసినది :- షాజహనా " తెలుగు కవిత్వానికీ ఒక నజరానా -బాధా దుఃఖ కవిత్వాల ఖజానా షాజహానా " *****---********** ***********---***************** ప్రయాణాల్లో కవిత్వపు సమాధి అవస్థల్లోకీ వెళ్ళటం కొందరు కవులు, కవయిత్రులు చేస్తూవుంటారు. దేవీప్రియ గారు విమానపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని కవిత్వపు ఊహల్లోకి అనువదించాడు."ఆకాశం చెట్టుకీ కట్టిన అద్భుతమైన ఊయలలా వుంది విమానం"-అని వొక గొప్ప భావకుని ఊహని మనకు పరిచయం చేస్తాడు దేవి ప్రియ గారు.కవయిత్రి షాజహాన తొలిసారి విమానమెక్కినప్పుడు తనకు కలిగిన ఊహావేశాన్ని ఎంతో గొప్ప ఊహతో చేసింది అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు.విమానం లోంచి బయటకు చూస్తే ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తొందో అట్లా తనో మనో ప్రపంచంతో దర్శించి"కిటికీల్లొంచి చూస్తే వాటర్ ట్యాంక్ లన్ని పుట్టగొడుగులే/కుబుసం విడువని పాముల్లా /సూర్య కాంతిలో లోహం ప్రవహిస్తున్నట్లు సన్నని గీతలుగా నదులు"-అని "ప్రాణవాయువు" అనే కవితలో చెబుతుంది.ఒకసారి ఈ పంక్తుల్లోని ఊహని ఊహిస్తే కవయిత్రి ఊహా శాలిత్వం అర్థం చేసుకోలేమా? చిన్నప్పుడు తుమ్మిసల్ని పట్టి గాల్లోకి వదిలే కవయిత్రి తనను పట్టుకొన్న పెద్ద తుమ్మెద విమానం అని ఊహచేయడం చదువరులకు ఒక కొత్త వూహను కలిగిస్తుంది అని అనిపించకపోదు.తాను దర్శించిన వస్తువు రూపాన్ని,లేదా దాని తత్వాన్ని చదివేవారికీ ఎంతో నిపుణతతో స్పురింప చేసే శిల్పచాతుర్యం వున్న కవయిత్రి షాజహానా అని నేనంటాను.ఈ మాట అనడానికీ ఈవిడ రాసిన "దర్దీ" కవితా సంపుటి వొక్కటే చాలు. అపుడెప్పుడో 'ఆకు రాలే కాలం" రాసిన కవయిత్రి మహజబీన్ వొక దుఃఖపు తడిని,ఆర్ద్రతని కాల్పనిక భావ సంచయంతో అందిస్తే ఇప్పుడు షాజహానా తన వారి యొక్కముఖ్యంగా ముస్లిమ్ మైనారిటీ మహిళలయొక్క 'దర్దీ"నీ తన కవిత్వమంతా పొదిగీ ఒక సాంబ్రాణి ధూమం లా ప్రతి చదువరి ఎదలోకి వ్యాప్తమయ్యేలా సృజన చేసిన చేస్తున్న కవయిత్రి షాజహానే. విమానంలో ప్రయాణించే సమయంలో ఏ కవైనా చేసే ఊహలు సాధారణంగానే వుంటాయి.షాజహానా విమానంలో పోతూ"బయట అకాల వర్షం../గాలికి పగిలిన పత్తికాయలు కొట్టుకొచ్చినట్టు/కుప్పలుకుప్పలు దూదిలా/ మబ్బు పరుచుకొంది చుట్టూ..!/లోపల పంట కోల్పోయిన రైతులా నేను'-ఈ మాటలు చాలు షాజహానాను మిగిలిన కవులకు కన్నా భిన్నమైనది అని చెప్పడానికీ.విమానంలో పోతున్నప్పుడూ కూడా తన నేల తల్లి పరిమళపు శ్వాసను ,తన నోటికి ఇంత ముద్దనందిస్తున్న రైతన్న విషాదాన్ని మరచి పోని గుండె లక్షణం ఈ కవయిత్రిలో ఉండటమే ఇతర కవుల కన్నా భిన్నమైనది చెప్పడాని కారణం. అంతులేని మానసిక వేదన వల్ల కావొచ్చు,నిద్ర లేమివల్ల కావొచ్చు లేదా పోషకాహార లేమి వల్ల కావొచ్చు అసంఖ్యాక స్త్రీల కనులకింద గుంటల్లో నల్లని వలయాలు ఏర్పడి,ఆ నలుపు వలయాలు వాళ్ల ముఖ బింబాల్ని ప్రకాశ రహితంగా మారుస్తాయి.తన అమ్మీ కళ్ళ కింద కూడా నల్లని వలయాల చారికల్ని చూసిన కవయిత్రి "కనిపించని మాంత్రికుడెవరో కళ్ళక్రింద మసి పూసినట్లు"వున్న నల్లని మేఘాల్లాంటి వాటిని "బ్లాక్ హోల్స్" అని ఈ కవితలో అంటుంది."బ్లాక్ హోల్స్" అనే మాట శాస్త్ర అంశానికి చెందింది."black holes swallowed the missings" అని బ్లాక్ హోల్స్ గురించి స్థూలంగా చెబుతారు. మగువలమనసుల్లోనిరంతరంమెరవాల్సినఆశలు,ఆనందాలు,ఆహ్లాదాలు miss అయి బతుకు ఆకాశంలో ఈ కళ్ల కింద గల బ్లాక్ హోల్స్ చే అవి మింగబడ్డయేమో,అందుకే బ్లాక్ హోల్స్ అలా వున్నాయేమో అన్న భావనను కవయిత్రి తన కవితకు పెట్టిన ఈ బ్లాక్ హోల్స్ అనే ఈ శీర్షిక వల్ల స్ఫురణకు తీసుకొస్తుందికవయిత్రి. తన అమ్మీ కళ్ళకిందవున్న బ్లాక్ హోల్స్ నే కాదు తన అమ్మీలాంటి ఎందరో అమ్మీల కళ్ళ కింద వున్న నల్లటి చారికల్నీ "ఏ యుద్ధాల నల్లని నీడల్లో ఏ డేగల రాబందుల గోళ్ళు గీసిన గీతలు"-గా గుర్తించిందిషాజహానా.జీవన క్లిష్టతను వ్యక్తం చేస్తూ నిద్రను రాత్రికి అప్పగించి చీకటై మేలుకొనే తన అమ్మీని ఎంతో దుఃఖాత్మకంగా కవయిత్రి చిత్రిక పడుతుంది. మనసును వెన్న పూసగా మార్చి ఆ బ్లాక్ హోల్స్ కీ మందుగా పూసి ఆ కళ్ళు మిల మిలా మెరుస్తుంటే చూడాలనే ఆశను కలిగివుండటంమంచి కవిత్వ లక్షణం. చీర మొత్తానికి,లేదా చీర అంచులకు చెరుగులకు శొభను చేకూర్చడానికీ చమ్కీనీ,జరీని చేర్చడం , కట్ దానాలను కుట్టడం,కుందన్ లు కూర్చడం లాంటివి చేస్తుంటారు.అట్లాంటి చీరల్ని వివాహాది కార్యాల్లో వధువుల ముస్తాబు కొరకు వాడుతుంటారు.ఇవే వర్క్ శారీస్.హైద్రాబాద్ నగరంలో పాత బస్తీలో ఈ వర్క్ శారీస్ ని ముస్లిమ్ మహిళలు ధరిస్తుంటారు,తయారు చేస్తుంటారు.ఈ కవయిత్రి చమ్కీ,జరీ,కట్ దానా,కుందన్ లాంటి కవితా సామాగ్రిని సమకూర్చుకొని ఆ చీరని ముస్లిమ్ స్త్రీకి ప్రతీక చేసి "చమ్కీ'-అనే మంచి కవిత నిర్మించింది.జీవితం అనేక కుచ్చుముళ్ళ దారాల సమాహారం.వొక్కొక్క ముడినే విప్పుకొంటు పోవడం, నాలుగ్గోడలకు రోజులను బిగించడం అంటే విరామమెరుగక గదిలోనే మగ్గిపోవడం ఇలాంటి గుండెను పిండే భావాలతొ కవయిత్రి "చమ్కీ"-కవితను ప్రారంభిస్తుంది. సాదా జీవితాన్ని గడుపుతున్న స్త్రీలు "అరబ్ దీనార్ల రంగుల కలలు"కనడం"రాకుమారుడి రాక కోసం/ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం"చెప్పడం చేస్తున్న వీళ్ళు అరబ్ షేక్ ల చేతుల్లో మోసపోతున్న వైనాన్ని "అన్ని చమ్కీలు చీర మీదకు చేరవు/దారి తప్పి కిందపడి-ఊడ్పులో మాసి-బజారులో ఎండకు మెరిశి/ఏ గాలి వేగానికో మురిక్కాలువల్లో ఆత్మహత్య చేసుకొంటాయి"-అన్న వాక్యాల్లో కవయిత్రి ధ్వనింప చేస్తుంది."బతుకు చీరకు వేసిన కట్ దానాలానో/బజారున పడ్డ చమ్కీలానో/ఏ ఎగుమతిలో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు/ఏ బురద గుంటలో పడి మునుగుతుందో తెలియదు"'అంటూ ఆ స్త్రీల దీన హైన్య స్థితిని మనసు కన్నీళ్ళ పర్యంతమయ్యేలా చెబుతూ వొక ఆశను"మెరవడం దాని జీవ లక్షణం"-అని వాళ్ళ జీవితంలోని తీపిని కూడా గుర్తుకు తెస్తుంది. స్త్రీల వేదనను,బాధను స్త్రీలు వ్యక్తం చేసినంత పదునుగా ఇతరులు అభివ్యక్తీకరించడం సాధ్యం కాదు.కవయిత్రులకీ భాషాపుష్టి తక్కువ అనే భావనలో కొందరు వుండొచ్చు.కానీ కవయిత్రులు వారు చెప్పదలుచుకున్న భావానికీ ఔన్నత్యాన్నిచ్చే శైలినే ఎన్నుకొంటారు.షాజహానా తాను స్త్రీ కాబట్టి స్త్రీగా పురుషాహంకారపు సమాజంలో అనుభవించిన దుఃఖంలోంచి అద్భుత కవిత్వాన్ని సృజించింది.ఇతర స్త్రీవాద కవయిత్రులు స్పృశించని కోణాలని తన కవితలో ప్రదర్శించిహిత్రించిన స్త్రీకి స్త్రీగా కలిగే మనఃస్పందనలోని వైవిధ్యాన్ని స్పష్టంగా చెప్ప్పగలిగింది.మనసును పట్టి వేయగలిగే కవితా శక్తి షాజహానాలో వుంది.ఇందుకు ఉదాహరణ ఈ కవితా సంపుటిలోని "సిద్ధార్థి"అనే కవితా ఖండిక.ఒక స్త్రీగా తాను నమ్మి వచ్చిన పురుషుని వల్ల కోల్పోయిన సమస్తాన్ని కవయిత్రి సమర్థవంతంగా వివరించిన గొప్ప కవిత ఇది. "నువ్వు మంచి వాడివి/దేవుడివి/ఉత్తమపురుషుడివి/పాలకుడివి/అధికారివి/చాలా ఎక్కువగా భర్తవి/తండ్రివి...ప్రేమికుడివి.../నేను నీవు చెప్పినట్లు వినే రోబొట్ ని అంతే"-ఈ వొక్క చివరి మాటలోనే స్త్రీ పురుషుని చేతిలో ఎలా వుందో వ్యక్తిత్వం లేని మర మనిషిగా ఎలా నమ్మివచ్చి పురుషుని చేతిలో వంచనకు గురయ్యిందో కవయిత్రి బలంగా,సాంద్రంగా చెబుతుంది.ఆదిమ మానవ వ్యవస్థలోనే,ప్రేమ భావన తెలియని వ్యవస్థలోనే స్త్రీకి గౌరవం వుండేదని,ఇప్పుడు స్త్రీలకు జరుగుతున్న అన్యాయలకు అంతేలేదని అనేక దృష్టాంతాలను ఆయేషా,సమీరా విషాదాలను ఉదాహరిస్తూ చెప్పే కవిత ఇది."ఈ భూమి మీద నీ పాదమెంతో నా పాదం అంతే'-అని అనటంలోనే కవయిత్రి స్త్రీ,పురుష సమానత్వాన్ని ప్రతిపాదిస్తున్నదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చును. కానీ ఈ సమానత్వం ఈ గోళం లో దొరకదేమో నన్న అపనమ్మకంతో "అలసిన నా మనసు ఆనుకోవడానికీ ఇక్కడ స్థలం లేదు మరో గ్రహం వుందేమో వెతుక్కోవాలి"-అని అనుమానం షాజహానా వ్యక్తం చేయడంలో ఆమెకు ఈ వ్యవస్థపై గల సత్యాగ్రహం అర్థం అవుతుంది.. ఒక అద్భుత స్త్రీ వాద కవిత ఇది.పురుషుల చేత గూడా ఈవిడ చెప్పింది నిజమే అని ఒప్పించ గలిగిన తర్కం ఇందులో నిక్షిప్తం అయి కవిత గొప్పదనం అవగతమవుతుంది. తన స్నేహితురాలు,తన సహేలీ,తనను ఎత్తుకొని లాలించిన రెండో అమ్మా,తన కవితలకు ఆత్మ,తన అపా తో అబ్ నార్మల్ పెయిన్ గురించి సంభాషించిన కవిత"అబ్ నార్మల్ పెయిన్". "చెప్ప కుండానొప్పి చేసే దాడిలో/ఒక్క శరీరమే ధ్వంసం అవుతుంది/మరి మనసుకు పడ్డ నెర్రెల్ని/ ఏ డాక్టరొచ్చి కుట్లేస్తాడు'-అని ప్రశ్నించే కవయిత్రి"రెండు ముక్కలైన ఆకాశాన్ని కలిపి కుట్టెసినట్లు మెరుపు"-అని ఎంతో గొప్ప పోలికతో స్త్రీలు పొందే అబ్ నార్మల్ పెయిన్ ను "లోపల గడ్డ కట్టినదేదో కరుగుతోంది'-అంటూ మనకీ 'ఈ మగ వాళ్ళు ఇంత కఠినులెందుకు"-అనిపించేటట్లుగా నోట మాట రాని స్థాణువుల్నీ చేస్తుంది ఈ కవయిత్రి తన శిల్పనైపుణ్యంతో. తెలుగు నేలలో జరిగిన ఘోర దురంతాలలో ఆయేషా సంఘటన ఒకటి."రాజకీయ దున్నపోతుల కొట్లాటలో"బలయిపోయిన చదులతల్లి ఆయేషా.చంపబడిన ఆయేషా కోసం ఆమే తల్లిదండ్రులు న్యాయం జరగాలని పడరాని పాట్లు పడ్డారు.ఈ సంఘటనను ఈ కవయిత్రి కవిత్వం చేసింది."మా ఇళ్ళలో చదివించడమే తక్కువ/చదవాలని వచ్చే ఒకరిద్దరినీ రాకుండా చేయకండిరా"-అని వేదనతో అభ్యర్థించడమే కాదు "ప్రతి అమ్మాయి ఉయ్యాల తొట్టెకి/ఒక తుపాకి మంజురు చెయ్యండి చాలు"-అని డిమాండ్ చేస్తుంది."సిగ్నల్ లైట్ల కాడ బురఖాలో/హైద్రాబాదీ నవాబీ తనం తనఖా../ఆ దారుల నుంచే ముఖ్యమైన మంత్రులు/రాజులు రాజ్యాధికారులు"-అంటూ చార్మినార్ పై నుంచి నెట్టివేయబడ్డ చదువు కోసం తపించే పేదరికపు సమీరా విషాద బాధని "బేవఫా దునియా కో మాఫ్ కరో.. సమీరా"అంటూ నిరసన తెలుపుతుంది షాజహాన. ఈ సంపుటికీ వొక అలంకారంగా భాసించే కవిత "మెహమాన్"(అథితి).కవయిత్రికీ గుజరాతీ బాధితుడికీ జరిగిన ఒక కవితత్మక సంభాషణ."ఒకానొక గుంపు వేట నుంచి తప్పించుకొన్న పావురాన్ని"-అని కవయిత్రి అతని చేత అనిపించటమే కవితకీ వొక కీలకమైన వాక్యం."లోపలేముందో తెలీనీ పూడుకపోయిన బావిలా వున్నాడు"-అని అనటంలో కవయిత్రి అతడిలోని భయాన్ని అపనమ్మకాన్ని స్ఫురింప చేసింది.అంతర్లీన సముద్రాల దుఃఖాన్ని తోడటం,సమస్త దేహంతో దుఃఖించడం లాంటి ప్రయోగాలు కవయిత్రి ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి. ఇపుడు అమాంతం చిన్న పిల్లై "అలీఫ్ బే తే"లు(ఉర్దూ అక్షరమాల) నేర్చుకోవాలని మనసు మారాం చేస్తున్నదని అంటున్న కవయిత్రి తన మాతృభాష గుర్తింపుకునోచుకోక పోవడాన్ని,తన భాష మ్యూజియంలో ఒకపురాతన వస్తువై మిగిలి పోవాడాన్ని నిరసిస్తూ రాసిన అద్భుత భావుకత్వంతో రాసిన కవిత "అలీఫ్ బే తే"-అనేది.దేవ కన్యలు తమ సుకుమార వేళ్ళతో కాస్మీరీ అల్లిక చేసినట్లూ అక్షరాలు రాయబడుతున్నాయన్న అద్భుత ఊహను కవయిత్రి అంద చేస్తుంది.దేవ కన్యలు నెల వంకల్ని కుప్పేసి వెన్నెల సోనలతో ఉర్దూ అక్షరాలు అవ్యక్త పరిమళాలు వెదజల్లుతాయన్న వొక మధుర ఊహను కవయిత్రి వ్యక్తం చేస్తూ,"నాది కాని భాష ఇవాళ నన్ను ఏలుతున్నది"-అంటూ భాష పరాయీకరణ చెందిన విషయాన్ని స్పష్టం చేస్తుంది. "హునర్" (మిషన్ కుట్టె వృత్తి)అనే కవితలో ఆ వృత్తిని'అర్ధరాత్రి వరకూ సాగే జీవన వాయిద్య ఒంటరి కచేరి"-అని వ్యాఖ్యానిస్తున్న ఈ కవయిత్రి మిషన్ తాళ్ళకే ఉరివేయబడ్డ ఈ బతుకులు మా కొద్దు అని చెబుతూ "ఐ.ఏ ఎస్.లు,ఐ.పి.ఎస్.లు కావాలి కొత్త జీవనోపాధులుగా తన జాతి వారికి అని తన ఆకాంక్షను గాఢంగా కవిత్వం చేసింది."నాతో పాటు ప్రతి వూరి ఙ్ఞాపకాన్ని లాక్కొస్తున్న నత్త గుల్లని"అనే ఈ కవయిత్రి నాస్తల్జియాకు గురై గతించిన ఙ్ఞాపకాల పునఃస్మరణ చేసుకొంటొంది చాలా కవితల్లో ఈ సంపుటిలో. "ప్రకృతి రాసిన ప్రేమ కవిత్వం పూలు"-అని అనుకుండే షాజహాన పూల లాంటి సుకుమార భావనలెన్నో చెప్పటమే కాదు,"ఏ పిట్టలకు వలేశారో ఇన్ని నక్షత్రాలూ చల్లారు"లాంటి అసాదరణ ఊహల్నీ కవిత్వ వాక్యాలు చేశారు. షాజహానా పోలికలను కల్పించుకుండే శక్తి ఎంత గొప్పదో చెప్పడానికీ ఈ వొక్క ఉదాహరణ చాలు."దేశాంతర దుఃఖం"-అనే కవితలో "ఎంత అందం సలీమానీది!/దుఃఖం గడ్డ కట్టిన మంచు శిల్పంపై చిక్కని చీకటి వంకర్లు తిరిగిన గిరజాల జుట్టు/ప్రకృతంతా విరగ బూసి నవ్వినట్లు"-ఇలాంటి కవితా పంక్తులు అనేకం ఈ కవయిత్రి రచనలో కనిపించి బాధల వరదల నదిలో మునకలేయించడమే కాదు అమ్మలా చల్లని కొంగుతో జోలపాడి,సెలయేళ్ళ ఘోష ,వెదురు వనాల సవ్వడి,ఎండిన ఙ్ఞాపకాలను ఆకు పచ్చగా తిరగదోడటం చేస్తాయి. "దర్గా దారికీ అంటు లేదు"-"ఖఠ్ఠా-మిఠ్ఠా దోస్తానా" వంటి కవితలు హిందూ ముస్లిమ్ ల మధ్యగల ప్రేమాభిమానాలను తెలిపేవి అయితే "మాదిగ బుచ్చమ్మ',తెల్లారని బ్రతుకు"-మున్నగునవి కవయిత్రికి గల దళిత వాద స్పృహను తెలియచేస్తాయి."బూషాడా..గో బ్యాక్"-అనే కవిత అమెరికా సామ్రాజ్యవాద నిరసనను తీవ్రాతి తీవ్రంగా తెలిపే కవిత. "తన శ్వాసను వంటినిండా అత్తరులా పూసుకొని జీవిస్తున్నాను నా భూమి మీది ప్రేమలా నీ మీది ప్రేమను మర్చిపోలేక పోతున్నాను నా నేల మీది మట్టి గంధాన్ని రాసుకొన్న క్షణాన్నే ఉద్యమం ఊపిరి పోసుకొంటుంది నా దేహం నిండా ప్రవహిస్తున్నది రక్తం కాదు నా ప్రాంతపు ఊపిరులే" (నువ్విప్పుడు నా భూమివి) ఎంత కాల్పనిక భావ సంచయంతో విరిసిన పున్నాగ పూలలాంటి పదాలతో"ఎంతో దుఃఖాన్ని తీయగా వుందంటూనే తన ప్రాంతంలో ఉరకలెత్తిన ఉద్యమాన్ని గొప్ప కవిత్వంగా చేసింది షాజహానా "నువ్విప్పుడు నా భూమివి"అంటూ. "మేరా హైద్రాబాద్"-అనేది ఈ సంపుటిలో చివరి కవితే అయిన అభివ్యక్తిలో అగ్ర భాగంలో నిలువాల్సినదే. "నా ఆత్మ ఈ షహర్ చుట్టూ/పిట్టలా గిరికీలు కొడుతుంది/అనుభూతుల్నీ ఏరుతుంటుంది"-అని ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు శతాబ్దాల హైద్రాబాద్ నగర సంస్కృతినీ,విశిష్టతని,ఆ నగర ఆహారపు ఘుమ ఘుమల్నీ,తెలుపడమే కాదు "ఈ షహర్ ఒక షాహరీ/ఇక్కడి జిందగీయే ఒక షాయరీ/రాత్రిని పాన్ బీడా చేసి/తెల్ల వార్లు ఎర్రని ముషాయిరాల్నీ పండిస్తుంది"అని ఒక అపూర్వ అనుభూతి పరిమళపు ధూపాన్నీ కవయిత్రి ముక్కు నిండా నింపి మదిని అక్కడికి మళ్లింప చేస్తుంది.ప్రముఖ కవి శివారెడ్డి గారు ఇదే హైద్రాబాద్ ని అదే శీర్షికతో "ఓ హైద్రాబాద్...నువ్వొక నల్లని భయంకరమైన జంతువ్వి..........నువ్వొక అందమైన ఆడదానివైతే నీ మేని రమణీయ సౌందర్య పరీమళాలనావాహన చేయదల్చినా కాని..స్వర్గ నరకాల్నీ రెండు కళ్ళల్లో కీలించుకొన్న నువ్వొక బూటకపు లం..వి"-అని అన్నాడు.అందుకు నిరసనగానేమో ఈ కవయిత్రి "కడుపు చేతుల పట్టుకొస్తే.కన్నీరు పెట్టిన నగరం/మీ కింత చోటిచ్చింది/ఆకలి తీర్చి అమ్మయ్యింది/గిరి గీసుకొని లేదు పొమ్మని మీ ముఖాన తలుపెయ్యలేదు చూడూ./అలాంటి అమ్మను "లం" అని తిడతారా?-అని రాసినట్టు అనిపించింది నాకు. పాట పడవై ప్రయాణిస్తున్న కవయిత్రికీ,ఇంటి చుట్టూ పాతిన వెదురు చెట్లను మనసు చుట్టు పాతుకొన్న కవయిత్రికీ,నక్షత్రాలకీ చలేసిందేమో మబ్బులను కప్పుకొన్నాయి-అని భావుకత్వంతో పరవశించే కవయిత్రికీ,రాసేదంతా కవిత్వమైతే జైళ్ళన్నీ కవులతో నిండేవి-అనే జనం ఆవహించిన కవయిత్రికీ ఎన్నటి ఆరని అద్భుత దీపం మీ కవిత్వం అని చెబుతూ ,నీ కవిత్వానికీ "తుఝే సౌ బార్ సలామ్"-అని అంటున్నా. మరో మంగళ వారం ఇంకో కవిత్వ సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dk33gf

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ గా౦దీ _ నానీలు @ గడియకో గా౦దీ పుట్టినా.. ఈ దేశమెన్నాళ్ళకు బాగుపడాలి గల్లీకో గా౦దీ పుట్టినా ఈ దేశమెప్పుడు రామరాజ్య౦ కావాలి. గు౦డెలన్ని గా౦దీయిజ౦ ని౦డినా ఆ కార్యమెప్పుడు పరిపూర్ణ౦ కావాలి. గతి తప్పిన గా౦దీతత్వాన్ని గాడీలొ పెట్టె గా౦దేయులెప్పుడు రావాలి. _ కొత్త అనిల్ కుమార్ 24 / 3/ 2014.

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxkd8G

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కేన్వాసుమీద... పేరంటాలపల్లి కొండవాగు పుట్టినదగ్గరికి పరుగెత్తినపుడే ఆ అడివిలోనే ఎందుకు తప్పిపోలేదు నేను విశాఖసముద్రంలో కెరటాలెత్తుకెళ్ళినపుడే ఓడనైపోవాల్సుండెకదా అరకులోయలో జలపాతాల దగ్గరే వాననై ఎందుకుండిపోలేదు నేను ఆదిలాబాద్ కనకాయ్ లో కడెంనదిలో నీళ్ళలో చేపలా ఎందుకు జారిపోలేదారోజే చిలుకలగుట్ట శివార్లలో తిరిగినపుడే జంపన్నవాగులో జనంలో తప్పిపోలేదెందుకు అర్ధరాత్రి వెన్నెల్లో విసునూరుబాటల్లో ముచ్చట్లలో కాటగలిసిపోలేదెందుకు గోదావరినదిలో ముఖంచూస్కునే పాపికొండల్లోనే ఎందుకుండిపోలేదు అమరావతి ఒడ్డున కృష్ణలో జారినపుడే మునకలేయలేదెందుకు నైనిటాలు నుండి రామేశ్వరం దాకా ఎక్కడో తప్పిపోవలసిన వాణ్ణే మళ్ళీ ఇంటికి చేరగానే అన్నీ జ్ఞాపకాలు మైలురాళ్ళయినయి ఉత్తవూళ్ళే కావుకదా మనుషులు కదా, నేస్తాలు, రక్తనేస్తాలు, ఆత్మీయనేస్తాలు, గోర్వెచ్చని అశ్రునేస్తాలు అందరి గుర్తొస్తరు కదా చేసిన వాగ్దానాలకు బందీలం కదా తీరని కలలకు బంధువులం కదా బతికిన తీపి కథలు కొందరివి బతకడమే తీపి కల కొందరికి బతుకుంటేయాత్ర కాదు పోరాట ప్రస్థానం కొందరికి నేను వాళ్ళబాటలో పరచుకున్న మట్టికవిత్వపుపొరను నేనిపుడు ఎక్కడ తప్పిపోనక్కర లేదు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxkecH

Posted by Katta

Vijaya Bhandaru కవిత

Kulam janminchinidi lepanalanu puasthu,manishi malli malli puduthunnantha kalam,kulam thana rupanni prema meeda dhastikanni chuputuane untundi, pillalini premichaleni bhandhalu, prathiroju uri vesthune untai, premikulu maranisthune untaru prapancham guddiga chustune untundi, matha homamlo bali la kula homamlo kuda bali pasuvulu adavare ! !

by Vijaya Bhandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxkbgM

Posted by Katta

Rajeswararao Konda కవిత



by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qutO

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కేన్వాసుమీద... పేరంటాలపల్లి కొండవాగు పుట్టినదగ్గరికి పరుగెత్తినపుడే ఆ అడివిలోనే ఎందుకు తప్పిపోలేదు నేను విశాఖసముద్రంలో కెరటాలెత్తుకెళ్ళినపుడే ఓడనైపోవాల్సుండెకదా అరకులోయలో జలపాతాల దగ్గరే వాననై ఎందుకుండిపోలేదు నేను ఆదిలాబాద్ కనకాయ్ లో కడెంనదిలో నీళ్ళలో చేపలా ఎందుకు జారిపోలేదారోజే చిలుకలగుట్ట శివార్లలో తిరిగినపుడే జంపన్నవాగులో జనంలో తప్పిపోలేదెందుకు అర్ధరాత్రి వెన్నెల్లో విసునూరుబాటల్లో ముచ్చట్లలో కాటగలిసిపోలేదెందుకు గోదావరినదిలో ముఖంచూస్కునే పాపికొండల్లోనే ఎందుకుండిపోలేదు అమరావతి ఒడ్డున కృష్ణలో జారినపుడే మునకలేయలేదెందుకు నైనిటాలు నుండి రామేశ్వరం దాకా ఎక్కడో తప్పిపోవలసిన వాణ్ణే మళ్ళీ ఇంటికి చేరగానే అన్నీ జ్ఞాపకాలు మైలురాళ్ళయినయి ఉత్తవూళ్ళే కావుకదా మనుషులు కదా, నేస్తాలు, రక్తనేస్తాలు, ఆత్మీయనేస్తాలు, గోర్వెచ్చని అశ్రునేస్తాలు అందరి గుర్తొస్తరు కదా చేసిన వాగ్దానాలకు బందీలం కదా తీరని కలలకు బంధువులం కదా బతికిన తీపి కథలు కొందరివి బతకడమే తీపి కల కొందరికి బతుకుంటేయాత్ర కాదు పోరాట ప్రస్థానం కొందరికి నేను వాళ్ళబాటలో పరచుకున్న మట్టికవిత్వపుపొరను నేనిపుడు ఎక్కడ తప్పిపోనక్కర లేదు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qry9

Posted by Katta

Patwardhan Mv కవిత

ఆండ్ ద క్రెడిట్ గోస్ టు::: తెలగాణా రాష్ట్రంబిది దీపించెను సంబరమే తలపంగా గెల్చితిమీ దండిదైన సంగరమే అలనాడూ ఈనాడును అపురూప త్యాగమ్ములు ఇల నెల్లా ఉద్యమాల కివే పాఠ్య భాగమ్ములు ఏరు తెచ్చినారలనీ ఏరలిచ్చినారలనీ వీరలకూ వారలకూ వీరతాళ్ళు ఎందుకనీ పేరుపేరునా రాయగ పెద్దకావ్య మౌను కదా భూరి ప్రజాశక్తే గెలుపొందె నంట మేలు సదా అందరినీ కల్పినదీ అందరినీ మల్పినదీ అందరినీ ఒక్క బాట యందుననే నిల్పినదీ అందిందన నేల దాని నఖిల ప్రజా మూర్తినీ అందులకే ఉద్యమాని కర్పించుద మీ కీర్తిని 24-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qoCD

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | ప్రవాస పునాదులు ---------------------------------- "ప్రవాసం" అంటే అనాధారిత ప్రతిపాదనలు, తుడవలేని అపోహలే కొన్ని మెదడు కొలతల్లో- పాదమిడిన ఉత్తర క్షణమే పట్టుపానుపుల పవళింపులని పాలరాతి మేడల నివాసమని ఎడతెరిపిలేక కురిసే కాసులని కడగండ్లు చొరని కాపురాలని: సగ జీవితం గడిపిన దేశాంతర వాసపు కథ కాని కథ- అనుభవాలే ఆత్మకథలు కాదా? నిరుద్యోగ భత్యపుయాచన తో మొదలైన యాత్ర ఇది! తొలినాళ్ళలో, తబ్బిబ్బయ్యే మనసుతో తడబడే ఉఛ్చారణతో, తెలియని భయాలతో కట్టుబొట్టు లో అమిరీఅమరని అసౌకర్యంలో తెగిపడిన జ్ఞాపకాల చిట్టాలివి యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా నోరెండిన పసి బిడ్డని చంకనేసుకుని గుక్కెడు నీటికి అర్రులు చాస్తే "Dollar a bottle" అంటూ దాహపు వెల కట్టిన నేలలో నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను అర్థరాత్రి నిద్రకొరిగిన ప్రపంచంలో నిర్జనమైన రైలుస్టేషనులో, చేతిలో సొమ్మున్నా చిల్లర ఇవ్వ/లే/ని యంత్రపర నిబంధనతో ఎటూ తోచని విధిలో, అపరిచితుని వెదుక్కుని "do you have 2 dollars" అన్నదానికి అర్థాంతరం ఉన్నదని, అది యాచకుల ఊతపదమని దినపత్రిక వెనుగ్గా వినవచ్చిన విసుగు, ఎగిరొచ్చిపడిన డాలరు కాసుతో నిర్విచేష్టురాలినయ్యాను అమ్మ ఉత్తరమో, ఉద్యోగ ప్రకటనలో రావాలని అర్రులు చాస్తే, పేపరు కట్టలు వేలు వస్తాయి: మెయిల్ బాక్సుల్లో కొత్త ఉత్పత్తుల వార్తలు, ఊరి వారి వేడుకల వార్తలు మోస్తూ. 'ఇంతంత కాగితపు అచ్చువేత కి ఎక్కడిదయ్యా సొమ్ము?' "Junk Mail" అని చెత్తకుప్పల్లోకి విసిరిపడే శ్రమ నష్టం బేరీజు వేసాను అందుకే ఎవరు వీసా వచ్చిందని వార్త పంపినా రెండుమాటలతో కార్డుముక్క రాసిపడేసేదాన్ని అప్పట్లో, డాలర్ పైన పోస్టల్ స్టాంప్ అతికించి మరీ! "నీళ్ళు కొనుక్కోవాలి రా అబ్బీ, చిల్లర మార్చుకుని వెంట ఉంచుకోవాలి సుమీ!!!" అంటో "నీ చిరునామాకి ఎక్కువగా వచ్చి చేరేది నీకక్కరలేని వార్తలేనని" కలుపుతూ- (1994 అనుభవాల నుంచి) 25/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qr1c

Posted by Katta