పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: అభినందన..: మండవ మిశ్ర శంకర భగవద్పాదుల న్యాయమూర్తి ఎవరోయి.. నరకాసుర వధ యందున నారసమెత్తినది ఎవరోయి.. కఠిన తపమునాచరించి అపర్ణయయిన ఆది ప్రేమమయి ఎవరోయి.. నిండు సభలో పండు మనసుతో రఘునందను వరించినది ఎవరోయి.. ఆంగ్ల రాక్షసులను వామ హస్తమున తరిమివేసినది ఎవరోయి.. కాకతీయ వంశప్రభకు వెలుగులద్దినది ఎవరోయి.. చంద్రమండలమున యాత్ర సల్పిన ధీరోద్ధాత్త మూర్తి ఎవరోయి.. అవనిన వెలసిన వనితా విరి కమలాలకు శ్రమ సౌందర్య విరాట్ తేజోమూర్తులకు ఇవియే నా మంగళ శాసనములు..! హృదయపూర్వక అభినందన చందనాలు..!! 08/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsFi6E

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి