పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

కాశి రాజు కవిత

పురిటి దుఃఖం మాయమ్మ భాదలాటి వరదగూడు మా నానలా మాటాడలేనట్టి సందురూడు అయేల సీకటిలో దుఃఖమంతా నక్షత్రాలవుతున్నట్టు వొట్టి ఊహనాది. వరిసేల మీద గాలి ఊగుతావుంది గడపమ్మీద్దీపం వొణుకుతూ వుంది. చిరు సీకటిలో అన్నమెట్టి పెద్దదానికి నెలలు నిండాయి, రేపో మాపో కరుసుంది అత్తమాటూ తాగొద్దు సత్తియ్యా అంటుంటే అన్నం తినడం ఆపలేదాడు. చిరాకొచ్చి, "పెంచలేనోడివి ఎందుక్కన్నావ్" అని అడిగితే గుండె బరువెక్కి,కల్లలోనీలు గొంతులోకొచ్చి మెదబడిందాడికి తప్పుడుమాటని తెలీకుండానే తరవాత నేను నిద్దరోయా ! మా నానకి ముందుగా తెల్లారినట్టుంది మొకం దుఃఖంతో కడుక్కుంటున్నాడు. చూడలేక పొద్దున్నే పొలాలమీదకి పొతే గడ్డిపరక్కి ఏలాడే మా ఊళ్ళోని మంచుబిందువులన్నీ ఆ రాత్రి దుఖ్ఖాలే ఆ గడ్డిపరకేమో రాత్రంతా మెలితిరిగి పోయిన మానాన గుండె.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ft4vw5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి