పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

RajendraKumar Devarapalli కవిత

యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. ----రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చ్,16,2014 యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. అన్ని సభలకు వెళ్ళండి.కేవలం సాహితీ సభలకే పరిమితం కాకండి. ముఖ్య అతిధిగానో,ప్రధాన వక్తగానో పిలిస్తే తప్ప ఏ సభకూ,ముఖ్యంగా సాహితీసభలకు వెళ్ళం,ప్రేక్షక/శ్రోతల్లో కూర్చోవటమా అన్న తలబిరుసు తగ్గించుకోండి. పదిమందితో కలిసే ఏ అవకాశాన్ని వీలైనంతవరకూ వదులుకోవద్దు. గుర్తుంచుకోండి-- సాహిత్యం సమాజం నుంచి పుడుతుంది. సారస్వతం పాఠకుల నుంచి,ప్రజల నుంచి వెలికివస్తుంది. దాన్ని అక్షరాల్లోకి బట్వాడా చేసి మరలా పాఠకులైన ప్రజల ముందు ఉంచటమే మీ ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలో కాగితం/కలం ఎంతో కంప్యూటరూ,కీబోర్డూ ఎంతో మీరూ అంతే అంతకంటే ఎక్కువ సమాజాన్నుంచి ఆశించకండి.ఆశాభంగం చెందకండి.

by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5r

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి