పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

Si Ra కవిత

ఆర్మేనియన్ జినోసైడ్ ------------------------ జినోసైడ్ అంటే- ఒకసమూహాన్ని ప్రణాలికాబద్దంగా నిర్మూలించటం. 20వ శతాబ్ధంలో మొట్టమొదటి జినోసైడ్ ఇది. రెండు కోట్లమందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఫలితంగా ఆర్మేనియన్ ప్రజలు వారి చారిత్రాత్మక జన్మభూమిని కోల్పోయారు . మూడు వేల సంవత్సరాల నుండి ఆర్మేనియన్లు మెడిటరెనియన్ సీ, బ్లాక్ సీ మరియు కస్పియన్ సీ ల మద్యలొ, తూర్పుభాగం లో, ఐరొపా, ఆఫ్రిక, ఆసియా ఖండాలు కలిసేచొట నివసించేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అనటొలియ అంటున్నాం. యెప్పటినుండో ఇక్కడి వాసులు వారి అస్థిత్వాన్ని,సంస్కౄతి ని కాపడుకుంటూ వొచ్చారు. 11వ శతాబ్ధంలో, టర్కులు ఆర్మేనియపై దాడి చేసి ఆక్రమించారు. 18వ శతాబ్ధానికల్లా, టర్కులు మెల్లగా బలహీనమయ్యారు. బాగా చదువుకున్న ఆర్మేనియన్లు రాజకీయ సంస్కరనలపై ప్రభుత్వం మీద వొత్తిడి పెట్టారు. కిరాతకుడైన టర్కు సుల్తాన్ లక్ష మంది ఆర్మేనియన్లను చంపించాడు. కాని సుల్తాను రొజులు దెగ్గర పడ్డాయి. "యంగ్ టుర్క్స్" అనే ఒక సంస్కరనా- ఆలొచనలు ఉన్న టుర్కు జాతియవాదులు సుల్తాన్ని ఎదిరించి అందరికీ కనీస హక్కులను కల్పించారు. కాని ఈ జాతియవాదమే తిరిగి ఆర్మేనియన్లను పొట్టనపెట్టుకుంది. ఈ జాతియవాదులు తమ రాజ్యాన్ని, తమ జాతిని విస్తరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వల్లకు అడ్డు ఉన్నది 10% కూడా లేని రెండు కొట్ల ఆర్మేనియన్లు. అప్పుడు వొచ్చిన మొదటి ప్రపంచ యుద్దం లో, టర్కులు సెంట్రల్ పవర్స్ (జర్మని మరియు ఆస్ట్రియ-హంగెరి) వైపు యుద్దం చేసారు. 1909 నుండి 1918 మద్య కాలంలో జరిగినదే ఈ జెనోసైడ్. టర్కుల జాతియవాద దాహం దీనికి మూలం. ప్రభుత్వం అత్యంత కిరాతకంగా రెండు కొట్ల మందిని చంపించింది. చిన్నా, పెద్దా లెకుండా, ఆడా మొగా తెడా లెకుండా అందర్ని ఘూరంగా చంపెసారు. చరిత్రలో మొట్టమొదటి సారి, ఆధునిక టెక్నొలజి , సైన్సె ఎంత మారనకాండ స్రుశ్టించగలవో తెలిపినది ఆర్మేనియన్ జేనొసిడె. అందుకే దీన్నే మొట్టమొదటి ఆధునిక మారనఖాండ అనికుడా అంటారు. --- సియమంటో (1878- 1915) బాగా చదువుకున్నాడు. ప్రపంచంలోని ఎన్నో ప్రదేషాలని చూసాడు. 1909 లో ఆర్మేనియన్ల మొదటి జెనోసిడ్ జరిగినప్పుడు, "నా స్నెహితుడు నుండి రక్త కబురు" అనే కవిత్వ పుస్తకాన్ని రచించాడు.రాజకీయ కార్యకర్త. ఆప్రిల్ 24, 1915 మిగిలిన ఎందరో కార్యకర్తలు, మెధావులు, రచయితలు, కలాకారులతో పాతు, ప్రభుత్వం హత్య చెసింది. వారిలో సియమంటో ఒకడు. నా కన్నీల్లు నా ముత్తాతలు నడిచిన చోట, స్వచ్చమైన రెక్కలున్న కలతో, ఒంటరిగా నేను; అందమైన జింకవేసే తేలికైన అడుగులు నావి, సంతొషంతో హౄదయం పులకరిస్తోంది; ఆ పాతరోజుల గొప్ప వెలుగు లో, నీలాకాషాన్ని గొంతువరకూ తాగి గంతులేశాను, స్వర్నాలతోనూ, ఆశలతోనూ నిండాయి నా కళ్ళు,నా ఆత్మ దైవత్వంతో వెలిగిపొయింది. మా తోటలోని చెట్ల నుంచి,ఎన్నెన్నో బుట్టల పండ్లను ఎండాకాలం నాకు బహుకరిస్తుంది- ప్రతి పండూ మా ప్రాంతం లో పెరిగేది. అందమైన, రాగవంతమైన, సన్నని చెట్టు నుండి, నిషబ్ధంగా కొమ్మని తెంచేస్తాను,వెణువుతో పాటలు తయారుచేసుకొవటానికి. నేను పాడుతాను; రత్నాల వెలుగులు, పాత ఇంటినుండి వొచ్చిన పిట్టలు, పగల్లు, రాత్రులనూ నింపే స్వర్గలొకపు బావులనుండి వస్తున్న రాగాలూ, నా సోదరి కౌగలింతలాంటి చల్లటి వుదయపు గాలులు, అన్నీ నా అనందంతో పాలుపంచుకున్నాయ్, నాతో పాటి పాడాయ్. ఈ రోజు రాత్రి కలలో , మల్లి నా తీయటి వేణువుని తీసుకున్న; నా పెదవులపై అది ఒక ముద్దు పెట్టింది, పాతరొజులకి చెందిన ముద్దు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకురాగానే, నాకు వూపిరి ఆడటం ఆగిపొయ్యింది, పాటల బదులు, కన్నీల్లు ఒకొక్క బొట్టుగా జారి కాలువలుకట్టాయి . ---- నాట్యం ఆర్మెనియన్ల ప్రాణాలు ఇంకా పూర్తిగా పోని రోజులవి బూడిదతో నిండిన మైదానంలో ఒక జర్మన్ మహిల,కన్నీల్లని అనిచిపట్టుకొని ఆమె చూసిన ఘొరం గురించి ఇలా చెప్పింది- “ఇదిగో, చెప్తున్నాను కదా ఈ విశయం, దీన్ని నా సొంత కల్లతో చూసాను. వెనక ఉన్న నరకపు కిటికీ లోంచి, పల్లని గెట్టిగా బిగబెట్టుకొని, చూసాను నా కరుణలేని కల్లతో: బార్డేజ్ పట్టణం బూడిద కావటం. చెట్టంత ఎత్తుగా పరచబడ్డ శవాలను. నీల్లలో, కొలనుల్లో, కాలువల్లో నిత్యం చెప్పుడు చేసే ఆర్మేనియన్ ల జాతి రక్తం నాకు ఇంకా వినిపిస్తొంది. భయపడకు, నేను ఏం చూసానో ఇంకా చెప్పనేలేదు, ఒక మనిషి ఇంకొక మనిషికి ఎంత ఘోరం చెయగలడొ ఇంకా చెప్పాలి. అంతా స్మశానం అవ్వటానికి రెండు రోజుల ముందు జరిగిన సంఘటన.. కత్తితో పొడచబడ్డ ఒక పాపను చూస్తూ, నా గదిలో రాత్రి నుండి పగలుదాక, కన్నీటితో చావును తడుపుతూ గడిపాను. అకస్మికంగా దూరం నుండి- బూతు పాటలు ద్రాక్ష తోటలో ఇరవయ్ మంది వధువులపై, కొరడా జులిపిస్తున్న, ఒక నల్లటి సమూహం. మెల్లగా ప్రానాలు వదులుతున్న ఆ గదిలోని పాపని గడ్డి పరుపుపై వొదిలేసి, బాల్కని కిటికీ దెగ్గరకు వెల్లాను అప్పటికే ఆ సమూహం చెట్ల గుబురుగా, అయ్యింది. వాల్లలొని ఒక మానవ మౄగం అరిచాడు- “నువ్వు నాత్యం చేసి తీరాల్సిందే మా డప్పుల శబ్దానికి నువ్వు ఆడాల్సిందే”నని. ఆ స్త్రీల చర్మం పై కొరడాలతో కొడ్తారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఆ వధువులందరూ సర్కిల్-డాన్స్ చెయ్యాలంటారు. అప్పుడు, నాకు అసూయ పుట్టింది, ఇంట్లో చనిపొతున్న ఆ పాపను చూసి, తను, చిన్నగా గొనిగినట్టూ ప్రపంచాన్ని తిట్టేసి తన ఆత్మని నక్షత్రాలకు ఇచ్చేసింది. నేను మాత్రం ఏమి చేయలేక నిలుచుండిపొయాను. “ఆడు” అని అర్చారు వాల్లు, “చచ్చే దాక ఆడు,జాతిలేని దానా మాకోసం నవ్వుతూ ఆడు, నీ స్తనాలు ఎగిరేలా! మిమ్మల్ని ఎవరూ పట్తించుకోరు ఇప్పుడు, నగ్నమైన బానిసలు మీరు మేమందరం ఎదురుచూస్తున్నాం, అందుకే ఆడండి, ఫక్కింగ్ స్లట్స్. ఆ ఇరవై అందమైన వధువులూ నేలకొరిగారు. “లెయ్యండి,” ఆ మంద అర్చింది వారి కత్తులతో భయపెడుతూ. అప్పుడు ఎవడో కిరొసిన్ తెచ్చాడు. మానవ ధర్మమా, ఇదిగో నీ మొహం పై నెను ఉమ్మేస్తున్నను. ఆ వధువులపై కిరొసిన్ పోసారు. “ఆడండి” వాల్లు గెట్టిగా అరిచారు అరేబియలో ఏ మూల వెతికినా ఇంత సువాసన దొరకదు” అంటూ ఒక కాగడాతో వారి నగ్న దేహాలను అంటించారు. ఆ కాలుతున్న దేహాలు పొర్లి పొర్లి చావులొకి జారిపడ్డాయి. వెంటనే కిటికీని మూసెసి ఇంట్లో చనిపోయిన పాప దెగ్గరకు వెల్లి అడిగాను- “నా కల్లని నేను ఎలా తవ్వాలి ఇప్పుడు ?” అని ---

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xLS0DL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి