పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

DrAcharya Phaneendra కవిత

9 జూన్ 2014 నాడు త్యాగరాయ గానసభలో "నమో భరతమాత" - కవిసమ్మేళనం జరిగింది. ప్రముఖ కవి "సుధామ" గారి అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో "డా. జె. బాపురెడ్డి", "డా. ఉండేల మాలకొండారెడ్డి", "డా. ముదిగొండ శివప్రసాద్", "డా. సి.భవానీ దేవి", "డా. వెనిగళ్ళ రాంబాబు" మొదలైన వారితోబాటు నేను పాల్గొన్నాను. ఆనాడు నేను వినిపించిన నా పద్య కవిత . శక్తివంత భారతం రచన: "కవి దిగ్గజ" డా. ఆచార్య ఫణీంద్ర తలపై హిమాద్రి మకుటము; గళమున హారములు పుణ్య గంగా, యమునల్; జలధి త్రయ సంధి స్థలి పలు వన్నెల పాదపీఠి - భారతి నీకౌ! క్రొత్త దనము నిండె - క్రొంగొత్త కాషాయ వర్ణశోభిత మయె భరతభూమి! కడచి పోయిన కడగండ్లు - గతము గతః స్వర్ణ యుగము లింక వరలు గాక! నాడొక "నరేంద్రు" డుదయించి, నాటి విశ్వ వేదిపై భారతీయ తాత్త్వికత చాటె! నేడొక "నరేంద్రు" డుదయించె - నిలుపు గాక భరత దేశమ్ము నుత్తుంగ పదము పైన!! ఇరువ దెనిమిది రాష్ట్రాల కింక తోడు కంటివి నవ శిశువు, "తెలంగాణ" పేర - పచ్చి బాలెంతరాల! మా భరత మాత! ప్రీతి లాలించి, పాలించి పెంచుమమ్మ! అన్ని రాష్ట్రము లిక అభివృద్ధి పథములన్ తురగ వేగ గతిని పరుగు లిడుత! అచిర కాల మందె అవనిపై భరతాంబ అమిత శక్తివంత దేశ మగును గాక! --- && ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qAAk96

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి