పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

కళాతాత్విక మార్గంలో తెలంగాణా నుడికారపు కవిత్వం Posted on: Mon 16 Jun 01:35:11.096163 2014 భావచిత్రాల వైవిధ్యం మాత్రమే కాదు. ప్రతీకలు, మనోవైజ్ఞానిక ప్రభావం, తాత్వికోద్దీపన ఇలాంటివి తెలంగాణా నుడికారంలోనే తెలంగాణా కవులు సాధిస్తున్నారు. ఇలాంటి చర్చల వలన ఈ కవిత్వంలోని మరో అంశం చర్చకు వస్తుంది. తెలుగు ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది. ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా, సహజాతి సహజంగా అందించింది. ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చా లేదా అనే చర్చలు జరిగాయి. కొన్ని సార్లు ఈ దృష్టితో పరిశీలిస్తే వచ్చిన కవిత్వం అందుకు సమాధానం చెబుతుంది. ప్రతీభాషకు ఒక ప్రాతిపదిక స్వభావం ఉంటుంది. తెలంగాణా నుడికారంలో ఔద్వేగికత, మమకారంలాంటి భిన్న మాధ్యమాలుంటాయి. ఈ నుడికారంలో ఏ అర్థాన్నిచ్చే వాక్యానికైనా ఈ స్వభావం కనిపిస్తుంది. గతంలో తెలంగాణా ఉద్యమం, నక్జల్చరీ పోరాటాలు అనే వైప్లవిక పోరాటాల వలన, వర్తమానంలోని కవిత్వం వలన తెలంగాణా కవిత్వం. పాటలో ఉద్యమం ధ్వనించింది. ప్రధాన ఉద్వేగ సందర్భాలు నడిపించటం, కవిత్వాన్ని ఉద్యమం ప్రభావితం చేయడం, ఇక్కడి కవిత్వంలో ఎక్కువే. ఉద్యమంవల్లే కవిత్వం రాసిన కొత్తగొంతుకలూ ఈ ప్రాంతంలో అధికమే. అదే సందర్భంలో ప్రాంతాన్ని అక్కడి ఆహ్లాదవాతావరణాలను, వ్యక్తులను ఉద్దేశించి రాసిన అనేక కవితలు తెలంగాణా కవిత్వంలో మరో భావ, తాత్విక కవితా యుగాలను స్వప్నిస్తాయి. ఈ కళాత్మక ఉద్దీపనకూ నుడికారం ప్రత్యేక అలంకారమయింది. వెన్నెలని ఆధారం చేసుకొని చాలా గొప్ప భావచిత్రాలతో ఒక కవితని నిర్మించారు బూర్ల వెంకటేష్‌. బూర్ల దర్శనంలో తన్మయీ భావం కనిపిస్తుంది. వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా, పాలలా, వరిగొలుకల్లా, వెండిలా, తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు. బూర్ల దర్శనంపై వర్ణ (షశీశ్రీశీబతీ ) ప్రభావం కనిపిస్తుంది. నిజానికి వెన్నెలని చల్లనిదనే దృష్టితో చూస్తారు. ''ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె నేను ఇంట్ల ఉంటే/ కిటికిలకెల్లి తొంగి చూస్తది బైటికివోతె/ ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది'' ''రాత్రిరాత్రంతా/తెల్లటి దుప్పటిగప్పి నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లు మూసుకుంటే మనసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది '' ''పొద్దుగాల పాలువిండేటప్పుడు సర్వలదునికి జాక్కుంటది'' ''ఆకాశంల నిలవడి నా కోసం తపస్సు జేసి వరిగొలుకల అవతారమెత్తి నా గుండిగెల నిండుతది సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి రమ్మని చేతులు చాపుతె తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి తన మనుసు తెల్లకాయిదం జేసి నాకు ప్రేమలేఖ పంపిస్తది'' (ఎన్నీల ముచ్చట్లు-బూర్ల వెంకటేష్‌) వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు. కోట్‌ చేయగలిగితే అన్ని వాక్యాలు అంతే బలమైనవి తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని , మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది. సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది. వెంకటేష్‌ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు. ''తొంగిచూసు/ ఎంటవడు/ ముచ్చటవెట్టు/ దునుకు/ జాక్కొను/ కుమ్మరిచ్చు/ఇనుకుంట'' ఇలాంటివి కనిపిస్తాయి. ''చెప్పాలే/ ఉంటే /వోతే'' లాంటి క్రియలు కూడా సహజ త్వాన్ని ప్రదర్శిస్తాయి. వెన్నెల గురించి గోరటి ఎంకన్న కూడా ఒక పాట రాసారు. తెలుపు అనే వర్ణాన్ని పట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని అనేక పంక్తులని రాయటం ఇందులో కనిపిస్తుంది. ఒక భావ చిత్రాన్ని నిర్మించడంలో స్వరం, వర్ణం, దృశ్యం , భావన వంటి అనేక పరికరాలు ఉంటాయి, బూర్లలో ఈ అంశాలన్నీ కనిపిస్తాయి. వెన్నెలతో ఉండే సంబంధాన్ని వ్యక్తం చేసిన వాక్యాలతో పాటు వెన్నెలలోని వర్ణాన్ని కూడా భావచిత్రమయం చేయడం కనిపిస్తుంది. ''సౌందర్యాన్ని కనిపెట్టే కన్ను ప్రకృతికి ఎదురు పడినపుడు దాని సౌందర్యం ద్విగుణీకృతం అవుతుందని'' కళావాదుల అభిప్రాయం. ఇది వెన్నెలతో ఉండే సంబంధాన్ని వ్యక్తం చేసిన వాక్యాలలో కనిపిస్తుంది. ''తెల్లటి దుప్పటి, వెండి'' లాంటి పదాలని, పదబంధాలని గమనిస్తే ఇందులోని వర్ణాన్ని కవిత్వం చేయడం చూడవచ్చు. మైకేల్‌ సూపర్‌ అనే కళా సమీక్షకుడు రంగుల గురించి మాట్లాడుతూ '' దీవyశీఅస aఅy సశీబb్‌. ఖీశీతీ ్‌ష్ట్రవ ళతీర్‌ ్‌ఱఎవ ఱఅ ్‌ష్ట్రవ ష్ట్రఱర్‌శీతీy శీట aత్‌ీ, షశీశ్రీశీబతీ ఱర సఱరజూశ్రీyవస టశీతీ ఱ్‌ర శీషఅ ఝసవ. ×్‌ రఱఅస్త్రఱఅస్త్ర టశీతీ ్‌ష్ట్రవ ఝసవ శీట రఱఅస్త్రఱఅస్త్ర , aఅస ఙఱbతీa్‌వర టశీతీ ్‌ష్ట్రవ ఝసవ శీట ఙఱbతీa్‌ఱఅస్త్ర. ఔఱ్‌ష్ట్రశీబ్‌ ్‌ష్ట్రవ రశ్రీఱస్త్రష్ట్ర్‌వర్‌ అవ్‌బతీaశ్రీఱర్‌ఱష షశీఅ్‌వఞ్‌'' అన్నాడు. కళాకారుని దృష్టిలో రంగు కేవలం భౌతికం కాదు. అది పాడటం, చలించటం మొదలైన అన్ని గుణాలని కలిగి ఉంటుంది, పై వాక్యంలో తెల్లటి దుప్పటి, వెండిలో ప్రతిబింబించటం ఇలాంటిదే. వస్తువునించి రూపాన్ని అందులోని విలువలను వేరుగా గమనించడం వల్ల ఇది సాధ్యమయింది. కళాత్మకంగా రాస్తున్నప్పుడు కవిలో అతని ఆత్మ వస్తువు యొక్క ఆత్మని దర్శిస్తుంది. ఈ క్రమంలో వస్తువులోని అంతర్గత శక్తులన్నీ ఆ దర్శనంలో పెనవేసుకుంటాయి. తైదల అంజయ్య, సిరిరామోజు హరగోపాల్‌, వేముగంటి మురళీ, బూర్ల వెంకటేశ్వర్లు మొదలైన కవులు రాసిన కవిత్వంలో ఈ మార్గం కనిపిస్తుంది. తాత్విక ఉద్దీపన దాక వెళ్లడానికి దర్శనం దాని నుండి కళాత్మక రూపం ఇందులోనూ మొదటి దశ భావచిత్రాలు గీయటం, రెండువదశలో ప్రతీకల ఆచ్చాదన ఎక్కువ చేసి రాయటం. ఈ దశకు అతీత స్థాయి దానిలో జీవితాన్ని సంలీనం చేసి తాత్విక మార్గంలో వ్యక్తం చేయటం ఇవన్నీ తెలంగాణా కవిత్వంలో కనిపిస్తాయి. ''నా చిన్న నాటి కలువపువ్వు కుంట మా పల్లె తలాపున తరగని ఆస్తి చెట్టుమీది పాలపిట్టకు నీటి ప్రేము కట్టే చిత్రం ఇక్కడమునిగి అక్కడ తేలే బుడుబుంగల ధర్మసత్రం'' (కుంట- బూర్ల వెంకటేశ్వర్లు) ''మొగిలీరేకుల్లెక్క పిల్లలొస్తున్నారె నవ్వుకుంట తుళ్ళుకుంట బడికొస్తున్నారె లేత లేత ఆకులోలె పూత పూత పిందెలోలె దువ్వెన్ల గుంపు లెక్క పావురాల దండు లెక్క లేత పెదవుల మీద నవ్వులూ రువ్వుకుంట ముద్దు ముద్దూగ నడిచె బొమ్మాల దండు'' (బడిబాటల్లో -సిరిరామొజు హరగోపాల్‌) మొదటిదానిలో కుంట అనే ప్రదేశాన్ని అనేక భావ చిత్రాలుగా గీయటం కనిపిస్తుంది. రెండవ భాగంలో బడి పిల్లలు బడికి వెళ్ళటాన్ని రకరకాల ప్రతీకలతో చిత్రించారు. ఈ పద్ధతిలో ఒకటి రెండు వైరుధ్యాలను గుర్తించవచ్చు. ప్రకృతిని భావచిత్రాలుగా గీస్తున్నప్పుడు ఊహా, సాంస్కృతికత ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే వ్యక్తులు చలనదృశ్యాలు గీసినప్పుడు ప్రతీకల వాడకం ఎక్కువ కనిపిస్తుంది. ''కళ ఒక విషయం కాదు అనుభవం'' అన్నాడు జోసెఫ్‌ అల్బర్ట్‌ ఈ అనుభవం ఈ వాక్య భాగాల్లో కనిపిస్తుంది. ''మా గూనపెంకల ఇంట్లోకి మల్లె తీగ జారి వుండె వేపపూల జడేసుకుని గచ్చు మురిసిపోయేది ఎత్తయిన అరుగులమీద గుమ్మడి ఆకులతోని దొండ పిందెలు ముచ్చట పెట్టుకుంటుంటె కట్టెలపొయ్యిలనుంచి లేసినపొగ అమ్మ దు:ఖంలో కలిసి జమిలిగ చూరు కింద దూరేది ఆవుల గిట్టలనుంచి రాలిన వడ్ల గింజలను ఏరుకుంట కోళ్ళమంద గుంపుగ కదిలేవి'' (వేముగంటి మురళి) ఒక ఊరులోని సజీవదృశ్యాన్ని కవిత్వం చేసిన వాక్యాలివి. ఒక దృశ్యం లోని అనే అంశాలు పేర్చినట్లుగా కనిపిస్తాయి ఇందులో కళాకారుడు వస్తువునుంచి రూపాన్ని వేరుచేసి చూస్తాడని అంటాడు సంజీవదేవ్‌. ప్రకృతి అంతా రూప భేదాలమయం దీన్నంతా ఒక్కటిగా చూడ్డనికి ఒక విశిష్ట దృష్టి కావాలి. ఆ దృష్టి కవిలోని సాంస్కృతికాత్మ ఇస్తుంది. అందుకే అరవిందులూ కవి ఆత్మ పలికిందే అసలైన కవిత్వం అన్నారు. మల్లె తీగ, వేప పూవు, పుంజీతం ఆట, ఆవుటగిట్టలు, కోళ్ల మంద'' ఇవన్నీ నిజానికి వ్యష్టి చిత్రాలు. వీటన్నిటిని ఒకటిగా చేసి ఒక పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా చేయటం ఇందులో కనిపిస్తుంది. భావచిత్రాల వైవిధ్యం మాత్రమే కాదు. ప్రతీకలు, మనోవైజ్ఞానిక ప్రభావం, తాత్వికోద్దీపన ఇలాంటివి తెలంగాణా నుడికారంలోనే తెలంగాణా కవులు సాధిస్తున్నారు. ఇలాంటి చర్చల వలన ఈ కవిత్వంలోని మరో అంశం చర్చకు వస్తుంది. అది తెలంగాణా కవిత్వాన్ని, తెలుగు కవిత్వాన్ని ప్రదీప్తం చేస్తుంది. - ఎం. నారాయణ శర్మ, 9848348502కళాతాత్విక మార్గంలో తెలంగాణా నుడికారపు కవిత్వంhttp://ift.tt/UFo7Ge 4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UFo7Ge

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి