పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

కాశి రాజు కవిత

||తెలుసు || దీపాలార్పేసిన గాలితో గొడవాడి భారంగా మారిన దాని హోరంతా కళ్ళకికట్టి సూపుతున్నపుడు సీకటి ముసుగు తీసేసి మామిడాకులు మెరుస్తాయని మా ఊళ్ళో ఎండాకాలం ఎన్నెలకి మనుసులతో మాటాడ్డం తెలుసు. దూరంగా ఉన్న ఎద్దునో , గేదినో అక్కడెవరో ఉన్నారని బ్రమింపసేసి తీరా సేరి సూశాక చేతులు నాకే ఎద్దునీ, గేదినీ మనుసుల్లాగా నీతో మాటాడించడం మాఊరి ఎన్నెలకి ఎప్పుడో తెలుసు 22/ 05/ 2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tnWFIJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి