పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

కాశి రాజు కవిత

కాశి రాజు ||ఒరిమూన|| ఆ గరుకుగెడ్డాన్ని గీసిన తుప్పట్టేసిన బ్లేడుతో బొడ్డుకోసాక నెప్పిలేకున్నా ఏడ్చానట, నాకప్పుడు తెలుసేమో గడవక ఆరో నెలలో దమ్ముచేలో అమ్మ నాటిన ఒరిమూన ములిగిపోయింది మాయమ్మ దుఖంలోనని. కడుపులో ఉన్న నేను కరువురోజోల్లో పెరుగుతానో లేదోనని గర్భగుడిలో గుప్పిల్లు మూసుకుని కళ్ళు తెరవని నాకు కన్నీల్లే పట్టినట్టుంది నా పేగుకు ముడేసుకున్న మాయనిండా, ఆ దమ్ముచేలో ఉన్న మాయమ్మ కన్నీళ్లు అవునిప్పుడు ఏడుస్తాను అన్నాన్ని, అమ్మనీ గుర్తు తెచ్చుకుని ఎవరైనా ఆప్యాయంగా వొండెట్టిన ముద్దను చుడుతున్నపుడు భూమి బ్రమిస్తున్నట్టు ఉంటాది నాకు. ఒరేయ్ వింటున్నవాడా ! నేను రాసేదానికి నీ లెక్కలు నీవి కావొచ్చు అన్నం నాకు ముఖ్యం కాదు, అమ్మల ముందు చేయికడిగి, ఒంటరి కాలాల్లో వొచ్చేటి దుఖం నాకు ప్రశాంతత. అపుడు రాసే కవిత్వమైతే కన్నీళ్లలో తేలెళ్లిపోయే కాగిత్తప్పడవ. విమర్శించకు వదిలేయ్ దుఖం లాంటి నీటిలో పెరిగే ఒరిమూన బతుకు నాది. (భరించలేని ఆ వెకిలి నవ్వుకి )

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTbgI7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి