పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

క్రాంతి శ్రీనివాస రావు కవిత: సిOహావలోకనం




అభివ్యక్తి సారళ్యత(flexibility of expression)అనేది ఒకటి కవితానిర్మాణంలో మార్పుతెచ్చింది.వాక్యాలుగా,యూనిట్లుగా కవిత్వాన్ని రాయడం అక్కడినుంచే.నిజానికి ఈ పద్ధతి సంస్కృత కాలంలోనూ,ఆతరువాత తెలుగు పద్యకవితలోనూ ఉన్నదే.వృత్తాలు,పద్యాలకుండే పరిది సహజంగానే ఈ విభాగాన్ని చేసేది.

భావభివ్యక్త్రికి ఊహలు,మనస్సు.బుద్ధి,అలంకారంలాంటివి కాకుండా ఆత్మనుండి ఆవిష్కృతమయ్యేదే అసలైన కవిత్వమని అరవిందులు అభిప్రాయపడ్డారు.
the true creator of poetry
the true hearer of the soul-అన్నారయన.ఈక్రమంలోనే దివ్య జీవన ప్రస్థానాన్ని(the path of devine life)ఆవిష్కరించారు.

సూక్ష్మ భౌతిక స్పృహ(micro phisical disire)జీవితానికిసంబంధించి ప్రధానభౌతికంశంద్వారా కాకుండా ఓ సూక్ష్మాశం ద్వారా జీవితాన్ని సౌందర్యాత్మకంగ ఆవిష్కరించడం.భౌతికమైన అంశం కవితలో తక్కువగా ఉండి ఆపాదు నుండి ఓ విశ్వవిరాడ్రూపం బయటికి రావడం.

క్రాంతి శ్రీనివాస రావు గారి కవితలో ఓక చిన్న అంశాన్ని తనకుండే కవితాశక్తితో కళాత్మకంగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.పదం నుండి పదచిత్రాలని ,భావ చిత్రాలని రూపొందించడానికి తగినంత కవిత్వానుభవం కావాలి.అన్నిటికి మించి ఆ అంశాన్ని వ్యక్తం చేయగల నిర్మాణరూపం కావాలి.

భారతీయ సాహిత్య దర్శనాలో ఆత్మప్రేరిత అంతర్దర్శనానికి ప్రాధాన్యత ఉంది.అరవిందులు అతీత మానసిక స్థాయిదాకా కొన్ని అంశాలు చెప్పారు.

భౌతికం(physical)అంతర్మానసం(the inner mind)ఉదాత్తమానసం(the higher mind)విశదమానసం(illumineated mind)పేరణాత్మక మానసం(intutive mind)వీటన్నిటిపైన ovarmindగురించి ప్రస్తావించారు.ఈ పరిశీలనా,విశ్లేషణ అంతా సమాధి అభ్యాసంలోనించే సాగింది.ఆత్మానందాన్నుంచి కవితాకళానుభవం పెరుగుతుందని దానికి సమాధ్యవస్థే అవసరమని అరవిందుల భావన.

శ్రీనివాసరావు వాక్యాల్లో ఇలాంటి అనుభవమొకటి కనిపిస్తుంది.ఒక స్థాయినుండి సూక్ష్మపు విశ్వాత్మ దర్శనాన్ని కళాత్మకంగా అన్వేషిస్తారు.

"దృశ్యపు వెలుగు శ్వాసలను
బింబ ప్రతిబింబాల బిందు స్వరాలను
వినిపించగలిగేవి
ఆలోచనల అంచులు దాటని చిత్రకారుని కుంచెలే"

ఒక సౌందర్యాన్ని అనుభవించేవిషయంలో ఒకపరిధిని ,అందులోంచి అన్వేషణని అనుసరిస్తున్నారు శ్వాసలను,స్వరాలను కుంచె వినిపించడం అతీత మానసిక స్పృహ.
మరో వాక్యాన్ని చూస్తే.. ..

"రాతి ముసుగేసుకున్న అందాలముడి
విప్పగలిగేది/ శిల్పి పిలుపు వినగలిగే ఉలిమొనలే"

అంతరాత్మలోని సౌందర్యాన్ని బాహ్యావస్థనించి అన్వేషించడం ఇక్కడ కనిపించేది.ఇక్కడ ఉలిమొనలకు,కుంచెకు సారూప్యత ఉంది.గమనిస్తే వాక్య సంబంధంగా అతీత మానసంలోఉంటే.రెండవది భౌతికం.ఎందుకంటే "వెలుగు శ్వాస,స్వరం,కుంచె"ఒక అర్థ క్షేత్రం లోనివి కాదు.కాని.."రాయి,ఉలిమొన,శిల్పం"ఒక అర్థ క్షేత్రంలోనివి ఈ నిర్మాణాభివ్యక్తి ద్వారా గాఢమైన అభివ్యక్తి మార్గాన్ని ప్రదర్శిస్తున్నాడు."సాయంత్రాన్ని చాపలా చుట్టటం,సమయాన్ని వొలవటం"అందుకు ఉదాహరణలు

"మనసు అంతరార్థాన్ని అధ్యయనం చేస్తేనే లక్షణంగా పేర్చగలవు"
"మనిషి మాత్రమే మోగించగలిగే వీణ జీవితం"

జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమంలో తానుగా సౌందర్యాన్ని వెదుక్కోటంగురించి మాట్లాడటం వల్ల ఇది ప్రేరణాత్మకంగా కనిపిస్తుంది.శ్రీనివాస రావుగారిలో ఓ ఆత్మావిష్కరముంది.అందులోని అభివ్యక్తే ఆయన కవితని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

________________________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి