పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ



జాన్ హైడ్ కనుమూరి-జీవన గమనం




ప్రపంచీకరణ తరువాత జీవన గమనంలో మార్పు వచ్చింది.ఈ మార్పుతో బాటు ఆధునికావసరాలు కొత్తగా జీవితంలో చేరిన పరికరాలు.వీటన్నిటికి కావలసిన ఆదాయపు వేట.ఇందులో మనిషి సామజిక దశనికోల్పోయి ఆర్థిక పశువుగా మిగిలాడు. ఈ క్రమంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడి పోయాడు.

ఈ ఆధునిక,ఆధునికానాంతర స్థితిలో మనిషి జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం జాన్ హైడ్ కనుమూరి కవిత"జీవన గమనం"చేసింది.

"ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు "

ఉదయం నించి ప్రతి అంశం యాంత్రికమైన తీరు మనిషితన మారిపోయి ప్రతీ అవసరానికి యంత్రం మీద ఆధార పడి తన ఉనికిని మార్చుకున్నాడు.

"ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాతరాలలో మనలేను!"

"మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది."
తన జీవితానికి ఙ్ఞాపకానికి ,ఊరికి,బాల్యానికి తానుగా దూరమవు తున్న అంశం.రోజూవారి జీవితం ఇరుకుగా మారుతున్న స్థితి ఇవన్ని ఈకవిత లో కనిపిస్తాయి.ఆత్మీయతలు కూడ యాంత్రికంగా మారిన స్థితితో కవిత ముగుస్తుంది.

జాన్ గారి వచనం ఎక్కువగా వస్తువు పైనే ఆధార పడింది.ఎలాంటి ఆర్భాటాలు లేని ఈ తరహా కవితని "సరళ కవిత(plain poem)అంటారు.అత్యంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించిన నేపథ్యం ఇందులో ఉంది.

ప్రపంచీకరణ తరువాతజీవితం అనే వస్తువు సాహిత్యంలో మరింత విస్తృతమయింది.ఈ క్రమంలో జీవితంలోని ఒక రోజుని గడుపుతున్న క్రమాన్ని కవితగా అందించారు.అభినందనలు జాన్ హైడ్ కనుమూరి గారు.

                                                                                                                                                                           _______ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి