పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

రాజేందర్ జింబో కవిత-'బిట్స్ అండ్ క్లిక్స్' 




తెలుగులో 1990కాలనికి కాస్త అటు ఇటుగా ఎక్కువ వినిపించేపదం ప్రపంచీకరణ(Globalisetion).అనేక అంశాలతో పాటు సాహిత్యాన్ని కూడా ఒక కుదుపు కుదిపిన అంశం.అనేకమంది బుద్దిజీవులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన అంశం.

80వ దశకంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తటంతో అప్పటివరకూ ఆచరణలో ఉన్న కీన్స్ ఆర్థిక సూత్రాలు దాన్ని పరిష్కరించ లేకపోవడంతో అప్పటి అమేరికా అధ్యక్షుడు రీగన్,బ్రిటీష్ ప్రధాని మార్గరేట్ థాచర్ "వాషింగ్టన్ కాన్సెన్సస్ పేరిట కొత్త ఆర్థిక విధానాలు తెచ్చారని నిపుణుల వివరణ.అందులో భాగంగా బహుళ జాతి సంస్థలు,ఐ.ఎం.ఎఫ్,ప్రపంచ బాంక్ సర్దుబాటు విధానాలను ప్రపంచ దేశాలపై ప్రయోగించాయి.ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థనుకూడా ఇబ్బందిలో పడేసింది.

తెలుగులో ప్రపంచీకరణ ప్రభావం సాహిత్యంలో కనిపిస్తుంది."ఇండియా ప్రైవేట్ లిమిటెడ్"పేరుతో జూకంటి జగన్నాథం.కవితా సంపుటిని తెచ్చారు.గుడిపాటి"గ్లోబలైజేషన్"పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.ఈ మార్గంలోనే"గ్లోబల్ ఖడ్గం"సంకలనం వెలువడింది.కవుల వ్యక్తిగత సంపుటాలు కూడా అనేకంగా వచ్చాయి.

"The liberal virus"(samir amin),"Under standing globaliseation"(Tony sachirato),"The world is flat"(Thomas friedman)మొదలైన పుస్తకాలు.ఈ అంశాన్ని సమర్థించాయి.అంతో ఇంతో తెలుగులోనూ ఇలాంటి సందర్భాలు లేక పోలేదు.కల్లూరి భాస్కరం గారు "వార్త" ఎడిట్ పేజీలో"ప్రపంచీకరణ తెలుగు సాహిత్య స్పందన"పేరుతో వ్యాసాలు రాసారు(27.2/3.3/10.3.2006).

ప్రపంచీకరణ ప్రభావాలని చిత్రిస్తున్న సందర్భంలోనూకవిత్వంలో కొన్ని దశలని గమనించవచ్చు.
1.తొలిదశలో కమ్యూనిస్ట్,మార్క్సిస్ట్ సిద్దాంత భూమిక తో తిరస్కరించడం.2.పల్లెల విధ్వంసం3.సంస్కృతి సంప్రదాయాల క్షీణత.కొత్త సంప్రదాయాల ప్రవేశం.4.కులవృత్తుల విధ్వంసం5.వలసలతో ప్రపంచమంతా ఒక్క నీడకి రావడం.మానవీయ సంబంధాల విధ్వంసం.

రాజేందర్ జింబో గారికవిత వీటన్నిటికి భిన్నంగా క్షణాల్లో జరుగుతున్న అనేక మార్పులను కవిత్వీకరించింది.ఆయన కొత్త సంపుటి "చూస్తుండగానే.."లో ఇలాంటివి కనిపిస్తాయి.ఈ కవితలోనూ మానీటర్,క్లిక్ లతో ప్రపంచం నడుస్తున్న అంశాన్ని వివరించారు.

"అంతా ఆన్‌లైన్ ఈ మెయిల్, ఈ గవర్నెన్స్
ఈ ఫైలింగ్ అఫ్గనిస్తాన్ నుంచి లాడెన్ వరకు అంతా మానిటరే
అమ్మను చూడాలన్నా అమ్మాయితో మాట్లాడాలన్నా మానిటరే
ఆటలు ఆనందాలు అన్నీ మానిటర్‌లోనే "

రాజకీయం.తీవ్రవాదం,కుటుంబ సంబంధాలు అన్నీ ఈ అధునిక కాలంలో దేనిపై ఆధార పడుతున్నాయనే అంశం పైవాక్యంలో కనిపిస్తుంది.తొలిదశలో టి.వి.ని వ్యతిరేకించడంకనిపించేది,ఇప్పుడు ఆస్థానాన్ని "కంప్యుటర్" ఆక్రమించింది.
మనిషి తనకుతాను దూరమవుతూ,మనిషితనం వ్యర్థమౌతున్న అనేక సందర్భాలుకూడా ఇందులో కనిపిస్తాయి.

"ఇక, మట్టికి, సున్నానికి స్థానం లేదట మాంసానికి రక్తానికి విలువ లేదట"

"అంతా ఆన్‌లైన్ మనిషి మౌస్ అయి
కుంచించుకుపోయినట్టు మౌస్ మనిషై శాసిస్తున్నట్టు
మౌసే మనిషిని కాటేస్తున్నట్టు ఫీలింగ్ "

భాషా పరంగా గానీ,ఊహపరంగా కానీ,వ్యక్తీకరణ విషయంలో గానీ పెద్దగా పాఠకుడినుండి ఙ్ఞానాన్ని కోరకుండా అనేక విషయాలని మనసుకందించే శైలి రాజేందర్ జింబో గారిది."హాజిర్ హై"నుండి ఇప్పటి వరకు ఆయన కవితలో ఒక బలమైన మానవీయ స్పృహ,జీవితేచ్చ కనిపిస్తాయి.ఆయన కవిత్వాన్ని చదవడం వల్ల ఇలాంటి అనేక విషయాలు అర్థం చేసుకో వచ్చు.మంచికవితని పంచుకున్నందుకు మితృలకు కృతఙ్ఞతలు.


                                                                                                                            ______ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి