పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

ఈ ఏటవాలు కాంతిపుంజాలతో చెలిమిగా వచ్చిన మలయమారుతాలు తమ బొండు మల్లెల గుబాళింపులతో నన్నావరించి నా ఆత్మను పలకరించాయి. నా వద్ద గులాబీలు లేనే లేవు నా హృదయాంతరంగ వన సీమలో పూచిన సుమాలన్నీ ఎండి, వడలి మృత్యువునే వరించాయి. నా ఆత్మ వెదజల్లే మల్లెల గుబాళింపులు స్వీకరించి నీ గులాబీ సౌరభాలు బదులిస్తావా? పోనీలే! ఈ జవజారి రాలి పడిన పూలరేకులూ, పీలవర్ణిత పత్రాలూ ఆ గోరు వెచ్చని కొలను నీటినే ఆస్వాదిస్తాను ఆశగా. మలయమారుతం ఎటో వెళ్ళిపోయింది మల్లెల గుబాళింపులను వెంటదీసుకుని ఓ పక్క నాకు దుఃఖం ఆగడంతేదు మరో పక్క నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోంది “నీ కొసగిన ఆ సుందర, సుకుమార హృదయాంతరంగ వనసీమను మరీ అంతలా ఛిద్రం చేసుకున్నావేం” అంటూ...........!!!!!! నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p709xB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి