పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Gajulapalli Madhava Reddy కవిత

గాజులపల్లి ||శూన్యం|| ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! గొంతునరం తెగనరికితే నీకైనా నాకైనా కారేది నెత్తురే పారేది నెత్తురే ఉరికొయ్యకి ఊగిస్తే నిన్నైనా నన్నైనా పోయేది ఊపిరే పోయేది ఊపిరే బ్రతకాలని ఆశలతో కబళించే ఆకలితో బ్రతిమాలే బానిసగా బ్రతుకంతా బాసటగా నీ యాతన నాకెరుకే నా దిగులు నీకెరుకే ఐశ్వర్యం నీకుంటే ఔదార్యం నాకుంది నీకున్న ఐశ్వర్యం నీ ఆయుస్సు పెంచినదా నాకున్న ఔదార్యం కష్టాలను కడతేర్చిందా ఏమున్నది ఏమున్నది నీకైనా నాకైనా ! నువ్వున్నది నేనున్నది నేలతల్లి ఒడిలోన !! .....................................................06/03/2014

by Gajulapalli Madhava Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUsaTz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి