పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

సాయికిరణ్ కుమార్ శర్మ కొండముది-ధన్యజీవితం,

           
         




ధ్యానంగురించి చాలావరకు ప్రాచీన భారతీయయానులనుంచి ఇప్పటి వరకు చెప్పని వారంటూలేరు.విమర్శలో ద్వంద్వార్థరచన(allegory)అనేపదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.పాఠకుడికి ఆసక్తి రేపడానికి ఒకవస్తువుతో ఒకటిపోల్చి చెప్పడం,ఒక స్వభావంతో మరోదాన్ని పోల్చి చెప్పటమిలాంటిదే.

పాతకాలపు నీతి శాస్త్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యమంతాఈపనిచేసింది.ఇందులో ఒక మార్గం ప్రకృతిలోని అంశాలకు జీవితాన్ని ఆపాదించి చెప్పటం.ఇలాంటివాటిలో కవికి లోతైన పరిశీలనా శక్తి కావాలి.కొండముది సాయి కిరణ్ కుమార్ శర్మ ఒక చెట్టుజీవితాన్ని-వార్ధక్యంలో ఉన్న వృద్దురాలిలా దర్శించి కవిత్వీకరించారు.

ప్రకృతితో స్నేహం చేయడానికి ఒక దార్శనికపరిఙ్ఞానం కావాలి.

"దర్శనే స్పర్శణే వాపి శ్రవణే భాషనేపివా
యత్ర ద్రవత్యంతరంగః స స్నేహ ఇతికథ్యతే"

చూడటం,తాకటం,వినటం,మాట్లాదుకోటంవల్ల ఎక్కడైనా మనసు ద్రవిస్తే దాన్ని స్నేహం అంటారు.-అని నీతి శాస్త్రం.

ప్రాచీన సంస్కృత కవుల్లో వాల్మీకి,కాళిదాసు మొదలైన వారు ప్రకృతిని గూర్చి గొప్ప వర్ణనలు చేసారు.

వాల్మీకి-"నదీం పుష్పోడుపవహాం"(పూల పడవల్ని మోస్తున్న నదీ"అన్నాడు.

శూర్పనఖ రెండువైపులా ఉన్న రామలక్ష్మనులిద్దరినీ చూసి-ఎవరిని వరించాలో తెలియక అర్థం గాని స్థితిని ఇలాచెబుతారు"ఉభయ కూల సమస్థిత శాద్వలభ్రమగతా గత భిన్న గవీ దశాం"(ఇరువైపుల గడ్డి పెరిగితే ఏవైపున మేయాలో తెలియని ఆవులా ఉందన్నాడు)కాళి దాసు కూడా హిమాలయాలల్లో గాలిసవ్వడి వినిపిస్తుంటే "ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదయిత్వమివోపగంతుం"(కిన్నెరలు పాదే పాటకు ప్రకృతి తానాన్ని పాడినట్టుగా ఉందని అన్నాడు)

ష్చెర్బీనా మాటల్ని శేషేంద్ర శర్మ ఈ సందర్భంలో ఇలా వివరించారు.
"What distingushes an artistic vision of the world from all the other froms of knowledge is its much larger content of fantasy,imaginetion,cinjecture,instinct,and sub conciousness"
భార తీయ అలంకార శాస్త్రం కూడా"ఋషిశ్చకిల దర్శనాత్"అనీంది స్థూలంగా..

"పండు ముదుసలి వగ్గులా
మడతలు పడ్డ దేహంతో/చెట్టు"
చెట్తు స్థితిని దార్శనికంగా చెప్పి,కారణాలను ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు.

"ఆకలేసిన కాకిలా /ఆరో ఋతువు
ఆకులను అద్దుకు తినేసింది"
శిశిరంలో ఆకురాలిన సంధర్భాన్ని చెపుతున్నారు.ఈ కవిత లో ప్రాసపై మక్కువ కనిపిస్తుంది.భావనా వ్యక్తతలో శబ్దం పాత్రని కవి ఎక్కువగా విశ్వసించి నట్టు కనిపిస్తుంది. "అకలి,ఆరో ఋతువు,అద్దుకు తినటం,ఆకతాయిలు,అరవైచేతులు అన్నీ ఇలాంటివే.
నీడకూడ ఇవ్వలేకపొతున్నందుకు తడికళ్లతో ఉందని అంటారు.ఇందులో స్వభావాన్ని ఆపందించడం ఉంది.ధ్యానం, తో కవితను వ్యక్తం చేయటం ఇందులో కనిపిస్తుంది.
అభినందనలు.సాయి కిరణ్ కుమార్ శర్మ గారు.3.8.2013



                                                                                                       _______________ఎం.నారాయణ శర్మ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి