పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

రాళ్ళబండి కవితా ప్రసాద్ || భగ్న దర్పణం ||

నేనొక ప్రతిబింబం గా మారినపుడు
వాస్తవాలు అదృశ్య మౌతుంటాయి తుంటాయి.
అందరి ఆశలు
మిధ్యా ప్రతిబింబాన్ని
ఆరాధిస్తుంటాయి
హృదయం కన్నా
మెదడు ముఖ్య మౌతుంటుంది.
కృతక సహజాల మధ్య
గీత చెరిగి పోతుంది.

సాక్షి గా ఉన్న అద్దం
న్యాయాధికారి గామారుతుంది.
గతం మూగదౌతుంది.
వర్తమానం వికటాట్టహాసం చేస్తుంది.

భవిష్యత్తు అద్దం ముందు హాజరు కాని ముద్దాయి!
ఎదురు గా ఉన్నదే గెలుస్తుంది.

కాలానికి సంకెళ్ళు పడతాయి.

మృత్యువు విజేత గా ఎంపిక అవుతుంది.

అద్దం పగిలి ముక్కలవుతుంది!
వాస్తవం వేయి ప్రతిబింబాలై విస్తరిస్తుంది!

*18-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి