పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

కాశి రాజు కవిత

||మీసాల రొయ్య || దిగబడిన అడుగుజాడల్లో చేరిన మురికి నీళ్లన్నీ వాడిమీదకి నేనూ నామీదకాడు తన్నుకుని సేసిన తానాలు అమ్మ అరుపుల్ని అందుకోలేవు ఇంకెంత సేపన్న కవురు ఎవరో ఒకరు తెత్తేనేగాని అమ్మ పిలిస్తుందని గాని , గుడికెల్లాలనిగాని గురుతురాదు. ఈతరాకున్న ములగననే దైరం ఇత్తన్నకొద్దీ ఎన్నోసార్లు దూకాను , లోతు నానది ఆటనాది. ఎక్కువసేపు రొంపసేత్తాది ఎక్కేయ్ గట్టు అనేవాడు తూము అరుగుల రాళ్ళ బొక్కల్లో రొయ్యపిల్లలు పట్టుకుని ఆడించిన నాన ఎందుకో ఎదగడం ఆపేసాక . మరి నేనూ రాములోరి కల్లేనం కదా తానం చేసి గుడికెలతుంటే మీసాల రొయ్యల దువ్వుకున్నాను . నానా మీసాల మీద సెయ్యేతే నిన్ను ముట్టినట్టే . నీతో మళ్ళీ మళ్ళీ ఆడినట్టే రాములోరిమీదొట్టు ఎదగడం రాలేదని ఎవరు నీతో సెప్తారు.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipsWr6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి