పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Rajeswararao Konda కవిత

సేవలు నాస్తి... ఆస్తులు జాస్తి... నమస్తే... నేస్తమా..! @ రాజేష్ @ 23/03/14 ఇదేమిటా... అనుకుంటున్నారా.. అవునండీ.. ఇదినిజం పచ్చినిజం..! మన దేశంలో ఆస్తులు పెరగాలంటే షేర్లు కొనాల్సిన అవసరంలేదు లాటరీ టిక్కెట్ కూడా కొనాల్సిన పనీలేదు ప్రజసేవ పేరుతో నేతలైతే చాలు ఉన్న ఆస్తులు వాటంతట అవే పెరిగిపోతాయి ఒకటికి వందరెట్లవుతాయి ఎందుకవుతాయో ఎలా అవుతాయో వారికే తెలియదు మనకెలా తెలుస్తుంది అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందిలే అదేనండి.. ఏ సేవ చేస్తామని వచ్చారో ఆ సేవ కించిత్ కూడా పెరగదు కనీసం ప్రజలను పలకరించే సమయం కూడా దొరకదు వారికి అదేమంటే ప్రొటోకాల్ అంటుంటారు బడా నేతలు కాకముందు ప్రజలు కావాలి పదవులొచ్చిన తర్వాత అధికారం రావాలి అధికారం రాగానే ఆస్తులు పెరగాలి ఆ ఆస్తులు పెరగాలంటే ప్రజాసేవ మరవాలి ఇది నిజం... నేటి యిజం... కాదంటారా నేస్తమా..!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhpe9x

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి