పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, జూన్ 2014, శుక్రవారం

Ravi Rangarao కవిత

రావి రంగారావు సాహిత్య పీఠం గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో 22న గుంటూరులో సీమాంధ్ర కవి సమ్మేళనం నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా సీమాంధ్ర చరిత్ర, సంస్కృతి, వైభవం...మననం చేసుకొనటానికి, అభివృద్ధి దిశలో పయనించటానికి ఒక చిన్న ప్రేరణగా సీమాంధ్ర కవి సమ్మేళనం ఈ నెల 22న గుంటూరులో గుజ్జనగుండ్ల, జె.కె.సి. కళాశాల ప్రాంగణంలోని ఆర్.వి.ఆర్.ఆర్.బి.ఎడ్. కళాశాలలో జరుగుతుంది. రావి రంగారావు సాహిత్య పీఠం, గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో నిర్వహింపబడే ఈ కవి సమ్మేళనంలో సీమాంధ్రకు చెందిన వివిధ జిల్లాల నుండి కవులు పాల్గొంటున్నారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. పాపినేని శివశంకర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రారు రావెల సాంబశివరావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. ఉన్నం వెంకయ్య, శాసన మండలి సభ్యులు శ్రీ కె.ఎస్.లక్ష్మణ రావు, ప్రముఖ విద్యావేత్త గద్దె మంగయ్య, ప్రొ. బూదాటి వెంకటేశ్వర్లు, డా. జి.వి.పూర్ణచంద్, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అద్దేపల్లి రామమోహనరావు మొదలైన వారు అతిథులుగా పాల్గొంటున్నారు.. వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతి, వైభవం, అభివృద్ధి... ఇతివృత్తాలుగా కవులు తమ కవితలు వినిపించే ఈ కార్యక్రమం ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు జరుగుతుంది.పాల్గొంటున్న కవు లందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ఇవ్వబడతాయి. ఉదయం 10 గం.కు ప్రారంభ సమావేశం, 11 గం.నుండి 1 గం.వరకు మొదటి కవి సమ్మేళనం, మధ్యాహ్నం భోజనం తరువాత 2 గం.నుండి రెండవ కవి సమ్మేళనం, 4 గం.నుండి 5 గం. వరకు ముగింపు సభ జరుగుతాయి. కవులు ఎలాంటి రుసుములు చెల్లించవలసిన పని లేదు. కవిమిత్రులు ఆహ్వాన పత్రికను అంతర్జాలం ద్వారా ఫేస్ బుక్ గ్రూప్ raavirangarao saahityapeetham నుండి పొందవచ్చు. (Sd.) సోమేపల్లి వెంకట సుబ్బయ్య (Sd.) రావి రంగారావు (గుంటూరు జిల్లా రచయితల సంఘం) (రావి రంగారావు సాహిత్య పీఠం) 9490776184 9247581825

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TehnOn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి