పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జూన్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ .......................అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ...... కరీంనగర్ కు వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ఉన్నది .ఆ మాటకు వస్తే అన్ని జిల్లాలకు ఉంటది .కాని కరీంనగర్ చరిత్ర గ్రంధస్తం చేయబడ్డది .డాక్టర్ మలయశ్రీ 'కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర (క్రీ .శ 950-1995) పిహెచ్డి గ్రంధం 1997లోనే వెలువరించారు .ఇది తెలుగు సాహిత్య చరిత్రలో తల మాణికం. ఇందులో అనేక సాహిత్య విషయాలు ఉన్నాయి .తొలి తెలుగు కంద పద్యం పుట్టింది కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట మీదనే .ఈ పద్యాన్ని జిన్నవల్లభుడు రాసిండు .జినవల్లభుడు కన్నడ ఆది కవి పంపని సోదరుడు క్రి .శ 946 లో ఈ శాసనం వేయబడ్డది .ఆ తరువాత మాడిక సింగన్న ,వేలగందల కందన ,నారాయ చ్రికొండ ధర్మన లు ఈ జిల్లలో కవులు గా ప్రసిద్ది చెందారని ఈ గ్రంధం లో ఉన్నది..తొలి కవయత్రి కోడిమ్యలకు చెందినా ఆనంద మాంబ.ఈమె 1934 లో 'సతీలలామ ' అనే కావ్యాన్ని వెలువరించారు 1901-1950 మద్యలో సిరిషేనహళ్ కృష్ణమాచార్యులు ,నేమలికొండ పింగళి లింబాద్రి రెడ్డి ,గుండరేద్దిపల్లె అనంత్వరపు సిద్దప్ప .రామసిహ్మకవి వి .కేశవరావు లు ప్రసిద్దులని మలయశ్రీ పేర్కొన్నారు 1934 దీపావళి ప్రత్యేక సంచిక గా వెలువడ్డ 'గోలకొండ' కవుల సంచికలో 354 మంది కవుల వివరాలు ఉంటె అందులో 40 మంది కరీంనగర్ వారే నని మలయశ్రీ పరిశోధన లో తెలిపారు .ఇలా ఈ పరిశోధన గ్రంధం లో చాల విషయాలు ఉన్నాయి .ఇందులో 700 మంది రచయితల పరిచయం ఉన్నది .వెయ్యి సంవత్సరాల అపురూప చరిత్ర రూపొందించిన మలయశ్రీ బహు అభినందనీయుడు .ఇంకా ఈ గ్రంధంలో కొన్ని ఆయా రచయితల ఫోటోలు సుత ఉనాయి .జిల్లా పేరు మీద ఇలాంటి చరిత్ర రావడం కరీంనగర్ ప్రథమం . అయితే ఈ గ్రంధాలు ఇప్పుడు లభ్యత లేకపోవచ్చు ఎందుకంటే పదిహేడేళ్ళ కింద వెలువడ్డ పుస్తకం ఇది .ఈ కాలం వాళ్లకు తెలువాలిసిన పుస్తకమని రాస్తున్న .(మలయశ్రీ గారు కరీంనగర్ లోనే ఉంటారు మాట్లడలనిపిస్తే సెల్ ....9866546220....)

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiOE6y

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి