పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

Pulipati Guruswamy కవిత

2002 లో రాసిన ఒక పద్యం.పాత పుస్తకాల మధ్య నుండి తేలింది . బతుకుమచ్చ // డా .పులిపాటి గురుస్వామి // ఈ రహదారుల మధ్య ఖైదు చేయబడ్డ ఒంటరి వనవాసి నేనే దారులు తెరుచుకునే మంత్రం మరిచిపోయిన బానిసను వెన్నెల్ని తీసుకొని వెలుతురు ఎటు వెళ్ళిందో ... బహుశా నేనే నా బానిస హస్తాల నుండి విముక్తి కలిగించానేమో! నా గుహ లోకి రంజింప వచ్చిన పిచ్చుకను నిలుపలేని బలహీనత కూడా ఒక శాపన కొన్ని జ్ఞాపకాలు తప్ప మరేమీ లేదు. తోతాపురి కండరాల ప్రశ్నలకు జవాబు లేదు అనేక వలయాల నడుమ చతికిల బడ్డ శ్వాస కు దుఃఖం తప్ప మరో తోడు లేదు దైవత్వం కోసం కాదు కాని మనిషిగా మసలుకునే లోపల ఏదీ కాకుండా పోయిన వెలివేయ బడ్డ ఆత్మవికలున్ని ఈ రక్త మానస గాయమిక పూయదు. ..... 29-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pme45c

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి