పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Subhash Koti కవిత

మితృలారా! ఇది అసలే ఎన్నికల కాలం.ఎన్నో కలల కాలం. కలల బేహారులు ప్రజలకు కలలు అమ్మి వోట్లు దండుకొనే కాలం. కల్లలు ఎల్లలు దాటి వరదలయి ప్రవహించే కాలం.నల్ల డబ్బు విపరీతంగా యేరులై పారే కాలం. తిట్ల పురాణాలను నేతలు సుప్రభాతం వలె గాక ప్రతి దినమూ పారాయణం చేసే కాలం. డబ్బులు దండుకొని పత్రికలు అభ్యర్థుల జయాపజయాలను హెచ్చవేసి ప్రచురించే కాలం. ఇట్టి వోట్ల రుతువు గురించి ప్రసాద మూర్తి రాసిన ఈ కవితను చూద్దాం. ఓడిపోతున్న దేశం *********** ఎవరో ఒకరు గెలుస్తారులే... నల్ల డబ్బు నాటు సారా ఆయుధాలయ్యాక అమ్ముడు పోయిన ప్రతి వోటరూ అటొ ఇటో ఒక పక్షాన సైనికుడయ్యాక... గెలిచేది ఎవడైతేనేం.. ఓడిపోయేది మాత్రం ప్రజాస్వామ్యమే.. ~~~~ ~~~~ ఎవరు గెలిస్తే ఏముంది నేస్తం.. నువ్వూ నెనూ మరేదైనా మాట్లాడుకోవడం మంచిది క్రికెట్ నుండి ఎన్నికల టికెట్ దాకా అంతా అమ్మకం కొనుగోళ్ళ లాభసాటి.. వ్యాపారమే కదా! ఎన్నికల్లో రిజర్వేషన్ మాటెలా వున్నా చట్టసభల్లో సీట్లన్నీ కోటీశ్వరులకే నోటు గెలుస్తుంది..వోటు ఓడుతుంది ఇదే పంచవర్ష ప్రహేళిక ~~~~~ ~~~~~ ఎన్నికలు ఎక్కడ జరిగితేనేం.. గెలిచేదిస్వార్థం..ఓడేది మనిషి ఎవడో ఒకడు గెలుస్తాడులే.. ఓడేది మాత్రం నువ్వూ నేనే ^^^^^^^^^^^ ^^^^^^^^^

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h38Xi4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి