పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | మరణమృదంగం | వందేమాతర గీతం వరస మారుతున్నది , హిందువే మన తరం గా రూపుదిద్దుతున్నది ముచ్చటయిన మూడు రంగుల దేశం ఆఫిషియల్ కాషాయంలో మునిగి తేలనున్నది . గొర్రె మనస్తత్వం కి తోడేలు కాపలా కలల బేహారుల ఆటలో కార్పోరేట్ కధల వేటలో చివరాఖరు వేటుకి బలి నీతల పారి పోయే దారిలేదు మతం ముళ్ళకంచె అడ్డంగా కోస్తుంది ముందుకెళ్ళే బాట లేదు పులి వేషపు నక్క పీక్కు తింటుంది ఇంకెందుకు రామ డ్రామా రంగులలో నీదయిన భీరువు మొహంని కప్పుకొని కట్టేయ్యి మంచితనపు నటన నింపెయ్యి మనసు భాండం లో కులం విషం చుక్క కక్కెయ్యి నిలువెత్తి సర్ప కీలల మాటలు ఇంకోక్కసారి కరసేవల కసాయితనం లో ఇటుక ఇటుక తో “భాయి “లందరికి ఘోరీ లు పేర్చే మారణ హోమం లో వేసెయ్యి నీదంటూ ఓ సమిధ పసి నవ్వుల సమాధుల పై సాగించే జైత్ర యాత్ర లో నలుగురు నడిచే నడమంత్రపు నైమిశ్యం కొంచం పులుముకొని కోసెయ్యి " హే అల్లా "ఆర్తనాదాల కుత్తిక ని మోబ్(Mob) బలాల వెనక దాగి మ్రోగించు నీదయిన మరణ మృదంగం వహ్ రే వహ్ నయా జమానా మనువు మనవడా మనుష్యుల రక్తం తో మానవత్వానికి కుంకుమ బొట్టు అద్దుకొని నిషిద్ధ గోడుగుల్లో దూర్చిన మగతనం ని "ఫక్ " మంత్రాల్లో నింపుకొని న "పుంసత్వాన్ని " మనసులో దాచుకొని మరొక్కసారి జై బోలో నమో( డి ) కి నిశీ !! 10-2-14.

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWpwn7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి