పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఆగస్టు 2012, సోమవారం

రావి రంగారావు || రాజుగారి తెలివి||

ఎప్పటినుంచో
తన మంత్రులు
దేవతా వస్త్రాలతో ఊరేగుతున్నారని
పసిపిల్లల పరిశోధనల వల్ల
ఈ మధ్యనే తెలిసిందట...

మంత్రుల ఒంటి మీద మచ్చలూ పుచ్చులూ ...
సూక్ష్మజీవులు వైరసులూ...
ఇన్నాళ్ళు ఎవరికీ కనబడ వనుకున్నాడట...
అసలు రహస్యాలు, అంగ రహస్యాలు బయటపడుతున్నందుకు
రాజుగా ఇపుడు తాను సిగ్గుపడుతున్నాడట...

మంత్రులకు మరీ ఒంటి మీద
ఓ నూలుపో గయినా లేకుంటే బాగోదని కొత్తగా తెలిసిందట...
అందుకే ఓ న్యాయసహాయం గోచీ
ఉచితంగా అందిస్తున్నాడట...

పాపం రాజుకు తన సంగతి తెలిసే దెప్పుడో-
తానింకా దేవతా వస్త్రాలు ధరించే తిరుగుతున్నా నని...

*24-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి