పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జులై 2012, ఆదివారం

వేంపల్లి గంగాధర్॥ఎర్ర తురాయి వర్ణం॥


మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు
...ఇదొక జనన మరణ చక్రం !

భూమి బల్ల పరుపు గా ఉందా ,
గోళా కృతి గా ఉందా ...అని
వాదించి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి
సత్యాన్ని తెల్ల గులాబీ గా ప్రకటించిన వారికి
మరణ కొయ్యకు ముళ్ళ శయ్య కూడా
నెత్తుటి జ్ఞానం దిద్దిన మహర్షులకు
జనం ఆకలి కేకల మధ్య
వరి కంకుల్లా మొల్చుకొచ్చిన వారికి
హక్కుల కోసం
నీ దిక్కుల కోసం
గుక్కడు నీటి చుక్కల కోసం
గుప్పెడు నోటి మెతుకుల కోసం
ఆయుధమై నిలిచి అమరు లైన అరణ్య యోధులకు 

ప్రజల కళ్ళ ల్లో , ఇళ్ళ ల్లో , గుండె గుళ్ళల్లో
పాఠం నేర్పే బళ్ళల్లో, పంట మళ్ళల్లో
నాలుగు బజార్ల కూడళ్ళలో
పిడికిలి నినాదమైన యోధాను యోధులకు
పాల రాతి సమాధులు అవసరం లేదు !

ఉదయం పుష్పించే వెలుగు లో
ఎర్ర తురాయి వర్ణం వారి ప్రాచీన పతాకం...!

రాజ్యం ఉక్కు పాదం...
ఒక ఇనుప ఖడ్గం ...

మనిషి
చస్తూనే ఉంటాడు
పుడుతూనే ఉంటాడు 
అదొక నీటి బుడగ
నువ్వొక పాము పడగ

అసలు నిజమైనా
మనిషి ఎలా ఉంటాడో
నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు ?
*21.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి