పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

కవిసంగమం లామకాన్ సిరీస్ - 2 - కర్టెన్ రైజర్

లామకాన్ లో ప్రారంభమైన సాహిత్య సంబరాలు మళ్ళి మీ ముందుకొచ్చాయి. ప్రారంభ సదస్సులో నగ్నముని, వసీరా గార్ల అద్భుత కవితా పఠనం రస హృదయులను ఉర్రూతలూగించింది. అలానే మెర్సి మార్గరెట్, చింతం ప్రవీణ్, కిరణ్ గాలి తమ దైన శైలిలో శ్రోతలను రంజింపజేసారు.

మళ్ళి ఈ రోజు సాయంత్రం మరిన్ని ఆహ్లాదకరమైన సాహిత్య పరిమళాలు విరబూయనున్నాయి.

చిట్టచివరి వాడిగా తన కవితా పఠనం వినిపించబోయె చిచ్చర పిడుగు, మన కవిసంగమం బుడుగు నంద కిషొరాన్ని గురించి, అతని కవిత్వం లోని వాడి వేడి... మెత్తదనం తీయదనం మీకందరికి తెలిసిందే. నందుది విలక్షణమైన శైలి. పువ్వులు గువ్వలు, వేకువలు వెన్నెలలతో పాటు నిప్పు కణికల్లాంటి నిజాలను నిర్దాక్షిన్యంగా మనపై చల్ల గలడు. తెలుగు సాహిత్యంలో (బహుశ సినిరంగంలో కూడా) రాబోయె కాలంలో అతడు ఎక్కబోయె శిఖరాల తొలి మెట్లు మన కవిసంగమం నించే కావడం మనందరికి గర్వకారణం. "పునర్విమర్శ అభ్యాసం", "యాది", "నా తెలంగాణ", "రాఖి", "ప్రియ సఖి" ఈ కవిత్వం ముద్దు బిడ్డ రాసిన వాటిలోని కొన్ని ఆణిముత్యాలు.

కవయిత్రి జయశ్రీ నాయుడు గారి కవిత్వం తన వర్చస్సు లానే స్వచ్చంగా, సరళంగా, సౌమ్యంగా, సౌందర్యభరితంగా వుంటుందనడంలో సందేహం లేదు. ముఖ పుస్తకంలో తరచుగా తన అలోచనలను అభిప్రాయాలను అందరితో పంచుకుంటు అప్యాయతలు, అనుభందాలు అల్లుకుంటు పోతు తనదైన ముద్రను మనందరి మనసుల మీద వేసారు. తన కవిత్వం కూడా అచ్చం తన చిరు దరహాసం లా పాఠకుల హౄదయాలలొ నిలిచి పోతుంది. జయశ్రి గారు రాసిన "మనిషి పేజి" , "నిరంతర చెలిమి", "పెయిన్ అఫ్ ఎ పోయెం", "అప్పటి నువ్వు" మళ్ళి మళ్ళి చదవవలసిన కవితలు.

నిలువెత్తు మనిషి, నిండైన గుండె క్రాంతి శ్రీనివాస్ గారి కవిత్వం ఒక స్ఫూర్తి. ఆయన స్పృశించని వస్తువు లేదు. అమ్మని , అమ్మమ్మని, అర్ధాంగిని...గుడిని, బడిని, గుండె సవ్వడిని... పల్లెటూరి మట్టిని, పట్టణ జీవితాన్ని... తత్వాన్ని మానవత్వాన్ని అన్నిటిని తన అక్షరాలతో ఆవిష్కరించిన పరిపూర్ణ కవి. ఇటివలే ఆయన రచించిన "సమాంతర ఛాయలు" సంకలనం స్తభ్దంగా వున్న సాహితి ప్రపంచంలో రేపిన కలకలం ముందు తరాలకు బంగారు బాట. కార్య దీక్షుడైన కవి తలచుకుంటే సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడొ అనేదానికి ఆయన ఒక గొప్ప ఉదాహరణ. వారి కవిత్వం అంటే ఎంత ప్రేమో వారి వ్యక్తిత్వమంటే అంత గౌరవం నాకు.

"మన కాలం కృష్ణశాస్త్రి" గురుస్వామి గారు అని ఒక కవిసంగమం మిత్రుడు అన్న కితాబులో నాకు అతిశయొక్తి కన్నా అక్షర సత్యం అగుపించింది. నిజమే పూల రెమ్మల లాంటి మృధువైన కవిత్వం, సెలెయేటి గలగలల కమ్మని సంగీత శబ్ధం, మనసును పరవశం చేసె మార్మికత ఆయన కవితలలోని ప్రత్యేకత. వారి కవిత్వం చదవడం ఒక అనుభూతి, ఒక అద్రుష్టం. వారు తన "జీవ గంజి", "చెమ్మ" సంకలనాలతో పాఠక లోకానిని దశాబ్ద న్నరకు పైగానే సుపరిచితం. ఆయన చెమ్మలో రాసిన "అయ్యా మళ్ళెప్పుడొస్తవే" చదివి కంట నీరు పెట్టని వారుండరు. మనిషిలోని మనసు ప్రపంచాన్ని ఆయన తన కవితలలొకి వంపే తీరు అద్వితీయం. వర్ధమాన రచయితలు ఆయన కవిత్వాన్ని అస్వాదించి, ఆకళింపు చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ జెనరేషన్ కి "Zen కవి" ఆయన.

దిగంబర కవితోద్యమంతో తెలుగు ప్రపంచాన్ని కుదిపేసిన కవులలో ఒకరు నిఖిలేష్వర్ గారు. సమకాలిన సాహిత్య దశని దిశని మార్చిన సాహసి. మన తరం అటువంటి మహా కవులకు ఇవ్వగలిగే కృతజ్ఞ్యత, గౌరవం - స్వయంగా ఆయనను కలవ గలిగే అవకాశాన్ని వదులుకోక పొవటం.

మీరు సాహిత్యాభిలాషులైతే, మంచిని పెంచే శక్తి అక్షరానికి వుందని నమ్మే వారైతే రండి నాతో పాటు ఈ సాయంత్రం సాహిత్యంతో సహచరిద్దాం, మేరుగైన సమాజ నిర్మాణానికి సహకరిద్దాం. ఈ నెల నెలా కవిత్వ వెన్నెలలో విహరిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి