పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఆగస్టు 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! చరిత్ర వాన్ని మరిచిపోయింది !!


అనాది నుండి
'నాది' అని ఏదీ లేని పేదవాడు
చరిత్ర పుస్తకం వదిలి
ఎప్పుడో పారిపోయాడు.

అయిన వాని కథ
రాతి పలకలపై నిలిచి శాసించింది
కడవాని వ్యధ
కడలి తీరంలో ఇసుక తెన్నులపై రోదించింది

చెమటోడ్చిన బ్రతుకుల రాతలన్నీ
సంద్రంలో కలిసాయి
ఎన్ని బ్రతుకులో ...
నీళ్లన్నీ ఉప్పగా .

అక్షర రాశికి వాసి పూసి
నిజానికి మసి పూసి
రాసిన రాతల్లో
పేదోడి కన్నీటి ధారలకన్న
పెద్దోడి కిరీటాల ధగ ధగలే ఎక్కువ

ఆ చరిత్ర
వరహాలు ముద్దాడిన అక్షరాల సమూహం కావచ్చు
రసిక సిఖామనుల రాజభోగాలను నెత్తిన ఎత్తుకొని
దరిద్రుడి దిన చర్యను వెక్కిరించాయి

మబ్బును చేరిన నీరు కొత్తగా కురిసినా
గతమంతా మరిచినా
గాలికి తెలుసు సంగతులన్నీ
గురుతుకొచ్చినప్పుడల్లా అరుస్తుంది

ఆ సాక్షినే వెంటబెట్టుకొని నిలదీద్దాం
నఖిలీ నవ్వులు నవ్వుతున్న' అక్షర గణాన్ని'
నింగిలో తారలని తుంచి
ప్రియురాలి సిగ లో పెట్టిన
వర్ణనా పైత్యాన్ని

28-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి