పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జులై 2012, శుక్రవారం

ప్రవీణ కొల్లి || సమాజం ||

సమాజమంటోంది
నేనో సాగర ప్రవాహమని!
నేనన్నాను
నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని!


నేననుకున్నాను
ఓ పదునైన పాళీ తయారు చేసుకుని
సముద్రాన్ని కలంలో సిరాగా నింపి
కసితీరా రాసెయ్యాలని….


సమాజం నోటితో నవ్వి,
నొసటితో వెక్కిరించింది.
“ఏంటని?” అడిగా
“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది
“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”
పాళీ పదును పెడుతూ చెప్పా!
“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది!


హు....ఏ దప్పిక గురించి రాయను?
పదును తేలిన పాళీ గుచ్చుకుంది
చూపుడువేలు స్రవిస్తోంది
చట్రంలో చితికిపోయిన ఎందరో బతుకుల సాక్షిగా
తెల్లకాగితం రంగు మారింది….


( * August 12, 2011 రాసిన కవిత. హనుమంత రావు గారి, సమాజపు పెడ పోకడల మీద కవిత్వం రావాలి అనే పోస్ట్ చూసాకా, ఈ కవిత పోస్ట్ చేస్తున్నాను.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి