పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, నవంబర్ 2013, బుధవారం

కవిత్వ విష్లేశణ



లక్ష్మణ్ స్వామి కవిత

విలయానికి, విద్వంసానికి సంబందించిన విషయాన్ని వస్తువు గా తీసుకోవడం అన్నది కొత్త ప్రక్రియగా చెప్పవచ్చు. బీబత్సానికి అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేసారు లక్ష్మణ స్వామి గారు తన కవిత లో , మొత్తం కవిత ని సంబాషణ రూపం లో వ్యక్తీకరించారు.

విద్వంసం ఎంత భయాన్ని సృష్టిస్తుందో, క్షణాల్లో ఎన్ని నగరాలని నేలమట్టం చెయ్యగలదో అంటాయి మొదటి పాదాలు

//కొన్ని నిమిషాలు చాలు నీకు //ఒక్కోనగరాన్ని ఉఫ్ మని ఊది //పారెయ్యటానికి...!

వాయు తీవ్రతకి ఎంతటి బలం వున్న వస్తువైనా కూలిపోవాల్సిందే, పెను గాలి కి వృక్షాలు సైతం చిత్తు కాగితం మే అంటూ పోలికలతో వర్ణిస్తారు .....

//విమానాల్ని వెనక్కినేట్టే //నీ విలయ గాలికి //వృక్షాలు మేడలు చిత్తుకాగితాలు ...!!!

విద్వంసపు తాలూకు స్పందనల్ని బీబత్స నృత్యానికి ముడివేస్తూ , ఆ క్రమం లో ప్రపంచం లో ని కొన్ని నగరాలు మటుమాయం అయి, ఆనవాళ్ళు ను కూడా మిగల్చని ఈ తుఫాను ..పెను విషాదభరితం అంటూ చెప్తూనే.... జరిగిపొయిన గతాన్ని మననం చేసి నిజాన్ని వెలికి తెచ్చే ప్రయత్నం కన్పిస్తుంది ...

//నీ అల్లకల్లోల//కంకాళ తాండవానికి //ప్రపంచ పటం నుంచి //పెకలించబడిన కొన్ని నగరాలు ..!!
//బహుశః కొన్ని రోజులకింద//ఇక్కడో మానవ ఆవాసముండేదేమో అన్న౦తగా ..!!

నీటి ప్రవాహపు శక్తి అణుబాంబు కన్నా వెయ్యి రెట్లు బలముంటుంది , ఆ ధాటికి చెల్లా చెదురైన బక్క ప్రాణాలు అవి జంతు జాలం అయిన, లేదు మనిషి అయిన సముద్రపు అడుగున వెళ్తాయి నిర్దయగా ........!!!
"అణు బాంబుల్ని వెక్కిరించే //నీ అసిధారకు ముక్కలైన ‘బక్క ప్రాణులు’//సముద్రం అడుక్కి !!

అంతరిక్షాన అబివృద్ధి కి చిహ్నాలు గ చెప్పుకుంటున్నవి కూడా నీ ఉనికి ని పసిగట్టలేక చతికిల బడి చూడలేకపోతున్నాయి, కేవలం గంటల వ్యవధి లో మానవుడు పేర్చుకున్న నాగరికత ను కొన్ని వందల వత్సరం ల వరకు తుడిచి పెట్టగలదు అంటూ అందులో ని తీవ్రత ను పట్టి ఇస్తాయి ఇలా..

"మార్స్ చూసే ‘మానవ కళ్ళు’ నీ మారణాయుధాన్ని //చూళ్ళేక పోతున్నాయి !
గంటల్లో యుగాల కావల //నా‘గరిక’తను తోసి పడేస్తావు !!

భవిష్యత్తు నిర్మాణాన్ని ఊహించేముందు, నేటి పరిస్థితి ని అవగాహన చేసుకోమంటూ, నేల మీద నిలిచేందుకు కనీసపు సాక్షాలన్న వుండాలి అన్న స్పృహ ను కల్పిస్తాయి కొన్ని పాదాలు

//చంద్రుని పైనా , అరుణిని పైనా , మేడలు కడతాడట !!??, మరి నేలమీద నీడలు నిలిచేందుకు
జాడలు౦డాలిగా ముందు !//

మనిషి తన ఆనందం కోసం, విలాసాల కోసం ప్రకృతి ని మట్టుబెట్టినపుడు, ప్రతీకారం తీర్చుకోడానికి ప్రతిజ్ఞ చేసి ..., .విషం తో అంతం చేస్తావా అంటూ ప్రకృతి ని నిలదీస్తారు ..

//అంత పగెందుకే ప్రకృతి ??//విశృంఖల విలాసాలకు //నిన్ను విచ్ఛిన్నం చేస్తే మట్టుకు //‘కాల’ కూటంతో కాటేయ్యాలా..!!??//

ప్రకృతి భీబత్సాలకు ప్రతిక గా కొన్ని ఉదాహరణలను చూపుతూ .....అవి మారణాయుధాలు, ఎంతో శక్తివంతం అయినవి ప్రకృతి విలయాలు అంటూ ముగిస్తారు ..ఇందులో "‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !! అనేది ఓ చక్కని పదబంధం ...సముద్రానికి సంబదించిన ఓ రహస్యం ...., ఈ వృత్తం నుంచి వెళ్ళినన ఏ వస్తువు అయిన కూడా ఆ ట్రయాంగిల్ పడి అంతం అవుతుంటాయి ...దానికి సంబదించిన రహస్యాన్ని చేదించారు ...అది వేరే విషయం, ప్రకృతి ప్రకోపిస్తే అన్ని రూపాల్లో వినాశనం తప్పదు ఇది సత్యం అంటూ ముగిస్తారు ...

//హరికేన్లు ... టోర్నడోలు , తుఫాన్లు ..భూకంపాలు., ఉల్కలు ... లావాలు
గ్రహశకలాలు, ఒక్కటా, రెండా .లెక్ఖ లేనన్ని మాయావి విశ్వంలో //
మారణ హోమాయుధాలు ...!! //‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !!

లక్ష్మణ్ స్వామి గారి లో వ్యక్తీకరించే భావేవాశం వున్నది ....అయితే కేవలం సమస్య తీవ్రత ని చెప్పారు తప్ప, పరిష్కార మార్గాన్ని సూచించలేదు ఆ ఒక్కటి తప్ప మిగితా మొత్తం కవిత చదివించేలా ఆకట్టుకొన్నది. ఓ కొత్త వస్తువు తో ముందుకు వచ్చిన స్వామి గారు అభినందనీయులు ..సామాజిక స్పృహ ని రంగరించి అక్షరానికి మెరుగులు దిద్దుకుంటే ఇంకా మరిన్ని మంచి కవితలని అందిచగలరు ...

వారు ఈ విషయము లో విజయం సాదించాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ...

సెలవు ...
 
                                                                                                                             
 
 
 
 
                                                                                                                             _______పుష్యమి సాగర్
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి