పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

వేంపల్లి గంగాధర్ || సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు ! ||

అతడు ఎక్కడో
వెతకనవసరం లేదు ...
 
నడి రాత్రి నట్ట నడడివి దిశగా
మహా ప్రస్తానం..
మనకెప్పుడు అవుతుంది జ్ఞానోదయం ...!

మహా నగరాల నిండా భస్మం
నిమజ్జనం కూడా అవసరం లేదు

దుఃఖ మయ దృశ్యాలు….

మొదటి దృశ్యం :

దేహ మంతా ముడుతలు పడ్డ
నడుము వంగి నడవ లేక నడుస్తున్న
మూడు కాళ్ళ ముసలి వాళ్ళు
గుంపులు గుంపులు గా
మనకు కనిపిస్తూనే ఉంటారు .....!

రెండవ దృశ్యం;

గడియారం ఆసుపత్రి
రోగులతో పొంగి పొర్లుతుంది...
కుష్టి వ్యాధి ఒక్కటే కాదు
దేహమంత కుళ్ళిన కమురు వాసన
రాత్రంతా వీధిలో ఎవరో దగ్గు తున్నా,
ఫ్యాన్ రెక్కలకు ఉరిపోసుకొని తనకలాడుతున్న,
రోడ్డు ఫై బాటసారి ని గుద్దుకొని వాహనాలు వెళ్తున్న ,
తత్త్వం మనకు బోధ పడదు !

మూడవ దృశ్యం:

నిన్న నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు
ఇవాల కన్నుమూసి కన్నీళ్ళు మిగిల్చిన సత్యం
పూలదండల మధ్య నీ దేహం
నీ తల వద్ద ప్రమిదలో దీపం
నీ చుట్టూ కన్నీటి ప్రవాహాలు
నీ శవ యాత్ర నీకే ఎదురుతుంది ....
తట్టుకొనే ద్యైరం నీ కుందా!
స్మశానానికి వెళ్తున్న వ్యక్తి శవం
నీ కు ఎన్నోసార్లు గుర్తుకొస్తూనే ఉంటుంది ....

మూడు దృశ్యాలు ముగిసిన తర్వాత ...
సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు !
ప్రతి నగరమూ కపిలవస్తు కానవసరం లేదు ...
శిద్దోధనుడి పుత్రప్రేమ ఒక కన్నీటి శోకం
సిద్ధార్థుడు నడిచిన దారి ఒక కాంతి శ్లోకం

ప్రపంచమంతా దుఃఖ మయం

త్యజించిన తర్వాత నుంచి
నిన్ను నీవు నిర్మితం చేసుకుంటావు !
*15-07-2012

www.vempalligangadhar.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి