పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ





మనసు మనిషిల నిలువది-౩

మోసానికి గురవుతున్నావ్ .లేదా దోపిడీ కి గురవుతునావ్ అన్న నిజం తెలిసినంక మనిషికి ఇగ మనుసున పట్టడి .నిదుర పట్టడి అది ఒక సామూహిక అన్యాయానికి సమూహమే అన్యాయమైందంటే అంతా అగ్గిమీద గుగ్గిలమే .

అది ఆందోళన
అది అలజడి
అది పోరాటం
అది పోరుబాట
అది తిరుగుబాటు
అగొ గండ్ల నుంచే కవిత్వం వస్తది రాగం వస్తది ఊర్లకు ఊర్లె సాంస్కృతిక వేదికలయితై .రచ్చ బండలు బహిరంగ సభలు అయితయి .అన్యాయాన్ని సహించని సహజ తనం మనిషి తనం .తెలిసి మిన్నకుంటు ఉన్నదంటే అనుమనిన్చాలే .పోరాటం నుంచే కవులు కలాలు పదును పెట్టుకుంటారు .ప్రజలు పల్లవి అందుకుంటారు .ఉద్యమం ఉప్పెన అయినంక ఇన్ని రోజులు వీళ్ళంతా ఏడ పోయిండ్రు అనిపిస్తది .

అరె ,ఇన్ని రోజులు వీళ్ళు
వోక్కలు లేకుంట బజట్లకు వస్తండ్లు
బొండిగలన్ని పొంగ లాసిగా వోర్లుతున్నారు
వాడ వాడలు కలే తిరుగుతన్నరు

ఇలా ప్రజా సమూహం ఉద్యమ సమయం అవడం తన కండ్ల ముందే కదలాడడం కవి ని నిలువనియ్యది.గాయకుణ్ణి కదలనియ్యది.

ఉరికి వస్తండ్రు రువ్వాడిగా వురికస్తండ్రు
విద్యార్థులంతా ఉద్యమమై ఎగిరిండ్రు
బడి పోరగాండ్లు బాత పెట్టి నిలిచిండ్రు

వూరు కదిలింది వాడ కదిలింది
పల్లె కదిలింది పట్నం కదిలింది
బొబ్బ మొదలైంది బొబ్బ బొబ్బ

ఈ బొబ్బ నే దోపిడీ పీటం కదిలస్తది. జంగ్ మొదలయితే దోపిడీ దారులు వోక్కటయితారు.ఎన్నో అడ్డంకులు మొదలయితై .అయినా చరిత్ర చూస్తే అవి ఏమి ఆగయి.కవిత్వం సాహిత్యం పాట కథ ఆట మాట ప్రజా ఉద్యమానికి మద్దతును ఇస్తాయి

ఎంత కాలం ఈ పరిపచ్చపు పాలన
ఎన్ని రోజులీ ఇసపుకోండి సంసారం
మిక్కుటమైన అవస్థ కక్కుతానికస్తండి
సకులం సమాజమే అగ్గి మండుతంది

ఉద్యమం సమాజానికి త్యాగాల తల్లులను అందిస్తుతుంది .ఉరికొయ్యను ముద్దాడే బిడ్డలను అందిస్తంది.పోరాట వారసత్వాన్ని కొనసాగించే కవిగాయకులను అందిస్తుంది .ఇప్పుడు తెలంగాణ . వూరురిలో కవి గాయకులే రచయితలే....

గాలి నేలా చెట్టు చేమా గుట్టా పిట్టా
అస్తిత్వ ఆకాంక్షల ఉద్యమాలై నినదిస్తున్నాయి

అదంతా చెవ్వు పెట్టి ఇంటే కవిత్వమే పో ....అంతా కవిత్వమేనే .....


________అన్నవరం దేవేందర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి