పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

క్రాంతి శ్రీనివాసరావు || చిదంబర రహశ్యం ||


సంపదకు శాశ్వత చిరునామలేక సంచరిస్తున్నప్పుడు
ప్రపంచమంతా ఒకే వూరవుతున్నప్పుడు
దరిద్రమంతా మన పంచనే ఎందుకుంది ?
ఈఆర్ధిక వంచన అర్దం అయ్యేదెప్పుడో ?

వస్తువులను చేసేది మనం
తరువాత కొని వాడేది మనం
మద్యలో వాడాదుకొనేది ఏందో
పప్పు మనది పొట్టు వాడిది
వూదుకు తింటున్నాం చెరిసగం

ఆదుకోవాల్సిన పాలకపక్షం
కనిపించని బానిస సంకెళ్ళు రంకెలు వేస్తుంటే
అంకెల గారడీలు చేసి చంకలు గుద్దుకొంటున్నారు
ఫలితం లేని పంచవర్ష ప్రణాలికలతో
పంక్ష్య భక్ష్యాలు వడ్డిస్తామని వగ్ధానాలను వర్షిస్తూనేవున్నాయు

ఒకప్పుడు రైళ్ళలో తరిలేది సంపద
ఇప్పుడెందుకో ఈమైళ్ళకే తరుగుతుంది
అరవైఏళ్ళ స్వతంత్రభారతంలో
ప్రపంచ ధనవంతుల లిస్టులోకి ఒకరిద్దరు వెళ్ళీతే
పాతిక శాతం ఆదాయం డెబ్బైకుటుంబాల చెతుల్లో పెట్టి
డెబ్బైశాతం జనాన్ని దారిద్యంలో చుట్టేశాం
రోజుకు పాతికరూపాయలొస్తే చాలు
పరమాన్నం తినొచ్చని పావర్టీ లైను పైకి నెట్టేశాం
పేదరికం తగ్గిందని లెక్కలు కట్టేశాం

ఎన్నికలొచ్చిన రోజు
వందో వెయ్యో ఇందా అంటే
మందో మాకో వుంది అంటే

అందలం అందుబాటులోకొస్తుంటే
అతిపెద్ద ప్రజస్వామ్యాదేశం లో
ఎప్పుడూ వారసులే సారధులవుతున్నారు
ఒహో ప్రజాస్వామ్యమా
రాహు(ల్)కాలమొచ్చిందినీకు
మరో స్వాతంత్ర్య పోరాటం జరగాలిప్పుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి