పేజీలు

23, జూన్ 2014, సోమవారం

Abd Wahed కవిత

ఎం.నారాయణ శర్మ గారు మంచి ప్రశ్నలు లేవదీశారు. ఈ ప్రశ్నలపై చర్చ జరగడం చాలా అవసరం. ఆయన అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ పోస్టు చేస్తున్నాను. ’’ కవిత్వ వచనం సాధారణ వచనం వేరుగా వుంటుందా..? సాధారణ వచనాన్నించి కవిత్వ వచనాన్ని వేరుగా ఎలా చూడాలి...కవిత్వం నిర్దిష్ట భావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా..?మెరుగైన కవిత్వం అని నిర్ణయించడానికి ఖచ్చితమైన విలువలున్నాయా..?చర్చ కోసమే ఈ ప్రశ్నల్ని ముందుకు తెస్తున్నాను.‘‘ ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన ప్రశ్న ’’కవిత్వం నిర్దిష్టభావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా?‘‘... ఈ ప్రశ్నకు జవాబిచ్చే స్థాయి నాకు లేదు. ఎందుకో ఈ ప్రశ్న చదవగానే ఎప్పుడో చదివిన ఒక చైనీస్ కథ గుర్తుకు వచ్చింది. ఆ కథేమిటంటే.... కొందరు వికలాంగ పిల్లలకు పరుగుపందెం జరుగుతోంది. చిన్నపిల్లలు, నడవలేని కుంటివారు. అందరు ఎలాగో పరుగెత్తుతున్నారు. అందులో ఒక చిన్నపిల్ల పడిపోయింది. కిందపడిన పిల్ల లేవలేకపోయింది. కుంటుతూ పరుగెత్తుతున్న పిల్లల్లో ఒక పిల్లవాడు చూశాడు. వెనక్కి వచ్చి ఆమెను లేవడానికి ప్రయత్నించాడు. శక్తి చాలడం లేదు, పైగా కుంటివాడు. ఇది చూసి మరో ఇద్దరు పిల్లలు వచ్చారు. వారితో పాటు, మిగిలిన పిల్లలందరూ వచ్చారు. అందరూ కలిసి ఆ పాపను లేపారు. అందరూ ఒకరి చేతులొకరు పట్టుకుని పరుగుపందెం ముగిసే లైన్ వరకు వెళ్ళారు. అందరూ గెలిచారు. ఇది కథ. ఎక్కడా పరుగు పందెం ఇలా జరగదు. అది వికలాంగ పిల్లలదైనా సరే, పోటీలో గెలిచేవారు ఒక్కరే ఉంటారు. అందరూ గెలిచేదైతే పోటీయే అవసరం లేదు. కాని ఈ కథలో పరుగుపందెంగా చెప్పింది నిజమైన పరుగుపందెం కాదు, సమాజంలో నిత్యజీవితాన్ని చెప్పారు. వికలాంగ పిల్లలుగా సూచించింది సమాజంలో సభ్యులనే, ప్రతి ఒక్కరికీ ఏవో లోపాలుంటాయి. ఒకరికొకరు సహాయపడడం ద్వారా ఒక మెరుగైన సమాజం ఏర్పరచడమే అందరూ గెలవడం. అంటే ఈ మొత్తం కథ, ఇందులో పాత్రలు, సన్నివేశఆలు భావచిత్రాలని భావిస్తే...ఇది కథా? లేక కవిత్వమా? కవిత్వ నిర్వచన పరిధిలోకి ఇది వస్తుందా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V2zlEW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి