పేజీలు

6, మార్చి 2014, గురువారం

కాశి రాజు కవిత

నిండుగా తిన్నాసరే నిండని రాత్రులుంటాయ్ కంచంనిండా పెట్టుకున్నా కొన్ని కబుర్లుండాలి పప్పో పెరుగో ఎప్పుడూ సరిపోదు సరిగ్గా నాకేసి సూసాక కదా కడుపు నిండేది ఏమీ మాట్లాడకుండా తినమన్నపుడో, మొకం సూపించకుండా వడ్డిస్తున్నపుడో ఆ నిండిన కంచం , ఆ నీళ్ళ గ్లాసూ నాతో మాటాడవు అప్పుడే ఒంటరితనపు నిర్వచనాలు, ఎంగిలి కంచంలో ఏళ్లతో రాస్తాను. నేనెందుకూ నీకందరూ ఉన్నారు అంటుంటావు ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు కొన్ని గుండె సెరువులో పడ్డ గులక రాళ్ళు మాట్లాడు నీ స్నేహం చేరువయ్యాక నువ్విసిరే మాటల రాళ్ళకు, నా గుండె సెరువవుద్ది. నేను మాట్లాడకుండా తిండం పూర్తిసేసాక మనసు నిండక మాఅమ్మ గుర్తొస్తది అపుడేమో ఆగకుండా కన్నీలొస్తయి 06/03/2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4eDqr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి