పేజీలు

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Kancharla Srinivas కవిత

నీళ్లలో ముంచేస్తుంటే నీ అరుపేం వినపిస్తుంది నిలువెల్లా ఏడుస్తున్నా ఆ..కన్నీరేం కనిపిస్తుంది.. వంధ్య శిలపై భవితలు బలి సమాదిపై పునాదులే ఇవి అడవి బిడ్డల కన్నీటితొ ఏ బతుకులు మొలిస్తారో.. ఏ మెతుకులు పండిస్తారో.. వెలుగిస్తుందని వెలిగిస్తే దీపం వేదనలే రగిలిస్తోంది నిప్పును ఆర్పే నీరే పెను ఉప్పెన జ్వాలవుతొంది ఈ అభినవ ఖాండవ దహనం అడవికళ్ళలో ఆకుపచ్చ దుఖం.. సంస్కృతి విధ్వంసం సంప్రదాయ వినాశం చేసే ఈ శాపాన్ని పోల వరం అంటే పాపం..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bkO2tO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి